మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతోందని గతంలోనే చెప్పారు. చెప్పినట్టుగా ఈ మూవీ ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ మాత్రం చాలామందిలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇది ఓ పౌరాణిక కథ. పౌరాణికాలు అంటే ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఈ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు అని చిన్నప్పటి రామాయణంతోనే ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకే ఇది ఓ అద్భుతమైన పౌరాణిక గాథ అని తెలుస్తోంది. అదీ కాక త్రివిక్రమ్ కు ఇలాంటి కథలపై ఎంత ఆసక్తి ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తే చాలా విషయాలు తెలిసేలా ఉన్నాయి.
ఈ పోస్టర్ లో త్రిశూలం కనిపిస్తోంది. ఆ త్రిశూలంలో డిఎన్ఏ సింబల్ కూడా ఉంది. అంటే ఇది సోషల్ డ్రామా నుంచి పౌరాణికం వరకు వెళుతుందా అని చాలామంది భావిస్తున్నారు. బట్ అదేం కాదు. ఈ మూవీలో కార్తికేయుడు పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. కార్తికేయుడు అంటే శివుని అంశ. అది కాకుండా పార్వతీ దేవి గర్భం నుంచి కాక విశ్వ బీజం నుంచి ఆయన పుట్టుకు ఉంటుంది అని అర్థం. అంటే కేవలం శివ పార్వతుల అంశతో మాత్రమే కార్తికేయుడు జన్మించాడు అని వేరే చెప్పక్కర్లేదు. కార్తీకేయుడు అంటే యుద్దాలు చాలానే ఉంటాయి. అందుకే పోస్టర్ లో దాన్ని కూడా ఇన్ డైరెక్ట్ గా తెలిపేలా డిజైన్ చేశారు. ఏదేమైనా ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పలేదు కానీ ముందైతే అనౌన్స్ అయింది.
ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో ఎన్టీఆర్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ ఉండబోతోంది అనేలా ఉంది. అంటే ఆ మధ్య ముందే నెల్సన్ మూవీ ఉంటుందని కూడా చెప్పారు కొందరు. అలాంటిదేం లేదు అనేలా ఈ అనౌన్స్ మెంట్ చెబుతోంది. ఏదేమైనా అల వైకుంఠపురములో తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఈ కథపై చాలా కసరత్తులు చేశాడు. అందుకే ఇదో అద్భుతమైన కథగా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఆయన ఆదర్శ కుటుంబం తర్వాత ఇక తన ఫోకస్ అంతా ఈ మూవీపైనే పెట్టబోతున్నాడు అనేది స్పష్టం.






