దేవ కట్టా సమర్పణలో రూపొందుతోన్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జో జో’

దేవా కట్టా సమర్పణలో జో జో మూవీ

వైవిధ్యంగా, సీరియస్‌గా, ఆలోచింపజేసే కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన సమర్పణలో రూపొందనున్న రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జో జో’. జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘మయసభ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ జయ్ కుమార్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, కొత్త జీవితంపై ఆశ‌లు, జీవితంలో ఎదగాలనే తపన.. మెరుగైన జీవితం కోసం మనుషులు ఎంత దూరమైన వెళ్లే తీరుని వ్యంగ్య హాస్యంతో ‘జో జో’ చిత్రంలో ఆవిష్క‌రించ‌బోతున్నారు.

రొమాంటిక్ కామెడీగా జో జో మూవీ

ఎండిపోయిన జొన్నగిరి డైమండ్ ఫీల్డ్స్‌లో ఇద్దరు పేద యువకులు, ఒక ధైర్యమైన యువతి తమ జీవితాలను ఒక్కసారిగా మార్చేయగల ఓ వజ్రం కోసం వేట మొదలుపెడతారు. ఆ ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలన్నీ తీరిపోతాయని, జీవితాలు మారిపోతాయని వారు ఆశపడతారు. అయితే డబ్బు కోసం మొదలైన వారి వేట అంత సులభంగా సాగదు. ప్రేమ, సరదా సంఘటనలు, అత్యాశ, మోసం, ప్రమాదాలు.. ఇలా ఊహించని పరిణామాలతో వారి ప్రయాణం గందరగోళంగా మారుతుంది. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని మలుపులతో ఆ వజ్రం కోసం సాగించే వేట మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో అక్కడి విచిత్రమైన మనుషులు, పరిస్థితుల చుట్టూ ‘జో జో’ ఓ భిన్నమైన, నేటివిటీతో కూడిన రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది.

జో జో టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్

శుక్ర‌వారం రోజున మేక‌ర్స్ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీన్ని గ‌మ‌నిస్తే.. రా అండ్ ఎర్తీ నేచర్‌ను ప్రతిబింబించేలా, పచ్చి నేటివిటీతో కూడిన విజువల్స్‌తో పోస్ట‌ర్‌ను రూపొందించారు. జొన్నగిరి ప్రాంతపు ల్యాండ్‌స్కేప్‌ను బ్యాక్‌డ్రాప్‌గా చూపిస్తూ, పోస్టర్‌లో ప్రధాన పాత్రను ప్రత్యేకంగా హైలైట్ చేశారు. అలాగే “హెచ్చరిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి!” అంటూ సరదాగా ఇచ్చిన వార్నింగ్‌తో సినిమాకు ఉన్న డిఫరెంట్ కామెడీ టోన్‌ను మేకర్స్ స్పష్టం చేశారు. ప్రేమ, కామెడీని ఎలాంటి హద్దులు, దాపరికాలు లేకుండా తమదైన శైలిలో చూపించబోతున్నామనే సంకేతాన్ని ఈ హెచ్చరిక ఇస్తోంది.

కృష్ణ‌ కమల్, మాహీ శ్రీ ప్రధాన పాత్రల్లో జో జో

‘జో జో’ చిత్రాన్ని విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. కిరణ్ జయ్ కుమార్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మ‌య‌స‌భ త‌ర్వాత వీరి కాంబోలో వ‌స్తోన్న సినిమా ఇది. ఇందులో కృష్ణ‌ కమల్ ‘శీను’..మాహీ శ్రీ ‘సుప్రజ’ పాత్ర‌ల్లో అల‌రించ‌నున్నారు. ఫణీంద్ర దేవరపల్లి వెంకటేష్‌గా, ప్రభావతి విజయమ్మగా, మహబూబ్ బాషా సూరిగా, సతీష్ దేవట్టే తంజోర్ రంగసామిగా, పూడూరు శరత్ బాబు రమణగా, మకరంద్ దేశ్‌పాండే ముఖేష్ షాగా కనిపించనున్నారు. టెక్నిక‌ల్‌గా రోహిత్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేష్ శంకర్ సంగీత దర్శకుడిగా, మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రెహమాన్, శ్రీనివాస్ మౌళి, రామచంద్ర సాహిత్యాన్ని అందిస్తున్నారు.

‘జో జో’మూవీపై ఆసక్తి పెంచే ప్రధాన అంశం.. ఈ సినిమా ప్రెజెంటేషన్‌లో కనిపించే భిన్నమైన కాంబినేషన్. సాధారణంగా సీరియస్, ఆలోచింపజేసే కథలతో సినిమాలు తెరకెక్కించే దేవ కట్టా, పూర్తిగా భిన్నమైన రూరల్ నేటివిటీ, విచిత్రమైన పాత్రలు, ప్రేమ, కామెడీతో కూడిన సినిమాను సమర్పిస్తుండటం ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు డైమండ్ కోసం జరిగే వేటను కథాంశంగా ఎంచుకోవడం, కిరణ్ జయ్ కుమార్ అనే కొత్త క్రియేటివ్ వాయిస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ‘జో జో’పై మొదటి నుంచే క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.

కరువు పరిస్థితుల నేపథ్యంలో జో జో మూవీ

కరువు పరిస్థితులతో ఉన్న గ్రామీణ నేపథ్యం, ఊహించని విధంగా వ‌జ్రం కోసం జ‌రిగే అన్వేష‌ణ‌, అదృష్టం కోసం కలలు కనే పాత్రలు.. ఆ కలలను సాకారం చేసుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ‘జో జో’ ఓ డిఫరెంట్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. రా అండ్ రస్టిక్ ఫీల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో సినిమా ప్రమోషనల్ జర్నీ మొదలైంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు రిలీజ్ ప్లాన్స్‌ను త్వరలో వెల్లడించనున్నారు.

Continue reading
సూర్య నటించిన విశ్వనాథం అండ్ సన్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

విశ్వనాథం అండ్ సన్స్ మూవీ రివ్యూ

రివ్యూ : విశ్వనాథ్ అండ్ సన్స్
తారాగణం : సూర్య, రాధిక, మమితా బైజు, రవీనాటాండన్, భవానీ శ్రీ, జార్జ్ మర్యన్, హర్ష, నాజర్ తదితరులు
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి
నిర్మాతలు : నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం : వెంకీ అట్లూరి
రిలీజ్ డేట్ : 14 ఆగస్ట్ 2026

సూర్య హీరోగా నటిస్తున్నాడు అంటే దానిపై తెలుగు వారికి కూడా మంచి అంచనాలుంటాయి. ఇక వరుసగా రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకుడు అంటే బలమైన కథను ఎక్స్ పెక్ట్ చేస్తుంటాం. అందుకు తగ్గట్టుగా ప్రమోషనల్ కంటెంట్స్ తో బాగా ఆకట్టుకున్నారు. ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. మరి సితార బ్యానర్ లో రూపొందిన ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

సంజయ్ విశ్వనాథ్(సూర్య)రిచెస్ట్ బిజినెస్ మాగ్నెట్. అతని చిన్నప్పుడు తల్లి (రాధిక) కోరిక వల్ల ఒలింపిక్ లో షూటింగ్ లో గోల్డ్ మెడల్ కొడతాడు. తండ్రి ఎర్లీ ఏజ్ లోనే చనిపోతాడు. అయినా తల్లి, కొడుకులు కలిసి బిజినెస్ ను మరింత స్ట్రాంగ్ గా మారుస్తారు. అయితే సంజయ్ కి పెళ్లిపై మంచి అభిప్రాయం ఉండదు. ఆ కారణంగా తల్లి ఎంత పోరు పెట్టినా పెళ్లి చేసుకోడు. తల్లి బాగా బతిమాలితే సరోగసీ ద్వారా వేరే దేశంలో ఓ కొడుకుకు జన్మనిస్తాడు. కానీ ఆ కొడుకు నెలల వయసులో ఉన్నప్పుడే బోన్ మ్యారో వస్తుంది. దాన్ని బాగు చేయాలంటే అతని సరోగేట్ మదర్ సాయం కావాలి. ఆ ప్రయత్నంలో పిల్లాడి తల్లి ఎవరు అని కనుక్కుంటే మ్యాడీ(మమితా బైజు) అని తెలుస్తుంది. ఆమె సాయం చేయాలంటే డబ్బులు అడుగుతుంది. అతని డబ్బు కొదవ కాదు కదా. అందుకే ఆమెకు డబ్బులు ఇచ్చి ఇండియాకు తీసుకు వస్తాడు. ఆ క్రమంలో మ్యాడీ, సంజయ్ మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంది.. ఇద్దరి మధ్య 20యేళ్ల ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా. మరి ఇద్దరూ ప్రేమలో పడతారా.. మధ్యలో రవీనాటాండన్ ఎపిసోడ్ ఏంటీ..? తల్లి, కొడుకుల మధ్య బంధం ఎంత గొప్పగా ఉంటుంది అనేది మిగతా కథలో చూస్తే తెలుస్తుంది.

ఎలా ఉంది :

విశ్వనాథ్ అండ్ సన్స్.. ఇది కొత్త కథ కాదు. కానీ కథనంలో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ కథనం కూడా సెకండ్ హాఫ్ లో చాలా చోట్ల రొటీన్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయినా చూస్తున్నంత సేపూ అవేవీ గుర్తుకు రావు. అదే మ్యాజిక్. సూర్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మమితా బైజు అయితే బొమ్మరిల్లులో జెనీలియాలాగా ఆ పాత్ర ఆసాంతం అదరగొట్టింది. రాధికకు చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్ర పడింది. తన నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇక రవీనాటాండన్ పాత్ర ఆశ్చర్యంగా ఉంది. తనూ బాగా చేసింది.
సూర్యకు పెళ్లిపై మంచి ఒపీనియన్ ఉండదు. ఆ కారణంగా పెళ్లి చేసుకోవద్దు అని బలంగా నిర్ణయించుకుంటాడు. రాధిక బలవంతం మీద, తన ఇంట్లోనే ఉండే ఓ డాక్టరమ్మ చెప్పింది అని యూఎస్ లో ఉండే ఓ డాక్టర్ తో రిలేషన్ మొదలు పెడతాడు. ఆ రిలేషన్ సీరియస్ అని చాలామంది అనుకుంటారు. కానీ అతను సరోగసీ కోసం ఓ అమ్మాయిని చూడమని ఆ డాక్టర్ కు చెబుతాడు.ఆమె కూడా అదే పనిచేస్తుంది. ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.ఇక సరోగసీ ద్వారా ఓ అబ్బాయిని తెచ్చుకుంటాడు. నెలల పిల్లాడుగా ఉన్నప్పుడే వాడికి బోన్ మ్యారో ఉందని తెలుస్తుంది. దీంతో ఒరిజినల్ అమ్మను తీసకు వస్తాడు. ఆ అమ్మే మమితా బైజు. తను అమెరికాలో ఉంటుంది. ఓ అనాథ. స్కాలర్షిప్ తో డాక్టర్ చదువుతూ ఉంటుంది. ఫైనల్ ఇయర్ లో స్కాలర్ షిప్ మిస్ అవుతుంది. ఆ డబ్బు కోసమే సరోగసికీ ఒప్పుకుంటుంది. అది తన కథ. తను ఈ సినిమా కథలోకి ఎంటర్ అయినా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ పండిస్తుంది. ఓ దశలో సూర్యను ఇరిటేట్ చేస్తున్నట్టుగా ఉన్నా.. అవన్నీ తన కొడుకు కోసం అన్నీ భరిస్తాడు. ఓ దశలో అవన్నీ అతనూ చాలా హ్యాపీగా తీసుకోవడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో మమితా బైజు అతనితో ప్రేమలో పడుతుంది. ప్రేమ గురించి చెబుతుంది. కానీ అతను ఏజ్ గ్యాప్ అని చెప్పినో చెబుతాడు. ఇంటర్వెల్ టైమ్ కు ముందే ఆమెను అమెరికా పంపే ప్రయత్నం చేస్తాడు. తను మాత్రం తిరిగి వస్తుంది. ఓ రచ్చ మొదలు పెడుతుంది. తర్వాత కథ మరో రేంజ్ కు వెళుతుంది. ఇది మూవీలో కనిపించే మెయిన్ ఎపిసోడ్.సెకండ్ హాఫ్ లో కోర్ట్ వ్యవహారం.. సరోగసీ మదర్ వాల్యూస్ అన్నీ చెబుతారు. అదే పనిలో సడెన్ గా రాధిక చనిపోతుంది. అక్కడి నుంచి కథనంలో బరువు పెరుగుతుంది. సూర్య .. రాధిక బెడ్ రూమ్ లో ఏడ్చే సీన్ చూసి అందరికీ ఏడుపు వస్తుంది. రాధిక కారణంగా రవీనాటాండన్ కూతురు వాయిదా వేద్దాం అనుకుంటుంది. కానీ సూర్యకు ఇష్టం లేకపోయినా తల్లి కోరిక కారణంగా పెళ్లి వాయిదా వేయొద్దు నేనే చేస్తా అంటాడు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ అన్నీ బ్రహ్మోత్సవం మూవీని తలపిస్తాయి. బోరింగ్ కూడా ఉంటాయి. ఇదో ఎపిసోడ్.

సూర్య తనకు పెళ్లి అక్కర్లేదు అని బలంగా చెబుతాడు మమితా బైజుకు. ఆమె కూడా కన్విన్స్ అవుతుంది. తిరిగి అమెరికా వెళ్లిపోతుంది. అక్కడ తనకు ప్రత్యేకమైన ఇల్లును కేటాయిస్తాడు సూర్య. అలాగే తన చదువుకు సంబంధించి అన్ని విషయాలూ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. మమితా బైజు కూడా సీరియస్ గా చదవడం మొదలు పెడుతుంది. కాలేజ్ టాపర్ గా మిగులుతుంది. ఈ లోగా అప్పుడప్పుడు ఆ పిల్లవాడిని ఆమెకు చూపిస్తుంటారు. అలా ఆ పిల్లాడు ఏడేళ్ల వాడుగా మారతాడు. అప్పుడు మళ్లీ సూర్యను కలుస్తుంది మమితా బైజు. అప్పుడు సూర్య తన తల్లి పేరు మీదుగా ఓ హాస్పిటల్ కట్టాను అని.. ఆ హాస్పిటల్ ను నువ్వే చూసుకోవాలని మమితా బైజుకు చెబుతాడు. ఇది ఓ ఎపిసోడ్.క్లైమాక్స్ ఏంటీ అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. అలాగని ఇదేమీ ఊహించలేనిదేం కాదు. బట్ చూస్తేనే బావుంటుంది కదా. అది.. కథ మొత్తం. ఈ నెరేషన్ మొత్తం వెంకీ అట్లూరి రైటింగ్ వల్ల బావున్నట్టుగా అనిపిస్తుంది. అంటే క్రెడిట్ అంతా దర్శకుడుదే కాదు.. ఆ రైటింగ్ ను అర్థం చేసుకున్న సూర్యది కూడా. అదీ మేటర్.

టెక్నికల్ గా :

ఎందుకో కానీ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అంత ఎఫెక్టివ్ గా కనిపించలేదు. అలాగని బాలేదా అంటే బానే ఉంది. బట్ సూపర్ అనలేం. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా కొన్ని లోపాలున్నాయి.. అంటే దర్శకుడి టేకింగే ఇది. డైలాగ్స్ బావున్నాయి. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచెస్ట్ గా ఉన్నాయి.
దర్శకుడుగా వెంకీ అట్లూరికి ఇది హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి ఆ టైటిల్ కు అస్సలు ఏ సంబంధం ఉండదు. అది కాస్త లోపంగా కనిపిస్తుంది.

ఫైనల్ గా : వెంకీ అట్లూరి అండ్ హిట్స్

రేటింగ్ : 3/5

K.Y.R

Continue reading
సూర్య.. బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా.. విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ రివ్యూ..

సూర్యకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీనా

సూర్య హీరోగా నటించిన మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ లో మమితా బైజు నటించింది. మరికొన్ని గంటల్లో మూవీ విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీకి ముందు నుంచి భారీ రెస్పాన్స్ కనిపిస్తోంది. స్ట్రాంగ్ ప్రమోషన్స్ లేకపోయినా.. ఈ కంటెంట్ పై చాలామందికి నమ్మకం ఉంది. అందుకే ఈ మూవీ ష్యూర్ బ్లాక్ బస్టర్ కాబోతోందని చాలామంది భావిస్తున్నారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ కథేంటీ

విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూగా చూస్తే.. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాల్లోని హీరోల పాత్రలన్నీ కూడా ఊరమాస్ లుక్ తో, రగ్ డ్ గా ఉంటున్నాయి. ఆ విషయంలో కాస్త మొనాటనీ కూడా మొదలైంది. అందుకు భిన్నంగా విశ్వనాథ్ అండ్ సన్స్ ఆల్ట్రా క్లాసిక్ గా కనిపిస్తోంది. హీరో సూర్య.. గజినిలో లాగా ఈ మూవీలో కూడా సంజయ్ పాత్రలో కనిపించాడు. అతను చాలా అంటే చాలా రిచెస్ట్ మనిషి. ఏం కావాలన్నా క్షణాల్లో అందుకోగలడు అనేలా ఉంటాడు. అలాంటి మనిషి సరోగసీలో ఓ అబ్బాయిని పొందుతాడు. అదెలా అంటే సినిమా చూస్తే అర్థం అవుతుంది. అక్కడి నుంచి మమితా బైజు పాత్ర ఎంటర్ అవుతుంది. ఓ రకంగా చూస్తే బొమ్మరిల్లులో జెనీలియా పాత్రకు మించిన అల్లరి పిల్లగా, హై టెంపర్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా అదరగొట్టింది మమితా బైజు. అలాగే రాధిక పాత్ర సైతం చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా అంటే చాలా బావుంటుంది.

సూర్య..పవన్ కళ్యాణ్ కు మించి నటించాడా.

సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కాస్త స్లోగా మొదలవుతుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ లో అత్తారింటికి దారేదీ, ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ ను కంపేర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అయినా మూవీ క్లాస్ గా ఆకట్టుకుంటుంది. అలాగే క్లైమాక్స్ లో సూర్య చేసిన నటన చూసి కన్నీళ్లు పెట్టని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన నటనతో అదరగొట్టాడు. ఓ రకంగా అత్తారింటికి దారేదీలో పవన్ కళ్యాణ్ కు మించిన నటనతో ఆకట్టుకుంటాడు సూర్య.

వెంకీ అట్లూరికి హ్యాట్రిక్ ఖాయం

టెక్నికల్ గా జివి ప్రకాష్ కుమార్ తనకే సొంతమైన ట్యూన్స్ తో అదరగొట్టాడు. ఆర్ఆర్ తో మూవీని మరో స్థాయిలో నిలబెట్టాడు. దర్శకుడుగా వెంకీ అట్లూరికి ఇది హ్యాట్రిక్ హిట్. అతను డైరెక్ట్ చేసిన సార్ మూవీ హిట్ అయింది. తర్వాత లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు.

Continue reading
యశ్.. టాక్సిక్ మూవీ సెన్సార్ పూర్తి

యశ్.. టాక్సిక్ మూవీ సెన్సార్ పూర్తి

యశ్ హీరోగా నటించిన మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిందీ మూవీని. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టాక్సిక్ ట్రైలర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేజీఎఫ్ తర్వాత యశ్ నుంచి మళ్లీ అంతకు మించిన మూవీ రాబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

భారీ తారాగణంతో టాక్సిక్

యశ్ హీరో అయినా ఫీమేల్ లీడ్స్ లో మాత్రం చాలామంది భామలే ఉన్నారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా అంటూ స్టార్ బ్యూటీస్ చాలామందే ఉన్నారు. ఆ అందరి పాత్రకు సరైన ఇంపార్టెన్స్ కూడా ఇచ్చినట్టు ట్రైలర్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. అదీ కాక యశ్ డ్యూయొల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇది ఓ సర్ ప్రైజింగ్ ఫ్యాక్టర్ లా ఉందీ మూవీకి.

టాక్సిక్ సెన్సార్ కు ఏ సర్టిఫికెట్

టాక్సిక్ 26న విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. మామూలుగా టీజర్, ట్రైలర్ చూసినప్పుడే ఇది ‘ఏ’ సర్టిఫికెట్ అని అందరికీ అర్థం అయింది. అయితే సెన్సార్ చాలాముందుగా చేయడానికి కారణం ఈ మూవీలో ఇంకేవైనా అబ్జెక్షన్స్ ఉంటాయోమో అని. అలాంటి అభ్యంతరాలు ఉంటే ముందే రెడీ చేసుకోవాలి కదా. అందుకే చాలా రోజుల ముందుగానే సెన్సార్ పూర్తి చేశారు. సెన్సార్ నుంచి అంతా ఊహించినట్టుగానే టాక్సిక్ కు ‘ఏ’సర్టిఫికెట్ వచ్చింది. సినిమా నిడివి 3 గంటల 14నిమిషాలు ఉంది.

టాక్సిక్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో..?

యశ్ మూవీ 3 గంటల 14నిమిషాలు అంటే సినిమా ఈజీగా చూసేయొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. సో.. ఇక మూవీ రిలీజ్ కు అంతా సిద్ధం అయింది. మరి ఈ నెల 26న కంటే ఒక రోజు ముందే ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయి. మరి ఆ ప్రీమియర్స్ తో ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనే అంచనాలు ఉంటాయనేది వాస్తవం.

Continue reading
అనుపమ పరమేశ్వరన్ చెప్పింది బైసన్ హీరో గురించేనా..

అనుపమ పరమేశ్వరన్ ప్రేమ  పెటాకులు

అనుపమ పరమేశ్వరన్ చాలా చిన్న వయసులోనే హీరోయిన్ గా మారింది. ప్రేమమ్ మూవీతో పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. తర్వాత అన్ని భాషల్లో తనదైన ఉనికిని చాటుకుంటుంది. డిఫరెంట్ రోల్స్ తో చాలామందిని ఆకట్టుకుంది. మొదట్లో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నా.. తర్వాత గ్లామర్ రోల్స్ తో కూడా సత్తా చాటుతోంది. అయితే రీసెంట్ గా తను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలకు ఎంటైర్ ఇండస్ట్రీస్ ఉలికిపడిపోయింది.

అపరిచితుడుతో పోల్చిన అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్ తను ఒక అబ్బాయిని ప్రేమించానను అని చెప్పింది. కానీ అతనిలో ఒక శాడిస్ట్ ఉన్నాడు అని చెప్పింది. ఈ క్రమంలో అతని గురించి వివరిస్తూ అపరిచితుడు మూవీలోని విక్రమ్ పాత్రల్లాగా ‘ఒక సారి రెమోలాగా కనిపిస్తాడు. ఆ టైమ్ లో అద్బుతమైన ప్రేమను చూపిస్తాడు. లోకంలో తనకు మించిన లవర్ ఉండడు అనేలా ఫీల్ అయ్యలా చేస్తాడు. తర్వాత రోజు అతనిలో ఒక అపరిచితుడు వస్తాడు. విపరీతమైన హింసను చూపిస్తాడు. శాడిస్టిక్ గా బిహేవ్ చేస్తాడు. ఆ తర్వాతి రోజు వెంటనే సారీ చెబుతూ ఒక బేబీలా ప్రవర్తిస్తాడు. కాళ్లపై పడి మరీ క్షమాపణలు చెబుతుంటాడు.. కట్ చేస్తే అది ప్రతిసారీ రిపీట్ అవుతూనే ఉంటుంది..’ అని చెప్పింది.

ఇదంతా ధృవ్ విక్రమ్ గురించేనా..?

అనుపమ పరమేశ్వరన్.. ఇదంతా ఎవరి గురించి చెప్పింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంకెవరు.. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్. యస్.. అనుపమ పరమేశ్వరన్ ను ధృవ్ విక్రమ్ ప్రేమించాడు. ఈ ఇద్దరూ కలిసి నటించిన బైసన్ మూవీ టైమ్ లో వీరు ప్రేమలో పడ్డారు. బైసన్ చాలా పెద్ద విజయం సాధించింది. ఓ రకంగా ధృవ్ కు ఇది ఫస్ట్ హిట్. ఆ టైమ్ లోనే వీరి లవ్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు అని చాలా వార్తలు వచ్చాయి.

అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ఫ్రీ..?

ఇంతలోనే అనుపమ పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్ విడిపోయారు అనే న్యూస్ కూడా వచ్చాయి. ఇప్పుడా వార్తలకు బలం చేకూరుస్తూ అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుపమ పరమేశ్వరన్ తను ధృవ్ విక్రమ్ పేరు చెప్పకుండా అపరిచుతుడులోని పాత్రలను పోల్చి చెప్పడంతో అది అతని గురించే అని అంతా అనుకుంటున్నారు. సో.. తను ప్రస్తుతం ఈ అపరిచితుడు నుంచి బయటపడిపోయిందన్నమాట.

Continue reading
శ్రీదేవి.. దేవతలూ అసూయపడే అందగత్తెగా వెలిగిన నటి

శ్రీదేవి జయంతి స్పెషల్ గా ఈ కవిత
శ్రీదేవి..
ఏ దేవి వరమో..
దేవతలూ అసూయపడే అందం పొందింది..
ఓ సిరిమల్లె పువ్వులా..
జామురాతిరి జాబిలమ్మలా..
పాలచుక్కలు.. తేనెబొట్టులు కలిపి రంగరించిన అతిలోక సుందరి.. శ్రీదేవి
బాలనటిగా భలేగా చేసి
పదేహేనేళ్లకే పదహారేళ్ల వయసుతో వచ్చి
తెల్లారబోతోంటే కల్లోకి చేరి
తెల్లార్లూ నిద్రల్లేకుడా చేసింది..
వయోభేదం లేకుండా
నయాజొరం తెప్పించింది
చెల్లెలికాపురంలో అన్నకు
అక్కకోసం దేవతలా మారి
బడిపంతులు తాతతో
ఆకుచాటు తడిసిన పిందెలా ఆడిపాడి
వయసుమళ్లిన హీరోలతో
ప్రేమాభిషేకం చేయించుకుని
ఆకాలం ప్రేక్షకుల అనురాగ దేవతలా
కలకాలం తరగని అభిమానం సంపాదించి
కమలాసన్ కే కన్నుకుట్టేలా
వసంతకోకిలలా మైమరపించింది
‘థండర్ థైస్’ తో బాలీవుడ్ లో వండర్ చేసి
ఓవర్ నైట్ ఓ రేంజ్ కు వెళ్లిపోయి..
లిమిటెడ్ హీరోతో అన్ లిమిటెడ్ రొమాన్స్ పండించి
మిస్టర్ ఇండియాస్ నూ మెస్మరైజ్ చేసి
ఇండియన్ వెండితెరపై వెలుగులే వెలవెలబోయే
తళుకులు చూపించింది..
ఆఖరుకి
నాన్న అకాల మరణం, అమ్మ అజాగ్రత్తతో కుంగిపోయినా
అతిలోకసుందరిలా క్షణక్షణం గుర్తొచ్చే నటన చూపి
అకస్మాత్ పెళ్లికి తలవంచింది
అందని ఆనందాల కోసం వేదనలు పడి
వేదికలపై వేయివాట్స్ బల్బ్ ల నవ్వులు పంచి
వేదనలో వేయి చీకట్ల అగాథాల్ని చూసి
ఒక జీవితంతో వంద పాఠాలు నేర్చుకుని
కన్నవారి అందలం చూడకుండానే కన్నుమూసింది
అప్రతిహతంగా వెలిగినట్లు నటించి
ఆఖరికి ఆఖరుపోరాటంలో ఓటమికి తలవంచి
ఊపిరిని అర్పించి
ఓ వెన్నెల రేయిలో కోట్లమంది మనసుల్లో చీకట్లు నింపింది
కానీ..
నీ లోకానికి వెళ్లిపోయి…
నువ్వేం చేశావో తెలుసా దేవీ..
నీ జీవితానికి నువ్వే శాడ్ ఎండింగ్ వేసుకున్నావ్
నీ జీవితం గురించి ఇంటర్వెల్ వరకే తెలిసిన మాకు
నీ ఎండింగ్ కు కారణం ఎప్పటికీ తెలియని,
తెలుసుకోలేని విధంగా చేసి
నీ లోకానికి వెళ్లిపోయావ్..
ఇప్పుడీ లోకంలో అతిలోక సుందరి అంటే
ఎవర్ని చూపించాలో చెప్పకుండానే
అమరపురికి వెళ్లిపోయావ్..
కానీ మళ్లీ ఓసారి నీ ఉంగరం పారేసుకోవూ..
కనీసం ఈ సారైనా
నీ కథ ఆనందంగా ఉండేలా చేసుకునేందుకైనా
మరోసారి నీ ఉంగరం పారేసుకోవూ..
పారేసుకుంటావు కదూ…
– బాబురావు..
9959977389

Continue reading
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్.. అంచనాలను అందుకోలేదా

సూర్య మూవీకి ప్రమోషన్స్ ఏవీ..?

సూర్య హీరోగా నటించిన మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించాడు. మమితా బైజు ఫీమేల్ లీడ్ గా నటించింది. రాధిక, రవీనాటాండన్ కీలక పాత్రల్లో నటించారు. విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ నెల 14న విడుదల కాబోతోంది. మామూలుగా స్టార్ హీరోల మూవీస్ అంటే ప్రమోషన్స్ లో స్ట్రాంగ్ గా ఉంటాయి. బట్ విశ్వనాథ్ అండ్ సన్స్ విషయంలో ఇది కనిపించడం లేదు.

హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య

సూర్య అంటే తెలుగు వారికి కూడా బాగా ఇష్టమైన హీరో. బట్ కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు సూర్య. రీసెంట్ గా అతను కరుప్పుతో కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించాడు. బట్ ఇదే చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడుగా డబ్ చేస్తే తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి టైమ్ లో వస్తున్నాడు అంటే కాస్త ప్రమోషన్స్ విషయంలో ఎక్కువ కాన్ సెంట్రేట్ చేయాల్సి ఉంది.

నాగ వంశీ సెలెన్స్ వెనక కారణం

నాగ వంశీ విషయంలో కాస్త ఇది కాస్త అతిశయోక్తిలాగా కనిపిస్తుంది. అతను ఇలాంటివి పెద్దగా పట్టించుకోడు అనే భావన చాలామందిలో ఉంది. కంటెంట్ లో విషయం ఉంటే కాసులు అవే వస్తాయి అనుకుంటాడు. బట్ అసలు ఈ కంటెంట్ ఆడియన్స్ వరకు బలంగా వెళ్లాలి కదా. అలా వెళ్లలేదు కాబట్టే ఈ మూవీ గురించి సాధారణ జనం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది వాస్తవం.

మమితా బైజు హైలెట్ అవుతుందా..

విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ మాత్రం చాలా వరకూ బావుంది అనే చెప్పాలి. అలాగని మాస్ ఎలిమెంట్స్ మాత్రం అస్సలు లేవు. ఓ రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలాగా ఉంది. అయినా ఇందులో ఆకట్టుకునే అంశాలు అంటే మమితా బైజునే చెప్పాలి. తను మాంచి చబ్బీ గాళ్ గా కనిపిస్తోంది. అలాగే చాటర్ బాక్స్ లాగా ఉంది. అయితే సూర్యతో వయసులో చాలా చిన్నది అయినా మమితా బైజు సూర్యతో ప్రేమలో పడుతుంది. ఇదే ఈ మూవీలో ప్రధానమైన కాన్ ఫ్లిక్ట్ లాగా ఉంది. మరి ఈ కాన్ ఫ్లిక్ట్ ను దాటుకుని ఈ ఇద్దరూ కలుస్తారా లేక సూర్యకు జోడీగా మరో పాత్ర ఉంటుందా లేదా అనేది చూడాలి.

విశ్వనాథ్ అండ్ సన్స్ హిట్ అవుతుందా..

ఏదేమైనా ఇలాంటి స్టార్ మూవీస్ ప్రమోషన్స్ విషయంలో ఇంకాస్త బలమైన ఫోకస్ ఉంటే బావుంటుంది. అయినా ఇవన్నీ దాటుకుని విశ్వనాథ్ అండ్ సన్స్ విజయం సాధిస్తే అదో పెద్ద విషయం అనే చెప్పాలి.

Continue reading
షకలక శంకర్ ప్రధాన పాత్రలో వస్తోన్న మూవీ ‘మేరంగి జంక్షన్’

షకలక శంకర్ మూవీ మేరంగి జంక్షన్

యువన్ టూరింగ్ టాకీస్ పతాకం పై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో షకలక శంకర్,
సాహితీ దాసరి, వినీత కందాల, సంపత్, ప్రభాకర్, రాధా కోహినూర్ ముఖ్య తారాగణంతో శివ గణేష్ రచన దర్శకత్వం లో రవి కృష్ణ గొల్లు, రాజేష్ గంగునాయుని, పెద్దింటి మోహన రావు, చొక్కపు రాములమ్మ మరియు సీర గణపతి నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం “మేరంగి జంక్షన్”.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

ఒక పాట మరియు ఒక ఫైట్ మినహా టాకీ షూటింగ్ పూర్తియింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ “ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మేరంగి అనే ఊరిలో జరిగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథే ఈ “మేరంగి జంక్షన్”. యదార్థ సంఘటనల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రం, పూర్తి కొత్త తరహా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ల స్థాయిలో ప్రేక్షకులను అలరించేవిధంగా ఉంటుంది. షకలక శంకర్ ఏజెన్సీ ఏరియా లో పోలీస్ పాత్రలో తన నటవిశ్వరూపం చూపించబోతున్నారు.

ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో

మొదటి సీన్ నుండి క్లైమాక్స్ వరకు ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది. ఒక పాట మరియు ఒక ఫైట్ మినహా 47 రోజుల్లో టాకీ మరియు రెండు పాటలు పూర్తిచేశాం. అజయ్ పట్నాయక్ సంగీతంలో మేరంగి జంక్షన్ టైటిల్ సాంగ్, నీల వేణి అనే మెలోడీ పాట ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే కిరణ్ చేబ్రోలు సినెమాటోహ్రాఫీ చిత్రానికి మంచి అస్సేస్ట్ ఆయుతుంది. 2026 చివరి మాసంలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.

Continue reading
శ్రీదేవి.. ఏ దేవి వరమో.. తరాలు మారినా తరగని అందం.. అభిమానం!

శ్రీదేవి జయంతి స్పెషల్

కొన్ని పేర్లు వినగానే ఒక తరం కళ్ల ముందు కదలాడుతుంది.
కొన్ని ముఖాలు గుర్తొస్తే పాత పాటలు చెవుల్లో మోగుతాయి.
కొన్ని నటీమణుల గురించి మాట్లాడుతుంటే.. సినిమా గురించి కాదు, జ్ఞాపకాల గురించి మాట్లాడుతున్నామనిపిస్తుంది.

శ్రీదేవి అలాంటి పేరు.

ఆమె ఒక హీరోయిన్ మాత్రమే కాదు.
ఒక తరం కలల సౌందర్యం.
మరో తరం సినిమాకు పరిచయమైన తొలి స్టార్.
ఇంకో తరం నటనకు అర్థం వెతికినప్పుడు గుర్తొచ్చే పేరు.

బాలనటిగా తెరపైకి వచ్చిన ఆ చిన్నారి.. దక్షిణాది సినిమాను దాటి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసింది. అందంతో పాటు అభినయం, అమాయకత్వంతో పాటు హావభావాలు, కామెడీ నుంచి ఎమోషన్ వరకు ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే ప్రతిభ.. ఇవన్నీ కలిసిన అరుదైన కలయిక శ్రీదేవి.

ఆమె వెళ్లిపోయి సంవత్సరాలు గడిచినా.. ఆమెపై ఉన్న అభిమానం మాత్రం తగ్గలేదు.

ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలకు కాలంతో పనిలేదు.

శ్రీదేవి జయంతి.. అభిమానుల గుండెల్లో మళ్లీ ఆ దేవి!

ఆగస్టు 13, 1963న తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి.. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు. నాలుగేళ్ల వయసులో బాలనటిగా కెరీర్ ప్రారంభించి.. దక్షిణాది భాషల్లో వరుస అవకాశాలు అందుకున్నారు.

బాలనటిగా వచ్చిన పిల్లే.. కొన్నేళ్లకు దక్షిణాది అగ్ర కథానాయికగా ఎదిగింది.

అది సాధారణ ప్రయాణం కాదు.

తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి బాలనటిగానే పరిచయమయ్యారు. ‘యశోదకృష్ణ’లో బాలకృష్ణుడి పాత్ర, ‘బడిపంతులు’లో ఎన్టీఆర్ మనవరాలి పాత్ర వంటి సినిమాల్లో చిన్న వయసులోనే తన ప్రతిభను చూపించారు.

ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన శ్రీదేవి.. తెలుగు తెరపై చేసిన ప్రయాణం ప్రత్యేక అధ్యాయం.

‘పదహారేళ్ల వయసు’.. శ్రీదేవి అంటే గుర్తొచ్చే తొలి సినిమా!

తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో శ్రీదేవి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే సినిమాల్లో ‘పదహారేళ్ల వయసు’ ఒకటి.

1978లో కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీదేవి మల్లి పాత్రలో కనిపించారు. ఇది తమిళంలో వచ్చిన 16 Vayathinileకు తెలుగు రీమేక్. ఈ సినిమాలో శ్రీదేవి నటన, అందం, అమాయకత్వం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

‘సిరిమల్లెపువ్వా..’ పాట వినిపిస్తే ఇప్పటికీ చాలామందికి గుర్తొచ్చేది శ్రీదేవి ముఖమే.

అక్కడి నుంచి ఆమెకు తెలుగులో వరుస విజయాలు మొదలయ్యాయి.

కమల్ హాసన్‌తో ఆ కెమిస్ట్రీ.. తెరపై ప్రత్యేకమైన మాయ!

శ్రీదేవి కెరీర్‌లో కమల్ హాసన్‌తో చేసిన సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది.

‘వసంత కోకిల’, ‘ఆకలి రాజ్యం’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ వంటి చిత్రాల్లో ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ముఖ్యంగా **‘వసంత కోకిల’**లో శ్రీదేవి చూపించిన నటన ఆమె కేవలం గ్లామర్ హీరోయిన్ కాదని మరోసారి నిరూపించింది.

నవ్వించగలదు.
ఏడిపించగలదు.
అమాయకంగా కనిపించగలదు.
అవసరమైతే ప్రేక్షకుడి మనసును కలవరపెట్టగలదు.

అదే శ్రీదేవి ప్రత్యేకత.

ఏఎన్నార్ నుంచి కృష్ణ వరకు.. స్టార్ హీరోలతో సూపర్‌హిట్ జోడీలు!

శ్రీదేవి తెలుగు కెరీర్‌లో అక్కినేని నాగేశ్వరరావుతో చేసిన ‘ప్రేమాభిషేకం’ ఒక మైలురాయి.

ఈ సినిమా దీర్ఘకాలం విజయవంతంగా ప్రదర్శితమై శ్రీదేవి స్టార్‌డమ్‌ను మరింత పెంచింది.

ఆ తర్వాత కృష్ణతోనూ శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించారు. వీరి జోడీకి అప్పటి ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉండేది.

పాటల్లో డ్యాన్స్.. తెరపై కెమిస్ట్రీ.. కథలో భావోద్వేగం..
ఏది ఉన్నా శ్రీదేవి తనదైన ముద్ర వేసేవారు.

శోభన్ బాబుతో **‘బంగారు చెల్లెలు’**లో చెల్లెలిగా కనిపించిన ఆమె.. తర్వాత అదే హీరోతో హీరోయిన్‌గా కూడా నటించారు.

**‘కార్తీక దీపం’**లోని భావోద్వేగపూరిత నటన..
**‘దేవత’**లోని పాత్ర..
ఆమెకు మహిళా ప్రేక్షకుల్లోనూ భారీ అభిమానాన్ని తెచ్చిపెట్టాయి.

చిరంజీవితో ఎక్కువ సినిమాలు ఎందుకు లేవు?

శ్రీదేవి, చిరంజీవి కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ ప్రత్యేకమే.

కానీ ఇద్దరూ తమ కెరీర్‌లో అగ్రస్థానానికి చేరుతున్న సమయంలో శ్రీదేవి బాలీవుడ్‌పై దృష్టి పెట్టడం వల్ల ఈ జంట నుంచి ఎక్కువ సినిమాలు రాలేదు.

అయినా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మాత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన ఫాంటసీ క్లాసిక్‌గా నిలిచిపోయింది.

ఆ సినిమాలో దేవకన్యగా కనిపించిన శ్రీదేవిని చూసిన తర్వాత..

‘అతిలోక సుందరి’ అంటే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది.

బాలీవుడ్‌లో శ్రీదేవి హవా.. హీరోయిన్ అంటే హీరోలే భయపడే స్థాయి!

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే శ్రీదేవి హిందీ సినిమాల్లోకి వెళ్లారు.

మొదట్లో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ‘హిమ్మత్‌వాలా’ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

అక్కడి నుంచి శ్రీదేవి బాలీవుడ్‌లో తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.

హిమ్మత్‌వాలా.. సద్మా.. నగీనా.. మిస్టర్ ఇండియా.. చాందినీ.. చాల్‌బాజ్.. జాన్‌బాజ్.. లమ్హే.. ఇలా వరుసగా గుర్తుండిపోయే సినిమాలు ఆమె ఖాతాలో చేరాయి.

1980లలో శ్రీదేవి హిందీ సినిమా అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగారు.

ఆమె స్టార్‌డమ్ ఎంత పెద్దదంటే.. ఒక దశలో హీరో కంటే హీరోయిన్ మార్కెట్ కూడా సినిమా విజయాన్ని నిర్ణయించగలదని నిరూపించిన నటీమణుల్లో శ్రీదేవి ఒకరు.

‘మిస్టర్ ఇండియా’.. శ్రీదేవి కామెడీ టైమింగ్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్!

శ్రీదేవిని కేవలం అందమైన హీరోయిన్‌గా చూస్తే ఆమె కెరీర్‌లో సగం మాత్రమే చూసినట్టే.

‘మిస్టర్ ఇండియా’ అందుకు అద్భుతమైన ఉదాహరణ.

హాస్యం, ఎమోషన్, రొమాన్స్, గ్లామర్.. అన్నింటినీ సమపాళ్లలో మోసిన పాత్ర అది.

శ్రీదేవి కామెడీ టైమింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉండేదో ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది.

అదే సమయంలో ‘సద్మా’ వంటి సినిమాల్లో ఆమె చూపించిన నటన మాత్రం పూర్తిగా మరో ప్రపంచం.

ఒకే నటి ఇన్ని విభిన్న భావాలను ఇంత సహజంగా పలికించడం అరుదు.

శ్రీదేవి అందంలో అసలు రహస్యం.. ఆ అమాయకత్వమే!

శ్రీదేవి గురించి మాట్లాడితే అందం గురించి మాట్లాడకుండా ఉండటం కష్టం.

కానీ ఆమె అందాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం రూపం కాదు.

ఆమె కళ్లలో కనిపించే అమాయకత్వం.

హీరోయిన్‌గా ఎంత పెద్ద స్టార్ అయినా.. తెరపై కనిపించినప్పుడు ఒక సహజమైన పసితనం ఉండేది.

అందుకే ఆమెను చూసి ప్రేక్షకులు కేవలం అభిమానించలేదు.

ఆరాధించారు.

ఆమె నవ్వు కోసం పాటలు గుర్తుండిపోయాయి.
ఆమె చూపు కోసం సన్నివేశాలు గుర్తుండిపోయాయి.
ఆమె నటన కోసం సినిమాలు మళ్లీ మళ్లీ చూశారు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం.. కానీ అభిమానం మాత్రం అలాగే!

శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కొంతకాలం దూరమయ్యారు.

సినిమా ప్రపంచానికి దూరంగా ఉన్నా.. ప్రేక్షకుల జ్ఞాపకాల నుంచి మాత్రం ఆమె ఎప్పుడూ దూరం కాలేదు.

అదే నిజమైన స్టార్‌డమ్.

తెరపై కనిపించకపోయినా అభిమానులు ఆమె సినిమాలను గుర్తు చేసుకున్నారు.

పాత పాటలు విన్నారు.
పాత సినిమాలు చూశారు.
పాత ఫొటోలు పంచుకున్నారు.

ఒక నటి సినిమాలు చేయకపోయినా ఆమెపై అభిమానం కొనసాగితే.. అది కేవలం స్టార్‌డమ్ కాదు. అది జ్ఞాపకాలలో స్థానం.

15 ఏళ్ల తర్వాత ‘English Vinglish’.. శ్రీదేవి అంటే ఇదే!

2012లో **‘English Vinglish’**తో శ్రీదేవి సినిమాల్లోకి తిరిగి వచ్చారు.

దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో అద్భుతమైన అధ్యాయంగా నిలిచింది.

శశి గోడ్బోలే పాత్రలో కనిపించిన శ్రీదేవి.. స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక సాధారణ మధ్యతరగతి మహిళ కథను తెరపై జీవించారు.

ఆమె నటనలో అప్పటి గ్లామర్ హీరోయిన్ కనిపించలేదు.

ఒక భార్య కనిపించింది.
ఒక తల్లి కనిపించింది.
తనను తాను నిరూపించుకోవాలనుకునే ఒక మహిళ కనిపించింది.

అందుకే ‘English Vinglish’ కేవలం శ్రీదేవి కమ్‌బ్యాక్ కాదు.. ఒక నటి కాలానికి అతీతంగా నిలబడగలదని నిరూపించిన సినిమా.

‘Mom’.. చివరి సినిమాతో జాతీయ అవార్డు!

2017లో వచ్చిన ‘Mom’ శ్రీదేవి చివరి ప్రధాన చిత్రం.

ఈ సినిమాలో ఆమె చూపించిన నటన మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి.

శ్రీదేవికి జాతీయ అవార్డు రాలేదని చాలాకాలంగా ప్రచారంలో ఉన్న పాత సమాచారం సరైనది కాదు.

‘Mom’లో నటనకు శ్రీదేవికి మరణానంతరం 2018లో జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది.

ఆమె కెరీర్‌లో ఎన్నో అవార్డులు ఉన్నా.. ఈ పురస్కారం మాత్రం ప్రత్యేకం.

ఎందుకంటే ఆమె లేని సమయంలో వచ్చిన గౌరవం అది.

శ్రీదేవి ఇక లేరనే వార్త.. దేశం మొత్తాన్ని కుదిపేసింది

2018 ఫిబ్రవరి 24.

ఆ రోజు వచ్చిన వార్తను సినీ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు.

శ్రీదేవి ఇక లేరు.

ఇంత పెద్ద స్టార్.. ఇంత అకస్మాత్తుగా వెళ్లిపోవడం అభిమానులకు జీర్ణించుకోలేని విషాదంగా మారింది.

సినిమా రంగం మొత్తం ఒక్కసారిగా మూగబోయింది.

ఎందరో నటీనటులు ఆమెకు నివాళులు అర్పించారు.

కానీ ఎంతమంది నివాళులు అర్పించినా..
ఎన్ని జ్ఞాపకాలు పంచుకున్నా..
ఎన్ని పాటలు వినిపించినా..

శ్రీదేవి స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు.

శ్రీదేవి ఎందుకు ఇంత ప్రత్యేకం?

దక్షిణాది సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప హీరోయిన్లు వచ్చారు.

ప్రతి తరానికి తనకంటూ ఒక స్టార్ హీరోయిన్ ఉంటుంది.

కానీ ఒకే నటి..

బాలనటిగా ఒక తరం..
హీరోయిన్‌గా మరో తరం..
బాలీవుడ్ స్టార్‌గా మరో తరం..
రీ ఎంట్రీతో ఇంకో తరం..

ఇలా తరాల్ని దాటి ప్రభావం చూపడం చాలా అరుదు.

శ్రీదేవి విషయంలో అదే జరిగింది.

ఆమె సినిమాలు చూసిన తల్లిదండ్రులు ఉన్నారు.
ఆ సినిమాలను టీవీలో చూసి పెరిగిన పిల్లలు ఉన్నారు.
ఆమె పాటలను ఇప్పటికీ వింటున్న కొత్త తరం ఉంది.

అందుకే శ్రీదేవి ఒక కాలానికి చెందిన హీరోయిన్ కాదు.

ఆమె భారతీయ సినిమా జ్ఞాపకాల్లో ఒక శాశ్వత అధ్యాయం.

అందం అస్తమించదు.. రూపం మాత్రమే దూరమవుతుంది!

కొన్ని నటీమణులు సినిమాలు చేసిన కాలంలో మాత్రమే గుర్తుంటారు.

కానీ కొందరు వెళ్లిపోయిన తర్వాత కూడా మరింత ఎక్కువగా గుర్తుకొస్తారు.

శ్రీదేవి రెండో కోవకు చెందిన నటి.

‘సిరిమల్లెపువ్వా’ వినిపించినా..
‘వసంత కోకిల’ గుర్తొచ్చినా..
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కనిపించినా..
‘మిస్టర్ ఇండియా’ గుర్తొచ్చినా..
‘చాందినీ’ గుర్తొచ్చినా..
‘English Vinglish’ చూసినా..

ఎక్కడో ఒకచోట శ్రీదేవి కనిపిస్తూనే ఉంటుంది.

ఆమె వెళ్లిపోయింది.

కానీ ఆమె తెరపై వదిలిన వెలుగు మాత్రం ఇంకా అలాగే ఉంది.

అందుకే..

శ్రీదేవి ఒక పేరు కాదు.. ఒక జ్ఞాపకం.
ఒక హీరోయిన్ కాదు.. ఒక శకం.
ఒక అందం కాదు.. తరాలు గుర్తుపెట్టుకునే ఒక అనుభూతి.

ఆ దేవి వరమో ఏమో..

అందానికి చిరునామాగా వచ్చి..
అభిమానాన్ని ఆస్తిగా చేసుకుని..
సినిమా చరిత్రలో తనకంటూ ఒక శాశ్వతమైన పేజీని రాసుకుని వెళ్లిపోయింది.

శ్రీదేవి లేదు.. కానీ శ్రీదేవి జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ ఉంటుంది.

Continue reading
సూర్య హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ పెంచితే బావుండేదేమో

విశ్వనాథ్ అండ్ సన్స్ కి ప్రమోషన్స్ వీక్

సూర్య హీరోగా రూపొందిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. మమితా బైజు ఫీమేల్ లీడ్ గా నటించింది. అలాగే రాధిక, రవీనాటాండన్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిందీ మూవీని. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే బిగ్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించేంత ట్రైలర్ కటింగ్ మాత్రం కనిపించలేదు అనేది వాస్తవం.
మామూలుగా ఇలాంటి మూవీస్ ప్రమోషన్స్ పరంగా బాగా ఆకట్టుకునే అవకాశాలున్నాయి. బట్ వీళ్లు ఆ విషయంలో బాగా నిర్లక్ష్యం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీంతో మూవీ ప్రమోషన్స్ గురించి ఇక లైట్ తీసుకున్నట్టే అని చెప్పాలి. దీనికంటే ముందు సుమతో ఒక కామన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతే.. ఇక సినిమా గురించి పెద్దగా పట్టించుకునేలాగానే లేరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అందులో వందల సినిమాలకు కనిపించే కామన్ పాయింట్స్ మాత్రమే హైలెట్ అవుతుంటాయి.

సూర్య మూవీ తమిళ్ మాత్రమేనా

సూర్య తెలుగులో నటించిన ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ ఇది అని మొదటి నుంచి వినిపించింది. బట్ అలాంటిదేం లేదు. ఇది కేవలం తమిళ్ మూవీ అని దర్శకుడు, నిర్మాత నాగవంశీ క్లియర్ గా చెప్పడం తెలుగు అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం. సూర్య అంటే తెలుగు హీరోగానే ఫేమ్ అయ్యాడు. అయినా కాస్త డైరెక్ట్ తెలుగు మూవీ అని చెబితే బావుండేది. అది కూడా మూవీపై ప్రభావం చూపుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

బబ్లీ గాళ్ గా మమితా బైజు

మమితా బైజు బబ్లీ గాళ్ గా నటించిందీ మూవీలో. తను కాస్త అల్లరి పిల్లగా కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ అనేది అర్థం అవుతుంది. వయసులో తనకంటే చిన్న పిల్ల కాబట్టి సూర్య మమితా బైజును కాస్త గారంగా చూస్తాడు. దాన్ని మమితా బైజు మిస్ అండర్ స్టాండ్ చేసుకుని అతనితో ప్రేమలో పడుతుంది. మరి ఈ ఏజ్ బార్ లవ్ తో పాటు కుటుంబ పరమైన ఇష్యూస్ అన్నీ మూవీలో ఉంటాయి అనుకోవచ్చు.

విశ్వనాథ్ అండ్ సన్స్ హిట్ అవుతుందా

ఏదేమైనా విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ పరంగా మాత్రం చాలా వీక్ గా కనిపిస్తోంది. ఒక్క ఇంటర్వ్యూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఇలాంటి పెద్ద మూవీస్ ను లైట్ తీసుకోవడం కూడా ఏమంత మంచిది కాదు. ఒకవేళ మూవీ రిజల్ట్ కాస్త అటు అయితే ఇక అస్సామే అవుతుందని గ్యారెంటీగా చెప్పొచ్చు. ఇక రిలీజ్ కు పెద్దగా టైమ్ కూడా లేదు. సో.. ఇక ప్రమోషన్స్ అంటూ ఏమీ ఉండవు అని తేలిపోయింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి.

Continue reading