సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న మూవీ శ్రీనివాస మంగాపురం. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఇప్పటి వరకు అయితే పాజిటివ్ బజ్ ఉంది. జయకృష్ణ ఫస్ట్ మూవీ కావడంతో పాటు ఇలాంటి నెపోకిడ్స్ ను ఫస్ట్ టైమ్ పరిచయం చేసిన నిర్మాత ప్రెజెంటర్ గా ఉండటం మరో ప్లస్ పాయింట్ అవుతుంది. అదీ కాక ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోస్ అన్నీ బాగా పేలాయి. దీంతో ఈ మూవీ గ్యారెంటీగా విజయం సాధిస్తుందని చాలామంది అంచనాలు వేస్తున్నారు.
మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో రవీనా టాండన్ కూతురు రషా టండానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా ఇది ఉండబోతోందని మొదటే చెప్పారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఏకంగా 1కోటి రూపాయలు ఇచ్చారు అనే ప్రచారం కూడా సినిమాకు ప్లస్ అవుతుందేమో చూడాలి.
ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ మూవీ కూడా ఉండటంతో శ్రీనివాస మంగాపురంను వాయిదా వేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమే అనేలా తాజాగా ఈ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో పాటు కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ అంటే ఇదే నెల 30న ఉండబోతోంది. అదీ కాక అదే రోజు మహేష్ బాబు హీరోగా ఫస్ట్ మూవీ రాజకుమారుడు విడుదలైన రోజు కూడా అదే. దీంతో ఇది కూడా కలిసొస్తుందని భావించారేమో.. ఈ నెల 30 శ్రీనివాస మంగాపురం విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు.






