వంద కోట్లకు చేరువలో ‘మా ఇంటి బంగారం’..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూనే ఉంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ మూవీ గత నెల 18న విడుదలైంది. అయినా ఇప్పటికీ మాగ్జిమం షోస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పటికి ఈ మూవీ 96.5 కోట్లు సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. అంటే మరో 3.5 కోట్లు వస్తే సమంత సోలోగా చేసిన ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టబోతోందని తెలుస్తోంది. ఓ రకంగా సోలో లీడ్ గా సమంత సాధించిన విజయం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. అది కూడా పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ తో. ఓ రకంగా ఆమెకు ఇది గ్రాండ్ ఫినిషింగ్ అని కూడా అంటున్నారు. అయితే “ఇది సమంత కెరీర్‌కు గ్రాండ్ ఫినిషింగ్” అని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఆమె భవిష్యత్ ప్రాజెక్టులపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రాలేదు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా ఆమె కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాతో మరోసారి తన కథ చెప్పే శైలిని నిరూపించారని ప్రేక్షకుల అభిప్రాయం. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం, భావోద్వేగాలను సహజంగా చూపించడం, కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ‘మా ఇంటి బంగారం’లో కేవలం సమంత పాత్ర మాత్రమే కాకుండా ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లేలా రూపొందించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. పాత్రల మధ్య భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, సంఘర్షణలు సినిమాకు మంచి బలంగా నిలిచాయి. అందుకే ప్రేక్షకులు సినిమాతో ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమాకు వస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి లభిస్తున్న ఆదరణను చూస్తే వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునేందుకు చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంది.
‘మా ఇంటి బంగారం’ సమంత కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దర్శకురాలు నందినీ రెడ్డికి కూడా ఇది కెరీర్ బెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బలమైన కథ, ప్రతి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, సమంత అద్భుతమైన నటన ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. బాక్సాఫీస్ ప్రయాణం పూర్తయ్యే నాటికి ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Continue reading
అఖిల్ ‘లెనిన్’పై భారీ అంచనాలు.. ఈసారి హిట్ కొడతాడా?

అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాగా ‘లెనిన్’ నిలుస్తోంది. ‘ఏజెంట్’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్, ఈసారి పూర్తి కొత్త లుక్, కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, కుటుంబ విలువలు, రాజకీయ అంశాలను కలిపి దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని కొన్ని సింబాలిక్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగులు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. కొంతమంది ప్రేక్షకులు కథలో పురాణాల ప్రభావం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం అఖిల్ మేకోవర్. గత సినిమాలతో పోలిస్తే ఈసారి అతను పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడు. యాక్షన్‌తో పాటు నటనకు కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. విడుదలకు ముందు జరిగిన కార్యక్రమంలో నాగార్జున కూడా అఖిల్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న యువ కథానాయికల్లో ఆమె ఒకరు. ‘లెనిన్’లో ఆమె భారతి అనే పాత్రలో కనిపించనుంది. సరదాగా ఉండే, అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడే యువతిగా ఆమె పాత్ర ఉంటుందని స్వయంగా భాగ్యశ్రీ తెలిపింది. కాబట్టి ఈ సినిమాలో ఆమె పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
భాగ్యశ్రీకి ఈ సినిమా కూడా విజయం అందించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే అది పూర్తిగా కథ, ఆమె పాత్ర నిడివి, ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అవుతుందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో మాత్రం అఖిల్-భాగ్యశ్రీ జోడీ ఆకట్టుకుంది.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇది ఇద్దరి ఫ్యాన్స్ లో కూడా మంచి ఉత్సాహాన్ని పెంచుతుంది. విడుదలకు ముందు సినిమాకు అదనపు హైప్ రావడానికి ఇది కూడా ఒక కారణంగా మారింది.
ప్రమోషన్స్ ను బట్టి చూస్తే ‘లెనిన్’లో యాక్షన్, భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, బలమైన పాత్రలు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అయితే సినిమా నిజంగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ మాత్రం అఖిల్‌కు ఇది బలమైన కమ్‌బ్యాక్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. మొత్తానికి ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌కే కాకుండా భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌కు కూడా కీలకమైన సినిమా. కథ ప్రేక్షకులను మెప్పిస్తే ఇద్దరికీ ఇది పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉంది.

Continue reading
పెద్ది ఓటిటిలోకి వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్దికి ఓటిటి డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ప్యాన్ ఇండియా హీరోగా చెప్పినా కేవలం తెలుగులో మాత్రం మెప్పించగలిగిందీ మూవీ. సౌత్ లోని ఇతర భాషల్లో జనం పట్టించుకోలేదు. అలాగే నార్త్ అస్సలు చూడలేదు. తెలుగులో మాత్రమే హిట్ అని చెప్పగలిగారు. అయితే రామ్ చరణ్ నటన విషయంలో మాత్రం యూనానిమస్ అంతా ఒకటే చెప్పారు. అద్భుతంగా నటించాడు అని. అలాగే జాన్వీ కపూర్ ఎపిసోడ్ విషయంలో బుచ్చిబాబు రైటింగ్ వరస్ట్ గా ఉందనే టాక్ కూడా వచ్చింది. దీంతో పాటు పాత్రలను ఇంకాస్త బలంగా రాసి ఉంటే బావుండేది అని కూడా అన్నారు. కేవలం రామ్ చరణ్ పైనే ఫోకస్ చేయడం.. అందులో మూడు ఆటలతో అంటే జనం విసిగిపోయారు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే చాలాకాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో ఇచ్చిన సంగీతానికి వంద మార్కులు పడ్డాయి. అతని వర్క్ సింప్లీ సూపర్బ్ అని చెప్పారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది.
ఈ నెల 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది పెద్ది. మామూలుగా థియేటర్స్ లో ఆడకపోయిన మూవీస్ కు ఓటిటిలో మంచి అప్లాజ్ వస్తుందనే దశ కూడా దాటేశారు. ఇప్పుడు థియేటర్ రిజల్ట్స్ ఓటిటిలో కూడా రిపీట్ అవుతున్నాయి. ఆ కారణంతో పెద్దికి కేవలం తెలుగులో మాత్రమే పాజిటివ్ టాక్ వస్తుంది లేక ఇతర భాషల్లో కూడా ఆడుతుందా అనేది చూడాల్సిందే.

Continue reading
ఎదురుచూపులు మాని ఎదుర్కోవడం నేర్చుకో..?

అక్కడెవరో నిద్రపోయారని నానా యాగీ చేస్తున్నావ్
నువ్వేదో మెలకువలో ఉన్నట్టు..
ఎవడో వచ్చి ప్రశ్నించడం లేదని నానా ప్రశ్నలూ గుప్పిస్తున్నావు
వినడాన్ని మించి ఇంకేం చేయగలవు.. ?
ఎవడో వస్తాడని .. ఎన్నాళ్లైనా కానీ
ఎదురుచూస్తూనే ఉంటావు
నీ సమస్యపై ఎవడో ప్రశ్నిస్తే కానీ
పౌరుషం గుర్తుకురాని గులామ్ గిరీగానివా నువ్వు
హామీలిస్తే చాలు.. హాయిగా ఉంటాననే భ్రమల్లో తేలిపోతావు
అమలు ఎలా అని ఆలోచించవెందుకు
బతుకంటేనే పోరాటం..
అది ఆపేసి
వాడి ప్రశ్నల కోసం
వాడి బాసుల కటాక్షం కోసం కాచుకుంటావెందుకు..?
కళ్లుమూసుకుని ప్రపంచాన్ని చూస్తున్నవాడివి
నీకు కన్నెర్రజేసే హక్కుందంటావా..?
ఆలోచించుకో.. నువ్వేం చేయాలో..
ఆలోచించుకో .. నువ్వేం చేయగలవో..
ఆలోచనలు పంచుకో .. నువ్వేం చేయగలననుకుంటున్నావో ..
గొర్రెలమందకు నేర్పాల్సింది
తలవంచుకు వెళ్లిపోవడం కాదు..
తలఎత్తుకుని ఆలోచించడం
ఆ మందకు చూపాల్సింది
గరికపచ్చ మైదానాలను కాదు
కీకారణ్యం కౄరమృగాలను
ఎందుకంటే గొర్రెలూ తిరగబడతాయ్..
నేడో రేపో ఎల్లుండో..
ఆలస్యమైనా ఫర్వాలేదు..
అదనుచూసి వేట మొదలుపెట్టాలి
అందుకే ఎదురుచూపులు మాని
ఎదుర్కోవడం నేర్చుకో..?

Continue reading
స్వర భాస్వరుడు .. నాగన్న

నాగన్న… ఆ స్వరంలో భాస్వరం ఉంది. కోట్లాది గుండె మంటల పాటై కొత్త బాటకు దివిటీగా మారుతుంది. అవును.. అరుణోదయ నాగన్న గాత్రం విన్న ఎవరికైనా ఇలాంటి భావనే కలుగుతుంది. చాలామంది పాడతారు. కొందరు మాత్రమే హృదయంతో పాడతారు. ఆ హృదయానికి ఓ పంథా ఉంటే.. ఆ పంథా బడుగుల బ్రతుకులను బాగు చేస్తుంది అనే నమ్మకాన్ని నింపుకున్నదైతే.. ఆ గొంతు పెనుమంటల వెలుగై వికసిస్తుంది. అలాంటి పంథాలోనే అమరుల చరిత్రతో మొలకెత్తిన నాగన్న గళం సైతం యాభైయేళ్లుగా ఇదే చేస్తుంది. ఆరున్నరొక్క రాగంలో కూడా అద్భుతమైన గమకాలు పలికిస్తూ.. సందర్భానుసారంగా ఆ గాత్రం చేసే మాయలకు మైమరచిపోతాం.
‘నూతన ప్రజాస్వామ్య’ఉద్యమ నావకు పాటల చుక్కానిగా మారి అర్థశతాబ్ధానికి పైగా అరుణోదయపు కళల్లో కలికితురాయిలా వెలుగిన ఎర్రబావుటా నాగన్న. అన్నల కోసం పాడినా.. అమ్మల కోసం పాడినా.. గొంతుతో ఉర్రూతలూపడం.. నడి కదనరంగంలో కత్తి తిప్పుతున్న యోధునిలా కొత్త ప్రజాస్వామ్యం కోసం ఉరకలెత్తి పాడటమూ తెలిసిన గానయోధుడు నాగన్న. వీటన్నిటికీ మించి నాటి నుంచి నేటి వరకూ ఎంతో నిబద్ధత కలిగిన నిఖార్సైన కమ్యూనిస్ట్. ఈ కారణంగానే నేను ఆ పార్టీ సభ్యుడిని, సానుభూతి పరుడునీ కాకపోయినా నాగన్నకు వీరాభిమానిగా మారాను. ఆయన పాట వింటే తెలియకుండానే మైమరచిపోతాను.
నాలుగు పాటలు పాడి.. నలుగురు చప్పట్లు కొట్టగానే నా అంత కళాకారుడు లేడు అని విర్రవీగే సమాజాన్ని చూస్తోన్న మనకు.. ఐదుదశాబ్ధాలకు పైగా అంతులేని పోరాటాలకు పాటగా నిలిచిన నాగన్న నిబద్ధత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజమైన కమ్యూనిస్ట్ లను అత్యంత తక్కువగా చూస్తోన్న కాలం ఇది. ఈ కాలంలోనే ఆయన మరణించడం.. అత్యంత విషాదకరమైనదే. అయితేనే జీవితాంతం నమ్మిన జెండాను మోసిన ధీశాలి నాగన్నకు లాల్ సలామ్ చెబుతూ జోహార్ నాగన్న.

Continue reading
రావు బహదూర్ మూవీ రివ్యూ

సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ సినిమా మొదటి పోస్టర్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పీరియడ్ డ్రామాకు ఫాంటసీ టచ్ జోడిస్తూ, విజువల్‌గా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ చిత్రం కథ, నటన, టెక్నికల్ విలువలతో ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా వెళ్లి, ఒక డిఫరెంట్ సినిమాను అందించాలనే టీమ్ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

కథ

ఒక రాజసం ఉన్న వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు, అతని వ్యక్తిత్వం వెనుక ఉన్న నిజాలు, అధికారం, అహంకారం, మానవ సంబంధాలు, సమాజం మధ్య జరిగే సంఘర్షణలే ఈ కథకు ప్రధాన బలం. దర్శకుడు కథను నెమ్మదిగా విప్పుతూ ప్రేక్షకుడిని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కథలో ఉన్న మిస్టరీ, భావోద్వేగాలు చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తాయి.

నటీనటుల పనితీరు

సత్యదేవ్ మరోసారి తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. రావు బహదూర్ పాత్రలో అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కళ్లతో చూపించిన భావాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఆచారి పాత్రలో వికాస్ అత్యద్భుతంగా నటించాడు. అతని ఏజ్ కు చాలా ఎక్కువగా చూపించిన పాత్ర అయినా ఆ పాత్రలో తను లీనమైన విధానం మాత్రం సింప్లీ సూపర్బ్. అలాగే దీపా థామస్ కూడా బాగా చేసింది.సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసింది. ప్రతి పాత్ర కథలో భాగంగా అనిపిస్తుంది.

దర్శకత్వం

వెంకటేష్ మహా మరోసారి తన ప్రత్యేకమైన కథనం చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒక ఆర్ట్ పీస్‌లా కనిపిస్తుంది. అయితే దర్శకుడు కమర్షియల్ అంశాల కంటే కథ, పాత్రల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కొన్ని చోట్ల సినిమా నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది.

టెక్నికల్ విభాగం

ఈ సినిమాకు అతిపెద్ద బలం విజువల్స్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లా మార్చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మంచి బలం ఇచ్చింది. ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్, మేకప్ పీరియడ్ ఫీల్‌ను అద్భుతంగా తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా ఉండి ఉంటే రన్‌టైమ్ మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.

ప్లస్ పాయింట్స్

సత్యదేవ్ అద్భుతమైన నటన
వెంకటేష్ మహా ప్రత్యేకమైన కథనం
అద్భుతమైన సినిమాటోగ్రఫీ
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
విజువల్ ప్రెజెంటేషన్

మైనస్ పాయింట్స్

మొదటి భాగంలో నెమ్మదిగా సాగే కథనం
కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం
మాస్ ప్రేక్షకులకు అన్ని చోట్ల కనెక్ట్ కాకపోవచ్చు
కొన్ని సన్నివేశాలు మరింత క్రిస్ప్‌గా ఉండి ఉంటే బాగుండేది

చివరగా

‘రావు బహదూర్’ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇది విజువల్‌గా, భావోద్వేగాల పరంగా ఒక ప్రత్యేక అనుభూతిని అందించే ప్రయత్నం చేసిన సినిమా. సత్యదేవ్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పాత్రగా నిలిచే అవకాశం ఉంది. దర్శకుడు వెంకటేష్ మహా తన ప్రత్యేకమైన స్టైల్‌ను మరోసారి నిరూపించాడు.మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించే ప్రేక్షకులకు సినిమా కొంత నెమ్మదిగా అనిపించవచ్చు. కానీ మంచి కథ, బలమైన నటన, అద్భుతమైన విజువల్స్‌ను ఆస్వాదించే వారికి మాత్రం ‘రావు బహదూర్’ తప్పకుండా నచ్చే సినిమా.

రేటింగ్        : 2.5/5

ఫైనల్ వెర్డిక్ట్:

డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన విజువల్ పీరియడ్ డ్రామా.

 

Continue reading
శ్రీనివాస మంగాపురం వాయిదా వేశారుగా

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న మూవీ శ్రీనివాస మంగాపురం. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఇప్పటి వరకు అయితే పాజిటివ్ బజ్ ఉంది. జయకృష్ణ ఫస్ట్ మూవీ కావడంతో పాటు ఇలాంటి నెపోకిడ్స్ ను ఫస్ట్ టైమ్ పరిచయం చేసిన నిర్మాత ప్రెజెంటర్ గా ఉండటం మరో ప్లస్ పాయింట్ అవుతుంది. అదీ కాక ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోస్ అన్నీ బాగా పేలాయి. దీంతో ఈ మూవీ గ్యారెంటీగా విజయం సాధిస్తుందని చాలామంది అంచనాలు వేస్తున్నారు.
మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో రవీనా టాండన్ కూతురు రషా టండానీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా ఇది ఉండబోతోందని మొదటే చెప్పారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ఏకంగా 1కోటి రూపాయలు ఇచ్చారు అనే ప్రచారం కూడా సినిమాకు ప్లస్ అవుతుందేమో చూడాలి.
ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ మూవీ కూడా ఉండటంతో శ్రీనివాస మంగాపురంను వాయిదా వేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమే అనేలా తాజాగా ఈ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో పాటు కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ అంటే ఇదే నెల 30న ఉండబోతోంది. అదీ కాక అదే రోజు మహేష్ బాబు హీరోగా ఫస్ట్ మూవీ రాజకుమారుడు విడుదలైన రోజు కూడా అదే. దీంతో ఇది కూడా కలిసొస్తుందని భావించారేమో.. ఈ నెల 30 శ్రీనివాస మంగాపురం విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు.

Continue reading
కోలీవుడ్ లో దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్

సౌత్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. తమిళ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా తమ నాలుగో తమిళ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో ధృవ్ విక్రమ్ ఫ్యాన్స్ కు మంచి జోష్ వస్తోందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్న ధృవ్‌కు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ మద్దతు లభించడం విశేషంగా మారింది.
ఈ చిత్రానికి యువ దర్శకుడు గణేష్ కె. బాబు దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా యాక్షన్, ఎమోషన్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతోందని టాక్.
ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్, త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు, షూటింగ్ షెడ్యూల్ వంటి పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఇటీవల తెలుగు సినిమాలతో పాటు తమిళ చిత్రాల నిర్మాణంపైనా మైత్రీ మూవీ మేకర్స్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.ఇప్పటికే తమిళ స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు ధృవ్ విక్రమ్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ద్వారా తమిళ మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది.
ధృవ్ విక్రమ్‌కు కూడా ఈ సినిమా కెరీర్‌లో కీలకంగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. సరైన కథ, బలమైన నిర్మాణ విలువలు, ప్రముఖ బ్యానర్ కలిస్తే యువ హీరోకు ఇది పెద్ద బ్రేక్ ఇవ్వొచ్చనుకోవచ్చు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సినిమా టైటిల్, విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read More

Continue reading
విజయ్ ‘జన నాయగన్’ జూలైలో విడుదల ఉంటుందా?

దళపతి విజయ్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న ‘జన నాయగన్’ సినిమా విడుదలపై గత కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సెన్సార్ సంబంధిత సమస్యల కారణంగా సినిమా మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది. అయితే సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలు, డైలాగ్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉందట. ముఖ్యంగా రాజకీయ నేపథ్యం ఉన్న కొన్ని సన్నివేశాలపై హాట్ డిబేట్స్ జరుగుతున్నాయి. అయితే మూవీ టీమ్ అవసరమైన మార్పులు చేయడానికి అంగీకరించిందని, అనంతరం సెన్సార్ ప్రక్రియ ముందుకు సాగినట్లు సమాచారం.
ఇక విడుదల విషయానికి వస్తే, ప్రస్తుతం సినిమా జూలైలోనే విడుదల చేసే దిశగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. థియేటర్ బుకింగ్స్, డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్ వంటి పనులు కూడా కొనసాగుతున్నాయని సమాచారం. అయితే అధికారిక రిలీజ్ డేట్‌ను చిత్రబృందమే ప్రకటించాల్సి ఉంది.

‘జన నాయగన్’పై భారీ అంచనాలు ఉండటానికి మరో ప్రధాన కారణం ఇది దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడమే. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన ఈ చిత్రం కావడంతో అభిమానులు దీనిని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆయన సిఎమ్ అయ్యాడు.దీంతో జన నాయగన్ కు అన్నీ క్లియరెన్స్ లు వస్తాయని చాలామంది భావించారు. బట్ అలాంటిదేం జరగడం లేదు.అందుకే మూవీ రిలీజ్ డేట్ పై ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతానికైతే సెన్సార్ నుంచి అన్నీ క్లియరెన్స్ లు వచ్చేస్తున్నాయి. కోలీవుడ్ లో సెన్సార్ ప్రాబ్లమ్ క్లియర్ కావడం మాత్రం గ్యారెంటీ అంటున్నారు. కాకపోతే హిందీ సెన్సార్ నుంచి క్లియరెన్స్ లు రావాల్సి ఉంది. ఇక మిగతా భాషల్లో ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం లేదు. అందుకే జన నాయగన్ ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు విడుదల కావడం ఖాయం అని చెబుతున్నారు.

Continue reading
నాని నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడా..?

నేచురల్ స్టార్ ఈ మధ్య తన రేంజ్ మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ముఖ్యంగా మాస్ హీరో అనిపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో సక్సెస్ అయ్యాడా లేదా అనేది పక్కన పెడితే అతని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ద ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఇంతకు ముందు అతనితోనే ఊరమాస్ గెటప్ తో దసరా మూవీ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని గత మార్చిలోనే విడుదల చేస్తాం అని చెప్పారు. బట్ మాట దాటేశారు. కొత్త రిలీజ్ డేట్ గా ఆగస్ట్ 21న అన్నారు. అదీ పోయింది. అసలు ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఏం జరుగుతుందా అని ఆడియన్స్ అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మామూలుగా ఈ మధ్య రిలీజ్ డేట్ లు బాగా వాయిదా పడుతున్న మూవీస్ పై ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు.
అయితే ఈ మూవీ షూటింగ్ విషయంలో సరైన ప్లానింగ్ లేకుండా పోయింది అనేది అందరికీ తెలిసిందే. కేవలం దసరాతో మాత్రం ఆకట్టుకున్న శ్రీకాంత్ ఓదెలకు ప్లానింగ్ పై అవగాహన లేకపోవడమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు. తీసిందే తీస్తూ ఉంటున్నాడట. దీంతో నిర్మాతలకు మండిపోయినా కామ్ గా ఉండిపోతున్నారట. ఒక్కసారి కథ ఫైనల్ అయితే మూవీ చేయడం సులువు అవుతుంది. బట్ అతను అదే పనిగా సెట్స్ లో కూడా కథలో మార్పులు చేస్తున్నాడట. ఈ కారణంగా బాగా ఆలస్యం అవుతోంది అని టాక్. అదీ కాక క్లైమాక్స్ చిత్రీకరణ సరిగా రాలేదట. దీంతో మొత్తం క్లైమాక్స్ ను మళ్లీ షూట్ చేయాలట.అదీ కాక ఓ ఐటమ్ సాంగ్ కూడా బ్యాలన్స్ ఉందట. ఈ కారణంగానే ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు. బట్ ఈ డేట్ కు కూడా రావడం దాదాపు అసాధ్యం అని తేలింది. అన్నీ సెట్ అయితే దసరాకు రావొచ్చు. లేదంటే డిసెంబర్ వరకు ఆగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఏదేమైనా సరైన ప్లానింగ్ కారణంగా ఇప్పటికే నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. అదీ ఇంకా కొనసాగుతూనే ఉండటం మరింత ఇబ్బందిగా మారిందట.

Continue reading