ZEE5 Kidsలో ‘శివలోక్ కె కుండక్క మండక్క’..

భారతీయ పౌరాణిక కథలకు సరికొత్త రూపం 

ZEE5 Kids, శివలోక్ కె కుండక్క మండక్క, తెలుగు యానిమేటెడ్ సిరీస్, Kids OTT, Indian Mythology Animation వంటి కీలక అంశాలతో రూపొందిన ఈ సరికొత్త ఒరిజినల్ యానిమేటెడ్ సిరీస్ పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ZEE5 తన KidZ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ ‘శివలోక్ కె కుండక్క మండక్క (SKM)’ అనే కొత్త పౌరాణిక యానిమేటెడ్ సిరీస్‌ను తీసుకొస్తోంది. ఈ సిరీస్ జూలై 17 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్ ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రచించిన బెస్ట్ సెల్లింగ్ పిల్లల పుస్తకం ‘The Very, Extremely, Most Naughty Asura Tales for Kids’ ఆధారంగా రూపొందింది. భారతీయ పౌరాణిక ప్రపంచాన్ని, ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో, హాస్యం, అడ్వెంచర్, భావోద్వేగాలతో కలిపి చిన్నారులకు కొత్త అనుభూతిని అందించనుంది.

కుండక్క, మండక్కల సరదా ప్రయాణమే కథలో హైలైట్

ఈ కథ మొత్తం కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర పిల్లల చుట్టూ తిరుగుతుంది. వారి అల్లరి, ధైర్యం, స్నేహం, ఆసక్తి వారిని ఎన్నో అద్భుతమైన సాహసాల్లోకి తీసుకెళ్తుంది. రామాయణం, మహాభారతం వంటి అందరికీ తెలిసిన కథలకు మాత్రమే పరిమితం కాకుండా, భారతీయ పౌరాణిక ప్రపంచంలోని కొత్త పాత్రలు, తెలియని లోకాలు, మాయాజాలంతో నిండిన కొత్త కథలను ఈ సిరీస్ పరిచయం చేస్తుంది.

పిల్లలకు వినోదంతో పాటు విలువలు

యాక్షన్, కామెడీ, అద్భుతమైన యానిమేషన్‌తో రూపొందిన ఈ సిరీస్ కేవలం వినోదానికే పరిమితం కాదు. హీరో అంటే శక్తివంతమైన వ్యక్తి కాదు, సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అనే సందేశాన్ని అందిస్తుంది. అలాగే అల్లరి పిల్లల్లో కూడా దయ, ధైర్యం, బాధ్యత, స్నేహం వంటి మంచి విలువలు ఉంటాయని ఈ కథ అందంగా చెబుతుంది.

భారతీయ పౌరాణిక ప్రపంచానికి కొత్త యూనివర్స్

‘శివలోక్ కె కుండక్క మండక్క’ ఒక సిరీస్ మాత్రమే కాదు. భవిష్యత్తులో మరిన్ని పాత్రలు, కొత్త కథలు, కొత్త అడ్వెంచర్లతో విస్తరించే భారీ యానిమేటెడ్ యూనివర్స్‌కు ఇది నాంది పలుకుతోంది. భారతీయ సంస్కృతి, పౌరాణిక సంపదను ఆధునిక తరానికి దగ్గర చేయాలనే లక్ష్యంతో ZEE5 ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించింది.

ZEE5 బిజినెస్ హెడ్ చందన్ ఖండేల్వాల్ ఏమన్నారు?

ఈ సందర్భంగా KidZ – ZEE5 బిజినెస్ హెడ్ చందన్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. తరతరాలుగా ప్రేక్షకులు ప్రేమించిన భారతీయ కథలను కొత్త తరానికి ఆధునిక రూపంలో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆనంద్ నీలకంఠన్ వంటి ప్రముఖ రచయితతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. హాస్యం, అడ్వెంచర్, విలువలు కలగలిపిన ఈ సిరీస్ కుటుంబం మొత్తం కలిసి చూసేలా రూపొందించామని చెప్పారు.

రచయిత ఆనంద్ నీలకంఠన్ స్పందన

రచయిత ఆనంద్ నీలకంఠన్ మాట్లాడుతూ.. తన పుస్తకంలోని పాత్రలు యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారతీయ పౌరాణిక కథలను చిన్నారులకు మరింత ఆసక్తికరంగా పరిచయం చేసే ప్రయత్నంలో ZEE5 తీసుకున్న ముందడుగు అభినందనీయమని చెప్పారు. కుండక్క, మండక్కల అల్లరి సాహసాలు పిల్లలను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

జూలై 17 నుంచి ZEE5లో స్ట్రీమింగ్

‘శివలోక్ కె కుండక్క మండక్క’ సిరీస్ జూలై 17 నుంచి ZEE5 KidZలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది. భారతీయ పౌరాణిక కథలను వినోదాత్మకంగా, ఆధునిక యానిమేషన్‌తో చూడాలనుకునే పిల్లలు, కుటుంబ ప్రేక్షకులకు ఈ సిరీస్ మంచి ఎంపికగా నిలవనుంది.

Continue reading
జగపతిబాబు, శ్రీకాంత్ లకు ఇంకా అవకాశాలున్నాయా

తెలుగులో ఒకప్పుడు టైర్ 1 హీరోలు, టైర్ 2 హీరోలు, టైర్ 3 హీరోలు అంటూ ఉండేవారు. వారందరికీ సరైన మార్కెట్ కూడా ఉండేది. ఆయా హీరోలకు మంచి రిలీజ్ లు దొరికేవి. కంటెంట్ ఉంటే టికెట్స్ కూడా భారీగా తెగేవి. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. ఇలాంటి హీరోలకు మంచి అవకాశాలు రావడం లేదు. ఆ మాటకొస్తే సినిమాలు చేస్తున్నారు కానీ కొనేవాళ్లు కూడా బాగా తగ్గిపోయారు. అందుకే ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు ఇతర పాత్రల వైపు మళ్లిపోయారు. విలన్ గా అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఈ టైమ్ లో అంతా హ్యాపీ అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా మళ్లీ వీళ్లకు హీరో దోమ కుట్టినట్టు ఉంది. హీరోలుగా మళ్లీ కొత్త సినిమాలతో రాబోతున్నారు. అది కూడా ఇద్దరూ ఒకే రోజు విడుదలతో వస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ లయ. ఇది కాస్త ఆశ్చర్యమే అయినా అసలు వీళ్లకు మళ్లీ సత్తా చాటే అవకాశాలున్నాయా అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ నెల 17న తెలుస్తుంది.
జగపతి బాబు హీరోగా నటించిన మూవీ వదలా. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన సినిమా ఇది. వయసు మళ్లిన ఓ వ్యక్తికి జీవితంలో ఓ యువతి తారసపడుతుంది. అతన్నే ప్రేమిస్తున్నా అంటూ అతని కుటుంబానికి దూరం చేస్తుంది. అయితే ఈ యువతి పాత్రతో కొత్తమ్మాయి పరిచయం అవుతోంది. తనది నెగెటివ్ రోల్ అంటూ ప్రమోషన్స్ లో చెబుతోంది. ట్రైలర్ అయితే బావుంది. ఈ తరహా పాత్రలకు జగపతిబాబు పాత ఇమేజ్ కు సరిపోయేలా ఉంది. అయితే ఒకే పాయింట్ తో అంత సేపు ఆడియన్స్ చూడగలరా అనేది పెద్ద పాయింట్. అదీ కాక అసలు ఈ జెనరేషన్ ఆడియన్స్ కు ఈ మూవీ కనెక్ట్ అవుతుందా అనేది మరో పెద్ద విషయం. నిజానికి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు రావడం లేదు. ఈ టైమ్ లో ఒకప్పటి ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ ఉన్న జగ్గూ భాయ్ కి మళ్లీ ఆ ఆడియన్స్ ను తీసుకు వచ్చే కెపాసిటీ ఉందా అంటే లేదు అనే చెప్పాల్సి వస్తుంది.
ఇక శ్రీకాంత్ పరిస్థితి కూడా ఇంటు మించు ఇలాగే ఉంది. హీరోగా అతనూ ఎప్పుడో ఫేడవుట్ అయిపోయాడు. జగపతిబాబు లాగానే ఇతర పాత్రలకు ఎప్పుడో మారిపోయాడు. ఇలాంటి టైమ్ లో అతను మిస్టర్ మిడిల్ క్లాస్ అనే మూవీతో రాబోతున్నాడు. రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మదేవుడు పాత్రలో కనిపించబోతున్నాడు ఈ మూవీలో. విశేషంగా ఈ ట్రైలర్ కూడా బావుంది. ఓ మిడిల్ క్లాస్ జనానికి కనెక్ట్ అయ్యే కథగా కనిపిస్తోంది. అతనికి ఉన్న సమస్యలను దేవుడే తీర్చేలా ఉండేలా ఉన్నా అతను అతను దేవుడు అనే విషయంలో అతనికి తెలియదు. ఈ క్రమంలో వచ్చే వినోదాత్మకమైన కథనం కూడా ఉండేలా ఉంది. ఇదీ సేమ్. ఇప్పుడు శ్రీకాంత్ కు ఆడియన్స్ ను తీసుకువచ్చే సత్తా ఉందా అంటే లేదు అనే చెప్పాలి. మిస్టర్ మిడిల్ క్లాస్ టైటిల్ బావుంది. ఈ టైటిల్ కు తగ్గ కథ కూడా సెట్ అయినట్టుగా ఉంది. మరి ఏ మేరకు జనం మెచ్చుతారు అనేది కూడా పెద్ద ప్రశ్నే.
ఏదేమైనా ఈ ఇద్దరు హీరోలకు బాగా సెట్ అయ్యే కథలే ఇవి. కాకపోతే ఆడియన్స్ కు ఈ మూవీస్ కనెక్ట్ అవుతాయా.. అదీ ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులకు. ఒకవేళ రివ్యూస్ అవీ బావుంటే అప్పుడు థియేటర్స్ కు వస్తారేమో కానీ ఈ లోగా వీకెండ్ పూర్తవుతుంది. తర్వాత వీరి పరిస్థితి ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ గత తరం హీరోలిద్దరూ ఒకే రోజు మళ్లీ హీరోలుగా వస్తుండటం మాత్రం కాస్త మంచి పరిణామమే. ఎటొచ్చీ ఈ చిత్రాలు కూడా ఆకట్టుకోవాలి. అప్పుడే మరిన్ని కథలు వస్తాయి. లేదంటే వీటితో ఆగిపోవాల్సిందే ఇంక.

Continue reading
వంద కోట్లకు చేరువలో ‘మా ఇంటి బంగారం’..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూనే ఉంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ మూవీ గత నెల 18న విడుదలైంది. అయినా ఇప్పటికీ మాగ్జిమం షోస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పటికి ఈ మూవీ 96.5 కోట్లు సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. అంటే మరో 3.5 కోట్లు వస్తే సమంత సోలోగా చేసిన ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టబోతోందని తెలుస్తోంది. ఓ రకంగా సోలో లీడ్ గా సమంత సాధించిన విజయం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. అది కూడా పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ తో. ఓ రకంగా ఆమెకు ఇది గ్రాండ్ ఫినిషింగ్ అని కూడా అంటున్నారు. అయితే “ఇది సమంత కెరీర్‌కు గ్రాండ్ ఫినిషింగ్” అని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఆమె భవిష్యత్ ప్రాజెక్టులపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రాలేదు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా ఆమె కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాతో మరోసారి తన కథ చెప్పే శైలిని నిరూపించారని ప్రేక్షకుల అభిప్రాయం. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం, భావోద్వేగాలను సహజంగా చూపించడం, కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ‘మా ఇంటి బంగారం’లో కేవలం సమంత పాత్ర మాత్రమే కాకుండా ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లేలా రూపొందించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. పాత్రల మధ్య భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, సంఘర్షణలు సినిమాకు మంచి బలంగా నిలిచాయి. అందుకే ప్రేక్షకులు సినిమాతో ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమాకు వస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి లభిస్తున్న ఆదరణను చూస్తే వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునేందుకు చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంది.
‘మా ఇంటి బంగారం’ సమంత కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దర్శకురాలు నందినీ రెడ్డికి కూడా ఇది కెరీర్ బెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బలమైన కథ, ప్రతి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, సమంత అద్భుతమైన నటన ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. బాక్సాఫీస్ ప్రయాణం పూర్తయ్యే నాటికి ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Continue reading
పెద్ది ఓటిటిలోకి వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్దికి ఓటిటి డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ప్యాన్ ఇండియా హీరోగా చెప్పినా కేవలం తెలుగులో మాత్రం మెప్పించగలిగిందీ మూవీ. సౌత్ లోని ఇతర భాషల్లో జనం పట్టించుకోలేదు. అలాగే నార్త్ అస్సలు చూడలేదు. తెలుగులో మాత్రమే హిట్ అని చెప్పగలిగారు. అయితే రామ్ చరణ్ నటన విషయంలో మాత్రం యూనానిమస్ అంతా ఒకటే చెప్పారు. అద్భుతంగా నటించాడు అని. అలాగే జాన్వీ కపూర్ ఎపిసోడ్ విషయంలో బుచ్చిబాబు రైటింగ్ వరస్ట్ గా ఉందనే టాక్ కూడా వచ్చింది. దీంతో పాటు పాత్రలను ఇంకాస్త బలంగా రాసి ఉంటే బావుండేది అని కూడా అన్నారు. కేవలం రామ్ చరణ్ పైనే ఫోకస్ చేయడం.. అందులో మూడు ఆటలతో అంటే జనం విసిగిపోయారు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే చాలాకాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో ఇచ్చిన సంగీతానికి వంద మార్కులు పడ్డాయి. అతని వర్క్ సింప్లీ సూపర్బ్ అని చెప్పారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది.
ఈ నెల 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది పెద్ది. మామూలుగా థియేటర్స్ లో ఆడకపోయిన మూవీస్ కు ఓటిటిలో మంచి అప్లాజ్ వస్తుందనే దశ కూడా దాటేశారు. ఇప్పుడు థియేటర్ రిజల్ట్స్ ఓటిటిలో కూడా రిపీట్ అవుతున్నాయి. ఆ కారణంతో పెద్దికి కేవలం తెలుగులో మాత్రమే పాజిటివ్ టాక్ వస్తుంది లేక ఇతర భాషల్లో కూడా ఆడుతుందా అనేది చూడాల్సిందే.

Continue reading