పుష్ప రూట్ లోనే రామ్ చరణ్.. ఇది సుకుమార్ ప్లానేనా..?

పెద్దితో రామ్ చరణ్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి పెద్ది తర్వాతేంటీ అనే ప్రశ్నకు ఎప్పుడో సమాధానం చెప్పాడు. సుకుమార్ తో మూవీ చేయబోతున్నాడు చరణ్. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీతోనే ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని చాలామంది ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. దాంతో పాటు చరణ్ కు చెవుడు ఉన్నట్టుగా ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు సుకుమార్. 2018లో వచ్చిన రంగస్థలం తర్వాత మళ్లీ ఈ కాంబోలో మూవీ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. దీనికి తోడు ఈ ఇద్దరూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్స్. అంటే రాబోయే కథ కూడా అలాగే ఉంటుంది అని భావించొచ్చు.
ఇక ఈ కథ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇది మళ్లీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఇది పూర్తిగా సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని పక్కా సమాచారం. దీంతో పాటు దీన్ని కేవలం ఒకే పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా రూపొందించబోతున్నారట. రెండు భాగాలు అంటే పుష్ప, పుష్ప 2 లాగా చాలా టైమ్ తీసుకోకుండా.. ధురంధర్ లాగా రెండు భాగాలను వెంట వెంటనే విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఈ మూవీ అయితే సుకుమార్ స్టైల్ కు భిన్నంగా కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందనేది మాత్రం నిజమే అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోబోతున్నాడు. అన్నీ సెట్ అయితే దసరా తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందని టాక్.

Continue reading
అల్లు అర్జున్ తో మరోసారి రష్మిక మందన్నా

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారింది. పుష్ప, పుష్ప 2తో ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. పుష్ప 2 కలెక్షన్స్ మాత్రం ఊహించని రేంజ్ లో వచ్చాయి. దీంతో త్రివిక్రమ్ తో చేయాల్సిన మూవీని పక్కన పెట్టాడు. తమిళ్ స్టార్ డైరెక్టర అట్లీతో జట్టు కట్టాడు. ఈ మూవీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ఉండబోతోంది అని అనౌన్స్ మెంట్ తోనే చెప్పారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. రాకా టైటిల్. ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన బన్నీ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకోణ్ ను తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం తను మళ్లీ ప్రగ్నెంట్ తో ఉంది. అలాగే ఈ మూవీలో ఇంకా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతున్నారు అనే వార్తలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. అదే టైమ్ ల రష్మిక మందన్నా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది అనే న్యూస్ కూడా వస్తున్నాయి. జాన్వీ, మృణాల్ మేటర్ ఏంటో కానీ.. లేటెస్ట్ గా రష్మిక మందన్నా కన్ఫార్మ్ అయింది. ఈచిత్రంలో రష్మిక మందన్నా పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. తనేమీ రెగ్యులర్ హీరోయిన్ కాదు. బట్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ఈ ఇద్దరికీ సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను ముంబైలోనే చేయబోతున్నారు. మరో రెండు వారాల్లో రష్మిక మందన్నా రాకా సెట్స్ లో అడుగు పెట్టబోతోంది. ఆల్రెడీ పుష్ప మూవీతో ఈ జంట దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. అలాంటి జంట మళ్లీ కనిపించబోతున్నారు అంటే ఓ రకమైన ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో ఉంది అనేది వాస్తవం. మరి కేవలం రష్మిక మాత్రమేనా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ల పాత్రలు కూడా ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా పెళ్లి తర్వాత కూడా రష్మిక మందన్నా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు.

Continue reading