ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారింది. పుష్ప, పుష్ప 2తో ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. పుష్ప 2 కలెక్షన్స్ మాత్రం ఊహించని రేంజ్ లో వచ్చాయి. దీంతో త్రివిక్రమ్ తో చేయాల్సిన మూవీని పక్కన పెట్టాడు. తమిళ్ స్టార్ డైరెక్టర అట్లీతో జట్టు కట్టాడు. ఈ మూవీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ఉండబోతోంది అని అనౌన్స్ మెంట్ తోనే చెప్పారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. రాకా టైటిల్. ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన బన్నీ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకోణ్ ను తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం తను మళ్లీ ప్రగ్నెంట్ తో ఉంది. అలాగే ఈ మూవీలో ఇంకా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతున్నారు అనే వార్తలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. అదే టైమ్ ల రష్మిక మందన్నా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది అనే న్యూస్ కూడా వస్తున్నాయి. జాన్వీ, మృణాల్ మేటర్ ఏంటో కానీ.. లేటెస్ట్ గా రష్మిక మందన్నా కన్ఫార్మ్ అయింది. ఈచిత్రంలో రష్మిక మందన్నా పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. తనేమీ రెగ్యులర్ హీరోయిన్ కాదు. బట్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ఈ ఇద్దరికీ సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను ముంబైలోనే చేయబోతున్నారు. మరో రెండు వారాల్లో రష్మిక మందన్నా రాకా సెట్స్ లో అడుగు పెట్టబోతోంది. ఆల్రెడీ పుష్ప మూవీతో ఈ జంట దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. అలాంటి జంట మళ్లీ కనిపించబోతున్నారు అంటే ఓ రకమైన ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో ఉంది అనేది వాస్తవం. మరి కేవలం రష్మిక మాత్రమేనా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ల పాత్రలు కూడా ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా పెళ్లి తర్వాత కూడా రష్మిక మందన్నా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు.