తెలంగాణ కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసమ్మతి.. రేవంత్ సర్కార్‌కు సొంత నేతల సెగ ఎందుకు?

రేవంత్ సర్కార్‌కు సెగ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్న సమయంలో.. పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగ చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంపై కొందరు సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఒక్కో నేత ఒక్కో అంశంపై మాట్లాడుతున్నప్పటికీ.. వాటన్నింటినీ కలిపి చూస్తే ప్రభుత్వ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కేటాయింపు, పార్టీలో నిర్ణయాలు, నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది.

అయితే ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉందని చెప్పే పరిస్థితి మాత్రం కాదు. ముఖ్యమంత్రి నాయకత్వానికి మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగానే స్పందిస్తున్నారు. అసలు సమస్య.. అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య కంటే, వారు ఆ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్‌గా మారడమే.

కొండా సురేఖ–సుష్మిత ఎపిసోడ్‌తో మళ్లీ రచ్చ

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుష్మిత వ్యవహారం.

పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వంపై సుష్మిత చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మళ్లీ అభ్యర్థిగా ప్రస్తావించడంపై ఆమె బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. TPCC క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యవహారాలపై AICC తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నివేదిక కోరినట్లు వార్తలు వచ్చాయి.

ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది.

వివాదం ఒక కుటుంబం లేదా ఒక నియోజకవర్గం వరకే పరిమితం కాకుండా.. పార్టీలో ఎవరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? పార్టీ క్రమశిక్షణ అందరికీ ఒకేలా వర్తిస్తుందా? అనే చర్చకు దారితీసింది.

సురేఖకు మద్దతుగా కాదు.. చర్యలు కోరిన ఎమ్మెల్యేలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లోనే భిన్న స్వరాలు వినిపించాయి.

సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బహిరంగంగా స్పందిస్తూ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుష్మిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.

అంటే ఒకవైపు అసమ్మతి స్వరాలు ఉంటే.. మరోవైపు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా కనిపిస్తోంది.

ఇదే తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కీలకమైన అంశం.

పార్టీలో విభేదాలు ఉన్నాయి.. కానీ అవి ఒకే దిశలో లేవు.

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు.. మరో హీట్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా కొంతకాలంగా ప్రభుత్వ పనితీరు, పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కీలక పదవుల్లో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని, కాంగ్రెస్‌తో అనుబంధం లేని వ్యక్తులు ఉన్నారని ఆయన విమర్శించారు. ప్రజా పాలన అంటే పేదల కోసం పనిచేయాలని, కాంట్రాక్టర్లు లేదా పెట్టుబడిదారుల కోసం కాదని వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలపై TPCC అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌ గౌడ్ కూడా స్పందించారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

అయితే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నారనే ఊహాగానాలను ఆయన స్వయంగా ఖండించారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి.

అంటే ఆయన వ్యాఖ్యలను పార్టీ వ్యతిరేక తిరుగుబాటుగా తేల్చడం కంటే.. ప్రభుత్వ విధానాలపై అంతర్గత అసంతృప్తిగా చూడటం ప్రస్తుతానికి సముచితం.

పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసంతృప్తి

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్‌లో చర్చకు కారణమయ్యాయి.

మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య సమన్వయం లేదని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసినా.. నిధుల విడుదల, పనుల అమలులో మంత్రుల నుంచి తగిన సహకారం లభించడం లేదని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత కూడా తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడానని పోచారం స్పష్టం చేశారు.

ఇది కూడా రేవంత్ ప్రభుత్వానికి మరో రాజకీయ సవాల్‌గా మారింది.

ఎందుకంటే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయనలాంటి సీనియర్ నేత ప్రభుత్వంలో సమన్వయం లేదని బహిరంగంగా చెప్పడం సహజంగానే రాజకీయ చర్చకు దారితీస్తోంది.

అసలు సమస్య ఏంటి?

ఇప్పటివరకు బయటకు వచ్చిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. నేతల అసంతృప్తికి ప్రధానంగా కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి.

1. నియోజకవర్గ అభివృద్ధి

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధులు రావడం లేదని, అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించడం కొత్త విషయం కాదు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇదే అంశాన్ని బహిరంగంగా ప్రస్తావిస్తే మాత్రం అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది.

2. సీఎం–మంత్రుల మధ్య సమన్వయం

పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నప్పటికీ కింది స్థాయిలో అవి అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

3. పార్టీలో నిర్ణయాధికారం

పరకాల టికెట్ వ్యవహారం ఈ అంశానికి ఉదాహరణగా మారింది.

ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అభ్యర్థిత్వాలపై ముందుగానే ప్రకటనలు రావడం, ఆశావహులు బహిరంగంగా స్పందించడం పార్టీ అంతర్గత వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

4. అసమ్మతిపై అధిష్ఠానం వైఖరి

ఎవరిపై చర్యలు తీసుకోవాలి? ఎవరి వ్యాఖ్యలను ఎంత సీరియస్‌గా తీసుకోవాలి? అన్నది ఇప్పుడు మరో కీలక అంశంగా మారింది.

కొందరు నేతలు.. అందరికీ ఒకే రకమైన క్రమశిక్షణ వర్తించాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై పార్టీ లోపల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రేవంత్‌రెడ్డి ఏం చెబుతున్నారు?

ఈ వివాదాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం కొండా సురేఖ–సుష్మిత వ్యవహారంపై నేరుగా స్పందించకుండా.. పార్టీ అధిష్ఠానం నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.

అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా చర్చించవద్దని నాయకులకు సూచించారు.

అంటే.. ఈ దశలో రేవంత్‌రెడ్డి వ్యూహం వ్యక్తిగతంగా స్పందించకుండా, పార్టీ క్రమశిక్షణ వ్యవస్థ ద్వారా సమస్యను పరిష్కరించడంగా కనిపిస్తోంది.

కానీ అది ఎంతవరకు ఫలిస్తుంది? అనేది చూడాల్సి ఉంది.

కాంగ్రెస్‌కు అసలు టెన్షన్ ఇక్కడే

అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షాల విమర్శలు సహజం. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా సీనియర్ నేతలు ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తితే మాత్రం రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లే సందేశం వేరుగా ఉంటుంది.

“ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మాత్రమే విమర్శలు చేయడం లేదు.. సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు” అనే భావన ఏర్పడే అవకాశం ఉంటుంది.

అదే కాంగ్రెస్ నాయకత్వానికి ప్రధాన ఆందోళనగా మారుతోంది.

రేవంత్ సర్కార్‌కు ఇది ఎంత పెద్ద సవాల్?

ప్రస్తుత పరిణామాలను చూస్తే వెంటనే ప్రభుత్వం సంక్షోభంలో పడిందని చెప్పడానికి ఆధారాలు లేవు. రేవంత్‌రెడ్డికి మద్దతుగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా నిలుస్తున్నారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా వివాదాలపై చర్యలు తీసుకుంటోంది.

కాబట్టి ప్రస్తుతం కనిపిస్తున్నది ప్రభుత్వాన్ని కూల్చే స్థాయి తిరుగుబాటు కంటే.. పార్టీ అంతర్గత అసమ్మతి బహిరంగ రూపం దాల్చడం.

అయితే ఈ అసమ్మతి ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ మరింత పెరిగితే మాత్రం కాంగ్రెస్‌కు రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు.

అసమ్మతిని రేవంత్ ఎలా కంట్రోల్ చేస్తారు?

రేవంత్‌రెడ్డి ముందున్న అసలు పరీక్ష ఇదే.

ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతి నేతపై కఠిన చర్యలు తీసుకుంటే.. అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బహిరంగ విమర్శలను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేస్తే.. పార్టీ క్రమశిక్షణ బలహీనపడే ప్రమాదం ఉంటుంది.

కాబట్టి అసమ్మతి స్వరాలను వినడం, నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించడం, మంత్రులు–ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెంచడం, పార్టీ నిర్ణయాలపై స్పష్టత ఇవ్వడం రేవంత్ నాయకత్వానికి కీలకం కానుంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో నెక్స్ట్ ఏంటి?

ప్రస్తుతం వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌లో ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అధికారంలో ఉన్నంత మాత్రాన పార్టీ అంతర్గత సమస్యలు ఆగిపోవు.

కాంగ్రెస్ వంటి విభిన్న నాయకత్వాలు, వర్గాలు ఉన్న పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమే. కానీ అవి నాలుగు గోడల మధ్య ఉంటే ఒక రకంగా.. మీడియా ముందుకు వస్తే మరో రకంగా మారతాయి.

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్నదీ అదే.

కొండా సురేఖ–సుష్మిత వివాదం, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసంతృప్తి.. ఇవన్నీ వేర్వేరు అంశాలే అయినప్పటికీ.. పార్టీ నాయకత్వానికి సమన్వయం ఎంత కీలకమో గుర్తుచేస్తున్న పరిణామాలు.

మరి రేవంత్‌రెడ్డి ఈ అసమ్మతి స్వరాలను ఎలా కంట్రోల్ చేస్తారు? పార్టీలోని సీనియర్ నేతలను ఎలా కలుపుకొని వెళ్తారు? రాబోయే రోజుల్లో ఈ విభేదాలు సద్దుమణుగుతాయా? లేక మరింత బహిరంగమవుతాయా? అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Continue reading
జన నాయగన్ మూవీ రివ్యూ.. విజయ్ సత్తా చాటాడా..

జన నాయగన్ మూవీ రివ్యూ

 

ఆర్టిస్ట్స్ : విజయ్, పూజాహెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి, రేవతి, సునిల్ తదితరులు
ఎడిటర్ : ప్రదీప్ ఇ రాగవ్
సంగీతం : అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్
నిర్మాత : వెంకట్ కే నారాయణ
కథ : అనిల్ రావిపూడి
దర్శకత్వం : హెచ్. వినోద్

దళపతి విజయ్ లాస్ట్ మూవీ అనే ట్యాగ్ తో మొదలైంది జన నాయగన్.భారీ పబ్లిసిటీ వచ్చింది. అందుకు కారణం అతను రాజకీయాల్లోకి వెళుతుండటమే. ఈ యేడాది జనవరి 9నే విడుదల కావాల్సిన మూవీ ఇది. కానీ సెన్సార్ కారణంగా వాయిదా వేశారు. ఆ వాయిదా వేస్తూనే వచ్చారు.

కట్ చేస్తే విజయ్ ఎన్నికల్లో నిలుచున్నాడు. ఏకంగా ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ఆ తర్వాతైనా ఇమ్మీడియొట్ గా జన నాయగన్ విడుదలవుతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలలకు కానీ దీనికి మోక్షం రాలేదు. తెలుగులో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరికి రీమేక్ గా వచ్చిన జన నాయగన్ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ

వెట్రి(విజయ్)జైలులో ఉంటాడు. అక్కడ అతన్ని చంపడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అతను వాటిని తిప్పి కొడుతుంటాడు. ఓ సారి అదే జైలులో ఉండే ఓ బిజినెస్ మేన్ ను చంపడానికి చాలామంది జైలుకు వస్తారు. వారిని కూడా వెట్రి ఎదురిస్తాడు. ఈ క్రమంలో ఓ జైలర్( గౌతమ్ మీనన్) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ జైలర్ వెట్రి గతం గురించి తెలుసుకుని అతనికి సాయం చేస్తాడు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తారు. తీరా వెట్రి బయటకు వచ్చాక అతన్ని కలుస్తాడు. ఆ జైలర్ కూతురుతో అప్పటికే వెట్రికి స్నేహం ఉంటుంది. ఓ ప్రమాదంలో జైలర్ చనిపోతాడు. దీంతో ఆ పాప బాధ్యతను వెట్రి తీసుకుంటాడు. జైలర్ కోసం ఆ పాపను ఆర్మీ ఆఫీసర్ ను చేయాలని కంకణం కట్టుకుంటాడు.
కట్ చేస్తే ఓ ఆఫ్రికన్ కంట్రీలో జైలులో ఉన్న జాన్ హిమ్లర్(బాబీ డియోల్) అత్యంత క్రూరుడు. ఆ దేశాన్ని పాశవికంగా నాశనం చేస్తాడు. అలాగే భారత దేశంలో కూడా ఓ భారీ విధ్వంసానికి కుట్ర చేస్తుంటాడు. అయితే అతనికి గతంలో వెట్రితో పరిచయం ఉంటుంది. మరి అసలు వెట్రి నేపథ్యం ఏంటీ..? అతనెందుకు జైలుకు వెళతాడు..? ఆ పాప బాధ్యత ఎందుకు తీసుకున్నాడు. జాన్ హిమ్లర్ కుట్రలను అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

ఓ మూవీ రీమేక్ అంటే ఒరిజినల్ తో కంపేరిజన్స్ కామన్ గా ఉంటాయి. ఆ విషయంలో భగవంత్ కేసరికి జన నాయగన్ కు కూడా పోలికలు వస్తాయి. బట్ ఈ విషయంలో భగవంత్ కేసరికి జన నాయగన్ చాలా అంటే చాలా దూరంలోనే ఆగిపోతుంది. కథ అదే అయినా కథనం విషయంలో హెచ్ వినోద్ తీసుకున్న టేకింగ్ మాత్రం అస్సలు బాలేదు. విజయ్ మూవీ అంటే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అవన్నీ తమిళనాడు వరకే. బట్ తెలుగుకు తీసుకుంటే బాలకృష్ణ నటన ముందు విజయ్ పూర్తిగా తేలిపోయాడు. బాలయ్య చూపించిన ఎమోషన్స్ లో 20శాతం కూడా విజయ్ చూపించలేకపోయాడు.

ఆ కారణంగా ఫస్ట్ హాఫ్ అంతా అత్యంత సాధారణంగా సాగుతుంది. దీనికి తోడు ఒరిజినల్ మూవీకి మక్కీకి మక్కీ చూపించడం మాత్రం అస్సలు బాలేదు. బాబీ డియోల్ ఎపిసోడ్ విషయంలో అతని ఎంట్రీ చాలా గ్రాండ్ గా చూపించారు. బట్ మిగతా అంతా అతను ఓ రెగ్యులర్ విలన్ గానే మిగిలిపోయాడు.
ఒరిజినల్ నుంచి 70శాతం తీసుకున్నారు. మిగతా 30శాతంలో వాళ్లు ఏం చెప్పాలనుకున్నారు అనేది పక్కాగా క్లారిటీగా ఉంది. కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం నాసిరకంగా ఉంది. పవర్ ఫుల్ గా చెప్పాల్సిన సన్నివేశాల్లో సాధారణంగా ఉండిపోయిందీ మూవీ. విజయ్ పాత్ర విషయంలో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. విజయ్ ని ఓ పవర్ ఫుల్ పోలీస్ గా చూపించారు కానీ ఆ పాత్రలో అస్సలు పవర్ కనిపించదు.
జన నాయగన్ లో చాలా డ్రా బ్యాక్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉండదు. విజయ్ లాంటి స్టార్ మాస్ హీరో నటించిన లాస్ట్ మూవీ అంటే చాలా గ్రాండ్ గా ఉండాల్సి ఉంటుంది. బట్ జన నాయగన్ లో విజయ్ పాత్రను తీర్చిదిద్దిన విధానం వెరీ రొటీన్ గా ఉంది. మిగతా 30శాతంలో కేవలం విజయ్ ని రాజకీయ నాయకుడుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అదీ తేలిపోయింది. అయితే కావాలని కొందరు ఈ దేశంలో కుల, మత రాజకీయాలను సోషల్ మీడియా ద్వారా వాడుకుంటున్న విధానాన్ని మాత్రం బాగా ప్రెజెంట్ చేశారు. ఏదేమైనా విజయ్ లాంటి స్టార్ ను ఇలా ప్రెజెంట్ చేయడం మాత్రం అతని అభిమానులను కూడా నిరాశపరిచేదే.

నటన పరంగా

విజయ్ ఈ మధ్య కాలంలో ఇంత క్లూ లెస్ గా నటించడం ఆశ్చర్యమే. అతని నటన, యాక్షన్ సీన్స్ లో అతనిదైన ఓ స్టార్డమ్ ఉంది. జన నాయగన్ లో ఇది పూర్తిగా మిస్ అయింది. ఒరిజినల్ లో శ్రీలీల పాత్రలో కనిపించిన మమితా బైజు అస్సలు సెట్ కాలేదు. ఆమె నటన కూడా శ్రీలీల స్థాయిలో లేదు. ఉన్నంతలో కాజల్ పాత్రలో నటించిన పూజాహెగ్డేని ఈ మూవీలో బాగా వాడుకున్నారు. ఆమె పాత్ర, నటన బావున్నాయి. విలన్ గా బాబీ డియోల్ ఓకే అనిపించుకున్నాడు. ప్రకాష్ రాజ్ విలనీ కూడా వెరీ రొటీన్. మిగతా పాత్రల్లో ఉన్నారంటే ఉన్నారు అంతే.

టెక్నికల్ గా

అనిరుద్ రవిచందర్ సంగీతం కూడా మామూలుగానే ఉంది. సన్నివేశాల్లో బలం లేనప్పుడు ఏ సంగీత దర్శకుడు మాత్రం ఎంతని హడావిడీ చేస్తాడు. తెలుగు పాటలు అస్సలు బాలేదు.సినిమాటోగ్రఫీ బానే ఉంది. ఫైట్స్ అస్సలు బాలేదు. ఎడిటింగ్ పరంగా కూడా చాలా ల్యాగ్స్ ఉన్నాయి. తెలుగు డైలాగ్స్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా హెచ్ వినోద్ తన స్థాయికి ఏ మాత్రం సరిపోని సినిమా తీశాడు. అతని డైరెక్షన్ అత్యంత సాధారణంగా ఉంది.

ఫైనల్ గా : జన నాయగన్ .. పరమ బోరింగ్
రేటింగ్ : 2/5

K.Y.R

Continue reading
ఇరుముడి రవితేజ మూవీ: ఆగస్ట్ 21న సంచలన రిలీజ్‌కు రెడీ

ఇరుముడి రవితేజ మూవీ: ఆగస్ట్ 21న సంచలన రిలీజ్‌కు రెడీ

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఇరుముడి రవితేజ మూవీ ఒక కీలక ఘట్టంగా నిలవనుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా రవితేజ ఈ చిత్రంపై కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. దానికి బలమైన కారణాలు ఉన్నాయి — కొత్త కథాంశం, కొత్త దర్శకుడు, మరియు భారీ నిర్మాణ సంస్థ అండదండలు. ఈ ఆర్టికల్‌లో ఇరుముడి రిలీజ్ డేట్, కాస్ట్ అండ్ క్రూ, స్టోరీ లైన్, మరియు రవితేజ ఇమేజ్‌పై ఈ సినిమా ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఇరుముడి రవితేజ మూవీపై ఎందుకింత క్రేజ్?

రవితేజ నుంచి ఓ మూవీ వస్తోందంటే ఆడియన్స్‌లో మునుపటి ఉత్సాహం ఇటీవలి కాలంలో కొంత తగ్గింది. అందుకు కారణం అతను ఎంచుకుంటున్న పరమ రొటీన్ కథలే. అయితే ఈ మధ్య రవితేజ తన ట్రెండ్‌ని మార్చుకున్నాడు. వైవిధ్యమైన కథలవైపు అడుగులు వేస్తున్నాడు. కానీ కథనం (నరేషన్) విషయంలో ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు మైనస్‌గా మారుతున్నాయి.

అతని లాస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి భారీ విజయం కాకపోయినా, అభిమానుల్లో నమ్మకాన్ని తిరిగి తెచ్చిన చిత్రంగా నిలిచింది. ఆ కథ కొత్తదేమీ కాదు, కానీ రవితేజ ఇమేజ్‌కు కొత్తగా అనిపించింది. ఆ ఊపులోనే ఇప్పుడు ఇరుముడి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఇరుముడి చిత్రీకరణను మేకర్స్ చాలా వేగంగా పూర్తి చేశారు. తాజాగా డబ్బింగ్ కూడా పూర్తయినట్టు సమాచారం. అంటే మూవీ దాదాపు పూర్తయినట్టే అర్థం చేసుకోవచ్చు.

నిజం చెప్పాలంటే రవితేజ కొన్నాళ్లుగా చాలా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఆ హడావిడిలోనే చాలాసార్లు రాంగ్ స్టెప్స్ పడుతున్నాయని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇరుముడి విషయంలో మాత్రం అలాంటిదేమీ ఉండదన్న నమ్మకంతో ఆయన ఉన్నాడు.

ఈ చిత్రంపై ఒక మలయాళ సినిమాకు రీమేక్ అనే పుకార్లు మొదట్లో షికారు చేశాయి. అయితే శివ నిర్వాణే స్వయంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు రాశారని అధికారిక సమాచారం. తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేశామని మేకర్స్ ముందు నుంచీ చెబుతున్నారు.

ఇరుముడి స్టోరీ లైన్ — తండ్రి, కూతురు బంధం

ఇరుముడి ఒక భావోద్వేగభరిత కుటుంబ కథా చిత్రం. అయ్యప్ప భక్తి నేపథ్యంలో సాగే ఈ కథలో రవితేజ ఒక తండ్రిగా, తన కూతురిపై ప్రేమతో మద్యానికి బానిసైన స్థితి నుంచి బయటపడే పాత్రలో కనిపించనున్నాడు. కూతురి విజ్ఞప్తే అతన్ని అయ్యప్ప భక్తుడిగా మార్చే కీలక మలుపుగా చిత్రం సాగుతుందని మేకర్స్ వెల్లడించారు. తండ్రి-కూతురు అనుబంధాన్ని ఇంత బలంగా చూపించే ప్రయత్నం తెలుగు సినిమాల్లో అరుదుగా జరుగుతుంది.

తెలుగులో ఇలాంటి కథలు అరుదు

తెలుగులో ఇలాంటి భావోద్వేగభరిత కథాంశాలు తెరకెక్కి చాలాకాలమైంది. అందుకే ఇరుముడి రవితేజ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా రవితేజ తన సినిమాలకు ముందస్తు ప్రమోషన్స్ పెద్దగా చేయడు. కానీ ఇరుముడి విషయంలో ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టాడు. డబ్బింగ్ సమయం నుంచే ప్రమోషన్స్‌ మొదలుపెట్టేశాడు.

మరి ఈ మార్పులు మూవీ ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది పక్కన పెడితే, రవితేజ మాత్రం ఇప్పటివరకూ చాలా కాన్ఫిడెంట్‌గానే కనిపిస్తున్నాడు.

ఇరుముడి మూవీ కాస్ట్ అండ్ క్రూ పూర్తి వివరాలు

విభాగం వివరాలు
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్
ప్రెజెంట్ చేస్తున్నవారు గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్ ఫిల్మ్స్
దర్శకత్వం, స్టోరీ, స్క్రీన్‌ప్లే శివ నిర్వాణ
హీరో రవితేజ
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్
కీలక పాత్రలు బేబీ నక్షత్ర, సాయికుమార్, అజయ్ ఘోష్, శ్వాసిక, రమేష్ ఇందిర
సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం విష్ణు శర్మ
ఎడిటింగ్ ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైన్ సాహి సురేష్
రిలీజ్ డేట్ ఆగస్ట్ 21, 2026

ఇరుముడి రిలీజ్ డేట్ ఎందుకు కీలకం?

ఆగస్ట్ 21, 2026న ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. స్వాతంత్ర్య దినోత్సవ వారాంతపు సీజన్‌కు దగ్గరగా ఉన్న ఈ రిలీజ్ విండో, కుటుంబ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించేందుకు మేకర్స్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరుముడి తొలి సింగిల్ “ఇరుముడి కట్టు” విడుదలై మంచి స్పందన అందుకుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఇరుముడి రవితేజ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇరుముడి ఆగస్ట్ 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

2. ఇరుముడి దర్శకుడు ఎవరు? శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రవితేజతో ఆయన తొలి కలయిక.

3. ఇరుముడిలో హీరోయిన్ ఎవరు? ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

4. ఇరుముడి ఏ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది? మైత్రీ మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, వై.రవిశంకర్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ముగింపు

ఏదేమైనా, ఇరుముడి రవితేజ మూవీతో ఆయన మంచి విజయం అందుకోవడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కొత్త కథాంశం, శివ నిర్వాణ నరేషన్ స్టైల్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కలిసొస్తే, రవితేజ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

మరిన్ని టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం Gaaradi.comను ఫాలో అవ్వండి.

Continue reading
మారుతి కొత్త ఆశ.. వరుణ్ తేజ్‌తో సినిమా ఫిక్స్?

ఫలించిన మారుతి నిరీక్షణ.. వరుణ్ తేజ్‌తో కొత్త ప్రయాణం?

ఒక దర్శకుడి కెరీర్‌లో హిట్లు ఎంత ముఖ్యమో.. ఫ్లాపులు కూడా అంతే ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా స్టార్ హీరోతో చేసిన సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దర్శకుడు మారుతి పరిస్థితి కూడా ఇప్పుడు అలానే కనిపిస్తోంది.

‘ది రాజా సాబ్’ భారీ అంచనాల మధ్య విడుదలైనా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమా ఆశించిన స్థాయిలో నిలబడలేదు. విడుదల తర్వాత మారుతి స్వయంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నానని, తన తదుపరి సినిమాకు మరింత కష్టపడతానని చెప్పాడు.

ఇలాంటి సమయంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.

వరుణ్ తేజ్‌తో సినిమా దాదాపు ఖరారు?

ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం.. వరుణ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. గత కొన్ని నెలలుగా వరుణ్ తేజ్ పేరు మారుతి తదుపరి సినిమాతో అనుసంధానమవుతోంది.

అధికారిక ప్రకటన వచ్చే వరకు దీన్ని ఇండస్ట్రీ బజ్గానే చూడాలి.

ఇద్దరికీ ఈ సినిమా ఎందుకు కీలకం?

ఈ ప్రాజెక్ట్ నిజమైతే.. ఇది కేవలం మారుతికే కాదు.. వరుణ్ తేజ్‌కూ ఎంతో కీలకం.

ఇటీవలి కాలంలో వరుణ్ తేజ్‌కు కూడా ఆశించిన విజయాలు దక్కలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాల ఫలితాలు ఆయన మార్కెట్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. అదే సమయంలో మారుతి కూడా మళ్లీ తన బలమైన జానర్ అయిన ఫ్యామిలీ కామెడీ, ఎంటర్‌టైనర్ వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మారుతి బలం అదే..

మారుతి కెరీర్‌ను పరిశీలిస్తే..

  • చిన్న కథలను వినోదాత్మకంగా చెప్పడంలో మంచి పేరు సంపాదించాడు.
  • ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కామెడీ అతని ప్రధాన బలం.
  • స్టార్ హీరోల కన్నా మిడిల్ రేంజ్ హీరోలతోనే అతని విజయాలు ఎక్కువగా వచ్చాయి.

అందుకే వరుణ్ తేజ్‌తో సినిమా నిజమైతే.. అది మారుతి తన కంఫర్ట్ జోన్‌లోకి తిరిగి వచ్చినట్టే అవుతుంది.

కమ్‌బ్యాక్ అవుతుందా?

ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే దర్శకుడి ప్రతిభ పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేం. టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు ఒక పెద్ద పరాజయం తర్వాత మరింత బలంగా తిరిగి నిలబడ్డారు.

మారుతి విషయంలో కూడా అదే జరుగుతుందా లేదా అన్నది ఈ కొత్త ప్రాజెక్ట్‌పైనే ఆధారపడి ఉంటుంది.

వరుణ్ తేజ్‌తో సినిమా అధికారికంగా ప్రకటించి.. మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే మారుతికి మరో అవకాశం దక్కినట్టే. లేదంటే ఆయనపై ఉన్న సందేహాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

GAARADI విశ్లేషణ

రాజాసాబ్ తర్వాత మారుతి కెరీర్ ఒక కీలక మలుపులో ఉంది. అదే సమయంలో వరుణ్ తేజ్ కూడా సరైన విజయాన్ని వెతుకుతున్నాడు. ఈ ఇద్దరి కలయిక నిజమైతే.. అది ఇద్దరికీ విన్-విన్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Continue reading
కమిటీ కుర్రోళ్లు జాతీయ అవార్డులు : నిహారిక కొణిదెల ఎమోషనల్ కామెంట్స్

కమిటీ కుర్రోళ్లుకు జాతీయ అవార్డులు

తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్‌ ఆధారిత చిత్రాలకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడంతో పాటు, బెస్ట్ మేకప్ విభాగంలో కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విజయంతో చిత్ర బృందం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత నిహారిక కొణిదెలతో పాటు దర్శకుడు యదు వంశీ, సాంకేతిక నిపుణులు, నటీనటులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.నిహారిక కొణిదెల మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరి ప్రయాణం నాకు తెలుసు. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం నా మనసుకు ఎంతో సంతృప్తినిచ్చింది. నా 32 ఏళ్ల జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మించాలనే నిర్ణయం నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటి.” మంచి సినిమా తీయడం మాత్రమే కాదు.. దాన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

“ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా పనిచేశారు. మంచి సినిమాలు తీస్తే ఇలాంటి గౌరవం వస్తుందని ఈ రోజు మరోసారి నిరూపితమైంది. అందుకే నేను జీవితాంతం సినిమాలనే చేస్తాను” అని చెప్పారు. “ఈ సినిమాను జాతీయ అవార్డు కోసం తీయలేదు. కానీ ప్రయాణం మొదలైన తర్వాత అవార్డు రావాలని మాత్రం నిజంగా కోరుకున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని చెప్పింది. అలాగే.. మేకప్ టీమ్ చేసిన కష్టం, కొత్త నటీనటుల కోసం చేసిన, ట్రాన్స్‌ఫర్మేషన్, సాంకేతిక బృందం అంకితభావం అంటూ అన్నింటినీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నేను మెగా ఫ్యామిలీకి అర్హురాలినని ఇప్పుడు గర్వంగా చెప్పగలను

“నేను కొణిదెల కుటుంబం నుంచి వచ్చాననే గుర్తింపుకంటే, ఇప్పుడు నేను కూడా ఆ కుటుంబానికి తగిన పని చేశాననే సంతృప్తి ఉంది. మెగా ఫ్యామిలీలో ఉండేందుకు అర్హురాలినని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను.” అలాగే మెగాస్టార్ చిరంజీవి తనను అభినందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘రుద్రవీణ’కు మీ నాన్న నాగబాబు జాతీయ అవార్డులు అందుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు.. మాకు గర్వంగా ఉంది’ అని చిరంజీవి గారు చెప్పడం జీవితాంతం గుర్తుండిపోతుంది” అని తెలిపారు.

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ..

“ఈ కథకు జాతీయ అవార్డు వస్తుందని నేను షూటింగ్ ప్రారంభం నుంచే చెబుతున్నాను. కానీ కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టేందుకు చాలామంది వెనక్కి తగ్గారు.” అయితే.. నిహారిక కొణిదెల, మన్యం రమేష్ తనపై నమ్మకం ఉంచి ఎలాంటి రాజీ పడకుండా సినిమా నిర్మించారని చెప్పారు. “ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. బిజినెస్ గురించి ఆలోచించకుండా కథను నమ్మారు. అదే ఈ రోజు జాతీయ అవార్డుల రూపంలో ఫలించింది” అని అన్నారు.

సాంకేతిక నిపుణులకు దక్కిన గౌరవం

ఈ సందర్భంగా..

సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్ రాజు ఎదురోలు
ఎడిటర్ అన్వర్ అలీ
నిర్మాత ఫణి అడపాక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్
మేకప్ ఆర్టిస్ట్ పి. రవి కుమార్
డైలాగ్ రైటర్లు కొండల్ రావు, వెంకట్ సుబాష్.. అందరూ ఈ విజయం మొత్తం టీమ్ కృషి ఫలితమని చెప్పారు.

ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్ట్ పి. రవి కుమార్ మాట్లాడుతూ..

“కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమాలో పని చేయడం ఒక పీహెచ్‌డీ చేసినంత అనుభవం” అని వ్యాఖ్యానించారు.

నటీనటుల ఆనందం

సందీప్ సరోజ్, ప్రసాద్ బెహరా, విషిక, తేజస్వి తదితరులు మాట్లాడుతూ..

కథ విన్న రోజే ఈ సినిమా ప్రత్యేకమని భావించామని,
ఇప్పుడు జాతీయ అవార్డు రావడంతో తమ కష్టం ఫలించిందని,
ప్రేక్షకులు, మీడియా ఇచ్చిన ఆదరణే ఈ విజయానికి కారణమని తెలిపారు.

కమిటీ కుర్రోళ్లు ఎందుకు ప్రత్యేకంగా నిలిచింది?

‘కమిటీ కుర్రోళ్లు’ గ్రామీణ నేపథ్యంలో సాగే స్నేహం, సంబంధాలు, కుల-సామాజిక విభేదాలు, యువత భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించిన కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం కథనం, సహజ నటన, సాంకేతిక నాణ్యతకు మంచి ప్రశంసలు అందుకుంది. విడుదల సమయంలో విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు రెండు జాతీయ అవార్డులు దక్కడం ద్వారా ఆ విజయానికి మరో ముద్ర పడింది.

ముగింపు

చిన్న కథను నమ్మి, కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి, కొత్త నటీనటులతో ప్రయోగం చేసిన నిహారిక కొణిదెల ధైర్యం ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సాధించిన రెండు జాతీయ అవార్డులు కేవలం ఒక సినిమా విజయమే కాదు.. కంటెంట్‌ను నమ్మిన తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గౌరవం కూడా. ఈ విజయోత్సవంలో చిత్ర బృందం వ్యక్తం చేసిన భావోద్వేగాలు, వారి ప్రయాణం వెనుక ఉన్న కష్టం ప్రేక్షకులను కూడా కదిలించాయి.

Continue reading
చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ రివ్యూ.. ఏముంది ఇందులో..?

ఏ కథైనా బలంగా రాసుకుంటారు మేకర్స్. అవి బలమైనవేనా కాదా అనేది తేల్చాల్సింది ప్రేక్షకులు. కొన్నిసార్లు రైటర్స్ తాము ఏదో ది బెస్ట్ ఇస్తున్నాం అని భావిస్తుంటారు. కానీ అవే చాలా బలహీనంగా ఉంటాయి అని ఆడియన్స్ కూడా భావిస్తుంటారు. అయితే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ముందు ఇంపార్టెంట్. తర్వాత అది క్లాసిక్ అవుతుందా లేక కల్ట్ అవుతుందా అనేది తర్వాతి సంగతి. బట్ ఇలా సినిమా విడుదలకు ముందే తెగ బిల్డప్ ఇస్తున్న మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. యస్.. వీళ్లకు అంత నమ్మకం ఉన్నట్టుగా కాకుండా ఇది కావాలనే జనాలపైకి రుద్దేస్తున్నారు అనిపించేలానే ఈ మూవీ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ చూస్తే ఇదో సాధారణమైన కథలాగే కనిపిస్తోంది. ఓ తెలుగు కుర్రాడు చెన్నై వెళ్లి అక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పటికే మందుకు బానిస అయిన ఓ అమ్మాయితో అతనికి పరిచయం అవుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. మొదట అతను ఆమెను మందుకు మాన్పించే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కట్ చేస్తే ఆ లవ్ స్టోరీలో ఏదో ఇష్యూ. ఆ ఇష్యూ వల్ల సదరు హీరో బాగా డిస్ట్రబ్ అవుతాడు. ఆమె అతని కోసం ఆరాటపడుతుంది. అదే టైమ్ లో దానికంటే ముందే అతన్ని చాలా లైట్ తీసుకుంటుంది. సింపుల్ గా ఇదే ట్రైలర్. ఇతర పాత్రలను పెద్దగా ఎలివేట్ చేయకుండా ఇదో ఈ రెండు పాత్రల మధ్య ఉన్న ఓ సంఘర్షణ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి లవ్ స్టోరీస్ లో అలాంటి సంఘర్షణ చాలా చాలా కామన్. కాకపోతే వీరి మూవీలో ఆ కాన్ ఫ్లిక్ట్ వేరేలా ఉండొచ్చేమో. అంత మాత్రం చేత దీన్ని ఓ ‘కల్ట్ క్లాసిక్’అని రిలీజ్ కు ముందే డబ్బా కొట్టడం అస్సలు అంటే అస్సలు బాలేదు. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇది ఓ సాధారణ రెగ్యులర్ లవ్ స్టోరీలాగానే ఉంది తప్ప కొత్తదనం అంటూ ఏమీ కనిపించడం లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన మూవీ ఇది. ఇక ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా సాయి రాజేష్ గా కనిపిస్తున్నాడు. బట్ ఇప్పటి వరకు ఈ మూవీ దర్శకుడు అనేది మాత్రం చెప్పడం లేదు. ఒక వేళ మూవీ హిట్ అయితే సాయి రాజేష్ ఖాతాలో వేసుకుంటాడు.. తేడా కొడితే దర్శకుడిపై నెట్టేస్తుంటాడేమో చూడాలి. ఏదేమైనా ఇది ఓ సాధారణమైన కథ అని అర్థం అవుతుంది. దాన్ని దాటుకుని ఇది నిజంగా కల్ట్ క్లాసిక్ అని వీళ్లు పదే పదే చెబుతున్నారు అంటే ఏదో తేడా కొడుతోంది. కల్ట్ నా లేక క్లాసిక్ నా అనేది చెప్పాల్సింది ప్రేక్షకులు. అది మాత్రం వీళ్లు కొడుతున్న డబ్బాలు మాత్రం మర్చిపోవద్దు.

Continue reading
72వ నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన తెలుగు సినిమాలు

72వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది.

కమిటీ కుర్రాళ్లు, పుష్ప 2, కల్కి 2898 AD, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు సాధించి టాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచాయి.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా జోరు

ఒకప్పుడు జాతీయ చలనచిత్ర అవార్డులు అంటే తెలుగు సినిమాలకు చాలా దూరంగా ఉండేవి. అప్పుడప్పుడు ఒక్కో అవార్డు వచ్చినా అది పెద్ద విశేషంగా మారేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే తెలుగు సినిమాలు వరుసగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన కూడా అదే విషయాన్ని మరోసారి నిరూపించింది. కమర్షియల్ సినిమాలతో పాటు మంచి కథ, బలమైన రచన, సాంకేతిక నైపుణ్యం ఉన్న చిత్రాలు ఈసారి కూడా అవార్డులను సొంతం చేసుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది గర్వకారణమనే చెప్పాలి.


ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’

ఈ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’ ఎంపిక కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

యదువంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కొణిదెల నిహారిక నిర్మించారు. పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా మంచి కథ, సహజమైన పాత్రలు, గ్రామీణ నేపథ్యం కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు జాతీయ అవార్డు రావడంతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులతో పాటు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు దక్కుతుందనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.


‘కమిటీ కుర్రాళ్లు’కు మరో గౌరవం

ఈ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో పీ. రవికుమార్ జాతీయ అవార్డు అందుకోవడం మరో విశేషం.

పాత్రలకు తగ్గట్టుగా సహజమైన లుక్స్ తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.


‘లక్కీ భాస్కర్’కు బెస్ట్ డైలాగ్స్

దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ అట్లూరి రాసిన సంభాషణలకు ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డు లభించింది.

షేర్ మార్కెట్ వంటి క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో ఈ సినిమా విజయవంతమైంది. అందులో డైలాగ్స్ కీలక పాత్ర పోషించాయి. అందుకే వెంకీ అట్లూరి జాతీయ అవార్డు అందుకోవడం ఆశ్చర్యంగా అనిపించదు.


‘పుష్ప 2’కు రెండు జాతీయ అవార్డులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కూడా రెండు విభాగాల్లో జాతీయ గుర్తింపు దక్కించుకుంది.

  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – సుకుమార్
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – దీపాలి నూర్, శీతల్ శర్మ

పుష్ప 2లో కథన నిర్మాణం, పాత్రల తీరు, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో పాత్రలకు తగ్గ దుస్తుల రూపకల్పన కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఈ రెండు విభాగాల్లో అవార్డులు రావడం సినిమాకు మరో గౌరవంగా చెప్పాలి.


‘కల్కి 2898 AD’కు బెస్ట్ పాపులర్ ఫిల్మ్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD చిత్రానికి ఉత్తమ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు లభించింది.

భారీ విజువల్స్, పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో మేళవించిన కథ, అద్భుతమైన సాంకేతిక నాణ్యత ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కమర్షియల్ విజయంతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కడం చిత్రబృందానికి మరో గౌరవం.


’35 చిన్న కథ కాదు’కు ఉత్తమ బాలల చిత్రం

ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న 35 చిన్న కథ కాదు చిత్రానికి ఉత్తమ బాలల చిత్రం అవార్డు లభించింది.

పిల్లల భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, చదువు ఒత్తిడి వంటి అంశాలను ఎంతో హృద్యంగా చూపించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగు సినిమాకు మరో మంచి వార్త.


ప్రధాన అవార్డుల్లో విజేతలు

ఈసారి ప్రధాన విభాగాల్లో కూడా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.

  • ఉత్తమ నటుడు – మమ్ముట్టి (భ్రమయుగం) మరియు కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) సంయుక్త విజేతలు.
  • ఉత్తమ నటి – యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
  • ఉత్తమ దర్శకుడు – రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)
  • ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ఆర్టికల్ 370
అవార్డు విజేత
ఉత్తమ తెలుగు చిత్రం కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే సుకుమార్ – పుష్ప 2
ఉత్తమ డైలాగ్స్ వెంకీ అట్లూరి – లక్కీ భాస్కర్
ఉత్తమ కాస్ట్యూమ్స్ పుష్ప 2
ఉత్తమ పాపులర్ ఫిల్మ్ కల్కి 2898 AD
ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు

తెలుగు సినిమాకు మరో గర్వకారణం

ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు కేవలం ఒక్క విభాగానికే పరిమితం కాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, మేకప్, కాస్ట్యూమ్స్, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, పాపులర్ సినిమా, బాలల చిత్రం వంటి పలు విభాగాల్లో తెలుగు సినిమాలు తమ ముద్ర వేశాయి.

ఇది తెలుగు సినిమా నాణ్యత పెరుగుతోందనే విషయానికి మరో నిదర్శనం. కమర్షియల్ విజయాలే కాకుండా కంటెంట్‌కు కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందనేది తెలుగు సినీ పరిశ్రమకు మంచి సంకేతం.

Continue reading
మా ఇంటి బంగారం OTT Full Review

థియేటర్లలా ఓటీటీలోనూ సమంత మ్యాజిక్ పనిచేసిందా..?

సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఓటీటీలో ఎలా ఉంది? పూర్తి తెలుగు రివ్యూ చదవండి.

మా ఇంటి బంగారం OTT Full Review

సమంత కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిన సినిమా మా ఇంటి బంగారం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడం చిన్న విషయం కాదు. జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌తో పాటు పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే సినిమా జూలై 17 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో ఎంతగా ఆకట్టుకుందో… ఓటీటీలో కూడా అదే స్థాయిలో మెప్పిస్తోందా?

ఓటీటీలో రెస్పాన్స్ ఎలా ఉంది..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న స్పందనను చూస్తే మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే థియేటర్లలో కనిపించిన భారీ హైప్ మాత్రం ఓటీటీలో కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే చాలామంది ఈ సినిమాను థియేటర్లలో చూసేయడమే. అయినప్పటికీ మొదటిసారి చూసేవారు మాత్రం సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. అధికారిక వ్యూయర్‌షిప్ డేటా ఇంకా విడుదల కాలేదు.

కథలో ఏముంది..?

ఒక సాధారణ గృహిణిగా కనిపించే స్వర్ణ పాత్రలో సమంత కనిపిస్తుంది. కానీ ఆమె గతం మాత్రం సాధారణం కాదు. కుటుంబం కోసం ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో గతం తిరిగి ఆమె జీవితంలోకి వస్తుంది. అక్కడి నుంచి సినిమా పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్తుంది.

ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా స్థాయిని పెంచుతుంది. రెండో భాగంలో సమంత పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. చివర్లో కుటుంబం కోసం ఆమె చేసే పోరాటం సినిమాకు మంచి ముగింపునిస్తుంది.

సమంత ఒన్ ఉమెన్ షో

ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా సమంత సినిమా. ఎమోషనల్ సీన్స్‌లో అయినా, యాక్షన్ సీక్వెన్స్‌లలో అయినా తన నటనతో ఆకట్టుకుంది.

విలన్‌గా గుల్షన్ దేవయ్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. దిగంత్, గౌతమి, చైతన్య కృష్ణ, శ్రీలక్ష్మి, మంజూష తదితరులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా సమంత-మంజూష మధ్య వచ్చే సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి.

టెక్నికల్‌గా సినిమా ఎలా ఉంది..?

దర్శకురాలు నందిని రెడ్డి ఈసారి తనకు భిన్నమైన జానర్‌ను ఎంచుకుని మంచి ఫలితం సాధించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఆమె విజయం సాధించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు అదనపు బలం.

ఓటీటీలో ఎందుకు కొంచెం తక్కువ హైప్..?

సినిమా బాగోలేదని కాదు. ఇప్పటికే థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులు చూసేయడంతో ఓటీటీలో కొత్తగా వచ్చే వ్యూయర్స్ సంఖ్య సహజంగానే తగ్గింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్, సమంత అభిమానులు, థియేటర్లలో మిస్ అయిన వారు మాత్రం ఇప్పుడు ఈ సినిమాను ఆస్వాదిస్తున్నారు.

మా ఇంటి బంగారం OTT Verdict

థియేటర్లలో మిస్ అయినవారికి మా ఇంటి బంగారం మంచి ఛాయిస్. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, సమంత పెర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా ఒకసారి చూడొచ్చు. థియేటర్లలో వచ్చినంత భారీ హైప్ ఓటీటీలో లేకపోయినా, సినిమా మాత్రం ఇప్పటికీ ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది.

రేటింగ్: ⭐⭐⭐⭐☆ (4/5)

ప్లస్ పాయింట్స్

  • సమంత అద్భుతమైన నటన
  • ఇంటర్వెల్ ట్విస్ట్
  • యాక్షన్ ఎపిసోడ్స్
  • ఫ్యామిలీ ఎమోషన్స్
  • నందిని రెడ్డి దర్శకత్వం

మైనస్ పాయింట్స్

  • రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తాయి
  • థియేటర్లలో చూసిన వారికి కొత్త అనుభూతి తక్కువగా ఉండొచ్చు

Continue reading
బాలీవుడ్ హీరోయిన్లకు టాలీవుడ్‌లో సరైన పాత్రలు దొరకడం లేదా..?

బాలీవుడ్ బ్యూటీలకు టాలీవుడ్‌పై భయం మొదలైందా..?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆసక్తిగా ఎదురుచూసేవారు. పాన్ ఇండియా మార్కెట్, భారీ క్రేజ్, దేశవ్యాప్తంగా గుర్తింపు… ఇవన్నీ ఒకే సినిమాతో వస్తాయని చాలామంది భావించేవారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితి కొద్దిగా మారుతోందనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కొంతమంది పేరున్న ఆర్టిస్ట్ లను తెలుగు దర్శకులు సరిగా వినియోగించుకోవడం లేదు అనేది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో పాటు కేవలం స్టార్ హీరోల చుట్టూ మాత్రమే కథలన్నీ తీసుుకోవడం, రాసుకోవడం కూడా ఓ పెద్ద మైనస్ గా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే కేవలం హీరోల చుట్టూ మాత్రమే అల్లుకున్న కథలన్నీ అవుట్ డేటెడ్ అవుతాయి అనేది నిజం.

దానికి ప్రధాన కారణంగా జాన్వీ కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వరుసగా రెండు తెలుగు పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ, ఆమె పాత్రలపై వచ్చిన విమర్శలు ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల కథా నిర్మాణంపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఇది మొత్తం టాలీవుడ్ గురించిన తీర్పు కాదు. కొంతమంది దర్శకులు హీరోయిన్లకు అద్భుతమైన పాత్రలు రాస్తుండగా, మరికొన్ని కమర్షియల్ సినిమాల్లో మాత్రం హీరోయిన్ పాత్రలు కథలో అంతగా నిలబడటం లేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

‘దేవర’తో మొదలైన చర్చ

జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమైన సినిమా దేవర. ఈ సినిమాతో ఆమెపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీదేవి కూతురిగా తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అనుబంధం కూడా ఆ అంచనాలను మరింత పెంచింది. అయితే సినిమా విడుదలైన తర్వాత ఎక్కువమంది ప్రేక్షకులు చెప్పిన కామన్ పాయింట్ ఒక్కటే. జాన్వీ కపూర్ పాత్రకు కథలో చాలా తక్కువ ప్రాధాన్యత ఉందని. స్క్రీన్ టైమ్ కూడా పరిమితంగానే ఉండటంతో ఆమె నటనను చూపించే అవకాశాలు పెద్దగా కనిపించలేదని విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని అప్పట్లో పలు సినీ విశ్లేషకులు కూడా ప్రస్తావించారు.

‘పెద్ది’తో వివాదం మరింత పెరిగింది

‘దేవర’ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్దిపై మాత్రం పరిస్థితి మరింత భిన్నంగా మారింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను ఎలా చిత్రీకరించారనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్, రొమాంటిక్ సన్నివేశాలు, హీరోయిన్ ప్రజెంటేషన్‌పై ప్రేక్షకులు తీవ్ర విమర్శలు చేశారు. మహిళా పాత్రను కథకు అవసరమైన స్థాయిలో కాకుండా విజువల్ గ్లామర్‌కే పరిమితం చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వివాదం బాగా పెరగడంతో దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ కొన్ని సన్నివేశాలను మార్చామని, ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించాలని కూడా చెప్పారు.

ఇది ఒక్క జాన్వీ సమస్యేనా..?

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జాన్వీ కపూర్ టాలీవుడ్ సినిమాలు చేయనని ఎక్కడా ప్రకటించలేదు. అలాగే “తెలుగు సినిమాలకు దూరంగా ఉంటాను” అని కూడా ఆమె అధికారికంగా చెప్పలేదు. అలాంటి వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అయితే తన పాత్రలపై వచ్చిన విమర్శల తర్వాత మహిళా పాత్రల ప్రజెంటేషన్ గురించి ఆమె స్వయంగా స్పందించింది. సినిమా సెట్స్‌లో నటీమణులు కూడా తమ అభిప్రాయం చెప్పగలగాలి అని పేర్కొంది. అందుకే “బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు తెలుగు సినిమాలకు భయపడుతున్నారు” అని చెప్పడం కంటే, “మంచి పాత్రలు ఉంటేనే స్టార్ హీరోయిన్లు ఆసక్తి చూపుతారు” అనడం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.

దర్శకులు ఆలోచించాల్సిన విషయం ఇదే

ఇప్పటి ప్రేక్షకులు కేవలం హీరో ఎలివేషన్ మాత్రమే చూడటం లేదు. హీరోయిన్ పాత్ర కూడా కథలో భాగంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో బలమైన మహిళా పాత్రలు ఉన్న సినిమాలకు మంచి ఆదరణ కూడా లభిస్తోంది. హీరోయిన్‌ను కేవలం పాటల కోసం లేదా గ్లామర్ కోసం ఉపయోగించే ట్రెండ్‌పై సోషల్ మీడియాలో కూడా విమర్శలు పెరుగుతున్నాయి. అంటే కమర్షియల్ సినిమా చేయకూడదనే కాదు. కానీ కథలో హీరోయిన్‌కు కూడా గుర్తుండిపోయే పాత్ర ఉంటే సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కుతుంది.

టాలీవుడ్‌కు ఇది హెచ్చరిక కాదు… అవకాశం

టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నిలిచింది. దేశం మొత్తం తెలుగు సినిమాల వైపు చూస్తోంది. అలాంటి సమయంలో హీరోలతో పాటు హీరోయిన్ల పాత్రలకూ సమానమైన ప్రాధాన్యత ఇస్తే మరింత మంచి గుర్తింపు వస్తుంది. దర్శకుల క్రియేటివిటీని ప్రశ్నించడం కాదు… ప్రేక్షకుల అభిరుచి మారుతోందనే విషయాన్ని గుర్తించడం ముఖ్యం.జాన్వీ కపూర్ చుట్టూ మొదలైన ఈ చర్చ భవిష్యత్తులో మరిన్ని బలమైన మహిళా పాత్రలకు దారి తీస్తే… అదే టాలీవుడ్‌కు నిజమైన విజయం అవుతుంది.

 

Continue reading
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయినట్టేనా..?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్యకు సరైన వారసుడుగా అభిమానులు అతన్ని నెత్తిన పెట్టుకోవడం కోసం చూస్తున్నారు. ఇటు చూస్తే తన తరం హీరోల తనయులు హీరోలుగా మారిపోయారు. బట్ తన ఏజ్ ను బట్టి మోక్షజ్ఞ కూడా ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎందుకో అతనికి ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తోంది. బాలయ్య కోరిక బలంగా ఉన్నా మోక్షజ్ఞకు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరిక కనిపించడం లేదు అని చాలాసార్లు అనిపిస్తోంది.
ఇక రీసెంట్ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అని కొన్నాళ్ల క్రితం నానా హడావిడీ చేశారు. ఆ మేరకు మోక్షజ్ఞకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ అంటూ కొన్ని ఫోటోస్ విడుదల చేశారు. బట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రశాంత్ తప్పుకున్నాడు. తర్వాత సీన్ లోకి బాలయ్యే స్వయంగా వచ్చాడు. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999ను రూపొందించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. బట్ అదీ ముందుకు సాగడం లేదు. ఇటు చూస్తే మోక్షజ్ఞ ఎప్పుడూ ప్రాపర్ లుక్ మెయిన్టేన్ చేయలేకపోతున్నాడు. దీంతో అసలు మనోడికి సినిమా హీరో కావాలనే లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అదీ నిజమే అనిపించేలా ఉంది తాజా కథ.
బాలకృష్ణ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఆగస్ట్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి సుధాకర్ చెరకూరు నిర్మాత. అయితే కొరటాల మూవీని సడెన్ గా స్టార్ట్ చేశాడు బాలయ్య. అందుకు కారణం నిర్మాతే అనేది చాలామందికి తెలియదు. సుధాకర్ చెరకూరి గతంలో మోక్షజ్ఞతో మూవీ చేయాలనుకున్నాడు. ఆ మేరకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం కొంత ఖర్చు చేశాడు. కానీ మోక్షజ్ఞ మూవీ చేయలేకపోతున్నాడు. ఆ మేరకు అతనికి కాంపెన్సేట్ చేయడం కోసమే బాలయ్య ఇప్పుడు ఈ మూవీ స్టార్ట్ చేశాడు అనేది వాస్తవం. అంటే మోక్షజ్ఞతో మూవీ చేయాలని సుధాకర్ కు ఉన్నా.. అది పట్టాలెక్కడం సాధ్యం కాదు అని తెలిసింది కాబట్టే ఈ ప్రాజెక్ట్ నే బాలయ్యతో స్టార్ట్ చేయబోతున్నాడన్నమాట.
ఈ రకంగా చూస్తే.. మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదు మాత్రమే కాదు.. అసలు అతనికి సినిమాలే ఇంట్రెస్ట్ లేదు అని అనుకోవచ్చు. లేదంటే ఇప్పటికే అతని వయసుకు 30కి వచ్చేసింది. ఈ ఇండస్ట్రీలో 20కే స్టార్ట్ చేయడం కామన్ గా చూస్తుంటాం. అలాంటి అతను ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు.. అంటే అతనికి అసలు ఇంట్రెస్ట్ లేకపోవడమే అనేది ఈ వార్త సారాంశం. లేదంటే బాలయ్య కొన్ని ముహూర్తాల కోసం చూస్తున్నాడేమో తెలియాల్సి కూడా ఉంది.

Continue reading