ప్రశ్న రావణ్ పేరెంట్స్ ఎందుకు మాట్లాడ్డం లేదు

ప్రశ్న రావణ్(బచ్చలకూరి జోసెఫ్).. ఈ పేరు ఓ సంచలనంగా మారింది. రావణ్ వేసిన ప్రశ్నలు చాలామందికి మింగుడు పడటం లేదు. కొందరిని వ్యక్తిగతంగా తీసుకున్నా.. ఇంకొందరిని ఇన్ డైరెక్ట్ గా తీసుకున్న రావణ్ అడిగిన విధానం కొందరికి అస్సలు నచ్చలేదు. సరైన టైమ్ కోసం వేచి చూడాలి అని చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ టైమ్ వచ్చింది. జూలై ఫస్ట్ వీక్ లో అతన్ని పోలీస్ లు అరెస్ట్ చేశారు. అంతకు ముందు దళిత క్రైస్తవ సమర శంఖారావం అనే పేరుతో ఏలూరులో జరిగిన ఓ మీటింగ్ లో ఓ గెస్ట్ గా వచ్చాడు రావణ్. అక్కడ మాట్లాడాడు. ఇందులో ఎప్పట్లానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు. అతన్ని ఇమిటేట్ చేస్తూ అతని మీటింగ్ సాగింది. అక్కడే జనసేనకు మండింది. కట్ చేస్తే వెంటనే కేస్ పెట్టారు. వెంటనే బెయిల్ వచ్చింది. తర్వాత మూడు కేస్ లు పెడితే వాటికీ బెయిల్ వచ్చింది. చివరికి రావణ్ నక్సలైట్ నాయకుడు హిడ్మా మరణం గురించి మాట్లాడాడు అనే కారణంతో ఏకంగా ‘ఉపా’కేస్ పెట్టారు. దీనికి 14జైలుకు జ్యూడీషియల్ రిమాండ్ కు పంపించారు. రావణ్ పై కేస్ పెట్టడం గురించి చాలామంది మాట్లాడారు. ప్రశ్నించే వారిపై ఇలా నిర్బంధం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఉపా కేస్ పెట్టడంపై సాధారణ సమాజం నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ఓ రకంగా జనసేన, తెలుగుదేశం, బిజెపి మినహా అన్ని పార్టీలూ ముక్త కంఠంతో ఉపా కేస్ పై ఖండనలు చేశారు. అయితే ఇవన్నీ ప్రభుత్వం చేతిలో పని కాబట్టి ఇలాంటివి కామన్.

రావణ్ కేవలం పవన్ ను మాత్రమే ప్రశ్నించడం ఎంత వరకు కరెక్ట్

అయితే రావణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం వచ్చిందా అంటే రాలేదు.. రాదు కూడా. అతను ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రశ్నిస్తే బావుండేది. కానీ కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే టార్గెట్ చేయడం చాలామందిలో మామూలుగానే అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఓ రకంగా చూస్తే రావణ్ ను కూడా కత్తి మహేష్ లా పార్సిల్ చేస్తారు అనే మాటలు వస్తున్నాయి. అయితే రావణ్ కేవలం ప్రశ్నించడం వరకు బాగా చేస్తే బావుండేది.కానీ కేవలం ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయడం ఏ మేరకు సబబు. అలాగే అతను ప్రశ్నించే విధానంలో అగ్రెసివ్ నెస్ కనిపిస్తోంది.ఇది ఓ రకంగా అతని స్టైల్ అనుకోవచ్చు. ఆ మాటును అసలు ప్రశ్నలు సరిగా సంధించలేకపోవడం ఎంత వరకు కరెక్ట్. అఫ్ కోర్స్ క్షేత్ర స్థాయిలో చాలామంది అణగారిన వర్గాల బాగు కోసం అనేక సార్లు తనదైన శైలిలో మాట్లాడాడు. కానీ అక్కడ కూడా పవన్ ను మాత్రమే టార్గెట్ చేయడం చూస్తే అతను ప్రశ్నించే విధానంలోనే ఏదో లోపం ఉందనేది ఎవరికైనా అర్థం అవుతుంది. చివరికి జనసేన మాత్రమే అతనిపై కేస్ లు పెట్టింది. ఇప్పుడు ఉపా వరకు వచ్చింది. ఇది ఇక్కడితో ఆగిపోతుందని ఎవరూ అనుకోవడం లేదు. ఇంకా చాలాముందుకు వెళ్లడం ఖాయం అనేది ఎవరిని అడిగినా అర్థం అవుతుంది. అయితే ఈ మొత్తం గొడవలో అతని కుటుంబం ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అనేది పెద్ద ప్రశ్న.

రావణ్ పేరెంట్స్ ఎందుకు మాట్లాడ్డం లేదు

బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ను చాలామంది దళితుడు అని భావించారు. కానీ ఈ మొత్తం గొడవ తర్వాతే అతను కమ్మ కులం వాడు అనేది తెలిసింది. ఓ కమ్మ వాడైనా చాలామంది దళితుల కోసం తన ప్రశ్నలు సంధించాడు. అదే టైమ్ లో కమ్మ కులం నాయకుల గురించి మాత్రం ఇంత ఘాటుగా ఎప్పుడూ స్పందించలేదు. ఆ విషయం పక్కన పెడితే అతని పేరెంట్స్ ఎవరు..? ఎందుకు వీళ్లు రావణ్ ను సపోర్ట్ చేయడం లేదు. రావణ్ తో వీరికి ఎప్పుడు చెడింది.. ఎక్కడ చెడింది.. అసలు అతని కుటుంబ నేపథ్యం ఏంటీ అనేది మాత్రం ఇంత వరకు ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. అంటే ఓ రకంగా రావణ్ తన కుటుంబం మొత్తాన్ని వదులుకున్నాడా..? లేదంటే నిజంగానే సమాజం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడా అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే.. అతని పోరాటానికి చాలామంది మద్ధతు ఇస్తున్నారు. అదే టైమ్ లో ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు అనేది వాస్తవం.

టిడిపి, వైసీపీ వీరిలో రావణ్ కు సపోర్ట్ చేస్తున్నది ఎవరు ..?

అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్నది ఎవరైనా సరే కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇలా ఎవరు ప్రశ్నించినా వారి వెనక ఇంకేదైనా కారణాలుంటాయి. కేవలం కమ్యూనిస్ట్ లు మాత్రమే సమాజం కోసం ప్రశ్నిస్తుంటారు. మిగతావారంతా తమదైన పర్సనల్ ఎజెండాతో ప్రశ్నిస్తుంటారు. అలా రావణ్ వెనక ఉన్నది ఎవరు అంటే.. చాలామంది వైసీపీ ఉంది అంటున్నారు. అలాగే ఇంకొందరు టిడిపి ఉంది అంటున్నారు. రావణ్ ప్రశ్నలు ఎక్కువగా ప్రభుత్వంపైనే ఉంటాయి కదా టిడిపి అతని వెనక ఉంది అనడం ఏ మేరకు కరెక్ట్ అని కూడా అనుకోవచ్చు. మామూలుగా చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వారికైనా ఇదే అనుమానం వస్తుంది. చంద్రబాబు ఏం చేసినా తన చేతికి మట్టి అట్టుకోకుండా చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ కారణంతో రావణ్ ఎప్పుడూ పవన్ లా వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. ఇంకా చెబితే ఇద్దరిదీ ఒకే కులం కూడా. మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయించారు అనే అనుమానం కూడా రావొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ లో చంద్రబాబు లాంటి వారి ఈజీగా చేతులు దులుపుకోవడం కూడా అత్యంత సాధారణమైన విషయం. ఈ ట్రాప్ లో వైసీపీ కూడా పడింది అని కూడా అనుకోవచ్చు.

K.Y.R

Continue reading
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరు. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం, ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు, విజయాలతో సాగి చివరకు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా నిలిచింది. దూకుడు రాజకీయాలు, పదునైన ప్రసంగాలు, ప్రజల్లోకి వెళ్లే తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
1969 నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లాలోని (ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా) కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ABVP కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పనిచేయడం ప్రారంభించారు.

స్థానిక నాయకుడి నుంచి ఎమ్మెల్యేగా

2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ ZPTC సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేశారు. అనంతరం 2007లో స్వతంత్ర అభ్యర్థిగానే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి గెలిచి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

కాంగ్రెస్‌లో చేరికతో కొత్త మలుపు

తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో 2017లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నిర్ణయం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా, వెనక్కి తగ్గలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచి తన రాజకీయ బలం మరోసారి నిరూపించారు.
2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. పాదయాత్రలు, సభలు, ప్రజా కార్యక్రమాల ద్వారా పార్టీని తిరిగి పోటీలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

2023 ఎన్నికలు.. ముఖ్యమంత్రి పీఠం

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రచార ముఖచిత్రంగా నిలిచారు. పార్టీ అధికారంలోకి రావడంతో 2023 డిసెంబర్ 7న తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారాన్ని చేపట్టింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, రైతు రుణమాఫీ అమలు, ప్రజాపాలన కార్యక్రమం వంటి ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదే సమయంలో హైడ్రా, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు కూడా చర్చనీయాంశమయ్యాయి. వీటికి మద్దతుతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం విజయాలతో పాటు వివాదాలనూ చూసింది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరడం, ‘వోటుకు నోటు’ కేసు, రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన వ్యాఖ్యలు తరచూ చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రిగా కూడా ప్రతిపక్షాలతో తీవ్ర రాజకీయ పోరు కొనసాగుతోంది. మరోవైపు ఆయన అనుచరులు మాత్రం ప్రజా సమస్యలపై దూకుడుగా పోరాడే నాయకుడిగా అభివర్ణిస్తారు. ఈ రెండు కోణాలు ఆయన రాజకీయ ప్రయాణంలో భాగమే.
రేవంత్ రెడ్డి రాజకీయాల్లో వేగం, దూకుడు, ప్రత్యర్థులపై నేరుగా విమర్శలు చేసే విధానం చాలామందికి నచ్చుతుంది. ప్రజల్లోకి నేరుగా వెళ్లే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే సమయంలో ఆయన నిర్ణయాలు, వ్యాఖ్యలు తరచూ రాజకీయ చర్చలకు కారణమవుతుంటాయి.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సాధారణ స్థానిక నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగిన అరుదైన ప్రయాణంగా చెప్పవచ్చు. విజయాలు, అపజయాలు, విమర్శలు, వివాదాలు అన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. ముఖ్యమంత్రిగా ఆయన పాలనపై తుది తీర్పు మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. అయితే తెలంగాణ రాజకీయ చరిత్రలో రేవంత్ రెడ్డి పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

Continue reading
స్వర భాస్వరుడు .. నాగన్న

నాగన్న… ఆ స్వరంలో భాస్వరం ఉంది. కోట్లాది గుండె మంటల పాటై కొత్త బాటకు దివిటీగా మారుతుంది. అవును.. అరుణోదయ నాగన్న గాత్రం విన్న ఎవరికైనా ఇలాంటి భావనే కలుగుతుంది. చాలామంది పాడతారు. కొందరు మాత్రమే హృదయంతో పాడతారు. ఆ హృదయానికి ఓ పంథా ఉంటే.. ఆ పంథా బడుగుల బ్రతుకులను బాగు చేస్తుంది అనే నమ్మకాన్ని నింపుకున్నదైతే.. ఆ గొంతు పెనుమంటల వెలుగై వికసిస్తుంది. అలాంటి పంథాలోనే అమరుల చరిత్రతో మొలకెత్తిన నాగన్న గళం సైతం యాభైయేళ్లుగా ఇదే చేస్తుంది. ఆరున్నరొక్క రాగంలో కూడా అద్భుతమైన గమకాలు పలికిస్తూ.. సందర్భానుసారంగా ఆ గాత్రం చేసే మాయలకు మైమరచిపోతాం.
‘నూతన ప్రజాస్వామ్య’ఉద్యమ నావకు పాటల చుక్కానిగా మారి అర్థశతాబ్ధానికి పైగా అరుణోదయపు కళల్లో కలికితురాయిలా వెలుగిన ఎర్రబావుటా నాగన్న. అన్నల కోసం పాడినా.. అమ్మల కోసం పాడినా.. గొంతుతో ఉర్రూతలూపడం.. నడి కదనరంగంలో కత్తి తిప్పుతున్న యోధునిలా కొత్త ప్రజాస్వామ్యం కోసం ఉరకలెత్తి పాడటమూ తెలిసిన గానయోధుడు నాగన్న. వీటన్నిటికీ మించి నాటి నుంచి నేటి వరకూ ఎంతో నిబద్ధత కలిగిన నిఖార్సైన కమ్యూనిస్ట్. ఈ కారణంగానే నేను ఆ పార్టీ సభ్యుడిని, సానుభూతి పరుడునీ కాకపోయినా నాగన్నకు వీరాభిమానిగా మారాను. ఆయన పాట వింటే తెలియకుండానే మైమరచిపోతాను.
నాలుగు పాటలు పాడి.. నలుగురు చప్పట్లు కొట్టగానే నా అంత కళాకారుడు లేడు అని విర్రవీగే సమాజాన్ని చూస్తోన్న మనకు.. ఐదుదశాబ్ధాలకు పైగా అంతులేని పోరాటాలకు పాటగా నిలిచిన నాగన్న నిబద్ధత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజమైన కమ్యూనిస్ట్ లను అత్యంత తక్కువగా చూస్తోన్న కాలం ఇది. ఈ కాలంలోనే ఆయన మరణించడం.. అత్యంత విషాదకరమైనదే. అయితేనే జీవితాంతం నమ్మిన జెండాను మోసిన ధీశాలి నాగన్నకు లాల్ సలామ్ చెబుతూ జోహార్ నాగన్న.

Continue reading