ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. రవితేజను చూసి నేర్చుకోండి

రవితేజను చూసి నేర్చుకోండి

వీళ్లందరి పేర్లు వాడాము అని కాదు కానీ.. ఇవాళా రేపు కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు అనేది అందరికీ అర్థమైన విషయం. చాలా చిన్న సినిమాలు పెద్ద మ్యాజిక్ లు చేస్తున్నాయి. అదే చాలా పెద్ద సినిమాలు అన్నవి మినిమం కూడా మ్యాజిక్ చేయడం లేదు. అది ఈ మధ్య విడుదలువుతున్న సినిమాలు చూస్తే అర్థమవుతోంది. తెలుగు సినిమాకు ఓ కీర్తి ఉంది. అది సాధించిన గొప్ప ప్రగతి ఉంది. అద్భుతమైన కథలందించిన నేపథ్యం ఉంది. అవన్నీ దాటుకుని ఇప్పుడు మన స్టార్స్ అంతా కేవలం ప్యాన్ ఇండియా మోజులో పడిపోవడం అంత గొప్పగా అనిపించడం లేదు.

చిన్న కథలతో పెద్ద విజయాలు

ఈ మధ్య కాలంలో చూస్తే ఓ మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఓ రకంగా దండయాత్ర చేస్తున్నాయి. ఈ లిస్ట్ లో యడ్ అయిన మూవీ ఇరుముడి. ఇరుముడి మిగతా హిట్ మూవీస్ కంటే చాలా భిన్నమైనది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథనం అద్భుతంగా వర్కవుట్ అయింది. ఆ అద్భుతం వల్లే కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా 80కోట్ల వసూళ్లు సాధించింది.
చాలాకాలం తర్వాత థియేటర్స్ లో ఆడియన్స్ హారతులు పడుతున్నారు. జేజేలు కొడుతున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ కు ఫిదా అయిపోతున్నారు. ఇంత గొప్ప సినిమా ఈ మధ్య కాలంలో చూడలేదు అని చాలామంది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మరి ఈ మూవీలో అంత హైలెట్స్ ఏమున్నాయి అంటే అవేమీ లేవు. ప్యాన్ ఇండియా దరిద్రం అస్సలు లేదు.

ఇరుముడి నేర్పిన పాఠాలు

ఓ చిన్న ఊరు, ఆ ఊరిలోని త్రినాథ్ అనే ఓ ఆటో డ్రైవర్. అతనికి కూతురే ప్రపంచం. బట్ చుట్టూ ఉన్న అనేక సమస్యలు.. ఒక్కోదాన్ని త్రినాథ్ దాటేస్తుంటాడు. కానీ అనుకోని సమస్య ఆ ఊరితో పాటు చుట్టు పక్కల ఊరిలో ఉన్న కొంతమంది లేడీ టీచర్ తో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ ఇబ్బందులు ఏంటీ అనేది తెలియక ఇబ్బంది పడుతుంటాడు త్రినాథ్. ఈ టైమ్ లో అనూహ్యంగా అతి పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని చుట్టూ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ఆడియన్స్ కన్నీళ్లు ఆగడం లేదు. అది ఈ సినిమాలో ఉన్న హైలెట్.
ఇరుముడి అయితే ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనేది అందరికీ తెలిసింది. పెద్ద విషయం ఏంటంటే.. ఈ మూవీలో అనేక లోపాలు ఉన్నాయి. బట్ మెయిన్ కంటెంట్ లో ఉన్న బలం వల్ల ఆ లోపాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే మనమూ వాటి గురించి మాట్లాడనక్కర్లేదేమో.

ప్యాన్ ఇండియా మోజులో మన స్టార్స్

అయితే ఇలాంటి కంటెంట్స్ పై మన స్టార్ హీరోలు కూడా ఫోకస్ పెట్టాలి. బలమైన కథలు, కథనాలు ఉంటే రికార్డ్ లు అవే వస్తాయి. ఇవి మర్చిపోతున్నారు మన హీరోలు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పటి వరకూ సరైన కథను సెలెక్ట్ చేసుకోలేదు. బాహుబలి ఇమేజ్ తో మాగ్జిమం విజయాలు వచ్చాయి అంతే తప్ప అతను ఖచ్చితంగా బలమైన కథలను మాత్రం ఇప్పటి వరకూ ఎంచుకోలేదు అనేది వాస్తవం.
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య, గేమ్ ఛేంజర్ వంటి ఫ్లాపులు చూశాడు. పెద్దిని విజయం అని చెబుతున్నారు కానీ అందులో బోలెడు అంటే బోలెడు మైనస్ లు ఉన్నాయి. ఇది ఓ గ్రామీణ కథ. దీన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో హైలెట్ చేయాలని చూశారు. కానీ అది అవలేదు. ఆ కారణంగా నార్త్ లో వాళ్లు మినిమం దేకలేదు ఈ చిత్రాన్ని.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన దేవర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆపై చేసిన వార్ 2 పోయింది. రాబోయే మూవీ కోసం ఇప్పటికే రెండేళ్ల టైమ్ తీసుకున్నాడు. మరి ఇంకెంత ఆగాలో తెలియదు. బట్ ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్ లో భారీతనం ఉంది తప్ప బలమైన కథ అని ఇప్పటికైతే చెప్పలేం.
ఇందులో కొంత వరకు ఓకే అనిపించుకున్నాడు అల్లు అర్జున్. అతను చిత్తూరులోని ఓ చిన్న ఊరి నుంచి మొదలు పెట్టిన కథ పుష్ప. అనూహ్యంగా ఇది ప్యాన్ ఇండియా కలర్ గా మారింది. ఆ మేరకు ఓకే అనుకోవచ్చు అల్లు అర్జున్. బట్ పుష్ప 2లో ఉన్న లోపాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇక మహేష్ బాబు ఇప్పటి వరకు రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ వైపు చూడలేదు. అయినా విజయాలు వచ్చాయి కాబట్టి ఓకే. రాబోయే వారణాసితో ఎలాంటి విజయం అందుకుంటాడు అనేది చూడాల్సిందే.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాత్రమే కథ. ఎంచుకున్న కథ ఏదైనా అందులో ఓ నావల్టీ ఉండాలి. మెజారిటీ ఆడియన్స్ ను మెప్పు పొందాలి. కథ పాతదే అయితే కథనంతో మాయ చేయాలి. అప్పుడు రూరల్ మాత్రమే కాదు.. రిచెస్ట్ పీపుల్ కథ అయినా కనెక్ట్ అవుతుంది. అందుకు విశ్వనాథ్ అండ్ సన్స్ ను ఉదాహరణగా చూడొచ్చు. ఏదేమైనా మనవాళ్లు ప్యాన్ ఇండియా మోజులో పడిపోయి మనవైన కథలకు దూరం అవుతున్నారు అనేది మాత్రం వాస్తవం.

Continue reading
పుష్ప రూట్ లోనే రామ్ చరణ్.. ఇది సుకుమార్ ప్లానేనా..?

పెద్దితో రామ్ చరణ్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి పెద్ది తర్వాతేంటీ అనే ప్రశ్నకు ఎప్పుడో సమాధానం చెప్పాడు. సుకుమార్ తో మూవీ చేయబోతున్నాడు చరణ్. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీతోనే ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని చాలామంది ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. దాంతో పాటు చరణ్ కు చెవుడు ఉన్నట్టుగా ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు సుకుమార్. 2018లో వచ్చిన రంగస్థలం తర్వాత మళ్లీ ఈ కాంబోలో మూవీ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. దీనికి తోడు ఈ ఇద్దరూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్స్. అంటే రాబోయే కథ కూడా అలాగే ఉంటుంది అని భావించొచ్చు.
ఇక ఈ కథ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇది మళ్లీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఇది పూర్తిగా సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని పక్కా సమాచారం. దీంతో పాటు దీన్ని కేవలం ఒకే పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా రూపొందించబోతున్నారట. రెండు భాగాలు అంటే పుష్ప, పుష్ప 2 లాగా చాలా టైమ్ తీసుకోకుండా.. ధురంధర్ లాగా రెండు భాగాలను వెంట వెంటనే విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఈ మూవీ అయితే సుకుమార్ స్టైల్ కు భిన్నంగా కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందనేది మాత్రం నిజమే అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోబోతున్నాడు. అన్నీ సెట్ అయితే దసరా తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందని టాక్.

Continue reading
అల్లు అర్జున్ తో మరోసారి రష్మిక మందన్నా

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మారింది. పుష్ప, పుష్ప 2తో ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. పుష్ప 2 కలెక్షన్స్ మాత్రం ఊహించని రేంజ్ లో వచ్చాయి. దీంతో త్రివిక్రమ్ తో చేయాల్సిన మూవీని పక్కన పెట్టాడు. తమిళ్ స్టార్ డైరెక్టర అట్లీతో జట్టు కట్టాడు. ఈ మూవీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ఉండబోతోంది అని అనౌన్స్ మెంట్ తోనే చెప్పారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. రాకా టైటిల్. ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన బన్నీ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకోణ్ ను తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం తను మళ్లీ ప్రగ్నెంట్ తో ఉంది. అలాగే ఈ మూవీలో ఇంకా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతున్నారు అనే వార్తలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. అదే టైమ్ ల రష్మిక మందన్నా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది అనే న్యూస్ కూడా వస్తున్నాయి. జాన్వీ, మృణాల్ మేటర్ ఏంటో కానీ.. లేటెస్ట్ గా రష్మిక మందన్నా కన్ఫార్మ్ అయింది. ఈచిత్రంలో రష్మిక మందన్నా పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. తనేమీ రెగ్యులర్ హీరోయిన్ కాదు. బట్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ఈ ఇద్దరికీ సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ను ముంబైలోనే చేయబోతున్నారు. మరో రెండు వారాల్లో రష్మిక మందన్నా రాకా సెట్స్ లో అడుగు పెట్టబోతోంది. ఆల్రెడీ పుష్ప మూవీతో ఈ జంట దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. అలాంటి జంట మళ్లీ కనిపించబోతున్నారు అంటే ఓ రకమైన ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో ఉంది అనేది వాస్తవం. మరి కేవలం రష్మిక మాత్రమేనా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ ల పాత్రలు కూడా ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా పెళ్లి తర్వాత కూడా రష్మిక మందన్నా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు.

Continue reading