ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ సంచలనం సృష్టిస్తుందా..?

జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి రాబోతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ అయింది. ప్రస్తుతం గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవతో ఈ కాంబో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయబోయే ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్, దేవుడి పాత్ర, భారీ విజువల్ స్కేల్ అంటూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎన్టీఆర్ ఏ దేవుడి పాత్రలో నటిస్తున్నాడనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఆ విషయంలో మాత్రం ఓ స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉంది. మాగ్జిమం కార్తికేయుడు పాత్రలో కనిపించబోతున్నాడు అనేది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్.
అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఈసారి తన రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఫార్మాట్‌ను దాటి ఒక భారీ మైథలాజికల్ ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడనేది మాత్రం స్పష్టం. పురాణాలు, చరిత్ర, ఫాంటసీ అంశాలను కలిపి ఒక ఎపిక్ కథను సిద్ధం చేశాడు అనేది క్లియర్.
ఎన్టీఆర్ విషయానికి వస్తే… ఆయనకు పౌరాణిక పాత్రలు కొత్త కాదు. చిన్న వయసులోనే పౌరాణిక పాత్రలు చేసిన అనుభవం ఉంది. తన డైలాగ్ డెలివరీ, హావభావాలతో ఇలాంటి పాత్రలకు సరిపోయే నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ అయిన నటుడు. అందుకే ఎన్టీఆర్‌ను దేవుడి తరహా పాత్రలో చూడాలనే వార్తలకు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది.
కానీ ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లు కేవలం స్టార్ పవర్‌తో కాకుండా కథ, విజువల్స్, టెక్నికల్ ఎగ్జిక్యూషన్‌పై ఆధారపడి ఉంటాయి. త్రివిక్రమ్ తన రైటింగ్ స్టైల్ తో ఈ పురాణ ప్రపంచాన్ని ఎలా ఆవిష్కరిస్తాడు? ఎన్టీఆర్ పాత్రను ఏ స్థాయిలో చూపిస్తాడు? అనేదే అసలు ఆసక్తి. కానీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయిక మాత్రం మరోసారి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.

Continue reading
నాగబంధం మూవీ ఎలా ఉండబోతోంది?

టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో పౌరాణికం, మిస్టరీ, ఫాంటసీ జానర్‌లపై ఆసక్తి పెరుగుతోంది. అదే కోవలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ నాగబంధం(Nagabandham). జూలై 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో విరాట్ కర్ణ(Virat Karna) హీరోగా నటించాడు. నభా నటేష్(Nabha Natesh), ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా చేశారు. అభిషేక్ నామా దర్శకుడు.
నాగబంధం ఒక ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నాగ శక్తి, పురాతన రహస్యాలు, ఆధ్యాత్మిక అంశాలు, యాక్షన్ అంశాలను కలిపి కథను నడిపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రధాన ఆకర్షణల్లో ఒకటి దీని కాన్సెప్ట్. సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా.. భారతీయ నమ్మకాలు, పురాణాల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. నాగ దేవత, రహస్యమైన శక్తులు అనే అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
విజువల్స్ విషయంలో కూడా సినిమా టీమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి జానర్ సినిమాలకు గ్రాఫిక్స్, VFX, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. కథలోని ఫాంటసీ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు నమ్మేలా చూపించగలిగితే ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుంది. అయితే ఇలాంటి సినిమాలకు పెద్ద సవాల్ కూడా ఉంటుంది. కేవలం భారీ సెట్స్, గ్రాఫిక్స్ ఉంటే సరిపోదు.. కథలో బలం, పాత్రల ఎమోషన్, స్క్రీన్‌ప్లే ఆకట్టుకోవాలి. ప్రేక్షకుడు ఆ ప్రపంచంలోకి వెళ్లేలా చేయగలిగితేనే ఫాంటసీ సినిమాలు విజయవంతం అవుతాయి.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్‌ను స్వీకరించే మూడ్‌లో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారతీయ కథలకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో.. నాగబంధం కూడా సరైన ఎగ్జిక్యూషన్‌తో వస్తే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి.. నాగబంధం ఒక రెగ్యులర్ సినిమా కాదు. పురాణం, మిస్టరీ, ఫాంటసీ కలయికతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని ప్రయత్నిస్తున్న సినిమా. ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో జూలై 3 తర్వాతే తెలుస్తుంది.

Continue reading
రవితేజ మారుతున్నాడా..?

మాస్ మహరాజ్ రవితేజ.. ఈ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే అతను ఎంచుకున్న కథల్లో అప్పుడు సత్తా చాటాడు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. అప్డేట్ కావాలి. బట్ ఈ విషయంలో రవితేజ చాలాకాలం పాటు అప్డేట్ కాలేకపోయాడు. అదే పనిగా మూవీస్ అన్నీ పోతున్నా అతను మారలేదు. ఓ దశలో అభిమానులు కూడా ఇవేం మూవీస్ రా బాబూ అని తెగ ఇబ్బంది పడిపోయారు. కొత్తదనం అనే పదానికి చాలా దూరంగా అతని కథలు కనిపించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుల దండయాత్ర మొదలైంది. ఒకదాన్ని మించి ఒకటిగా డిజాస్టర్ అయ్యాయి. ఓ దశాబ్దం పాటు కొనసాగిన ఈ ఫ్లాపుల పర్వం అతని కెరీర్ నే ప్రశ్నార్థకంలో పడేసింది. బాగా ఆలస్యం అయినా ఆత్మ పరిశీలనలో పడిపోయాడు. అందులో భాగంగానే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీ చేశాడు. ఈ కథలో కొత్తదనం లేదు. బట్ అతను చేయడం వల్ల కొత్తగా అనిపించింది. దీనికి తోడు తన ఇమేజ్ కు దూరంగా ఈ మూవీ చేశాడు. ఈ యేడాది సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా విజయాన్ని సాధించింది. ఈ టైమ్ లో ఎవ్వరూ ఊహించని కథకు కమిట్ అయ్యాడు రవితేజ.
శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఇరుముడి’అనే టైటిల్ తో మూవీ అనౌన్స్ చేశాడు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అతను కథల విషయంలో ఓ మెట్టు ఎక్కుతున్నాడు అనిపించేలాఈ మూవీ నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు. అది చాలామందిని ఆకట్టుకుంది. తాజాగా ఇదే మూవీ నుంచి ఓ పాట విడుదల చేశారు. ఈ పాట ఇరుముడి చుట్టూ సాగే గీతం. అయ్యప్ప మాల వేసుకుని, ఇరుముడి కట్టుకుని దీక్షను విరమించే సందర్భంలో వచ్చే పాట. ఈ పాటలో ఎక్కడా రవితేజ అతి కనిపించలేదు. చాలా సాధారణంగా సాగింది. పాట, సాహిత్యం రెండూ బావున్నాయి. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మూవీలో చాలా కీలకంగా ఓ పాప కనిపిస్తోంది. ఈ పాటలో తను వేసిన డ్యాన్స్ లు చాలా బావున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న మూవీ ఇది. ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది.
ఏదేమైనా రవితేజ కాలానికి తగ్గట్టుగా మారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అదే పనిగా మాస్ రాజా అంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కు అంతగా వర్కవుట్ కాదు అనేది అర్థమైనట్టుంది. మరి ఇకనైనా బలమైన కథలను ఎంచుకుంటూ తనలోని కొత్త యాంగిల్ ను చూపిస్తూ.. అప్పుడప్పుడు మాస్ యాంగిల్ ను కూడా బయటకు తీసుకువస్తే తన మళ్లీ రేంజ్ మారుతుంది.

Continue reading
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ అయింది..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతోందని గతంలోనే చెప్పారు. చెప్పినట్టుగా ఈ మూవీ ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ మాత్రం చాలామందిలో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇది ఓ పౌరాణిక కథ. పౌరాణికాలు అంటే ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఈ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు అని చిన్నప్పటి రామాయణంతోనే ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకే ఇది ఓ అద్భుతమైన పౌరాణిక గాథ అని తెలుస్తోంది. అదీ కాక త్రివిక్రమ్ కు ఇలాంటి కథలపై ఎంత ఆసక్తి ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తే చాలా విషయాలు తెలిసేలా ఉన్నాయి.
ఈ పోస్టర్ లో త్రిశూలం కనిపిస్తోంది. ఆ త్రిశూలంలో డిఎన్ఏ సింబల్ కూడా ఉంది. అంటే ఇది సోషల్ డ్రామా నుంచి పౌరాణికం వరకు వెళుతుందా అని చాలామంది భావిస్తున్నారు. బట్ అదేం కాదు. ఈ మూవీలో కార్తికేయుడు పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. కార్తికేయుడు అంటే శివుని అంశ. అది కాకుండా పార్వతీ దేవి గర్భం నుంచి కాక విశ్వ బీజం నుంచి ఆయన పుట్టుకు ఉంటుంది అని అర్థం. అంటే కేవలం శివ పార్వతుల అంశతో మాత్రమే కార్తికేయుడు జన్మించాడు అని వేరే చెప్పక్కర్లేదు. కార్తీకేయుడు అంటే యుద్దాలు చాలానే ఉంటాయి. అందుకే పోస్టర్ లో దాన్ని కూడా ఇన్ డైరెక్ట్ గా తెలిపేలా డిజైన్ చేశారు. ఏదేమైనా ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పలేదు కానీ ముందైతే అనౌన్స్ అయింది.
ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో ఎన్టీఆర్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ ఉండబోతోంది అనేలా ఉంది. అంటే ఆ మధ్య ముందే నెల్సన్ మూవీ ఉంటుందని కూడా చెప్పారు కొందరు. అలాంటిదేం లేదు అనేలా ఈ అనౌన్స్ మెంట్ చెబుతోంది. ఏదేమైనా అల వైకుంఠపురములో తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఈ కథపై చాలా కసరత్తులు చేశాడు. అందుకే ఇదో అద్భుతమైన కథగా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఆయన ఆదర్శ కుటుంబం తర్వాత ఇక తన ఫోకస్ అంతా ఈ మూవీపైనే పెట్టబోతున్నాడు అనేది స్పష్టం.

Continue reading
ఎవర్ గ్రీన్ క్లాసిక్ గీతాంజలి రీ రిలీజ్ కాబోతోంది

క్లాసిక్స్ అనే మాట అత్యంత అరుదుగా వినిపిస్తుంది. ఆ మాటలోనే ఆ మూవీ ఏ స్థాయిలో ఉంటుంది అనేది అర్థమైపోతుంది. కథలో కొత్తదనం, కథనంలో నవ్యత వల్ల అప్పటి వరకు చూసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే మూవీస్ గా ఇవి కనిపిస్తుంటాయి. అలాంటి అరుదైన క్లాసిక్ మూవీనే గీతాంజలి. నాగార్జున, గిరిజ జంటగా నటించిన మూవీ ఇది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఏకైన తెలుగు సినిమా కూడా ఇదే. మణిరత్నం మ్యాజిక్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. చూసిన ప్రతి ఒక్కరూ ఈ మూవీతో ప్రేమలో పడిపోయారు. ఆ రోజుల్లో ఈ తరహా మూవీని ఎవరూ ఊహించను కూడా లేరు. 1989 మే 12న విడుదలైన గీతాంజలి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
సినిమా ప్రారంభంలోనే కాలేజ్ లో హ్యాపీగా సాగుతున్న ప్రకాష్ కి అనూహ్యంగా క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. పైగా అది చివరి దశలో ఉందని డాక్టర్స్ చెబుతారు. దీంతో ఆ కొన్నాళ్లు తను తనకు నచ్చినట్టుగానే ఉండాలని ఊటీ వెళతాడు. అక్కడ ఓ అల్లరి అమ్మాయి గీతాంజలితో పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య పోట్లాటల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. అదే టైమ్ లో గీతాంజలికి కూడా క్యాన్సర్ ఉందని.. అది కూడా చివరి దశలో ఉందని తెలుస్తుంది. మరి ఆ తర్వాత వీరి ప్రేమ ఏ తీరాలకు వీరిని తీసుకువెళుతుంది. చనిపోతారా లేక బ్రతికి ఉంటారా అనేది అత్యంత హృద్యంగా సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకుంటుందీ మూవీ. కావడానికి ఇద్దరూ క్యాన్సర్ పేషెంట్సే అయినా ప్రతి నిమిషం వీళ్లు సంతోషంగా బ్రతికి ఉంటారు. అదే ఈ మూవీలో కనిపించే కోర్ పాయింట్. అలాగే ఫస్ట్ హాఫ్ వరకు అసలు వారికి వ్యాధి ఉందా లేదా అనేది కూడా లేని ఆనందంగా సాగుతుందీ కథనం. ఏదేమైనా ఈ మూవీ ఇప్పుడు మళ్లీ విడుదల చేయబోతున్నారు అంటే నాటి ప్రేక్షకులకు మళ్లీ చూడాలన్న తపన పెరుగుతూ ఉంటుంది.
ఇక గీతాంజలి రీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 28న నాగార్జున బర్త్ డే స్పెషల్ గా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇళయరాజా సంగీతం, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అత్యద్భుతం. టెక్నికల్ గా కంటెంట్ పరంగా హండ్రెడ్ మార్క్స్ పడిన ఈ మూవీ ఈ జెనరేషన్ ఆడియన్స్ కు కూడా చాలా చాలా బాగా నచ్చుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Continue reading
పుష్ప రూట్ లోనే రామ్ చరణ్.. ఇది సుకుమార్ ప్లానేనా..?

పెద్దితో రామ్ చరణ్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి పెద్ది తర్వాతేంటీ అనే ప్రశ్నకు ఎప్పుడో సమాధానం చెప్పాడు. సుకుమార్ తో మూవీ చేయబోతున్నాడు చరణ్. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీతోనే ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని చాలామంది ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. దాంతో పాటు చరణ్ కు చెవుడు ఉన్నట్టుగా ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు సుకుమార్. 2018లో వచ్చిన రంగస్థలం తర్వాత మళ్లీ ఈ కాంబోలో మూవీ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. దీనికి తోడు ఈ ఇద్దరూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్స్. అంటే రాబోయే కథ కూడా అలాగే ఉంటుంది అని భావించొచ్చు.
ఇక ఈ కథ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇది మళ్లీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఇది పూర్తిగా సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని పక్కా సమాచారం. దీంతో పాటు దీన్ని కేవలం ఒకే పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా రూపొందించబోతున్నారట. రెండు భాగాలు అంటే పుష్ప, పుష్ప 2 లాగా చాలా టైమ్ తీసుకోకుండా.. ధురంధర్ లాగా రెండు భాగాలను వెంట వెంటనే విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఈ మూవీ అయితే సుకుమార్ స్టైల్ కు భిన్నంగా కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందనేది మాత్రం నిజమే అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోబోతున్నాడు. అన్నీ సెట్ అయితే దసరా తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందని టాక్.

Continue reading
అల్లు అర్జున్ తో మరోసారి రష్మిక మందన్నా

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారింది. పుష్ప, పుష్ప 2తో ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. పుష్ప 2 కలెక్షన్స్ మాత్రం ఊహించని రేంజ్ లో వచ్చాయి. దీంతో త్రివిక్రమ్ తో చేయాల్సిన మూవీని పక్కన పెట్టాడు. తమిళ్ స్టార్ డైరెక్టర అట్లీతో జట్టు కట్టాడు. ఈ మూవీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ఉండబోతోంది అని అనౌన్స్ మెంట్ తోనే చెప్పారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. రాకా టైటిల్. ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన బన్నీ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకోణ్ ను తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం తను మళ్లీ ప్రగ్నెంట్ తో ఉంది. అలాగే ఈ మూవీలో ఇంకా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతున్నారు అనే వార్తలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. అదే టైమ్ ల రష్మిక మందన్నా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది అనే న్యూస్ కూడా వస్తున్నాయి. జాన్వీ, మృణాల్ మేటర్ ఏంటో కానీ.. లేటెస్ట్ గా రష్మిక మందన్నా కన్ఫార్మ్ అయింది. ఈచిత్రంలో రష్మిక మందన్నా పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. తనేమీ రెగ్యులర్ హీరోయిన్ కాదు. బట్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ఈ ఇద్దరికీ సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను ముంబైలోనే చేయబోతున్నారు. మరో రెండు వారాల్లో రష్మిక మందన్నా రాకా సెట్స్ లో అడుగు పెట్టబోతోంది. ఆల్రెడీ పుష్ప మూవీతో ఈ జంట దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. అలాంటి జంట మళ్లీ కనిపించబోతున్నారు అంటే ఓ రకమైన ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో ఉంది అనేది వాస్తవం. మరి కేవలం రష్మిక మాత్రమేనా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ల పాత్రలు కూడా ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా పెళ్లి తర్వాత కూడా రష్మిక మందన్నా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు.

Continue reading
సూర్యకు జోడీగా కయాడు లోహర్

కరుప్పు బ్లాక్ బస్టర్ తో సూర్య దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తర్వాత విశ్వనాథమ్ అండ్ సన్స్ మూవీతో తెలుగు స్ట్రెయిట్ మూవీ ఈ ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. తర్వాత ఓ మళయాల మూవీ చేస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. మరోవైపు తమిళ్ లో కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జై భీమ్ దర్శకుడితో మరో మూవీకి సిద్ధం అయ్యాడు. ఇది సూర్యకు 48వ చిత్రం. జై భీమ్ తో విమర్శకుల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు టిజే జ్ఞానవేల్. తర్వాత అతను రజినీకాంత్ తో చేసిన మూవీ బాక్సాఫీస్ వద్ద పోయింది. బట్ అతను ఎంచుకున్న పాయింట్ మాత్రం చాలా బావుంది.
దర్శకుడు టిజే జ్ఞానవేల్ తో మళ్లీ సూర్య జత కట్టడం మాత్రం చాలా బావుంది. ఇద్దరి కాంబోలో జై భీమ్ లాంటి మూవీనే మళ్లీ ఎక్స్ పెక్ట్ చేయలేం.. బట్ కమర్షియల్ మూవీతో రావడం పక్కా అనేది తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కయాడు లోహర్ ను తీసుకున్నారు. తమిళ్ లో ఆమె చేసిన డ్రాగన్ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఇప్పుడు అన్ని భాషల్లో కూడా చాలా బిజీ అయిపోయింది. అలాంటి బ్యూటీ సూర్యతో అంటే మంచి ఛాయిస్ అనే చెప్పాలి. ఇక హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మితమవుతోన్న ఈ మూవీ ఇవాళే ప్రారంభం అయింది. ఈ యేడాది జూలై లేదా ఆగస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. మరి ఈ మూవీతో జై భీమ్ జోడీ మళ్లీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

Continue reading
తెలుగు సినిమా పాటకు చిరునామా వేటూరి

తెలుగు పాటకు ఆయన చిరునామా.. తెలుగు పాటే ఆయనకు చిరునామా.. సంస్కృతభూయిష్టమైన సమాసాలను అందంగా పొదిగి, సరళమైన పాటగా మార్చి అందించినా.. లళిత శృంగార భావాలను మనోహరంగా కూర్చి అందమైన పాటగా మలచినా.. మొరటు పదాలకు జానపద పలుకులను నేర్పుగా అల్లి మసాలా కూర్చి మెప్పించినా… రాలిపోయే పూవుకు రాగాలెందుకంటూ శ్రోతల గుండెల్ని పిండి ఏడిపించినా .. అది వేటూరి కలానికే చెల్లింది.

ఆ కలం ముద్దమందారం పై వాలిన సీతాకోక చిలుక.. సిరిసిరిమువ్వల నాదమైంది.. సితారాగానమైంది.. శంకరాభరణం ధరించి సాగరసంగమమైంది. సరికొత్త పదాల అన్వేషణలో సప్తపదులు దాటుకుని మరీ మధురమైన పదాలకు పాటలు వేసింది. ఆ కలం వేటూరిది.. ఆ పాట తెలుగు పాటకు శాశ్వత సంతకం. ఆ సంతకాన్ని తనదైన పదాలతో వేసిన పదసిరి.. గడసరి వేటూరి..
బాధల్నీ, విషాదాల్నీ, ఆనందాల్నీ గాయకుల స్వరాల్లో నింపి తెలుగు సినిమా పాటకు ఓ సొగసిరినీ, సౌందర్యాన్ని, పరిపూర్ణత్వాన్ని తెచ్చిన కలం వేటూరి సుందరరామ్మూర్తిది. సందర్భోచితమైన భావాలను సరళమైన పదాలతో పేర్చి శ్రోతల్ని తన సాహితీ రసజ్ఞతతో ముంచి వేయడం వేటూరి ప్రత్యేకత.
ఆయన కలం నుంచి జాలువారితే తెలుగు పదం హొయలు పోతుంది. లయలుగా మారుతుంది. సరికొత్త సొగసులను అందిపుచ్చుకుని… తెలుగు పాటకు వన్నె అద్ది.. చిన్నెలు నేర్పింది. సంప్రదాయం, యవ్వనం, విరహం, భక్తి, రక్తి, వేదాంతం, వైరాగ్యం.. ఇలా .. భావమేదైనా అది వేటూరి కలంలో పడితే అద్భుతమైన గేయమవుతుంది. మధురగానమై ప్రాణం పోసుకుంటుంది. అవ్యాక్తానుభూతులను కూడా అతి చిన్న పదాలతో ఆకట్టుకునేలా చెప్పడం వేటూరికే చెల్లిందేమో..
కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీతకథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు వేటూరి. తనలోని పదసంపద అనే జ్ఞానానికి బాణీలు అద్ది, ఆ బాణీలతో తెలుగు పాటకు ఓణీలు వేయించారు. సంప్రదాయ కీర్తనలే కాదు, పురాణ సాహిత్యంలోని మాటలనూ తీసుకుని వాటిని అందమైన పాటలుగా మలచడంలో వేటూరిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో..
వేటూరి కలంలో శృంగారపు సిరా పాళ్లు కూసంత ఎక్కువే కనిపిస్తాయి. అందుకే గానమూ ప్రాణమూ నీవేనని శంకరుణ్ని ఆరాధించిన ఆ కలమే.. ఆరేసుకోబోయి పారేసుకుంటుంది.. పారేసుకోవాలనే ఆరేసుకున్నాననే చిలిపి దనాన్నీ చిలకరిస్తుంది. ఇలాంటి పాటలను కూడా అంత అందంగా ఇంకెవరూ రాయలేకపోయారు.. అప్పుడే కాదు.. ఇప్పటికీ..
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా.. తరించిపోతుంది ఆ పట్టుపురుగు జన్మ అంటూ వేటూరి రాస్తే..ఆ భావానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదా పట్టుపురుగు. ఇలాంటి పద ప్రయోగాలు చేయడం అంటే వేటూరికి పాళీతో పెట్టిన విద్య. ఇలా మాటల్నీ మంత్రాలుగా చేసిన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో వేటూరి సిద్ధహస్తుడు.
వేటూరి భావానికి నాటి సంగీత దర్శకులు అద్భుతమైన స్వర ప్రస్థానం కట్టబెట్టారు. హార్ట్ బీట్ ను కదిలించేదైనా.. ఫాస్ట్ బీట్ తో హార్ట్ బీట్ ను పెంచేదైనా ఆయన అక్షరాలను నాటి సంగీత దర్శకులు సమకూర్చిన స్వరాల స్థానం కూడా చాలా చాలా ప్రత్యేకమైనదే. ముఖ్యంగా చిరంజీవి సినిమాల్లోని పాటల్లోని వేగానికి తగ్గట్టుగా వేటూరి కలమూ పరుగులు పెడుతుంది.

తెలుగు పదకవితా పితామహుడు అన్నమయ్యే అచ్చెరువొందేలా.. ఆయన జననాన్నే అత్యద్భుతంగా అక్షరీకరించాడు వేటూరి. తెలుగు పదానికి జన్మదినం..ఇది జానపదానికి జ్ఞానపదం, ఏడు స్వరాలే ఏడుకొండలై వెలసిన కలియుగ విష్ణుపదం .. ఇంతకు మించి అన్నమయ్యను గురించి చెప్పడం ఇంకెవరికి సాధ్యం..
మంచుతాకి కోయిల మౌనమైన వేళా… రాలేటి పూల రాగాలతో పూసేటి పూలగంధాలతో ఆమనీ పాడవే హాయిగా అని చెప్పడం ఎంతమందికి సాధ్యమౌతుంది. మంచు కురిసే వేళలో మల్లెవిరిసేదెందుకో అంటూ తొలి ప్రేమ చిగురించే వైనానికి ప్రకృతిని ఆసరా చేసుకుంటాడు. నిజంగానే ఆ పాట వింటుంటే మనం కూడా తెలియకుండానే ఏ మంచు కొండల నడుమనో ఉండిపోయి.. లేని మల్లెలను ఊహించుకుంటూ.. ఉంటాం.
రాలిపోయే పూవుకు రాగాలెందుకు.. వాలిపోయే పొద్దుకు వర్ణాలెందుకు అంటూ వేటూరి కలం ఝలిపిస్తే కన్నీరు పెట్టకుండా ఉండగలమా.. వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి .. అంటే మధ్యలో వినిపించే గానమే జీవితమా.. ఇలాంటి పదాలను రాస్తున్నప్పుడు అందులోని కష్టం తను అనుభవిస్తూ.. అనుభూతిని మనకు మిగుల్చుతాడు వేటూరి.
ఇలాంటిదే మరో పాట ఆకాశాన సూర్యుడుండు సందెవేళకీ .. చందమామకు రూపముండదు తెల్లవారితే అంటూ జీవితం ఎంత చిన్నదో తెలుపుతూనే… ఈ మజిలీ మూడు నాళ్లే అంటూ తత్వాన్నీ బోధిస్తాడు. ఇవన్నీ కవి అనుభవాల నుంచే రావాల్సిన అవసరం లేదు. సమాజాన్నీ.. తన చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనిస్తూ ఉంటే చాలు..
వేటూరి పాటల్లో క్లాస్ ఉన్నాయి మాస్ ఉన్నాయి. పండిత పామరులను మెప్పించిన ఉన్నత సాహితీ విలువలున్న పాటలూ ఉన్నాయి. భాషమీద పట్టుతో పాటు స్వరజ్ఞానం ఆయనకున్న వరం. శబ్ధానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సినిమా పాటను రక్తి కట్టించారు. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి తెలుగు సినిమా పాటను లాలించి, పాలించి, శాసించిన సినీకవితాగ్రేసరుడు వేటూరి.
వేటూరి రాసిన వాటిలో సాంఘికంగా ఎప్పటికీ తిరుగులేని పాట.. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో. ఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఏదో తెలియని ఫీలింగ్ లోకి వెళ్లిపోతాం. ఈ పాటతో ఆడవారిని చులకనగా చూసేవారిపై అక్షర శస్త్రాలు సంధించారు. వారిపై జరుగుతున్న ఆకృత్యాలను పాటీకరించిన ఆయన కలంలోని ఆవేశానికి మనమూ గురవుతాం..
తొలినాళ్లలో ఆయన పాట మానసవీణపై మదుగీతమై ఎలా పరవశింప చేసిందో.. ఆఖర్లోనూ అంతే ఉత్సాహంగా పరవళ్లు తొక్కింది. ఉప్పొంగిన గోదారిని చూసి .. ఆనందంతో ఊగిపోయిన వరి చేలను ఊహించింది. డెభ్భైయేళ్ల వయసులో కూడా చెలికాడి నిర్లక్ష్యానికి గురయ్యానేమో అనుకుని ఓ యువతి పడే తాపత్రయాన్ని అందంగా లేనా.. అస్సలేం బాలేనా అని చెప్పగలిగారంటే.. సందర్భానికి తగ్గ పాటను కాదు ఇక్కడ చూడాల్సింది. దర్శకుడి ఊహకు ఆయన అద్దిన పదాల్ని, వాటిపై ఆయనకున్న సర్వాధికారాన్ని. ..
కెరీర్ ప్రారంభం నుంచీ.. తనదైన శైలిలో తెలుగు సినిమా పాటలో సాహితీ సేద్యం చేసి ఎన్నో అద్భుతమైన పాటలను పండించారు. ముఖ్యంగా ఇళయరాజా, వేటూరి కలయికలో వచ్చిన పాటలన్నీ ఆణిముత్యాలే. కవిగా ఎంత గొప్పవాడో తెలుగు భాషాభిమానిగానూ ఆయన అంతే గొప్పవాడు. అందుకే తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చిన నిజమైన మాతృభాషాభిమాని.. వేటూరి.. భౌతికంగా వేటూరి మనమధ్య లేకపోయినా.. తన అక్షరాలతో అనునిత్య తెలుగు భాషతో మమేకమయ్యే ఉంటారు.

 

  • యశ్వంతుడు

Continue reading
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయినట్టేనా..?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్యకు సరైన వారసుడుగా అభిమానులు అతన్ని నెత్తిన పెట్టుకోవడం కోసం చూస్తున్నారు. ఇటు చూస్తే తన తరం హీరోల తనయులు హీరోలుగా మారిపోయారు. బట్ తన ఏజ్ ను బట్టి మోక్షజ్ఞ కూడా ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎందుకో అతనికి ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తోంది. బాలయ్య కోరిక బలంగా ఉన్నా మోక్షజ్ఞకు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరిక కనిపించడం లేదు అని చాలాసార్లు అనిపిస్తోంది.
ఇక రీసెంట్ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అని కొన్నాళ్ల క్రితం నానా హడావిడీ చేశారు. ఆ మేరకు మోక్షజ్ఞకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ అంటూ కొన్ని ఫోటోస్ విడుదల చేశారు. బట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రశాంత్ తప్పుకున్నాడు. తర్వాత సీన్ లోకి బాలయ్యే స్వయంగా వచ్చాడు. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999ను రూపొందించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. బట్ అదీ ముందుకు సాగడం లేదు. ఇటు చూస్తే మోక్షజ్ఞ ఎప్పుడూ ప్రాపర్ లుక్ మెయిన్టేన్ చేయలేకపోతున్నాడు. దీంతో అసలు మనోడికి సినిమా హీరో కావాలనే లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అదీ నిజమే అనిపించేలా ఉంది తాజా కథ.
బాలకృష్ణ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఆగస్ట్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి సుధాకర్ చెరకూరు నిర్మాత. అయితే కొరటాల మూవీని సడెన్ గా స్టార్ట్ చేశాడు బాలయ్య. అందుకు కారణం నిర్మాతే అనేది చాలామందికి తెలియదు. సుధాకర్ చెరకూరి గతంలో మోక్షజ్ఞతో మూవీ చేయాలనుకున్నాడు. ఆ మేరకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం కొంత ఖర్చు చేశాడు. కానీ మోక్షజ్ఞ మూవీ చేయలేకపోతున్నాడు. ఆ మేరకు అతనికి కాంపెన్సేట్ చేయడం కోసమే బాలయ్య ఇప్పుడు ఈ మూవీ స్టార్ట్ చేశాడు అనేది వాస్తవం. అంటే మోక్షజ్ఞతో మూవీ చేయాలని సుధాకర్ కు ఉన్నా.. అది పట్టాలెక్కడం సాధ్యం కాదు అని తెలిసింది కాబట్టే ఈ ప్రాజెక్ట్ నే బాలయ్యతో స్టార్ట్ చేయబోతున్నాడన్నమాట.
ఈ రకంగా చూస్తే.. మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదు మాత్రమే కాదు.. అసలు అతనికి సినిమాలే ఇంట్రెస్ట్ లేదు అని అనుకోవచ్చు. లేదంటే ఇప్పటికే అతని వయసుకు 30కి వచ్చేసింది. ఈ ఇండస్ట్రీలో 20కే స్టార్ట్ చేయడం కామన్ గా చూస్తుంటాం. అలాంటి అతను ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు.. అంటే అతనికి అసలు ఇంట్రెస్ట్ లేకపోవడమే అనేది ఈ వార్త సారాంశం. లేదంటే బాలయ్య కొన్ని ముహూర్తాల కోసం చూస్తున్నాడేమో తెలియాల్సి కూడా ఉంది.

Continue reading