ఓటిటిలోనూ అదరగొడుతోన్న ‘బ్లాస్ట్’

యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ బ్లాస్ట్. మే 28న విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. సినిమా కమర్షియల్ గా కూడా పెద్ద విజయం సాధించింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ చాలా వరకు ప్రిడక్టబుల్. కానీ కథనంతో కట్టి పడేశారు. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ పాత్రను డిజైన్ చేసిన విధానానికి చాలామంది ఫిదా అయిపోతున్నారు. డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కే డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రధానంగా తమిళ్ లో తెరకెక్కినా డబ్బింగ్ రూపంలో తెలుగులోనూ హిట్ అయింది. మళయాలంలో మాత్రం చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. అలాంటి చిత్రాన్ని ఈ నెల 25న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఓ వైపు ఓటిటిలో వస్తున్నా.. ఈ మూవీకి అక్కడక్కడ థియేటర్స్ లో కూడా ఆడుతూనే ఉంది.
మామూలుగా ఇలాంటి మూవీస్ థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంటాయి. ఓటిటిలో మాత్రం తేలిపోతుంటాయి. బట్ ఈ మూవీ విషయంలో అలా కాలేదు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్స్.. ఓటిటిలో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటోంది. ముఖ్యంగా ప్రీతి ముకుందన్ కు ఓటిటిలో హారతులు పడుతున్నారు ఆడియన్స్. థియేటర్స్ లో చూసిన వాళ్లు కూడా ఓటిటిలో మళ్లీ మళ్లీ చూస్తున్నారు అంటే అది ఈ కంటెంట్ లో ఉన్న దమ్ము. ఏదేమైనా నెట్ ఫ్లిక్స్ లో బ్లాస్ట్ కు బ్లాస్టింగ్ రెస్పాన్స్ వస్తోందనేది వాస్తవం.

Continue reading
శ్రీనివాస మంగాపురం పోస్ట్ పోన్ అవుతోందా..?

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు, మహేష్ బాబు అన్న కొడుకు అంటూ చాలా ట్యాగ్స్ తో ఉన్న హీరో జయకృష్ణ. అతను హీరోగా పరిచయం అవుతోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా టండానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ ఇద్దరి జంటకు మంచి అప్లాజ్ వస్తోంది. జయకృష్ణ ఇండస్ట్రీలోకి రావడం కోసం చాలా కసరత్తులు చేశాడు. తన తండ్రి సాధించలేకపోయిన విజయాన్ని తను సాధించాలని తాపత్రయ పడుతున్నాడు. ఆర్ఎక్స్ 100, మంగళవారంతో మంచి హిట్స్ అందుకున్న అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆల్రెడీ ఈ మూవీ ఆడియోకు మంచి అప్లాజ్ వస్తోంది.పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని జూలై 9న విడుదల చేయబోతున్నాం అని గతంలోనే ప్రకటించారు. అయితే అదే టైమ్ కు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ కూడా విడుదల కాబోతోంది. దీంతో వీరు తమ శ్రీనివాస మంగాపురం సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త డేట్ గా ఇదే అని ఫిక్స్ చేయలేదు కానీ.. జూలై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. మొత్తంగా హీరోగా ఫస్ట్ మూవీ అంటే ఇలాగే చేయాలి. కానీ వీళ్లు మొదటి నిర్ణయాన్ని వాయిదా వేయడం ఏమంత బాలేదు అని అభిమానులు భావించినా.. అఖిల్ తో పోటీ ఎందుకునే అని వీళ్లు అలా ఫిక్స్ అయ్యారు. బట్ మూవీ ఎప్పుడు విడుదలైన మంచి విజయం సాధించడం ఖాయం అనేది వీరి కాన్ఫిడెన్స్ మాత్రం చూడముచ్చటగా ఉంది.

Continue reading
ఒన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి

చిన్నవయసులోనే వెండితెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. గ్లమరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన భారతనారి. హీరో స్వామ్యం నడిచే ఇండస్ట్రీలో నటిగా దాన్ని ప్రతిఘటించిన ధీశాలి. ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి. అబితాబ్ బచ్చన్, రజినికాంత్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ విజయశాంతి. డబ్బింగ్ చిత్రాలతోనే తమిళనాట నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందిన అరుదైన నటీమణి విజయశాంతి.

విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి తీసుకుంది. విజయశాంతిని కథానాయకిగా తెరకు పరిచయము చేసింది భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం కూడా అదే ఏడాది ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ, దర్శకురాలు విజయనిర్మల. తర్వాత కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది విజయశాంతి.

హీరోయిన్ గా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు తెలుగు, తమిళ్ లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసింది విజయశాంతి. వీటిలో కూడా పెద్ద హిట్స్ గా నిలిచినవి చాలా తక్కువ. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983 లో నిర్మించిన నేటి భారతం. అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండాపోయింది. క్రమంగా కథానాయికగా ఒక్కో మెట్టే అధిరోహిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరింది.

తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసి లోయ, పెళ్లిచూపులు వంటి తెలుగు చిత్రాల్లో రెగ్యలర్ హీరోయిన్ వేషాలే వచ్చాయి .అయితే రాశి పరంగా తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినా.. అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ వేసి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె.

జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనకంటూఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి చాలాకాలమే నిరీక్షించాల్సి వచ్చింది. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం ప్రతి హీరోయిన్ కుళ్లుకునేలా సాగిందంటే అతిశయోక్తి కాదు.

1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ , అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జాదొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో హీరోతో ఆడి పాడే చిలిపి కథానాయికగానూ నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది. ప్రతిఘటన తో అభినయ పరంగా తనకెదురే లేదని నిరూపించుకోగా, జడగంటలు లో టు-పీస్ బికినీ ధరించి అందాల ప్రదర్శన విషయంలో కూడా తనకు హద్దులు లేవని చాటి చెప్పింది.

సౌజన్యం మూర్తీభవించిన కథానాయిక పాత్రలకు.. హుందాతనం ఉట్టిపడే పాత్రలు.. పురుషులను ధిక్కరించే అహంకారపూరిత పాత్రలు.. మొండితనం నిండిన క్యారక్టర్స్ కు .. అందచందాలతో అలరించే పాత్రలు.. ఇలా ఒక్కో రకం కథానాయిక పాత్రకు ఒక్కో నటీ ఫేమస్ అయిన టైమ్ లో, అవన్నీ విజయశాంతి ఒక్కతే పోషించి ప్రేక్షకులను మెప్పించగలదనీ నిరూపించింది. మొత్తంగా 1985లో ఆమె నటించిన పదమూడు తెలుగు సినిమాలు రిలీజ్ అయితే వాటిలో పదకొండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో ఆమె తమిళ మూవీస్కు ఫుల్ స్టాప్ పెట్టి తెలుగు సినిమాలపైనే కాన్ సెంట్రేట్ చేసింది.

1986 విజయశాంతి స్టామినాను కమర్షియల్ నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లిన సంవత్సరం. రేపటి పౌరులు, అరుణ కిరణం, సమాజంలో స్త్రీ, శ్రావణ సంధ్య వంటి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ, అటు ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, సక్కనోడు, బ్రహ్మాస్త్రం వంటి మసాలా చిత్రాల నాయికగానూ నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా దేశోద్ధారకుడు చిత్రంలోని వచ్చె వచ్చె వాన జల్లు పాటలో అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి మొహమాటాలూ పెట్టుకోలేదు. ఈ మూవీతో బాలయ్యతో విజయశాంతిది హిట్ పెయిర్ గా గుర్తింపొచ్చింది.

1980ల సగం నుంచి 90 వరకూ విజయశాంతి కెరీర్ పీక్స్ లో కొనసాగింది. ఈ టైమ్ లో ఆమె ఏం చేసినా హిట్టే అన్నట్టుగా సాగింది కెరీర్. తనే ప్రధాన పాత్రగా ఉన్నా.. హీరోల సరసన కేవలం గ్లామర్ డాళ్ గా ఆడిపాడినా.. అచ్చ తెలుగు ఆడపిల్లగా అయినా.. విజయశాంతి ఈ ఐదారేళ్ల కాలంలో చేసిన పాత్రలు.. సినిమాలు.. అన్నీ సూపర్ హిట్సే. ఓ రకంగా అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది.

పడమటి సంధ్యారాగం, జానకి రాముడు చిత్రాలలో అచ్చ తెలుగు ఆహార్యమైన లంగా ఓణీలతో ఆమె పోషించిన సంధ్య, జానకి పాత్రలు ఇప్పటికీ ముద్ద బంతి పూవు లాంటి తెలుగు పడుచు పిల్ల సౌందర్యానికి వెండితెర పర్యాయ పదాలుగా నిలచిపోయాయి. ఇవే కాక ఇంద్రుడు – చంద్రుడు, యముడికి మొగుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు, గూండా రాజ్యం వంటి సూపర్ హిట్ సినిమాలతో విజయానికి మరో పేరు విజయశాంతిగా నిలిచిపోయింది.

ఇక మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన సినిమా కర్తవ్యం. అప్పటి వరకూ లేడీ ఓరియంటెడ్ పాత్రలంటే మగదిక్కులేని గంపెడు సంసారాన్ని గుట్టుగా లాగిస్తూ.. సమాజంలో మంచి మహిళగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసినవే. కానీ ఆడదంటే అబల కాదు..ఆమె తలచుకుంటే ఏదైనా సాధిస్తుందని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా నాటి రోజుల్లో ఎందరు మహిళలకు స్ఫూర్తినిచ్చిందో చెప్పలేం. ఇప్పటికీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో చాలామంది సీనియర్ లేడీ ఆఫీసర్స్ తమకు కర్తవ్యం సినిమానే స్ఫూర్తి అని చెప్పుకుంటారు.

అయితే విజయశాంతి చేసిన చాలా చిత్రాల్లో పాత్రల కంటే తమిళ్ లో రజినికాంత్ హీరోగా నటించిన మన్నన్ లోని పాత్ర ది బెస్ట్ అని చెబుతారు. పొగరుబోతు మహిళగా ఈ సినిమాలో ఆమె నటనకు ఫిదా కాని వారు లేరు. ఓ సన్నివేశంలో ఆమె రజినికాంత్ ను చెంపదెబ్బ కొట్టాలి. ఆ పాత్రలో విజయశాంతి కాకుండా ఇంకెవరు చేసినా రజిని అభిమానులు ఊరుకునేవారు కాదని రజినీయే స్వయంగా చెప్పారంటే ఆమె నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే చిత్రం తెలుగులో ఘరానామొగుడు గా రీమేక్ కావడం విశేషం.

కర్తవ్యం ఇంపాక్ట్ తో ఆ తర్వాత దాదాపు తనే ప్రధాన పాత్రలో చాలా సినిమాలే చేసింది. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని యావరేజ్ గా నిలిచాయి. ఇదే టైమ్ లో మరికొన్ని గ్లామర్ పాత్రలనూ పోషించింది. బాలయ్యతో నిప్పురవ్వ, చిరంజీవితో మెకానిక్ అల్లుడు తర్వాత ఆమె స్టార్ హీరోల సరసన నటించలేదు. అయితే వీటితో పాటు ఆమె చేసిన మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫట్ మన్నాయి. ఆ టైమ్ లో వచ్చిన ఓ చిత్రం తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులూ తుడిచేసింది. అదే ఓసేయ్ రాములమ్మా.

ఒసేయ్ రాములమ్మా సినిమాతో వచ్చిన ఇమేజ్ తో ఆమె అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. పొలిటికల్ గా పెద్దగా యాక్టివ్ గా లేని టైమ్ లో మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నం చేశారు. ఆ కోవలో చేసిన రౌడీ దర్బార్ ఎబౌ యావరేజ్ గా నిలిస్తే.. శ్రీవారంటే మావారే, భారతరత్న సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. 2000ల తర్వాత నుంచి విజయశాంతి సినిమా కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ లో కొనసాగింది. చేసిన ప్రతి సినిమా నిరాశపరిచింది.

శాంభవి ఐ.పి.యస్., వైజయంతి, నాయుడమ్మ, ఇందిరమ్మ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఇవన్నీ ఆమె ప్రధాన పాత్రలో నటించినవే అయినా, కథ, కథనాల్లో ఎటువంటి ప్రత్యేకత లేని చిత్రాలు కావటంతో ఎవరినీ ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు అదే సమయంలో ఆమె రాజకీయరంగంలో కూడా ఉండటంతో మంచి కథలు ఎంచుకోలేకపోయింది. దీంతో సినిమాలలో ఇంకా సంచలనం సృష్టించగల ప్రతిభ, వయసు ఉన్నా రాజకీయరంగంపై ఆసక్తితో ఆమె సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టు చెప్పుకోవచ్చు.

సొంతంగా పార్టీ పెట్టి, తర్వాత ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం ఓ సారి ఎం.పిగా గెలిచిన విజయశాంతి పొలిటికల్ కెరీర్ కూడా ఇప్పుడేమంత బాగా లేదు. అందుకే మళ్లీ సినిమా రంగంలోకి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదీ కాక ఆమె ఎప్పటి నుంచో తన లక్ష్యం తెలంగాణ సాధించడం అని చెబుతూ వచ్చింది. అది సాకారమైంది కాబట్టి.. ఇక రాములమ్మ రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆమె అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం విజయశాంతి లాంటి ఆర్టిస్ట్ అవసరం దక్షిణాది చిత్ర పరిశ్రమకు చాలా ఉంది.

 

Continue reading
బాలయ్య, ప్రభాస్, విజయ్.. డిసెంబర్ లో వచ్చేదెవరు..?

నందమూరి బాలకృష్ణ అప్డేట్

ఈ యేడాది డిసెంబర్ మంచి డిమాండ్ లో ఉండబోతోంది అనిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య నటిస్తోన్న మూవీ డిసెంబర్ లో విడుదల కాబోతోంది అని చెబుతున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్ తోనే అదరగొట్టాడు. అదీ కాక బాలయ్య విగ్ సెట్ అయితే సినిమా హిట్ అనే టాక్ కూడా ఉంది కదా. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయడానికి మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ కూడా పూర్తి కావొస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు ప్రమోషన్స్ కు కావాల్సినంత టైమ్ ఉంది. అదీ కాక బాలయ్య ఈ మూవీ తర్వాత ఆగస్ట్ నుంచే కొరటాల శివ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడు. అంటే ఆగస్ట్ వరకు గోపీచంద్ మూవీ కంప్లీట్ అవుతుంది. అందుకే బాలయ్యకు బాగా కలిసొచ్చినా డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ప్రభాస్ ఫౌజీ మూవీ

ఇక రాజాసాబ్ లాంటి డిజాస్టర్ చూసిన ప్రభాస్ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ముందుగా రావాల్సిన సినిమా ఫౌజీ. బట్ ఈ మూవీ గురించి మినిమం అప్డేట్స్ కూడా ఏం లేవు. అసలు వస్తుందా లేదా అనేది కూడా తెలియకుండా పోయింది. ఈ మూవీ టీమ్ నుంచి ఎలాంటి విషయాలు కూడా తెలియకుండా ఉన్నారు. ఆ కారణంగా ఈ చిత్రం అసలు ఈ యేడాది విడుదలవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా కొందరు మాత్రం ఈ చిత్రాన్ని ఈ యేడాది డిసెంబర్ 3న విడుదల చేస్తారు అని చెబుతున్నారు. ఆ కొందరు అనేది ఎవరికీ తెలియదు. బట్ ఇప్పటికైతే ఫౌజీని డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నారు అనే రూమర్ ఉంది.

విజయ్ దేవరకొండ రణబాలి

ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న మూవీ రణబాలి. రష్మిక మందన్నా హీరోయిన్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో రాబోతోంది. ఈ మూవీ విషయంలో విజయ్ దేవరకొండ చాలా సీరియస్ గా ఉన్నాడు. ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అదీ కాక రష్మిక మందన్నా ఈ మధ్య చేసిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్స్. అలాంటి ఇద్దరూ పెళ్లి తర్వాత చేస్తోన్న మూవీ ఇది. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 11నవిడుదల అన్నారు. తర్వాత అక్టోబర్ కు వాయిదా వేశారు. బట్ ఈ వాయిదా కూడా ఆగిపోయేలా ఉందట. ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇక నాని నటిస్తోన్న ద ప్యారడైజ్ కూడా డిసెంబర్ లోనే విడుదల కాబోతోందంటున్నారు. వీళ్లు ఇప్పటికే రిలీజ్ డేట్ మార్చారు. ఇంకా కొత్త డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. మరి వీళ్లు కూడా డిసెంబర్ లో వస్తే.. ఈ నెల టాలీవుడ్ కు మాంజి జోష్ గా ఉంటుందేమో.

 

Continue reading
రామ్ పోతినేని రఫ్పాడిస్తాడా..?

రామ్ పోతినేని(Ram Pothineni) కొన్నాళ్లుగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. సరైన సినిమాలు పడటం లేదు. వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశనే పరుస్తున్నాయి. చివరగా ఆంధ్రాకింగ్ తాలూకాతో నటనతో మెప్పించాడు కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని తనే స్వయంగా రంగంలోకి దిగాడు. డెబ్యూ డైరెక్టర్ గా ఫస్ట్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ రేపటి నుంచి(29.06.2026) ప్రారంభం కాబోతోంది.
ఈ చిత్రానికి దర్శకుడే కాదు నిర్మాత కూడా తనే. కృష్ణ పోతినేని నిర్మాణంలో రాపో సినిమాటిక్ అనే బ్యానర్ స్థాపించాడు. ఆ బ్యానర్ లోనే రాపో ఫస్ట్ డైరెక్షన్ మూవీ రాబోతోంది. ఈ మూవీలో అతని పాత్రను ‘వీరా’గా ఆల్రెడీ చెప్పారు. ఆ పాత్రకు తగ్గట్టుగా గెటప్ కూడా ఉండబోతోంది అనిపించేలా ఓ లుక్ కూడా విడుదల చేశారు. మొత్తంగా రామ్ పోతినేని ఈ కథ విషయంలో చాలా సీరియస్ గా ఉండబోతున్నాడు అనిపించేలా ఉన్నాడు. మరిఈ మూవీలో హీరోయిన్ ఎవరు.. ఇతర కాస్టింగ్ ఎవరు అనేది రేపు తెలుస్తోందేమో.

Continue reading
మా ఇంటి బంగారంతో సమంత సత్తా చాటుతుందా..?

సమంత ఈ మధ్య వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతోంది. చేసిన సినిమాలన్నీ పోతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ అన్నీ పోతున్నాయి. అయినా మరోసారి అదే ప్రయత్నం చేసింది అని మా ఇంటి బంగారంతో అర్థమవుతోంది. ఈ మూవీ ట్రైలర్ మంచి స్పందన వస్తోంది. తను చాలా హార్డ్ వర్క్ చేసింది అని తెలుస్తోంది. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మా ఇంటి బంగారంను తన సొంత బ్యానర్ లోనే నిర్మించింది. అందుకే ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది. ఏకంగా ఒకే రోజు 40ఇంటర్వ్యూస్ ఇచ్చింది అంటే ఇదో రికార్డ్ అని కూడా చెప్పాలి. అంతలా ఈ మూవీ కోసం కష్టపడుతోంది.
ఇక ఈ చిత్రంలో ఓ ఉమ్మడి కుటుంబానికి కోడలుగా వస్తోంది. ఆమెకు కుటుంబ వ్యవహారాలేం తెలియదు. అయినా కష్టపడి అన్నీ నేర్చుకుంటూ అందరికీ నచ్చేలా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. అదే సమయంలో తన కుటుంబం కష్టాల్లో ఉంది తెలుసుకుని ఆ కష్టాలను తొలగించేందుకు తను తీసుకున్న నిర్ణయాలు కీలకంగా ఉంటాయి అని తెలుస్తోంది. అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండబోతున్నాయని అర్థం అవుతోంది. ముఖ్యంగా తను చీర కట్టుతో చేసిన ఫైట్స్ ఈ చిత్రానికే హైలెట్ గా నిలవబోతున్నాయనిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసింది. అందుకోసం తన ఫిజిక్ ను కూడా చాలా కష్టపెట్టిందనిపిస్తోంది. మరి ఇంత కష్టానికి తగ్గ ఫలితంగా ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందా లేదా అనేది ఈ నెల 19న తేలిపోతుంది.

Continue reading
విజయ్ విడాకుల వ్యవహారం ఎటు తేలింది..?

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ విడాకుల వ్యవహారం ఎటూ తేలకుండా ఆగిపోయింది. విజయ్ భార్య సంగీత సొర్ణలింగం ఈ యేడాది ఆరంభంలోనే విజయ్ తో విడాకులు కావాలని కేస్ వేసింది. ఈ కేస్ లో తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది సంగీత. విజయ్ కి వివాహేతర సంబంధం, తనపై మానసిక వేధింపులు, ఎమోషనల్ నెగ్లీజెన్స్ ఆరోపిస్తూ సంగీత విడాకుల కోసం దాఖలు చేసింది. ఆ కేస్ ఏప్రిల్ 20న హియరింగ్ కు వచ్చింది. ఇదే సమయంలో విజయ్ రాజకీయంగా, ఎన్నికల కారణంగా చాలా బిజీగా ఉండిపోయాడు. దీంతో 20న హాజరు కాలేను అని లాయర్స్ ద్వారా అభ్యర్థించాడు. దీనికి మన్నించిన కోర్ట్ జూన్ 15న హియరింగ్ అని చెప్పింది. ఇవాళ జూన్ 15న. బట్ ఆ ఇద్దరూ కోర్ట్ కు హాజరు కాలేదు.
కోర్టు విచారణ సందర్భంగా, అధికారిక అనుమతి పత్రం (వకాలత్‌నామా) దాఖలు చేయకపోవడం, ఇరు పక్షాల వారు స్వయంగా హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఇప్పుడు ఆగస్టు 7కి నిర్ణయించబడింది.
విచారణకు ఇద్దరూ హాజరు కాలేదు అంటే ముందు నుంచీ వస్తోన్న వార్తలకు మరింత బలం చేరింది. ఈ ఇద్దరూ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అని కొందరు.. లేదూ విజయ్ తల్లితండ్రి శోభ, చంద్రశేఖర్ చేసిన రాయబారం వల్ల ఈ ఇద్దరు మళ్లీ కలిసిపోతున్నారు అని మరికొందరు అంటున్నారు. మాగ్జిమం ఇద్దరూ మళ్లీ కలిసిపోవడం ఖాయం అనేది మెజారిటీ జనాల అభిప్రాయం. ఏదేమైనా ఇద్దరి మధ్య సంధి కుదిరినట్టుగానే చాలామంది భావిస్తున్నారు. మరి ఫైనల్ గా ఆగస్ట్ 7న అసలు విషయం తేలిపోతుందేమో చూడాలి.

Continue reading
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా

భారతీరాజా .. వెండితెరపై గ్రామీణ భారతాన్ని ఎంతో అద్భుతంగా సెల్యులాయిడ్ చేసిన దర్శకుడు. ఒకటీ రెండు కాదు.. ఎన్నో సినిమాల్లో విలేజ్ లవ్ స్టోరీస్ తో పాటు వారి జీవన విధానాల్ని అక్కడి మట్టి వాసనలంత సహజంగా పిక్చరైజ్ చేశాడు.. ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయని వెండితెరపై ఎర్రగులాబీలు పూయించి, థ్రిల్లర్ సినిమాలతో టిక్ టిక్ టిక్ మనిపించాడు. పదహారేళ్ల వయసు నుంచే మొదలైన భారతీరాజా సంచలనం నిన్నా మొన్నటి వరకూ కొనసాగింది. తెలుగు తెరపైనా తనదైన ముద్రవేసిన భారతీరాజా కన్నుమూశారు. ఎన్నో మరపురాని చిత్రాలతో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని మిగుల్చుకున్న భారతీరాజా చిత్రాల్ని ఓ సారి గుర్తు చేసుకుందాం ..

దక్షణభారత దేశ చరిత్రలో ఎంతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భారతీరాజా.. అసిస్టెంట్ గా కెరీర్ మొదలుపెట్టింది.. పి పుల్లయ్య దగ్గర. ఆయన మన తెలుగు దర్శకుడే. తర్వాత కన్నడ స్టార్ డైరెక్టర్ పుట్టన్న కనగల్, మళయాల చిత్రదర్శకుడు కృష్ణ నాయర్ వద్ద ఓనమాలు నేర్చుకున్నాడు.. కానీ తనకంటూ ఓ శైలిని అప్పుడే ఏర్పాటు చేసుకున్నట్టుగా అద్భుతమైన స్క్రిప్ట్ సమకూర్చుకున్నాడు. అదే పదహారు వయదినిలే. పరువానికి వచ్చిన అమ్మాయిల కలలు, ఊహలు ఎలా ఉంటాయి.. ఊహలకు వాస్తవాలకు మధ్య దూరమెంత అంటూ భారతీరాజా వెండితెరపై వేసిన పెయింటింగ్ ఇండియా అంతా సంచలనం అయింది.. ఆ సినిమానే తర్వాత రాఘవేంద్రరావు తెలుగులో పదహారేళ్ల వయసుగా రీమేక్ చేశాడు.
తర్వాత తెలుగులో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ ను హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో కిజక్కే పోగుమ్ రైల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కూడా గ్రామీణ వాతావరణంలో సాగే ప్రేమకథే. అంచనాలను మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎన్నో కేంద్రాల్లో యేడాది పాటు ఆడి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రాన్నే తర్వాత బాపు తెలుగులో తూర్పువెళ్లేరైలుగా రీమేక్ చేశారు.. మోహన్, జ్యోతి జంటగా నటించారు.
రెండు వరుస హిట్స్ వచ్చాయనో లేక, అతని ఎదుగుదలను ఓర్వలేకో కానీ కొందరు తమిళ చిత్ర ప్రముఖులు భారతీరాజా గ్రామీణ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు అనే ముద్రవేశాడు. దీంతో భారతీరాజా ‘‘సిగప్పుడ రోజాక్కల్’ అనే సినిమా చేశాడు. కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఆ సినిమా తెలుగులో ఎర్రగులాబీలుగా డబ్ అయింది. ఇక్కడే కాదు.. ఈ సినిమా అక్కడా బ్లాక్ బస్టర్ సాధించింది. అలాగే కమల్ తోనే థ్రిల్లర్ సినిమా ‘టిక్ టిక్ టిక్’ తీసి విమర్శకుల నోళ్లు మూయించాడు భాగ్యరాజా.
కెమెరా యాంగిల్స్ ను కొత్తగా పరిచయం చేశాడు భారతీరాజా. అప్పటి వరకూ ఉన్న ట్రెండ్ కు పూర్తి భిన్నంగా పిక్చరైజేషన్ స్టార్ట్ చేశాడు. ఇక ఎంచుకునే కథల్లో సినిమాకు అనుగుణంగా కాకుండా ఒరిజినాలిటీకి అతి దగ్గరగా సెట్ చేసుకున్నాడు. అటే లొకేషన్స్ విషయంలోనూ అదే చేశాడు. అందుకే ఆడియన్స్ కు భారతీరాజా సినిమా పై గురి పెరిగింది.
ఇక భారతీ రాజా సృష్టించిన మరో సంచలనం టీనేజ్ లవ్ స్టోరీగా తీసిన ‘అలగై ఓవితల్లై’. కార్తీక్, రాధ జంటగా రూపొందించిన ఈసినిమా పై ఆ రోజుల్లో కొన్ని విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం దుమ్మురేపింది. దాన్నే తెలుగులో సీతాకోక చిలుకగా కార్తీక్ హీరోగా ముచ్చర్ల అరుణ హీరోయిన్ గా తెరకెక్కించాడు.. ఇక్కడా ఆ చిలుక అదిరిపోయే హిట్ అందుకుంది..
ముఖ్యంగా సీతాకోక చిలుకలో అప్పటి వరకూ శృంగార తారగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత చేత అద్భుతమైన పాత్ర చేయించాడు భారతీరాజా. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించిన అవతలి వారిలోని ప్రతిభను గుర్తించడంలో భారతీరాజా స్పెషాలిటీని గుర్తు చేస్తుందా పాత్ర.. అందుకే సిల్క్ కూడా ఈ పాత్రలో అద్భుతమైన అభినయాన్ని చూపించింది.
ఎనభైయవ దశకం అంతా భారతీరాజా సంచలన విజయాలతో నిండిపోయింది. అద్భుతమైన చిత్రాలు.. అదరిపోయే విజయాలతో భారతీ రాజా దక్షిణాది చిత్రసీమపై తిరుగులేని ముద్ర వేశాడు. వీటిలో చాలా సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి.. లేదంటే డబ్ అయి, అక్కడా అంతే స్థాయిలో విజయాల్ని సాధించాయి. అయితే తొలినాళ్లలో వచ్చిన విమర్శల ప్రకారం భారతీరాజా నిజంగానే గ్రామీణ కథలతోనే ఎక్కువ విజయాలు సాధించాడు. అందులో ‘మాన్ వాసనై’ ఒకటి. ఇదే చిత్రం తెలుగులో మంగమ్మగారి మనవడు గా రీమేక్ అయింది.
భారతీరాజా సినిమాల్లో పాత్రలు అనుభవించే పెయిన్ ప్రేక్షకులూ అదే స్థాయిలో ఫీలవుతారు. అదే భారతీరాజా విజయానికి ప్రధాన కారణం. మూతల్ మరియాదై అనే ఓ మధ్యవయస్కుడి కథతో చేసిన సినిమా దేశవ్యాప్తంగా సంచలనం అయింది. నటీనటుల అద్భుత అభినయానికి తోడు, ఆ కథను భారతీరాజా నడిపించిన విధానికి ఎవరి హృదయమైనా బరువెక్కాల్సిందే. ఈ సినిమా తెలుగులో ఆత్మబంధువుగా డబ్ అయి.. సూపర్ హిట్ అయింది.
అలాగే భారతీరాజా సృష్టించిన మరో మాసివ్ అండ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఆరాధన. తెలుగులో చిరంజీవి పోషించిన పాత్రలో తమిళంలో ముందుగా సత్యరాజ్ నటించాడు.. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారతీరాజానే డైరెక్ట్ చేశాడు. ఆరాధనలోని పాటలన్నీ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే..అసలు ఇలాంటి ఓ టిపికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేయాలనే భారతీరాజా ఆలోచనకే హ్యాట్సాఫ్ చెప్పాలి..
అయితే క్లాసికల్ చిత్రాల దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు అవార్డులు సాధించిన భారతీరాజా చాలాసార్లు ఎన్నో విమర్శలు కూడా ఫేస్ చేశాడు. ముఖ్యంగా రాజాకు తెలుగువాళ్లంటే ఇష్టం ఉండదు అనేది బహిరంగ రహస్యం. అలాగే తమిళనాడు అంతా వ్యతిరేకించే అప్పటి ఉగ్రవాద గ్రూప్ అధిపతి ప్రభాకరన్ ను కలిసి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కొన్నాళ్ల క్రితం తన స్వీయదర్శకత్వంలోనే రూపొందించిన ‘‘అన్నకోడి’’ అనే సినిమాలో తెలుగువారిపై తన విద్వేషాన్ని వెల్లగక్కాడు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది..
భారతీరాజా దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించాడు. చాలాసార్లు ముక్కుసూటి తనంతో మరికొన్ని సార్లు దుడుకుతనంతో విమర్శలపాలయ్యాడు. ఓ రకంగా భారతీరాజాకు ఉన్న ఇమేజ్ కు కాస్త క్లీన్ సర్టిఫికెట్ కూడా ఉండి ఉంటే ఆయన్ని గౌరవించే వారి సంఖ్య ఇంకా చాలా పెరిగి ఉండేదని సన్నిహితులే చెబుతారు.. అలాగే ఇప్పుడు తెలుగు, తమిళ సీమల్లో టాప్ హీరోయిన్ గా వెలుగుతోన్న కాజల్ ను తెరకు పరిచయం చేసింది ఆయనే. అయితే కొన్ని రోజుల క్రితం కాజల్ కు డిసిప్లిన్ లేదని.. ఆమెను అనవసరంగా తను ఇంటర్ డ్యూస్ చేశానని చెప్పి సంచలనం సృష్టించాడు..
విమర్శలు, వివాదాలూ పక్కనబెడితే, ఆయన దర్శకుడిగా కెరీర్ ప్రారంభించింది మన తెలుగువాడైన పి పుల్లయ్య దగ్గరే. అలాగే మనం కమెడియన్ అనుకుంటున్న సుధాకర్ ను తమిళనాట స్టార్ హీరోను చేసింది కూడా భారతీరాజానే. అయినా తెలుగువారంటే ఆయనకెందుకు ఇష్టం ఉండదో కానీ, ఓ దర్శకుడిగా, సృజనాత్మకత ఉన్నవాడిగా భాషతో, వివాదాలతో సంబంధం లేకుండా భారతీరాజా ప్రతి ఒక్కడి హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్నాడు. అలాంటి దర్శకుడు మళ్లీ వస్తాడనేది కూడా అనుమానమే అని ఎంతో మంది సినీ పెద్దలు ఇప్పటికీ అంటూ ఉంటారు.. ఏదేమైనా భారతీరాజాకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను రంజింప చేయాలని కోరుకుందాం..

Continue reading
ప్రపంచంలో అతనే తొలి దర్శకుడు

ఏజ్ తో పని ఏముందీ అంటుంటారు. కానీ ఒక వయసు దాటితేనే రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు చాలామంది. బట్ ఈయన విషయంలో అది మినహాయింపు. ఈ వయసులో కూడా ఉరకలెత్తే ఉత్సాహంతో కనిపిస్తుంటాడు. అసలు తనకు ఏజ్ గురించి గుర్తుకు కూడా లేదు అంటే ఆశ్చర్యం లేదు. ఆయనే సింగీతం శ్రీనివాసరావు. ఆయన పేరు చెబితే ఇండియన్ స్క్రీన్ మీద ఈయన చేసిన ప్రయోగాలకు లెక్కే లేదు అనిపిస్తుంది. అసలు ఇన్ని ఎక్స్ పర్మెంట్స్ తో కమర్షియల్ గా విజయాలు సాధిస్తారా అని కూడా అనుకుంటారు.ఆ విషయంలో కూడా అదరగొట్టాడు సింగీతం. ఎలాంటి ఎక్స్ పర్మెంట్ అయినా కమర్షియల్ గా కూడా పెద్ద విజయాలు సాధించాడు. అదే అత్యంత అరుదైన విషయం కూడా. పుష్పక విమానం లాంటి మూకీ మూవీతో అద్భుత విజయం సాధించాడు. అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, ఆదిత్య 369,భైరవద్వీపం, మేడమ్ వంటి చిత్రాలు మచ్చుకు కొన్ని మాత్రమే. అలాంటి మనిషి ఇప్పుడు 94యేళ్ల వయసులో ఓ మూవీ చేశాడు. సింగ్ గీతం అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఇది కూడా ఆయన శైలిలో అంతా కొత్తదనంతో కూడిన చిత్రమే. ఎక్కువగా పాటలతో సాగే కథనంలా ఉండబోతోందీ మూవీ. మాటల్లోనే పాటలుగా సాగుతుంది అనిపించేలా ఉంది. రీసెంట్ గా విడుదలైన పాటలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది.
ఈ ఏజ్ లో కూడా ఇలాంటి ఎక్స్ పర్మెంట్ అంటే మామూలు విషయం కాదు. ఇక విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాత. అతనికీ ఈ దర్శకుడు అంటే ఆరాధన. దీంతోనే ఈ చిత్రాన్ని నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడీ చిత్రానికి. ప్రమోషన్స్ కూడా కొత్తగానే ఉన్నాయి. అయాన్ కే హీరోగా నటించాడు. షాలినీ కొండేపూడి విలన్ గా నటించింది. మరి ఈ చిత్రంతో సింగీతం శ్రీనివాసరావు ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో అనేది చూడాలి

Continue reading
తెలుగు సినిమాకి ఏమైంది..?

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఓ రేంజ్ లో ఊహించుకునేవారం. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. వస్తోన్న మూవీస్ అన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవుతున్నాయి. ఎవరికి వారు మేం గొప్ప తీశాం అని భావిస్తున్నారు తప్ప.. ఆడియన్స్ యాంగిల్ అవి ఎలా ఉండబోతున్నాయి అని ఎవరూ అనుకోవడం లేదు. ముఖ్యంగా ఈ సమ్మర్ లో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయాయి. ఎంతలా అంటే మార్చి నుంచి ఏప్రిల్ వరకు విడుదలైన సినిమాలు మామూలుగా 60 -70 వరకు ఉన్నాయి. మరి వీటిలో సక్సెస్ రేట్ ఎంత అంటే స్పష్టంగా చెబితే మూడో నాలుగు సినిమాలు మాత్రమే అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి ఫస్ట్ వీక్ లో విడుదలైన మృత్యుంజయ్ నుంచి మొదలైతే.. మే లాస్ట్ వీక్ లో విడుదలైన మరీచిక వరకు కూడా ఏ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
మధ్యలో మార్చిలో రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలున్నాయి. బట్ వాటిని అందుకోవడంలో దారుణంగా విఫలమైందీ మూవీ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు అనే పేరున్నా.. అది ఆడియన్స్ ను హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ ఫైడ్ చేయలేదు అనేది నిజం. హరీష్ శంకర్ డైరెక్టర్ గా ఈ మూవీతో ఇక కష్టం అనిపించుకున్నాడు అంటే అతిశయోక్తి కాదు. అంత దారుణంగా పోయిందీ మూవీ.
ఇక ఏప్రిల్ మాత్రం గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విడుదలైన రాకాస, బైకర్ మూవీస్ బాక్సాఫీస్ కు కళ తెచ్చాయి. ఈ రెండూ కమర్షియల్ గా మంచి విజయాలు సాధించాయి. రాకాస కాస్త ఎక్కువ వసూళ్లు సాధించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. హారర్ కామెడీ అన్నారు కానీ హారర్ అసలేమాత్రం లేదు. మాగ్జిమం కామెడీతో లాగించారు. బట్ ఈ మూవీలో కూడా బలమైన కథ అంటూ లేదు.
బైకర్ ఇండియాలోనే ఫస్ట్ బైక్ రేసింగ్ నేపథ్యంలో వచ్చిన మూవీగా చెప్పారు. ఆ మేరకు ఆకట్టుకుంది. శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా నటించారు. యాంగ్రీ మేన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించాడు. అతని నటనే ఈ మూవీకి హైలెట్ గా నిలిచింది. హై ఇంటెన్షల్ డ్రామాగా రూపొందిన బైకర్ అనుకున్న దానికంటే కాస్త తక్కువ విజయం సాధించింది. బట్ హిట్ గా నిలిచింది.
తర్వాత విడుదలైన డెకాయిట్ కూడా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించింది. అడివి శేష్ గత చిత్రాలతో పోలిస్తే డెకాయిట్ పూర్తిగా తేలిపోయింది. కథ, కథనాల్లో అసలు పస లేదు. అయినా ఈ మూవీ హిట్ అయిందంటే అదో మిరాకిల్ అనే చెప్పాలి. ఇక ఆపై విడుదలైన చిత్రాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ గా నిలిచాయి. ఈ మూడు చిత్రాలు మాత్రమే ఏప్రిల్ వరకు సరిపెట్టుకున్నాయి. ఇక మే నెలలో విడుదలైన చిత్రాలు కూడా తేలిపోయాయి. వీటిలో గోదారి గట్టుపైన మూవీ మాత్రం కమర్షియల్ గా విజయం సాధించింది అంటూ సక్సెస్ మీట్ పెట్టారు. బట్ ఈ మూవీలో కథ, కథనం మాత్రం కంప్లీట్ గా అవుట్ డేటెగ్ గా నిలిచాయి. ఏ మాత్రం కొత్తదనం లేని సినిమాగా దీన్ని ఆడియన్స్ తేల్చారు.
మొత్తంగా ఈ వేసవిలో విడుదలైన సినిమాలన్నీ దారుణంగా పోయాయి. ఓ రకంగా ఐపిఎల్ వల్ల మూవీస్ ఇబ్బంది పడ్డాయి అన్నా కూడా కొన్ని అయినా కంటెంట్ పరంగా ఆకట్టుకోవాలి కదా. బట్ అందులో పూర్తిగా తేలిపోయాయి. ఎంచుకున్న కథల్లో నవ్యత లేదు.. కథనంలో కొత్తదనం ఉండదు. హీరోయిజం పేరుతో సాగించిన ప్రహసనాలే ఈ చిత్రాలన్నీ తేలిపోవడానికి ప్రధాన కారణం. ఇకపై తెలుగు సినిమా జాగ్రత్త పడాల్సిందే. ఇలాంటి కథలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని దారుణమైన పరాజయాలు రావడం మాత్రం ఖాయం

Continue reading