నాని నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడా..?

నేచురల్ స్టార్ ఈ మధ్య తన రేంజ్ మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ముఖ్యంగా మాస్ హీరో అనిపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో సక్సెస్ అయ్యాడా లేదా అనేది పక్కన పెడితే అతని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ద ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఇంతకు ముందు అతనితోనే ఊరమాస్ గెటప్ తో దసరా మూవీ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని గత మార్చిలోనే విడుదల చేస్తాం అని చెప్పారు. బట్ మాట దాటేశారు. కొత్త రిలీజ్ డేట్ గా ఆగస్ట్ 21న అన్నారు. అదీ పోయింది. అసలు ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఏం జరుగుతుందా అని ఆడియన్స్ అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మామూలుగా ఈ మధ్య రిలీజ్ డేట్ లు బాగా వాయిదా పడుతున్న మూవీస్ పై ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు.
అయితే ఈ మూవీ షూటింగ్ విషయంలో సరైన ప్లానింగ్ లేకుండా పోయింది అనేది అందరికీ తెలిసిందే. కేవలం దసరాతో మాత్రం ఆకట్టుకున్న శ్రీకాంత్ ఓదెలకు ప్లానింగ్ పై అవగాహన లేకపోవడమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు. తీసిందే తీస్తూ ఉంటున్నాడట. దీంతో నిర్మాతలకు మండిపోయినా కామ్ గా ఉండిపోతున్నారట. ఒక్కసారి కథ ఫైనల్ అయితే మూవీ చేయడం సులువు అవుతుంది. బట్ అతను అదే పనిగా సెట్స్ లో కూడా కథలో మార్పులు చేస్తున్నాడట. ఈ కారణంగా బాగా ఆలస్యం అవుతోంది అని టాక్. అదీ కాక క్లైమాక్స్ చిత్రీకరణ సరిగా రాలేదట. దీంతో మొత్తం క్లైమాక్స్ ను మళ్లీ షూట్ చేయాలట.అదీ కాక ఓ ఐటమ్ సాంగ్ కూడా బ్యాలన్స్ ఉందట. ఈ కారణంగానే ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు. బట్ ఈ డేట్ కు కూడా రావడం దాదాపు అసాధ్యం అని తేలింది. అన్నీ సెట్ అయితే దసరాకు రావొచ్చు. లేదంటే డిసెంబర్ వరకు ఆగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఏదేమైనా సరైన ప్లానింగ్ కారణంగా ఇప్పటికే నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. అదీ ఇంకా కొనసాగుతూనే ఉండటం మరింత ఇబ్బందిగా మారిందట.

Continue reading
సూర్యకు జోడీగా కయాడు లోహర్

కరుప్పు బ్లాక్ బస్టర్ తో సూర్య దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తర్వాత విశ్వనాథమ్ అండ్ సన్స్ మూవీతో తెలుగు స్ట్రెయిట్ మూవీ ఈ ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. తర్వాత ఓ మళయాల మూవీ చేస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. మరోవైపు తమిళ్ లో కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జై భీమ్ దర్శకుడితో మరో మూవీకి సిద్ధం అయ్యాడు. ఇది సూర్యకు 48వ చిత్రం. జై భీమ్ తో విమర్శకుల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు టిజే జ్ఞానవేల్. తర్వాత అతను రజినీకాంత్ తో చేసిన మూవీ బాక్సాఫీస్ వద్ద పోయింది. బట్ అతను ఎంచుకున్న పాయింట్ మాత్రం చాలా బావుంది.
దర్శకుడు టిజే జ్ఞానవేల్ తో మళ్లీ సూర్య జత కట్టడం మాత్రం చాలా బావుంది. ఇద్దరి కాంబోలో జై భీమ్ లాంటి మూవీనే మళ్లీ ఎక్స్ పెక్ట్ చేయలేం.. బట్ కమర్షియల్ మూవీతో రావడం పక్కా అనేది తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కయాడు లోహర్ ను తీసుకున్నారు. తమిళ్ లో ఆమె చేసిన డ్రాగన్ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఇప్పుడు అన్ని భాషల్లో కూడా చాలా బిజీ అయిపోయింది. అలాంటి బ్యూటీ సూర్యతో అంటే మంచి ఛాయిస్ అనే చెప్పాలి. ఇక హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మితమవుతోన్న ఈ మూవీ ఇవాళే ప్రారంభం అయింది. ఈ యేడాది జూలై లేదా ఆగస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. మరి ఈ మూవీతో జై భీమ్ జోడీ మళ్లీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

Continue reading