శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ : ప్లస్ లు మైనస్ లు ఎలా ఉన్నాయి..?

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ

ఆర్టిస్ట్స్ : ఘట్టమనేని జై కృష్ణ, రషా టండానీ, మోహన్ బాబు, వికే నరేష్, బ్రహ్మాజీ, శ్యామ్, అజయ్ తదితరులు
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుల్లపల్లి
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : జయకృష్ణ గుమ్మడి
ప్రెజెంటర్ : అశ్వనీదత్
నిర్మాత : జెమినీ కిరణ్
దర్శకత్వం : అజయ్ భూపతి

టాలీవుడ్ నుంచి పెద్ద ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే కాస్త హడావిడీ ఉంటుంది. అలాంటిదేం లేకుండా శ్రీనివాస మంగాపురం మూవీతో ఘట్టమనేని జై కృష్ణను పరిచయం చేశారు. మహేష్ బాబు లాంటి స్టార్ అన్న కొడుకుగా వచ్చినా జై కృష్ణకు ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయకపోవడం కాస్త విచిత్రమే అయినా.. జై కృష్ణ తనదైన శైలిలో ప్రమోషన్స్ చేశాడు. ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి కంటెంట్ ఉన్న మూవీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. అతని దర్శకత్వంలో జై కృష్ణను పరిచయం చేయాలనుకున్నారు. అంటే మాగ్జిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి ఈ మూవీ ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :

పెద్దిరెడ్డి (శ్యామ్) తిరుపతిలో పేరు మోసిన రాజకీయ నాయకుడు. అతని కూతురు మంగ(రషా టండాని). థియేటర్స్ చదువుతుంటుంది. వేరే ఊరి నుంచి తిరుపతికి వచ్చిన కుర్రాడు శ్రీను(జై కృష్ణ). అతను తొలి చూపులోనే మంగతో ప్రేమలో పడతాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. మంగ కూడా అది కేవలం స్నేహమే అనుకుంటుంది. మంగకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం అవుతుంది. తర్వాత శ్రీను తన ప్రేమను చెబుతాడు. ఆమె తాళికట్టే చివరి క్షణం కోసం వరకు తను వెయిట్ చేస్తా అని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆమె మాత్రం అతన్ని లైట్ తీసుకుంటుంది.

పెద్ది రెడ్డి చెల్లి వరలక్ష్మి(వాసుకి). ఆమె బల్లారిలో ఉంటుంది. మేనకోడలి పెళ్లికి వస్తుంది. అక్కడ ఫోటోస్ లో శ్రీను కూడా కనిపిస్తాడు. కట్ చేస్తే ఆమె అతని వద్దకు వెళుతుంది. తన మేన కోడలిని వదిలేయమని చెబుతుంది. కానీ శ్రీను తను తిరుపతి వచ్చిందే మంగ కోసం. మంగ లేకుండా తను బ్రతకలేను అని చెబుతాడు. మరి ఈ వ్వవహారం వెనక ఉన్న కథేంటీ..? వాసు బాబు ఎవరు..? వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)కు వాసుబాబుకు ఉన్న సంబంధం ఏంటీ..? అసలు శ్రీనుకు మంగతో ముందే పరిచయం ఉందా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయి. ఈ లోగా కొందరు విలన్స్ ఎంటర్ అవుతారు. వారి నుంచి దాటుకునే ప్రయత్నంలో ఈ ఇద్దరి సమస్యలు క్లియర్ అవుతాయి. ఇదే కథ. ఇలాంటి కథలు తెలుగు తెర ఇప్పటికి వేలల్లో చూసింది. అలాంటిదే శ్రీనివాస మంగాపురం మూవీ. బట్ ఇందులో కొత్తదనం అనేది మచ్చుకు కూడా కనిపించదు. ఏ మాత్రం ఆకట్టుకోలేని కథనంలో కావాల్సినంత బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా సాదా సీదాగా సాగుతుంది. ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడు ఈ కాలాని తగ్గట్టుగా బలమైన కథనం ఉంటే బావుంటుంది. ఈ మూవీలో అదే ప్రధానమైన లోపం.

ఫస్ట్ హాఫ్ ఒకలా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం కాస్త బావుంది. ఇందులోని ట్విస్ట్ కారణంగానే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అది చాలా కీలకమైనప్పుడు అది అద్భుతం అనిపించాలి. అలా లేకపోవడం ఫస్ట్ హాఫ్ తేలిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ చుట్టూ అల్లుకున్న కథనం మాత్రం నిజంగానే బావుంటుంది. అయితే ఇదేమీ కొత్తదేం కాదు. అయినా ఓకే అనిపిస్తుంది. ఓ రకంగా పడిపడి లేచె మనసులోని ట్విస్ట్ నే వీళ్లు మళ్లీ రిపీట్ చేశారు. ఆ మూవీ కూడా పోయింది. కానీ అంత ఇంపాక్ట్ కూడా శ్రీనివాస మంగాపురంలో లేదు. అదే పెద్ద మైనస్.

జై కృష్ణ నటుడుగా ఇంకా సానబెట్టబడాలి. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. ఎక్స్ ప్రెషన్స్ మరీ తేలిపోలేదు కానీ చాలా చోట్ల సరిగ్గా పెట్టలేకపోయాడు. జై కృష్ణను ఇలాంటి కథతో పరిచయం చేయాలనుకోవడమే పెద్ద లోపం. అయితే అతనిలోని మాస్ యాంగిల్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం దురదృష్టం. రషా టండానీ నటన కూడా ఏమంత బాలేదు.

మోహన్ బాబు పాత్రను సెకండ్ హాఫ్ లో చూపించారు. అది స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది కానీ వీక్ గానే సాగింది. ఉన్నంతలో శ్యామ్ పాత్ర బావుంది. అలాగే నువ్వు నాకు నచ్చావులో సుహాసిని లాంటి పాత్రతో వాసుకి ఓకే అనిపించుకుంది. నరేష్ పాత్ర బావుంది. అద్భుతంగా నటించాడు. కానీ ఆ పాత్ర వల్ల సినిమాకు ఏ మాత్రం ఉపయోగం లేదు. బ్రహ్మాజీ కూడా ప్యాడింగ్ యాక్టర్ గానే కనిపించాడు. ఇతర పాత్రలన్నీ చాలా రొటీన్ వే.

టెక్నికల్ గా

జివి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం అదరగొట్టాడు. వీక్ సీన్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించాడు. ఈ కథలాగే పాటలు కూడా 90ల కాలం నాటివిగా కనిపించాయి. బట్ సాహిత్యం పరంగా పాటలన్నీ బావున్నాయి. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

దర్శకుడుగా అజయ్ భూపతి తీసుకున్న కథలో కొత్తదనం అస్సలు లేదు. కథనం పరంగా ఏదైనా మ్యాజిక్ లు చేసి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. కానీ అతను స్లో నెరేషన్ తో బాగా ఇబ్బంది పెట్టాడు. ఓ రకంగా అజయ్ భూపతి కూడా ఇంకా 90స్ లోనే ఆగిపోయాడు. బట్ ఆ టైమ్ లో వచ్చినా ఇంత స్లో నెరేషన్ అంటే అప్పుడు కూడా వర్కవుట్ కాకపోయి ఉండేది.

ఫైనల్ గా : బ్యాడ్ డెబ్యూ బై జై కృష్ణ
రేటింగ్ : 2/5
K.Y.R

Continue reading
ఘట్టమనేని జయకృష్ణను అభిమానులు ఓన్ చేసుకోలేదా..?

జయకృష్ణను ఘట్టమనేని ఫ్యామిలీ పట్టించుకోవడం లేదేంటీ..?

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. మరికొన్ని గంటల్లో అతను నటించిన శ్రీనివాస మంగాపురం మూవీ విడుదల కాబోతోంది. అయితే ఇక్కడ అనేక సందేహాలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మనవడుగా ఎంట్రీ ఇస్తున్నాడు జయకృష్ణ. అంతకు ముందే కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు మరణించి ఉన్నాడు. అతను హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అది కృష్ణకి చాలా పెద్ద లోటుగా ఉండిపోయింది. తర్వాత మహేష్ బాబు వచ్చాడు కృష్ణ ట్యాగ్ అయిన సూపర్ స్టార్ ను ఓన్ చేసుకున్నాడు. అయితే అంత త్వరగా మహేష్ బాబు స్టార్డమ్ తెచ్చుకోలేదు. చాలా ఫ్లాపుల తర్వాత గాడిలో పడ్డాడు. దీనికి తోడు మంచి నటుడు అనిపించుకున్నాడు.

రమేష్ బాబుపై మహేష్ బాబు ప్రేమ..?

మహేష్ బాబుకు అన అన్న రమేష్ బాబు అంటే చాలా ఇష్టం. ప్రేమ, గౌరవం కూడా మెండుగా ఉన్నాయి చాలామంది చెబుతుంటారు. అలాంటి తన అన్న కొడుకు హీరోగా మారాడు అంటే అతనికి సపోర్ట్ చేయాల్సిన మహేష్ బాబు మాత్రం మాగ్జిమం మౌనంగా ఉండిపోయాడు. శ్రీనివాస మంగాపురం మూవీకి సంబంధించి ఏ ఈవెంట్ కూ అటెండ్ కాలేదు. అందుకు తన వారణాసి మూవీ కారణమే అని చెబుతూ ఓ చిన్న వీడియో చేసి వదిలాడు. బట్ అది ఏమాత్రం సరిపోలేదు అనేది నిజం.

జయకృష్ణను మహేష్ ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారా..

మహేష్ బాబు దాదాపు లైట్ తీసుకున్నాడు అనేది చాలామందిలో కలుగుతున్న భావన. దర్శకుడు అజయ్ భూపతి ఎంత చెప్పినా ఈ విషయంలో అడ్జెస్ట్ కాలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రధాన విషయం ఏంటీ అంటే.. మహేష్ బాబు అభిమానులెవరూ కూడా జయకృష్ణను ఓన్ చేసుకోలేపోయారు. అతని గురించి మినిమం కూడా పట్టించుకోలేదు అనేది వాస్తవం. పాపం అతనే సొంతంగా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. రెండు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు. ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. బట్ అభిమానులు మాత్రం చాలా అంటే చాలా లైట్ తీసుకున్నారు జయకృష్ణను.
ఇలాంటి సందర్భాల్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన.. వస్తోన్న హీరోలందరితో పోలిస్తే జయకృష్ణను ఎవరూ పట్టించుకోవడం లేదు. మహేష్ బాబు తన అన్నపై చాలా గౌరవం ఉన్నా.. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన సందర్భంలో మాత్రం వదిలేయడం ఎంత వరకు సమంజసం అనేది పెద్ద ప్రశ్న. శ్రీనివాస మంగాపురంకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ ఏవీ కూడా ఆడియన్స్ నుంచి అటెన్షన్ తెచ్చుకోలేదు అనేది వాస్తవం. అతనేదో అతని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ప్రేక్షకులు మాత్రం ఈ కుర్రాడిలో హీరోను చూడలేకపోతున్నారు.

నెపోకిడ్స్ ను రుద్దడం కామన్

మామూలుగా పెద్ద కుటుంబాల నుంచి వస్తోన్న హీరోలందరు కూడా ముందుగా ప్రేక్షకులపై రుద్దబడటం కామన్ గా చూస్తున్నాం. జయకృష్ణ విషయంలో కూడా అదే జరుగుతుంది అని చాలామంది అనుకుంటున్నా.. అసలు ఆ కుటుంబం నుంచే ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అదే ఫ్యామిలీకి అల్లుడైన సుధీర్ బాబు హీరోగా మారిన టైమ్ లో అతని కోసం చాలామంది చాలా చేశారు. అతన్ని కూడా రుద్దారు. ఇప్పటికీ రుద్దడం జరుగుతూనే ఉంది. కాకపోతే సుధీర్ బాబు తన సినిమాల రిజల్ట్స్ ను పక్కన పెట్టి తనదైన శైలిని ఏర్పాటు చేసుకున్నాడు.

జయకృష్ణ స్వయంకృషే దిక్కా..

ఏదేమైనా కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు.. అతని ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా జయకృష్ణను అస్సలు పట్టించుకోలేదు అనేది తెలుస్తోంది. మరి అందుకు కారణాలేంటీ అనేది తెలియకపోయినా కుర్రాడు మాత్రం ఈ విషయాలన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం మాత్రం ఆపొద్దు అని చెప్పొచ్చు.

Continue reading