రవితేజ కెరీర్ లో ఇరుముడి స్పెషల్ మూవీగా నిలుస్తుందా..

రవితేజ ఇరుముడి పాట

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ ‘ఇరుముడి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ఈ నెల 21న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీపై ముందు నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ తో వస్తున్నాడు అనిపించేలా ఉంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా బేబీ నక్షత్ర కీలకమైన పాత్రలో నటించారీ చిత్రంలో.

రవితేజ పాట బావుంది

రవితేజ ఇరుముడి నుంచి తాజాగా మరో పాట విడుదల చేశారు. ఫస్ట్ సాంగ్ అయితే అయ్యప్ప మాలలో రవితేజ చేసిన హడావిడీగా సాగే గీతంగా ఉంది. అయితే ఈ పాట అందుకు భిన్నంగా ఉంది. రవితేజ ఓ ఆటో డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. ‘యాలాలో యాలాలో ఎన్నెట్లో ఎన్ని ముచ్చటలో.. ’అంటూ సాగే ఈ పాటలో పల్లవిలోనే ‘అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం.. మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం’ అంటూ వినిపించిన పదాలు చాలా చాలా బావున్నాయి.

రవితేజ తాగుబోతు పాత్రలో

ఇక పాటలో వచ్చే సన్నివేశాలు చూస్తుంటేనే ఈ చిత్రంలో రవితేజ పాత్ర చాలా వరకు దిగువ మధ్యతరగతి వాడిగా కనిపిస్తాడు అని తెలుస్తుంది. దీనికి తోడు భార్యకు తెలియకుండా పొద్దు పొద్దునే మందు తాగడం మొదలు పెడతాడు రవితేజ. చూస్తుంటే తాగుబోతులంతా ఇలా అయ్యప్ప మాలలు వేసుకుంటారు అనిపించేలా ఉన్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి

ఏదేమైనా రవితేజ కెరీర్ లో ఇదో స్పెషల్ మూవీ అవుతుందా అంటే అవుననే చెప్పాలేమో అనేలా ఉంది. శివ నిర్వాణ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ను బలంగా రాసుకుంటాడు. వాటిని ప్రెజెంట్ చేసే విధం కూడా చాలా బావుంటుంది. మరి ఇలా దిగువ మధ్యతరగతి హీరోతో ఇలాంటి సెంటిమెంట్స్ ను రంగరించడం మాత్రం మరో స్థాయిలో ఉండబోతోంది అనిపించేలా ఉంది.
ఇక జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి అనంత శ్రీరామ్ రాశాడు. హేషమ్ అబ్దుల్లా వాహబ్ ఈ పాటను పాడటం విశేషం. అతనితో పాటు సాధిక కే.ఆర్ పాడింది.

Continue reading
కామాక్షి భాస్కర్ల అగధ మూవీ ట్రైలర్ రిలీజ్

కామాక్షి భాస్కర్ల అగధ మూవీ

కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన మూవీ అగధ. అగధీ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్ రాజు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ ఫిక్షన్ కంటెంట్ తో రూపొందిన సినిమా ఇది. మాయలు, మంత్రాలు, మంచిపై చెడు వారి పోరాటం వల్ల సాగే కథలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
అగధ లాంటి కథలు మనకు ఇప్పటి వరకు రాలేదు అని కాదు.. కానీ ఈ మూవీ విషయంలో కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా కనిపిస్తోంది. సినిమా అంతా తన చుట్టూనే సాగుతుంది అనిపించేలా ఉంది. కామాక్షి భాస్కర్ల కూడా మంత్రగత్తెగా కనిపిస్తోంది. అయితే తను కేవలం మంచి కోసమే తన మంత్రాలు ఉపయోగిస్తుంది. దానికి భిన్నంగా దుష్టమైన మంత్రగాళ్లు కూడా ఉంటారు. మరి వారిపై కామాక్షి భాస్కర్ల పోరాటం ఎలా ఉంది అనేది ప్రధానంగా ఉండబోతోందీ మూవీలో.

చెడుపై మంచి చేసే యుద్ధం

అగధ ట్రైలర్ చూస్తే ఓ గర్భిణీ స్త్రీ ఆత్మహత్య చేసుకుంటుంది. మహిమ అనే పేరున్న ఆమె ఆత్మహత్య వెనక ఉన్న రహస్యం ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న మహిమ ఆత్మగా మారుతుంది. మరి తను ఎందుకు ఆత్మగా ఎందుకు మారింది అనేది మరో కోణంలో ఉంటుంది. అయితే అగధకు ఈమె ఆత్మహత్యకు ఉన్న సంబంధం ఏంటీ అనేది మరో కోణం. ‘నీ చుట్టూ చెడు చేసే పిచ్చి భూతాలుంటే.. నా చుట్టూ మంచి చేసే పంచ భూతాలున్నాయి’అనే డైలాగ్ చాలా బావుంది.

ఎమ్.ఎస్.రాజుకు హిట్ పడుతుందా..?

మరి ఆ చెడు భూతాలను కామాక్షి భాస్కర్ల ఎలా ఎదుర్కొంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపించేలా ఉంది. అయితే ఈ ట్రైలర్ మాత్రం టీజర్ లా అంత ఎఫెక్టివ్ గా లేదు. అలాగని ట్రైలర్ చూడగానే కంటెంట్ పై జడ్జిమెంట్ చేయడం సరైంది కాదు. అందుకే మూవీ విడుదలైతే కానీ ఓ క్లారిటీ రాదు.
ఏదేమైనా ఈ మూవీతో ఎమ్.ఎస్.రాజు ఓ పెద్ద హిట్ కొట్టాలనే ప్రయత్నం మాత్రం కనిపిస్తోంది. ఈ తరహా కొత్తదనం ఉన్న కథలతో ఆకట్టుకునే కామాక్షి భాస్కర్లకు కూడా ఈ మూవీ మంచి విజయం ఇచ్చేలా ఉంది. మరి ఈ నెల 14న విడుదల కాబోతోన్న అగధ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

Continue reading
నితిన్ హీరోగా ఎలియాస్ రుక్మిణి గ్లింప్స్ విడుదల

నితిన్ హీరోగా ఎలియాస్ రుక్మిణి

నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ ఎలియాస్ రుక్మిణి. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. దండోరా ఫేమ్ మురళీకాంత్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. నితిన్ హీరోగా కొన్నాళ్లుగా సరైన విజయాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. తను అనుకున్న ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. ఓ దశలో చాలామంది ఇక నితిన్ హీరోగా తప్పుకుంటే బావుంటుందని కూడా కామెంట్స్ చేశారు. అన్నీ మైండ్ లోకి తీసుకున్నాడు నితిన్. కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాతే ఈ ఎలియాస్ రుక్మిణితో వస్తున్నాడు.
విశేషం ఏంటంటే ఎలియాస్ రుక్మిణికి హీరో నాని ప్రెజెంటర్. అంటే నాని గతంలోనే మురళీకాంత్ తో చర్చలు నడిపించాడు. దీంతో మురళీకాంత్ తో డైరెక్షన్ లోనే నాని నటించబోతున్నాడు అని చాలామంది భావించారు. బట్ ఫైనల్ గా ఆ ప్లేస్ లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. మరి దీనికి నానియే కారణమా లేక మురళీకాంత్ డెసిషనా అనేది తెలియాల్సి ఉంది.

నితిన్ ఎలియాస్ రుక్మిణి గ్లింప్స్

ఇక గ్లింప్స్ చూస్తే.. నాని ఈ కథ గురించి తెలుకోవాలని దర్శకుడు మురళీకాంత్ ను అడుగినట్టుగా చూపించారు. ‘హాయ్ మురళీ.. దేని గురించి ఈ కథ అని నాని అడిగితే.. దానికి ఈ కథ కృష్ణ గురించి అన్నా’అంటాడు మురళీ. కృష్ణ ఓ నవలా రచయితగా చూపించారు. కట్ చేస్తే అతని ఊహల నుంచి కొన్ని నవలలు వస్తాయి అని చూపించారు. అందులో భాగంగా మొదటి నవల గరం గోపాల్ అని ఉంటుంది. అలాగే ఓ లెస్బియన్ నవలగా ఆమెకు ఆమె అంటే ఇష్టం అనేలా మరోటి ఉంటుంది. మూడోదిగా వ్రతం వెంకన్న అనే నవల రాసినట్టుగా ఉంటుంది. అంటే భార్య కోరికలను తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి నవలగా ఇది కనిపిస్తోంది అనేలా ఉంది.

రచయితగా నితిన్

ఇవన్నీ చూసిన తర్వాత నాని వెంటనే అడుగుతాడు.. మరి ఈ రుక్మిణి అని. దానికి వీడియోలో నితిన్ చెబుతున్నట్టుగా ‘నా వైఫ్’అంటాడు. మరి ఆ భార్య ఎవరు.. అతనికి రచయితగా తను ఎంత ఇన్సిస్పిరేషన్ గా నిలుస్తుంది.. అసలు నిజంగా ఆమె ఉంటుందా లేదా అనేది తెలియాల్సిన కథ అని అర్థమవుతుంది.
దీప్తి గంటా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సింగీతం అందించబోతున్నాడు. ఏదేమైనా నితిన్ కు ఈ మూవీ అత్యంత కీలకం అనేది మాత్రం వాస్తవం. మరి ఆ వాస్తవాన్ని నిలబెట్టుకునేలా ఎలియాస్ రుక్మిణి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Continue reading
రష్మిక మందన్నా డ్యాన్స్ చిత్రీకరణలో గాయపడింది

రష్మిక మందన్నాకు గాయాలు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న బ్యూటీ రష్మిక మందన్నా. రష్మిక మందన్నా తాజాగా ఒక సినిమా పాట చిత్రీకరణ సందర్భంగా ఆమెకు గాయాలు అయ్యాయి. ఒక రకంగా ఇది తీవ్ర గాయమే చెబుతున్నారు. ప్రస్తుతం తను మైసా, రణబాలి మూవీస్ షూటింగ్ చేస్తుండగా ఈ గాయం అయిందా లేక మరేదైనా చిత్రీకరణలో అయిందా అనేది తెలియాల్సి ఉంది.

గతంలోనూ రష్మిక కాలికి ఫ్రాక్చర్స్

ఓ రకంగా రష్మిక మందన్నా గతంలో సికందర్ అనే బాలీవుడ్ మూవీ షూటింగ్ టైమ్ లో కూడా గాయపడింది. అయితే ఇది మూవీ షూటింగ్ టైమ్ లో కాదు. జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా కాలు బెణికింది. డాక్టర్స్ పరీక్షించారు. దీంతో కాలికి ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయని తేలింది. దీంతో కొన్నాళ్లు షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఆ టైమ్ లో మరో మూవీ ప్రమోషన్స్ లో రష్మిక మందన్నా పాల్గొంది. అంతే తను ఎంత డెడికేటెడ్ అనేది అందరికీ తెలిసింది.

ఆరు వారాలు విశ్రాంతి

ఇక తాజాగా అయినా గాయం సాధారణంగా టాప్ అథ్లెట్స్ కు మాత్రమే అవుతుందట. అలాంటిది ఓ సాధారణ హీరోయిన్ కు ఇలాంటి గాయం కావడం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం డాక్టర్లు అయితే తనకు ఆరువారాల పాటు విశ్రాంతి అవసరం అని ఖచ్చితంగా చెప్పారు.

రష్మిక మందన్నా మూవీస్ షెడ్యూల్స్ లో మార్పులు

మరి ఈ కారణంగా తను చేస్తోన్న మూవీస్ షెడ్యూల్స్ కూడా మారిపోతాయి. దీని వల్ల ఆ మూవీస్ రిలీజ్ డేట్స్ లో కూడా మార్పులు రావడం జరుగుతుంది. ఏదేమైనా రష్మిక మందన్నా త్వరగా కోలుకోవాలి. వీలైనంత వేగంగా మళ్లీ జోష్ గా షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాలని గారడి డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Continue reading
శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ : ప్లస్ లు మైనస్ లు ఎలా ఉన్నాయి..?

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ

ఆర్టిస్ట్స్ : ఘట్టమనేని జై కృష్ణ, రషా టండానీ, మోహన్ బాబు, వికే నరేష్, బ్రహ్మాజీ, శ్యామ్, అజయ్ తదితరులు
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుల్లపల్లి
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : జయకృష్ణ గుమ్మడి
ప్రెజెంటర్ : అశ్వనీదత్
నిర్మాత : జెమినీ కిరణ్
దర్శకత్వం : అజయ్ భూపతి

టాలీవుడ్ నుంచి పెద్ద ఫ్యామిలీ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే కాస్త హడావిడీ ఉంటుంది. అలాంటిదేం లేకుండా శ్రీనివాస మంగాపురం మూవీతో ఘట్టమనేని జై కృష్ణను పరిచయం చేశారు. మహేష్ బాబు లాంటి స్టార్ అన్న కొడుకుగా వచ్చినా జై కృష్ణకు ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయకపోవడం కాస్త విచిత్రమే అయినా.. జై కృష్ణ తనదైన శైలిలో ప్రమోషన్స్ చేశాడు. ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి కంటెంట్ ఉన్న మూవీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. అతని దర్శకత్వంలో జై కృష్ణను పరిచయం చేయాలనుకున్నారు. అంటే మాగ్జిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి ఈ మూవీ ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :

పెద్దిరెడ్డి (శ్యామ్) తిరుపతిలో పేరు మోసిన రాజకీయ నాయకుడు. అతని కూతురు మంగ(రషా టండాని). థియేటర్స్ చదువుతుంటుంది. వేరే ఊరి నుంచి తిరుపతికి వచ్చిన కుర్రాడు శ్రీను(జై కృష్ణ). అతను తొలి చూపులోనే మంగతో ప్రేమలో పడతాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. మంగ కూడా అది కేవలం స్నేహమే అనుకుంటుంది. మంగకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం అవుతుంది. తర్వాత శ్రీను తన ప్రేమను చెబుతాడు. ఆమె తాళికట్టే చివరి క్షణం కోసం వరకు తను వెయిట్ చేస్తా అని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆమె మాత్రం అతన్ని లైట్ తీసుకుంటుంది.

పెద్ది రెడ్డి చెల్లి వరలక్ష్మి(వాసుకి). ఆమె బల్లారిలో ఉంటుంది. మేనకోడలి పెళ్లికి వస్తుంది. అక్కడ ఫోటోస్ లో శ్రీను కూడా కనిపిస్తాడు. కట్ చేస్తే ఆమె అతని వద్దకు వెళుతుంది. తన మేన కోడలిని వదిలేయమని చెబుతుంది. కానీ శ్రీను తను తిరుపతి వచ్చిందే మంగ కోసం. మంగ లేకుండా తను బ్రతకలేను అని చెబుతాడు. మరి ఈ వ్వవహారం వెనక ఉన్న కథేంటీ..? వాసు బాబు ఎవరు..? వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)కు వాసుబాబుకు ఉన్న సంబంధం ఏంటీ..? అసలు శ్రీనుకు మంగతో ముందే పరిచయం ఉందా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయి. ఈ లోగా కొందరు విలన్స్ ఎంటర్ అవుతారు. వారి నుంచి దాటుకునే ప్రయత్నంలో ఈ ఇద్దరి సమస్యలు క్లియర్ అవుతాయి. ఇదే కథ. ఇలాంటి కథలు తెలుగు తెర ఇప్పటికి వేలల్లో చూసింది. అలాంటిదే శ్రీనివాస మంగాపురం మూవీ. బట్ ఇందులో కొత్తదనం అనేది మచ్చుకు కూడా కనిపించదు. ఏ మాత్రం ఆకట్టుకోలేని కథనంలో కావాల్సినంత బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా సాదా సీదాగా సాగుతుంది. ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడు ఈ కాలాని తగ్గట్టుగా బలమైన కథనం ఉంటే బావుంటుంది. ఈ మూవీలో అదే ప్రధానమైన లోపం.

ఫస్ట్ హాఫ్ ఒకలా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం కాస్త బావుంది. ఇందులోని ట్విస్ట్ కారణంగానే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అది చాలా కీలకమైనప్పుడు అది అద్భుతం అనిపించాలి. అలా లేకపోవడం ఫస్ట్ హాఫ్ తేలిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఆ ట్విస్ట్ చుట్టూ అల్లుకున్న కథనం మాత్రం నిజంగానే బావుంటుంది. అయితే ఇదేమీ కొత్తదేం కాదు. అయినా ఓకే అనిపిస్తుంది. ఓ రకంగా పడిపడి లేచె మనసులోని ట్విస్ట్ నే వీళ్లు మళ్లీ రిపీట్ చేశారు. ఆ మూవీ కూడా పోయింది. కానీ అంత ఇంపాక్ట్ కూడా శ్రీనివాస మంగాపురంలో లేదు. అదే పెద్ద మైనస్.

జై కృష్ణ నటుడుగా ఇంకా సానబెట్టబడాలి. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. ఎక్స్ ప్రెషన్స్ మరీ తేలిపోలేదు కానీ చాలా చోట్ల సరిగ్గా పెట్టలేకపోయాడు. జై కృష్ణను ఇలాంటి కథతో పరిచయం చేయాలనుకోవడమే పెద్ద లోపం. అయితే అతనిలోని మాస్ యాంగిల్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం దురదృష్టం. రషా టండానీ నటన కూడా ఏమంత బాలేదు.

మోహన్ బాబు పాత్రను సెకండ్ హాఫ్ లో చూపించారు. అది స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది కానీ వీక్ గానే సాగింది. ఉన్నంతలో శ్యామ్ పాత్ర బావుంది. అలాగే నువ్వు నాకు నచ్చావులో సుహాసిని లాంటి పాత్రతో వాసుకి ఓకే అనిపించుకుంది. నరేష్ పాత్ర బావుంది. అద్భుతంగా నటించాడు. కానీ ఆ పాత్ర వల్ల సినిమాకు ఏ మాత్రం ఉపయోగం లేదు. బ్రహ్మాజీ కూడా ప్యాడింగ్ యాక్టర్ గానే కనిపించాడు. ఇతర పాత్రలన్నీ చాలా రొటీన్ వే.

టెక్నికల్ గా

జివి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం అదరగొట్టాడు. వీక్ సీన్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించాడు. ఈ కథలాగే పాటలు కూడా 90ల కాలం నాటివిగా కనిపించాయి. బట్ సాహిత్యం పరంగా పాటలన్నీ బావున్నాయి. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

దర్శకుడుగా అజయ్ భూపతి తీసుకున్న కథలో కొత్తదనం అస్సలు లేదు. కథనం పరంగా ఏదైనా మ్యాజిక్ లు చేసి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. కానీ అతను స్లో నెరేషన్ తో బాగా ఇబ్బంది పెట్టాడు. ఓ రకంగా అజయ్ భూపతి కూడా ఇంకా 90స్ లోనే ఆగిపోయాడు. బట్ ఆ టైమ్ లో వచ్చినా ఇంత స్లో నెరేషన్ అంటే అప్పుడు కూడా వర్కవుట్ కాకపోయి ఉండేది.

ఫైనల్ గా : బ్యాడ్ డెబ్యూ బై జై కృష్ణ
రేటింగ్ : 2/5
K.Y.R

Continue reading
విజయ్ దేవరకొండ: పదేళ్ల సినీ ప్రయాణం… విజయాలూ, వైఫల్యాలు

విజయ్ దేవరకొండ పదేళ్ల ప్రస్థానం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి కొన్నేళ్లకు ఒక కొత్త స్టార్ వస్తుంటాడు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ స్టైల్, యాటిట్యూడ్, సినిమాల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.

చిన్న పాత్రలతో ప్రారంభమైన అతని ప్రయాణం, స్టార్ హీరోగా ఎదగడం, వరుస విజయాలు, అనూహ్యమైన పరాజయాలు, మళ్లీ తిరిగి నిలబడేందుకు చేసిన ప్రయత్నాలు… ఇలా విజయ్ కెరీర్‌లో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఈ పదేళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి.

చిన్న పాత్రల నుంచి హీరో వరకు

విజయ్ దేవరకొండ మొదట నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని స్నేహితుడి పాత్రతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఆ సినిమా అతనికి మంచి అవకాశాల తలుపులు తెరిచింది.

‘పెళ్లిచూపులు’తో మొదలైన స్టార్ జర్నీ

2016లో వచ్చిన పెళ్లిచూపులు విజయ్ జీవితాన్నే మార్చేసింది. పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా, మంచి కథతో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఒక సాధారణ అబ్బాయి పాత్రలో విజయ్ చాలా సహజంగా నటించాడు. అప్పటివరకు “కొత్త హీరో”గా ఉన్న విజయ్, ఈ సినిమాతో “భవిష్యత్ స్టార్”గా మారిపోయాడు.

2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. ఈ సినిమా విడుదల సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం విజయ్ నటనకు ఫిదా అయ్యారు. కోపం, ప్రేమ, బాధ, ఆవేశం… ప్రతి భావాన్ని సహజంగా చూపించి ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత విజయ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. “రౌడీ” అనే ఇమేజ్ కూడా అప్పుడే బలపడింది.

ఒకే ఏడాదిలో మూడు హిట్లు

మహానటిలో చిన్న కానీ గుర్తుండిపోయే పాత్ర
గీత గోవిందం భారీ బ్లాక్‌బస్టర్
టాక్సీవాలా మరో సూపర్ హిట్

ప్రత్యేకంగా గీత గోవిందం విజయ్‌లోని మరో కోణాన్ని చూపించింది. అర్జున్ రెడ్డిలో కనిపించిన కోపిష్టి యువకుడికి పూర్తి భిన్నంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే పాత్రలో విజయ్ మెప్పించాడు.

భారీ అంచనాలు… ఆశించిన ఫలితం కాదు

ఈ విజయాల తర్వాత విజయ్ చేసిన డియర్ కామ్రేడ్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో నటనకు ప్రశంసలు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా నిరాశపరిచింది. ఇక్కడి నుంచే విజయ్ స్క్రిప్ట్ ఎంపికపై చర్చ మొదలైంది.

‘లైగర్’… కెరీర్‌లో అతిపెద్ద షాక్

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన లైగర్ విజయ్ కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్. కానీ సినిమా విడుదల తర్వాత తీవ్ర నిరాశ ఎదురైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ కెరీర్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

‘ఖుషి’తో కొంత ఊరట

లైగర్ తర్వాత వచ్చిన ఖుషి విజయ్‌కు కొంత ఊరటనిచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. పూర్తిస్థాయి కమ్‌బ్యాక్ కాకపోయినా, అభిమానుల్లో మళ్లీ ఆశలు పెంచింది.

విజయ్ బలం ఏమిటి?

విజయ్ దేవరకొండను ప్రత్యేకంగా నిలబెట్టేది అతని నటన మాత్రమే కాదు.
స్క్రీన్‌పై కనిపించే ఎనర్జీ
సహజమైన డైలాగ్ డెలివరీ
కొత్త తరానికి దగ్గరగా ఉండే బాడీ లాంగ్వేజ్
యువతను ఆకట్టుకునే స్టైల్
ఇవన్నీ అతని ప్రత్యేకతలు.

బలహీనత ఏమిటి?

విజయ్ కెరీర్‌ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత అదే తరహా ఇంటెన్స్ పాత్రల వైపు ఎక్కువగా వెళ్లడం, సరైన కథల ఎంపికలో కొన్ని తప్పులు చేయడం అతని కెరీర్‌పై ప్రభావం చూపింది. ప్రేక్షకులు ప్రతి సినిమాలో కొత్త విజయ్‌ను చూడాలని కోరుకుంటారు. అదే అతనికి పెద్ద సవాలు.

గారడీ విశ్లేషణ

విజయ్ దేవరకొండ కెరీర్‌ను ఒక మాటలో చెప్పాలంటే… “వేగంగా ఎదిగిన స్టార్, కష్టాలను ఎదుర్కొని మళ్లీ నిలబడేందుకు ప్రయత్నిస్తున్న నటుడు.”

Continue reading
ఘట్టమనేని జయకృష్ణను అభిమానులు ఓన్ చేసుకోలేదా..?

జయకృష్ణను ఘట్టమనేని ఫ్యామిలీ పట్టించుకోవడం లేదేంటీ..?

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. మరికొన్ని గంటల్లో అతను నటించిన శ్రీనివాస మంగాపురం మూవీ విడుదల కాబోతోంది. అయితే ఇక్కడ అనేక సందేహాలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మనవడుగా ఎంట్రీ ఇస్తున్నాడు జయకృష్ణ. అంతకు ముందే కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు మరణించి ఉన్నాడు. అతను హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అది కృష్ణకి చాలా పెద్ద లోటుగా ఉండిపోయింది. తర్వాత మహేష్ బాబు వచ్చాడు కృష్ణ ట్యాగ్ అయిన సూపర్ స్టార్ ను ఓన్ చేసుకున్నాడు. అయితే అంత త్వరగా మహేష్ బాబు స్టార్డమ్ తెచ్చుకోలేదు. చాలా ఫ్లాపుల తర్వాత గాడిలో పడ్డాడు. దీనికి తోడు మంచి నటుడు అనిపించుకున్నాడు.

రమేష్ బాబుపై మహేష్ బాబు ప్రేమ..?

మహేష్ బాబుకు అన అన్న రమేష్ బాబు అంటే చాలా ఇష్టం. ప్రేమ, గౌరవం కూడా మెండుగా ఉన్నాయి చాలామంది చెబుతుంటారు. అలాంటి తన అన్న కొడుకు హీరోగా మారాడు అంటే అతనికి సపోర్ట్ చేయాల్సిన మహేష్ బాబు మాత్రం మాగ్జిమం మౌనంగా ఉండిపోయాడు. శ్రీనివాస మంగాపురం మూవీకి సంబంధించి ఏ ఈవెంట్ కూ అటెండ్ కాలేదు. అందుకు తన వారణాసి మూవీ కారణమే అని చెబుతూ ఓ చిన్న వీడియో చేసి వదిలాడు. బట్ అది ఏమాత్రం సరిపోలేదు అనేది నిజం.

జయకృష్ణను మహేష్ ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారా..

మహేష్ బాబు దాదాపు లైట్ తీసుకున్నాడు అనేది చాలామందిలో కలుగుతున్న భావన. దర్శకుడు అజయ్ భూపతి ఎంత చెప్పినా ఈ విషయంలో అడ్జెస్ట్ కాలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రధాన విషయం ఏంటీ అంటే.. మహేష్ బాబు అభిమానులెవరూ కూడా జయకృష్ణను ఓన్ చేసుకోలేపోయారు. అతని గురించి మినిమం కూడా పట్టించుకోలేదు అనేది వాస్తవం. పాపం అతనే సొంతంగా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. రెండు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు. ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. బట్ అభిమానులు మాత్రం చాలా అంటే చాలా లైట్ తీసుకున్నారు జయకృష్ణను.
ఇలాంటి సందర్భాల్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన.. వస్తోన్న హీరోలందరితో పోలిస్తే జయకృష్ణను ఎవరూ పట్టించుకోవడం లేదు. మహేష్ బాబు తన అన్నపై చాలా గౌరవం ఉన్నా.. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన సందర్భంలో మాత్రం వదిలేయడం ఎంత వరకు సమంజసం అనేది పెద్ద ప్రశ్న. శ్రీనివాస మంగాపురంకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ ఏవీ కూడా ఆడియన్స్ నుంచి అటెన్షన్ తెచ్చుకోలేదు అనేది వాస్తవం. అతనేదో అతని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ప్రేక్షకులు మాత్రం ఈ కుర్రాడిలో హీరోను చూడలేకపోతున్నారు.

నెపోకిడ్స్ ను రుద్దడం కామన్

మామూలుగా పెద్ద కుటుంబాల నుంచి వస్తోన్న హీరోలందరు కూడా ముందుగా ప్రేక్షకులపై రుద్దబడటం కామన్ గా చూస్తున్నాం. జయకృష్ణ విషయంలో కూడా అదే జరుగుతుంది అని చాలామంది అనుకుంటున్నా.. అసలు ఆ కుటుంబం నుంచే ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అదే ఫ్యామిలీకి అల్లుడైన సుధీర్ బాబు హీరోగా మారిన టైమ్ లో అతని కోసం చాలామంది చాలా చేశారు. అతన్ని కూడా రుద్దారు. ఇప్పటికీ రుద్దడం జరుగుతూనే ఉంది. కాకపోతే సుధీర్ బాబు తన సినిమాల రిజల్ట్స్ ను పక్కన పెట్టి తనదైన శైలిని ఏర్పాటు చేసుకున్నాడు.

జయకృష్ణ స్వయంకృషే దిక్కా..

ఏదేమైనా కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు.. అతని ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా జయకృష్ణను అస్సలు పట్టించుకోలేదు అనేది తెలుస్తోంది. మరి అందుకు కారణాలేంటీ అనేది తెలియకపోయినా కుర్రాడు మాత్రం ఈ విషయాలన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం మాత్రం ఆపొద్దు అని చెప్పొచ్చు.

Continue reading
శర్వానంద్ భోగి మూవీ వాయిదా పడిందా..?

శర్వానంద్ భోగిపై లేటెస్ట్ అప్డేట్

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ భోగి. ఇదో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే మూవీ అని గతంలోనే ప్రకటించారు. సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. శర్వానంద్ ఫస్ట్ డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఊరమాస్ లుక్ తో నటిస్తున్నాడు. ఈ కథ చాలా బలంగా ఉందని చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా శర్వానంద్ ఇదో బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా భావిస్తున్నారు.

సంపత్ నందికి పెద్ద హిట్ కావాలి

సంపత్ నంది ఈ మధ్య కాలంలో సరైన విజయాలు లేక కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయినా నిర్మాతగా మాత్రం కాస్త ఫర్వాలేదు అనిపించేలాంటి మూవీస్ చేస్తున్నాడు. ఆ మూవీస్ కంటెంట్ పక్కన పెడితే కమర్షియల్ గా మాత్రం బానే వర్కవుట్ అయ్యాయి. ఈ కారణంగా తను డైరెక్ట్ చేసిన మూవీస్ పోయినా ఇబ్బంది పడకుండా ఉంటున్నాడు. అయితే భోగి మూవీ విషయంలో సంపత్ నంది మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నాడట. రీసెంట్ గా ఈ మూవీ రష్ మొత్తం శర్వానంద్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.

భోగి అవుట్ పుట్ పై శర్వానంద్ హ్యాపీ

భోగి కంటెంట్ తో పాటు సంపత్ నంది టేకింగ్ పై శర్వానంద్ చాలా ఇంప్రెస్ అయ్యాడట.దీంతో సంపత్ నందికి మరో అవకాశం ఇవ్వబోతున్నాడు శర్వానంద్. భోగి చిత్రాన్ని ఆగస్ట్ 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా చెప్పలేదు కానీ ఇప్పటికైతే ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది.

భోగి అందరికీ కీలకమే

ఏదేమైనా భోగిపై శర్వానంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సంపత్ నంది ఈ చిత్రంపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. అటు డింపుల్ హయాతి కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కు కూడా ఈ మూవీ కీలకమే అవుతుందని చెప్పొచ్చు. మరి రిజల్ట్ తర్వాత ఎవరికి ఎంత మేలు జరుగుతుందో అనేది తెలుస్తుంది.

Continue reading
విజయ్ జన నాయగన్ ఫైనల్ రిజల్ట్ ఏంటీ..?

జన నాయగన్ బిగ్గెస్ట్ డిజాస్టర్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమాగా జన నాయగన్ విడుదలైంది. నిజానికి ఈ మూవీ ఈ యేడాది జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. అప్పుడు రిలీజ్ అయితే ఎలక్షన్ కు ప్లస్ అవుతుందని అతను భావించినా సెన్సార్ కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విడుదలకు ముందే మూవీ రావడం కష్టం అని భావించారు. ఈ లోగా పైరసీకీ గురైంది. ఈ లోగా విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత వెంటనే విడుదల అనుకున్నా.. అప్పుడూ కుదరలేదు.

భగవంత్ కేసరికి రీమేక్

ఫైనల్ గా ఈ నెల 23న విడుదల చేశారు. బట్ రిజల్ట్ మాత్రం దారుణంగా వచ్చింది.
జన నాయగన్ తెలుగులో వచ్చిన భగవంత్ కేసరికి రీమేక్. అయితే ఇది కేవలం 50శాతం మాత్రమే తీసుకున్నారు అని ముందే చెప్పినా విడుదల తర్వాత చూస్తే 80శాతం వరకు అదే ఉంది. పైగా మూవీ అంతా మక్కీకి మక్కీగానే ఉంది. టేకింగ్ పరంగా మేకింగ్ పరంగా ఏ మాత్రం కొత్తదనం లేదు. అయినా విజయ్ మూవీ కాబట్టి తమిళ్ లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి అని చాలామంది భావించారు. బట్ అందుకు భిన్నంగా ఈ మూవీకి బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ తమిళ్ లోనే వచ్చింది.

జన నాయగన్ ను పట్టించుకోని ప్రేక్షకులు

ఎలెక్షన్స్ టార్గెట్ గా తీసిన మిగతా 20శాతం ఇప్పుడు అవసరం లేకపోవడంతో మరింత మైనస్ గా మారింది. ఆ కారణంగా జన నాయగన్ చూసిన వాళ్లంతా.. ఇంకా చెబితే విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. దీంతో ఈ చిత్రంలో డిలీట్ చేసిన ఒక 6సీన్స్ ను మళ్లీ యాడ్ చేస్తున్నాం అని మూవీ టీమ్ ప్రకటించింది. బట్ ఇప్పటికే జరగాల్సిన నష్టమే అయితే జరిగింది. ఈ టైమ్ లో కొన్ని సీన్స్ ను యాడ్ చేయడం వల్ల ఒరిగేదేంటీ అని చాలామంది ఫీలవుతున్నారు.

విజయ్ లాస్ట్ మూవీ డిజాస్టర్ గా

ఏదేమైనా విజయ్ మూవీ అంటే భారీ క్రేజ్ ఉంటుంది. పైగా అతని లాస్ట్ మూవీ అని కూడా జనం ఎగబడి చూస్తారు అనుకున్నారు. కానీ కంటెంట్ లో దమ్ము లేకపోతే జనం అస్సలు పట్టించుకోరు అని జన నాయగన్ తో మరోసారి ప్రూవ్ అయింది.ఏదేమైనా విజయ్ లాస్ట్ మూవీతో ఇలాంటి డిజాస్టర్ చూడ్డం కాస్త బాధాకరమే.

Continue reading
కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయడమేంటి

కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్

ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వెలిగిన వాళ్లంతా ఆఫర్స్ తగ్గగానే ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకునేవారు. మెల్లగా ట్రెండ్ మారింది. టాప్ హీరోయిన్ లుగా వెలుగుతున్న టైమ్ లో కూడా ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. అయితే వారి ఇమేజ్ కు తగ్గట్టుగా మాత్రమే ఇది కనిపించేది. అలాంటిది కీర్తి సురేష్ కూడా ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటే మాత్రం చాలామంది నమ్మలేకపోతున్నారు. బట్ ఇది నిజం. కీర్తి సురేష్ కూడా ఇప్పుడు ఐటమ్ లో చిందేస్తోంది.

వరుస మూవీస్ తో బిజీ

కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా బాగా బిజీగా మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది అని తెలుస్తోంది. దీంతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ సరసన మరో మూవీ చేస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్, కృతిశెట్టి మరో జంటగా నటిస్తున్నారు. వీటితో పాటు తమిళ్ లో కూడా మరికొన్ని మూవీస్ చేస్తోంది. అలాంటి టైమ్ లో కీర్తి సురేష్ సడెన్ గా ఐటమ్ సాంగ్ చేయడం ఆశ్చర్యమే.

ద ప్యారడైజ్ మూవీలో స్పెషల్ సాంగ్

Keerthy Suresh Movies, The Paradise Movieనేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘ద ప్యారడైజ్’మూవీలో కీర్తి సురేష్ ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఇది ఈ నెల 28నుంచే చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది కదా. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఐటమ్ సాంగ్ పెద్ద బ్యాలన్స్ గా ఉంది. ఈ పాట కేవలం నాని కోసమే చేస్తోంది అనేది చాలామందికి తెలిసిన విషయం. నానితో కీర్తి సురేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ కారణంగానే ఈ ఐటమ్ లో చిందేస్తోందా లేక ఫ్యూచర్ లో కూడా ఈ టైప్ స్పెషల్ సాంగ్స్ తో నర్తిస్తుందా అనేది చూడాలి.
కానీ కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయడం ఆమె అభిమానులకు కాస్త మింగుడు పడని విషయమే అని చెప్పాలి.

Continue reading