కమిటీ కుర్రోళ్లు జాతీయ అవార్డులు : నిహారిక కొణిదెల ఎమోషనల్ కామెంట్స్

కమిటీ కుర్రోళ్లుకు జాతీయ అవార్డులు

తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్‌ ఆధారిత చిత్రాలకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడంతో పాటు, బెస్ట్ మేకప్ విభాగంలో కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విజయంతో చిత్ర బృందం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత నిహారిక కొణిదెలతో పాటు దర్శకుడు యదు వంశీ, సాంకేతిక నిపుణులు, నటీనటులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.నిహారిక కొణిదెల మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరి ప్రయాణం నాకు తెలుసు. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం నా మనసుకు ఎంతో సంతృప్తినిచ్చింది. నా 32 ఏళ్ల జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మించాలనే నిర్ణయం నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటి.” మంచి సినిమా తీయడం మాత్రమే కాదు.. దాన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

“ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా పనిచేశారు. మంచి సినిమాలు తీస్తే ఇలాంటి గౌరవం వస్తుందని ఈ రోజు మరోసారి నిరూపితమైంది. అందుకే నేను జీవితాంతం సినిమాలనే చేస్తాను” అని చెప్పారు. “ఈ సినిమాను జాతీయ అవార్డు కోసం తీయలేదు. కానీ ప్రయాణం మొదలైన తర్వాత అవార్డు రావాలని మాత్రం నిజంగా కోరుకున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని చెప్పింది. అలాగే.. మేకప్ టీమ్ చేసిన కష్టం, కొత్త నటీనటుల కోసం చేసిన, ట్రాన్స్‌ఫర్మేషన్, సాంకేతిక బృందం అంకితభావం అంటూ అన్నింటినీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నేను మెగా ఫ్యామిలీకి అర్హురాలినని ఇప్పుడు గర్వంగా చెప్పగలను

“నేను కొణిదెల కుటుంబం నుంచి వచ్చాననే గుర్తింపుకంటే, ఇప్పుడు నేను కూడా ఆ కుటుంబానికి తగిన పని చేశాననే సంతృప్తి ఉంది. మెగా ఫ్యామిలీలో ఉండేందుకు అర్హురాలినని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను.” అలాగే మెగాస్టార్ చిరంజీవి తనను అభినందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘రుద్రవీణ’కు మీ నాన్న నాగబాబు జాతీయ అవార్డులు అందుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు.. మాకు గర్వంగా ఉంది’ అని చిరంజీవి గారు చెప్పడం జీవితాంతం గుర్తుండిపోతుంది” అని తెలిపారు.

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ..

“ఈ కథకు జాతీయ అవార్డు వస్తుందని నేను షూటింగ్ ప్రారంభం నుంచే చెబుతున్నాను. కానీ కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టేందుకు చాలామంది వెనక్కి తగ్గారు.” అయితే.. నిహారిక కొణిదెల, మన్యం రమేష్ తనపై నమ్మకం ఉంచి ఎలాంటి రాజీ పడకుండా సినిమా నిర్మించారని చెప్పారు. “ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. బిజినెస్ గురించి ఆలోచించకుండా కథను నమ్మారు. అదే ఈ రోజు జాతీయ అవార్డుల రూపంలో ఫలించింది” అని అన్నారు.

సాంకేతిక నిపుణులకు దక్కిన గౌరవం

ఈ సందర్భంగా..

సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్ రాజు ఎదురోలు
ఎడిటర్ అన్వర్ అలీ
నిర్మాత ఫణి అడపాక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్
మేకప్ ఆర్టిస్ట్ పి. రవి కుమార్
డైలాగ్ రైటర్లు కొండల్ రావు, వెంకట్ సుబాష్.. అందరూ ఈ విజయం మొత్తం టీమ్ కృషి ఫలితమని చెప్పారు.

ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్ట్ పి. రవి కుమార్ మాట్లాడుతూ..

“కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమాలో పని చేయడం ఒక పీహెచ్‌డీ చేసినంత అనుభవం” అని వ్యాఖ్యానించారు.

నటీనటుల ఆనందం

సందీప్ సరోజ్, ప్రసాద్ బెహరా, విషిక, తేజస్వి తదితరులు మాట్లాడుతూ..

కథ విన్న రోజే ఈ సినిమా ప్రత్యేకమని భావించామని,
ఇప్పుడు జాతీయ అవార్డు రావడంతో తమ కష్టం ఫలించిందని,
ప్రేక్షకులు, మీడియా ఇచ్చిన ఆదరణే ఈ విజయానికి కారణమని తెలిపారు.

కమిటీ కుర్రోళ్లు ఎందుకు ప్రత్యేకంగా నిలిచింది?

‘కమిటీ కుర్రోళ్లు’ గ్రామీణ నేపథ్యంలో సాగే స్నేహం, సంబంధాలు, కుల-సామాజిక విభేదాలు, యువత భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించిన కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం కథనం, సహజ నటన, సాంకేతిక నాణ్యతకు మంచి ప్రశంసలు అందుకుంది. విడుదల సమయంలో విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు రెండు జాతీయ అవార్డులు దక్కడం ద్వారా ఆ విజయానికి మరో ముద్ర పడింది.

ముగింపు

చిన్న కథను నమ్మి, కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి, కొత్త నటీనటులతో ప్రయోగం చేసిన నిహారిక కొణిదెల ధైర్యం ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సాధించిన రెండు జాతీయ అవార్డులు కేవలం ఒక సినిమా విజయమే కాదు.. కంటెంట్‌ను నమ్మిన తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గౌరవం కూడా. ఈ విజయోత్సవంలో చిత్ర బృందం వ్యక్తం చేసిన భావోద్వేగాలు, వారి ప్రయాణం వెనుక ఉన్న కష్టం ప్రేక్షకులను కూడా కదిలించాయి.

Continue reading
చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ రివ్యూ.. ఏముంది ఇందులో..?

ఏ కథైనా బలంగా రాసుకుంటారు మేకర్స్. అవి బలమైనవేనా కాదా అనేది తేల్చాల్సింది ప్రేక్షకులు. కొన్నిసార్లు రైటర్స్ తాము ఏదో ది బెస్ట్ ఇస్తున్నాం అని భావిస్తుంటారు. కానీ అవే చాలా బలహీనంగా ఉంటాయి అని ఆడియన్స్ కూడా భావిస్తుంటారు. అయితే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ముందు ఇంపార్టెంట్. తర్వాత అది క్లాసిక్ అవుతుందా లేక కల్ట్ అవుతుందా అనేది తర్వాతి సంగతి. బట్ ఇలా సినిమా విడుదలకు ముందే తెగ బిల్డప్ ఇస్తున్న మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. యస్.. వీళ్లకు అంత నమ్మకం ఉన్నట్టుగా కాకుండా ఇది కావాలనే జనాలపైకి రుద్దేస్తున్నారు అనిపించేలానే ఈ మూవీ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ చూస్తే ఇదో సాధారణమైన కథలాగే కనిపిస్తోంది. ఓ తెలుగు కుర్రాడు చెన్నై వెళ్లి అక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పటికే మందుకు బానిస అయిన ఓ అమ్మాయితో అతనికి పరిచయం అవుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. మొదట అతను ఆమెను మందుకు మాన్పించే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కట్ చేస్తే ఆ లవ్ స్టోరీలో ఏదో ఇష్యూ. ఆ ఇష్యూ వల్ల సదరు హీరో బాగా డిస్ట్రబ్ అవుతాడు. ఆమె అతని కోసం ఆరాటపడుతుంది. అదే టైమ్ లో దానికంటే ముందే అతన్ని చాలా లైట్ తీసుకుంటుంది. సింపుల్ గా ఇదే ట్రైలర్. ఇతర పాత్రలను పెద్దగా ఎలివేట్ చేయకుండా ఇదో ఈ రెండు పాత్రల మధ్య ఉన్న ఓ సంఘర్షణ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి లవ్ స్టోరీస్ లో అలాంటి సంఘర్షణ చాలా చాలా కామన్. కాకపోతే వీరి మూవీలో ఆ కాన్ ఫ్లిక్ట్ వేరేలా ఉండొచ్చేమో. అంత మాత్రం చేత దీన్ని ఓ ‘కల్ట్ క్లాసిక్’అని రిలీజ్ కు ముందే డబ్బా కొట్టడం అస్సలు అంటే అస్సలు బాలేదు. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇది ఓ సాధారణ రెగ్యులర్ లవ్ స్టోరీలాగానే ఉంది తప్ప కొత్తదనం అంటూ ఏమీ కనిపించడం లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన మూవీ ఇది. ఇక ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా సాయి రాజేష్ గా కనిపిస్తున్నాడు. బట్ ఇప్పటి వరకు ఈ మూవీ దర్శకుడు అనేది మాత్రం చెప్పడం లేదు. ఒక వేళ మూవీ హిట్ అయితే సాయి రాజేష్ ఖాతాలో వేసుకుంటాడు.. తేడా కొడితే దర్శకుడిపై నెట్టేస్తుంటాడేమో చూడాలి. ఏదేమైనా ఇది ఓ సాధారణమైన కథ అని అర్థం అవుతుంది. దాన్ని దాటుకుని ఇది నిజంగా కల్ట్ క్లాసిక్ అని వీళ్లు పదే పదే చెబుతున్నారు అంటే ఏదో తేడా కొడుతోంది. కల్ట్ నా లేక క్లాసిక్ నా అనేది చెప్పాల్సింది ప్రేక్షకులు. అది మాత్రం వీళ్లు కొడుతున్న డబ్బాలు మాత్రం మర్చిపోవద్దు.

Continue reading
72వ నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటిన తెలుగు సినిమాలు

72వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది.

కమిటీ కుర్రాళ్లు, పుష్ప 2, కల్కి 2898 AD, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు సాధించి టాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచాయి.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా జోరు

ఒకప్పుడు జాతీయ చలనచిత్ర అవార్డులు అంటే తెలుగు సినిమాలకు చాలా దూరంగా ఉండేవి. అప్పుడప్పుడు ఒక్కో అవార్డు వచ్చినా అది పెద్ద విశేషంగా మారేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే తెలుగు సినిమాలు వరుసగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన కూడా అదే విషయాన్ని మరోసారి నిరూపించింది. కమర్షియల్ సినిమాలతో పాటు మంచి కథ, బలమైన రచన, సాంకేతిక నైపుణ్యం ఉన్న చిత్రాలు ఈసారి కూడా అవార్డులను సొంతం చేసుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది గర్వకారణమనే చెప్పాలి.


ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’

ఈ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’ ఎంపిక కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

యదువంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కొణిదెల నిహారిక నిర్మించారు. పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా మంచి కథ, సహజమైన పాత్రలు, గ్రామీణ నేపథ్యం కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు జాతీయ అవార్డు రావడంతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులతో పాటు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు దక్కుతుందనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.


‘కమిటీ కుర్రాళ్లు’కు మరో గౌరవం

ఈ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో పీ. రవికుమార్ జాతీయ అవార్డు అందుకోవడం మరో విశేషం.

పాత్రలకు తగ్గట్టుగా సహజమైన లుక్స్ తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.


‘లక్కీ భాస్కర్’కు బెస్ట్ డైలాగ్స్

దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ అట్లూరి రాసిన సంభాషణలకు ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డు లభించింది.

షేర్ మార్కెట్ వంటి క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో ఈ సినిమా విజయవంతమైంది. అందులో డైలాగ్స్ కీలక పాత్ర పోషించాయి. అందుకే వెంకీ అట్లూరి జాతీయ అవార్డు అందుకోవడం ఆశ్చర్యంగా అనిపించదు.


‘పుష్ప 2’కు రెండు జాతీయ అవార్డులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కూడా రెండు విభాగాల్లో జాతీయ గుర్తింపు దక్కించుకుంది.

  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – సుకుమార్
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – దీపాలి నూర్, శీతల్ శర్మ

పుష్ప 2లో కథన నిర్మాణం, పాత్రల తీరు, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో పాత్రలకు తగ్గ దుస్తుల రూపకల్పన కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఈ రెండు విభాగాల్లో అవార్డులు రావడం సినిమాకు మరో గౌరవంగా చెప్పాలి.


‘కల్కి 2898 AD’కు బెస్ట్ పాపులర్ ఫిల్మ్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD చిత్రానికి ఉత్తమ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు లభించింది.

భారీ విజువల్స్, పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో మేళవించిన కథ, అద్భుతమైన సాంకేతిక నాణ్యత ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కమర్షియల్ విజయంతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కడం చిత్రబృందానికి మరో గౌరవం.


’35 చిన్న కథ కాదు’కు ఉత్తమ బాలల చిత్రం

ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న 35 చిన్న కథ కాదు చిత్రానికి ఉత్తమ బాలల చిత్రం అవార్డు లభించింది.

పిల్లల భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, చదువు ఒత్తిడి వంటి అంశాలను ఎంతో హృద్యంగా చూపించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగు సినిమాకు మరో మంచి వార్త.


ప్రధాన అవార్డుల్లో విజేతలు

ఈసారి ప్రధాన విభాగాల్లో కూడా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.

  • ఉత్తమ నటుడు – మమ్ముట్టి (భ్రమయుగం) మరియు కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) సంయుక్త విజేతలు.
  • ఉత్తమ నటి – యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
  • ఉత్తమ దర్శకుడు – రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)
  • ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ఆర్టికల్ 370
అవార్డు విజేత
ఉత్తమ తెలుగు చిత్రం కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే సుకుమార్ – పుష్ప 2
ఉత్తమ డైలాగ్స్ వెంకీ అట్లూరి – లక్కీ భాస్కర్
ఉత్తమ కాస్ట్యూమ్స్ పుష్ప 2
ఉత్తమ పాపులర్ ఫిల్మ్ కల్కి 2898 AD
ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు

తెలుగు సినిమాకు మరో గర్వకారణం

ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు కేవలం ఒక్క విభాగానికే పరిమితం కాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, మేకప్, కాస్ట్యూమ్స్, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, పాపులర్ సినిమా, బాలల చిత్రం వంటి పలు విభాగాల్లో తెలుగు సినిమాలు తమ ముద్ర వేశాయి.

ఇది తెలుగు సినిమా నాణ్యత పెరుగుతోందనే విషయానికి మరో నిదర్శనం. కమర్షియల్ విజయాలే కాకుండా కంటెంట్‌కు కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందనేది తెలుగు సినీ పరిశ్రమకు మంచి సంకేతం.

Continue reading
మా ఇంటి బంగారం OTT Full Review

థియేటర్లలా ఓటీటీలోనూ సమంత మ్యాజిక్ పనిచేసిందా..?

సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఓటీటీలో ఎలా ఉంది? పూర్తి తెలుగు రివ్యూ చదవండి.

మా ఇంటి బంగారం OTT Full Review

సమంత కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిన సినిమా మా ఇంటి బంగారం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడం చిన్న విషయం కాదు. జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌తో పాటు పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే సినిమా జూలై 17 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో ఎంతగా ఆకట్టుకుందో… ఓటీటీలో కూడా అదే స్థాయిలో మెప్పిస్తోందా?

ఓటీటీలో రెస్పాన్స్ ఎలా ఉంది..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న స్పందనను చూస్తే మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే థియేటర్లలో కనిపించిన భారీ హైప్ మాత్రం ఓటీటీలో కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే చాలామంది ఈ సినిమాను థియేటర్లలో చూసేయడమే. అయినప్పటికీ మొదటిసారి చూసేవారు మాత్రం సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. అధికారిక వ్యూయర్‌షిప్ డేటా ఇంకా విడుదల కాలేదు.

కథలో ఏముంది..?

ఒక సాధారణ గృహిణిగా కనిపించే స్వర్ణ పాత్రలో సమంత కనిపిస్తుంది. కానీ ఆమె గతం మాత్రం సాధారణం కాదు. కుటుంబం కోసం ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో గతం తిరిగి ఆమె జీవితంలోకి వస్తుంది. అక్కడి నుంచి సినిమా పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్తుంది.

ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా స్థాయిని పెంచుతుంది. రెండో భాగంలో సమంత పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. చివర్లో కుటుంబం కోసం ఆమె చేసే పోరాటం సినిమాకు మంచి ముగింపునిస్తుంది.

సమంత ఒన్ ఉమెన్ షో

ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా సమంత సినిమా. ఎమోషనల్ సీన్స్‌లో అయినా, యాక్షన్ సీక్వెన్స్‌లలో అయినా తన నటనతో ఆకట్టుకుంది.

విలన్‌గా గుల్షన్ దేవయ్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. దిగంత్, గౌతమి, చైతన్య కృష్ణ, శ్రీలక్ష్మి, మంజూష తదితరులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా సమంత-మంజూష మధ్య వచ్చే సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి.

టెక్నికల్‌గా సినిమా ఎలా ఉంది..?

దర్శకురాలు నందిని రెడ్డి ఈసారి తనకు భిన్నమైన జానర్‌ను ఎంచుకుని మంచి ఫలితం సాధించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఆమె విజయం సాధించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు అదనపు బలం.

ఓటీటీలో ఎందుకు కొంచెం తక్కువ హైప్..?

సినిమా బాగోలేదని కాదు. ఇప్పటికే థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులు చూసేయడంతో ఓటీటీలో కొత్తగా వచ్చే వ్యూయర్స్ సంఖ్య సహజంగానే తగ్గింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్, సమంత అభిమానులు, థియేటర్లలో మిస్ అయిన వారు మాత్రం ఇప్పుడు ఈ సినిమాను ఆస్వాదిస్తున్నారు.

మా ఇంటి బంగారం OTT Verdict

థియేటర్లలో మిస్ అయినవారికి మా ఇంటి బంగారం మంచి ఛాయిస్. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, సమంత పెర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా ఒకసారి చూడొచ్చు. థియేటర్లలో వచ్చినంత భారీ హైప్ ఓటీటీలో లేకపోయినా, సినిమా మాత్రం ఇప్పటికీ ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది.

రేటింగ్: ⭐⭐⭐⭐☆ (4/5)

ప్లస్ పాయింట్స్

  • సమంత అద్భుతమైన నటన
  • ఇంటర్వెల్ ట్విస్ట్
  • యాక్షన్ ఎపిసోడ్స్
  • ఫ్యామిలీ ఎమోషన్స్
  • నందిని రెడ్డి దర్శకత్వం

మైనస్ పాయింట్స్

  • రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తాయి
  • థియేటర్లలో చూసిన వారికి కొత్త అనుభూతి తక్కువగా ఉండొచ్చు

Continue reading
బాలీవుడ్ హీరోయిన్లకు టాలీవుడ్‌లో సరైన పాత్రలు దొరకడం లేదా..?

బాలీవుడ్ బ్యూటీలకు టాలీవుడ్‌పై భయం మొదలైందా..?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆసక్తిగా ఎదురుచూసేవారు. పాన్ ఇండియా మార్కెట్, భారీ క్రేజ్, దేశవ్యాప్తంగా గుర్తింపు… ఇవన్నీ ఒకే సినిమాతో వస్తాయని చాలామంది భావించేవారు. కానీ గత కొంతకాలంగా పరిస్థితి కొద్దిగా మారుతోందనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కొంతమంది పేరున్న ఆర్టిస్ట్ లను తెలుగు దర్శకులు సరిగా వినియోగించుకోవడం లేదు అనేది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో పాటు కేవలం స్టార్ హీరోల చుట్టూ మాత్రమే కథలన్నీ తీసుుకోవడం, రాసుకోవడం కూడా ఓ పెద్ద మైనస్ గా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే కేవలం హీరోల చుట్టూ మాత్రమే అల్లుకున్న కథలన్నీ అవుట్ డేటెడ్ అవుతాయి అనేది నిజం.

దానికి ప్రధాన కారణంగా జాన్వీ కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వరుసగా రెండు తెలుగు పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ, ఆమె పాత్రలపై వచ్చిన విమర్శలు ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల కథా నిర్మాణంపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఇది మొత్తం టాలీవుడ్ గురించిన తీర్పు కాదు. కొంతమంది దర్శకులు హీరోయిన్లకు అద్భుతమైన పాత్రలు రాస్తుండగా, మరికొన్ని కమర్షియల్ సినిమాల్లో మాత్రం హీరోయిన్ పాత్రలు కథలో అంతగా నిలబడటం లేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

‘దేవర’తో మొదలైన చర్చ

జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమైన సినిమా దేవర. ఈ సినిమాతో ఆమెపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీదేవి కూతురిగా తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అనుబంధం కూడా ఆ అంచనాలను మరింత పెంచింది. అయితే సినిమా విడుదలైన తర్వాత ఎక్కువమంది ప్రేక్షకులు చెప్పిన కామన్ పాయింట్ ఒక్కటే. జాన్వీ కపూర్ పాత్రకు కథలో చాలా తక్కువ ప్రాధాన్యత ఉందని. స్క్రీన్ టైమ్ కూడా పరిమితంగానే ఉండటంతో ఆమె నటనను చూపించే అవకాశాలు పెద్దగా కనిపించలేదని విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని అప్పట్లో పలు సినీ విశ్లేషకులు కూడా ప్రస్తావించారు.

‘పెద్ది’తో వివాదం మరింత పెరిగింది

‘దేవర’ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్దిపై మాత్రం పరిస్థితి మరింత భిన్నంగా మారింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను ఎలా చిత్రీకరించారనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా కెమెరా యాంగిల్స్, రొమాంటిక్ సన్నివేశాలు, హీరోయిన్ ప్రజెంటేషన్‌పై ప్రేక్షకులు తీవ్ర విమర్శలు చేశారు. మహిళా పాత్రను కథకు అవసరమైన స్థాయిలో కాకుండా విజువల్ గ్లామర్‌కే పరిమితం చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వివాదం బాగా పెరగడంతో దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ కొన్ని సన్నివేశాలను మార్చామని, ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించాలని కూడా చెప్పారు.

ఇది ఒక్క జాన్వీ సమస్యేనా..?

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జాన్వీ కపూర్ టాలీవుడ్ సినిమాలు చేయనని ఎక్కడా ప్రకటించలేదు. అలాగే “తెలుగు సినిమాలకు దూరంగా ఉంటాను” అని కూడా ఆమె అధికారికంగా చెప్పలేదు. అలాంటి వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అయితే తన పాత్రలపై వచ్చిన విమర్శల తర్వాత మహిళా పాత్రల ప్రజెంటేషన్ గురించి ఆమె స్వయంగా స్పందించింది. సినిమా సెట్స్‌లో నటీమణులు కూడా తమ అభిప్రాయం చెప్పగలగాలి అని పేర్కొంది. అందుకే “బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు తెలుగు సినిమాలకు భయపడుతున్నారు” అని చెప్పడం కంటే, “మంచి పాత్రలు ఉంటేనే స్టార్ హీరోయిన్లు ఆసక్తి చూపుతారు” అనడం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.

దర్శకులు ఆలోచించాల్సిన విషయం ఇదే

ఇప్పటి ప్రేక్షకులు కేవలం హీరో ఎలివేషన్ మాత్రమే చూడటం లేదు. హీరోయిన్ పాత్ర కూడా కథలో భాగంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో బలమైన మహిళా పాత్రలు ఉన్న సినిమాలకు మంచి ఆదరణ కూడా లభిస్తోంది. హీరోయిన్‌ను కేవలం పాటల కోసం లేదా గ్లామర్ కోసం ఉపయోగించే ట్రెండ్‌పై సోషల్ మీడియాలో కూడా విమర్శలు పెరుగుతున్నాయి. అంటే కమర్షియల్ సినిమా చేయకూడదనే కాదు. కానీ కథలో హీరోయిన్‌కు కూడా గుర్తుండిపోయే పాత్ర ఉంటే సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కుతుంది.

టాలీవుడ్‌కు ఇది హెచ్చరిక కాదు… అవకాశం

టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నిలిచింది. దేశం మొత్తం తెలుగు సినిమాల వైపు చూస్తోంది. అలాంటి సమయంలో హీరోలతో పాటు హీరోయిన్ల పాత్రలకూ సమానమైన ప్రాధాన్యత ఇస్తే మరింత మంచి గుర్తింపు వస్తుంది. దర్శకుల క్రియేటివిటీని ప్రశ్నించడం కాదు… ప్రేక్షకుల అభిరుచి మారుతోందనే విషయాన్ని గుర్తించడం ముఖ్యం.జాన్వీ కపూర్ చుట్టూ మొదలైన ఈ చర్చ భవిష్యత్తులో మరిన్ని బలమైన మహిళా పాత్రలకు దారి తీస్తే… అదే టాలీవుడ్‌కు నిజమైన విజయం అవుతుంది.

 

Continue reading
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయినట్టేనా..?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్యకు సరైన వారసుడుగా అభిమానులు అతన్ని నెత్తిన పెట్టుకోవడం కోసం చూస్తున్నారు. ఇటు చూస్తే తన తరం హీరోల తనయులు హీరోలుగా మారిపోయారు. బట్ తన ఏజ్ ను బట్టి మోక్షజ్ఞ కూడా ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎందుకో అతనికి ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తోంది. బాలయ్య కోరిక బలంగా ఉన్నా మోక్షజ్ఞకు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరిక కనిపించడం లేదు అని చాలాసార్లు అనిపిస్తోంది.
ఇక రీసెంట్ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అని కొన్నాళ్ల క్రితం నానా హడావిడీ చేశారు. ఆ మేరకు మోక్షజ్ఞకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ అంటూ కొన్ని ఫోటోస్ విడుదల చేశారు. బట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రశాంత్ తప్పుకున్నాడు. తర్వాత సీన్ లోకి బాలయ్యే స్వయంగా వచ్చాడు. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999ను రూపొందించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. బట్ అదీ ముందుకు సాగడం లేదు. ఇటు చూస్తే మోక్షజ్ఞ ఎప్పుడూ ప్రాపర్ లుక్ మెయిన్టేన్ చేయలేకపోతున్నాడు. దీంతో అసలు మనోడికి సినిమా హీరో కావాలనే లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అదీ నిజమే అనిపించేలా ఉంది తాజా కథ.
బాలకృష్ణ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఆగస్ట్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి సుధాకర్ చెరకూరు నిర్మాత. అయితే కొరటాల మూవీని సడెన్ గా స్టార్ట్ చేశాడు బాలయ్య. అందుకు కారణం నిర్మాతే అనేది చాలామందికి తెలియదు. సుధాకర్ చెరకూరి గతంలో మోక్షజ్ఞతో మూవీ చేయాలనుకున్నాడు. ఆ మేరకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం కొంత ఖర్చు చేశాడు. కానీ మోక్షజ్ఞ మూవీ చేయలేకపోతున్నాడు. ఆ మేరకు అతనికి కాంపెన్సేట్ చేయడం కోసమే బాలయ్య ఇప్పుడు ఈ మూవీ స్టార్ట్ చేశాడు అనేది వాస్తవం. అంటే మోక్షజ్ఞతో మూవీ చేయాలని సుధాకర్ కు ఉన్నా.. అది పట్టాలెక్కడం సాధ్యం కాదు అని తెలిసింది కాబట్టే ఈ ప్రాజెక్ట్ నే బాలయ్యతో స్టార్ట్ చేయబోతున్నాడన్నమాట.
ఈ రకంగా చూస్తే.. మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదు మాత్రమే కాదు.. అసలు అతనికి సినిమాలే ఇంట్రెస్ట్ లేదు అని అనుకోవచ్చు. లేదంటే ఇప్పటికే అతని వయసుకు 30కి వచ్చేసింది. ఈ ఇండస్ట్రీలో 20కే స్టార్ట్ చేయడం కామన్ గా చూస్తుంటాం. అలాంటి అతను ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు.. అంటే అతనికి అసలు ఇంట్రెస్ట్ లేకపోవడమే అనేది ఈ వార్త సారాంశం. లేదంటే బాలయ్య కొన్ని ముహూర్తాల కోసం చూస్తున్నాడేమో తెలియాల్సి కూడా ఉంది.

Continue reading