సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన రోమాంచికం మూవీ రివ్యూ

రివ్యూ : రోమాంచికం

ఆర్టిస్ట్స్ : సుమంత్ ప్రభాస్, అనంతిక, ఉపేంద్ర లిమాయే, నరేంద్ర రవి, మహి, వెంకటేష్ కాకుమాను, సాయి సోహన్ తదితరులు
ఎడిటర్ : వేణు గోపాల్ రెడ్డి
సంగీతం : వాసుకి వైభవ్
సినిమాటోగ్రఫీ : పవన్ పప్పుల
నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగా
దర్శకత్వం : గోపాల్ రెడ్డి

రోమాంచికం.. ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్మించిన మూవీ కావడమే. సందీప్ రెడ్డి ఫస్ట్ టైమ్ తన బ్యానర్ లో బయటి మూవీ చేయడం. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన ఈ మూవీ బజ్ కు
సందీపే అనేది వాస్తవం. ప్రమోషన్స్ మరీ భారీగా చేయకుండా ఇవాళ(03.09.2026)విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :
అన్వేష్(సుమంత్ ప్రభాస్) ఓ ఆవారా కుర్రాడు. చదువు తర్వాత ఫ్రెండ్స్ తో చిల్ అవుతుంటాడు. అలాగే తను సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయాలని రోమాంచికం అనే పేరుతో ఓ యాప్ రెడీ చేస్తాడు. దీని ద్వారా యూత్ అంతా ఒకరికి తెలియకుండా పరిచయం అవుతుంటారు. తర్వాత వారికి ఐడియాస్ నచ్చితే ప్రేమలో పడటమో లేక మరోదైనా చేస్తుంటారు అనేది అతని కాన్సెప్ట్.ఆ యాప్ లోనే పరిచయం అయిన చెన్నై అమ్మాయి మైథిలీ(అనంతిక). మెల్లగా ఇద్దరూ మాట కలుపుకుంటారు. తర్వాత ప్రేమలో పడతారు. మైథిలీ బర్త్ డే అని చెన్నై వెళతాడు అన్వేష్. ఇద్దరూ కలుద్దాం అనుకుంటారు. టైమ్ కూడా ఫిక్స్ అవుతుంది. సడెన్ గా మైథిలీ.. అన్వేష్ ని బ్లాక్ చేస్తుంది. అసలేం జరిగిందో తెలియక అన్వేష్ పిచ్చివాడవుతుంటాడు. ఫ్రెండ్స్ తో గాయ్ గాయ్ గా మాట్లాడ్డం.. తిరగడం చేస్తుంటాడు.
కొంత కాలం తర్వాత సడెన్ గా మైథిలీ తను అతనికి సారీ చెబుతూ.. తను హైదరాబాద్ వస్తున్నా అని చెబుతుంది. వస్తుంది కూడా. ఇద్దరూ కలిసి ఓ ఫ్రెండ్ ఫ్లాట్ తీసుకుంటారు. ఈలోగా అన్వేష్ ఫ్రెండ్ కోసం బయటకు వెళ్లి వస్తాడు. కట్ చేస్తే మైథిలీ మళ్లీ కనిపించదు. మళ్లీ బ్లాక్ చేస్తుంది. అప్పటికే మైథిలీ చాలా సెన్సిటివ్ అని తనకు సూ సైడ్ ఆలోచనలు వస్తుంటాయి అని చెబుతుంది. అక్కడి నుంచి అన్వేష్ లైఫ్ చాలా గందరగోళం అవుతుంటుంది. అసలు మైథిలికి ఏం జరిగింది అని రోజంతా నానా తంటాలు పడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది. మైథిలీ అలా ఎందుకు చేస్తుంది. అసలు ఇద్దరూ కలుస్తారా.. అనేది సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది :
రోమాంచికం.. ఇది ఓ రెగ్యులర్ మూవీ కాదు. కథలో డెప్త్ ఉండదు. కంటెంట్ లో కంటిన్యూటీ ఉండదు. సంఘర్షణలూ ఏమీ ఉండవు. దీంతో ఇదేం మూవీ అనుకుంటారేమో. అలా ఏం కాదు. ఇందులో బలమైన కథ లేదు. కానీ కథనంతో కట్టి పడేస్తారు. ముఖ్యంగా హీరో చుట్టూ ఉన్న పాత్రలు మాత్రం హైలెట్ గా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇది ఓ క్రేజీ క్రేజీగా సాగే సినిమా. ఫుల్ ఫన్ రైడ్ లా ఉంటుంది. సినిమా అంతా ఆడియన్స్ ను నవ్వించడమే టార్గెట్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా సార్లు నవ్విస్తారు కూడా. అందుకే ఇది రెగ్యులర్ మూవీగా కాదు.. జస్ట్ ఓ ఫన్ రైడ్ లా కనిపిస్తుంది.
సుమంత్ ప్రభాస్ పేరుకు హీరో. కానీ మన తెలుగు సినిమాల్లో హీరోలు వారి ఫ్రెండ్స్ ను ఎలా ట్రీట్ చేస్తుంటాం కదా.బట్ ఇందులో అందుకు భిన్నంగా ఉంటుంది. హీరోతో పాత్రతో సమానంగా ఫ్రెండ్స్ పాత్రలు ఉంటాయి. వారంతా హీరోను ఓ రేంజ్ లో ఆడుకుంటారు. అసలు స్నేహితులు అంటే వీళ్లు కదా అనిపిస్తారు. అంతే కానీ హీరో కాబట్టి అతని పాత్రను హైలెట్ చేయడం ఫ్రెండ్స్ అందరినీ బకరాలు చేయడం అస్సలు కనిపిందు ఈ మూవీలో. ఆ ఫ్రెండ్స్ లో నరేంద్ర రవి పాత్ర మాత్రం అద్దిరిపోతుంది. కొన్నిసార్లు అతి అనిపించినా అతని క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది.
మొత్తం ఐదుగురు స్నేహితులు. ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. మిగతా ముగ్గురూ స్టార్టప్ యాప్ డెవలప్ చేస్తున్నాం అనే భ్రమలో లైఫ్ ను ఈజీగా తీసుకుంటారు. ఇక సుమంత్ ప్రభాస్.. అనంతికతో ప్రేమలో పడిన తర్వాత కూడా మిగతా స్నేహితులు రెగ్యులర్ గానే బిహేవ్ చేస్తుంటారు. ఇది ఓ రకంగా తెలుగు సినిమాకే కొత్తదనం అని చెప్పాలి. ఇక్కడ సీన్స్ కాస్త డల్ అవుతున్నాయి అనిపించిన వెంటనే అదిరిపోయే ఫన్నీ సీన్ వస్తుంటుంది. ఇదో రకమైన రైటింగ్ అనిపిస్తుంది. ఎలా చూసినా ఇది జెన్ జికి, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ అని బలంగా చెప్పొచ్చు.

నెగెటివ్ పాయింట్స్

కేవలం కామెడీ గ్యాంగ్ పై మాత్రమే ఫోకస్ చేశారు. యాప్ మేటర్ మొదటి సీన్ కే పరిమితం అయింది. చాలా చోట్ల స్లోగా సాగుతుంది. చాలా లాజిక్స్ ను పక్కన పెట్టారు. ఇవి మైనస్ లుగా కనిపిస్తాయి. అలాగే ఇది మిడిల్ ఏజ్ తో పాటు ఆపై వయసున్న ఆడియన్స్ కు కనెక్ట్ కావడం దాదాపు ఇంపాజిబుల్.
నటన పరంగా చూస్తే.. సుమంత్ ప్రభాస్ బాగా చేశాడు. అమాయకత్వం, బలుపు, తెలియని తనం అన్ని మిక్స్ చేసిన పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. అనంతిక క్యూట్ గా ఉంది. నటనా బావుంది. ఫ్రెండ్స్ పాత్రల్లో నరేంద్ర రవి ఇరగ్గొట్టాడు. తన టైమింగ్, స్లాంగ్ లో నేచురాలిటీ ఉన్నాయి. ఉపేంద్ర లిమాయే పోలీస్ పాత్రలో బాగా నవ్వించాడు. ఫ్రెండ్స్ పాత్రల్లో వెంకటేష్ కాకుమాను, మణి ఎరిగల, సాయి సోహన్ అందరూ అదరగొట్టారు. ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు.

టెక్నికల్ గా :
వాసుకి వైభవ్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలన్నీ చాలా బావున్నాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బావుంది. లిమిటెడ్ లొకేషన్స్ లో పవన పప్పుల సినిమాటోగ్రఫీ చాలా బ్యూటీఫుల్ గా క్యాప్చర్ చేశాడు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. డైలాగ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి.
దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి రాసుకున్న కథను పక్కాగా తెరకెక్కించాడు. కొన్ని సీన్స్ లో నాన్ స్టాప్ గా నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ లాజిక్స్ అన్నీ పక్కన పెట్టాడు.

ఫైనల్ గా : రోమాంచికం – బాగా నవ్వించిన ప్రయత్నం
రేటింగ్ : 2.75/5
K.Y.R

Continue reading
రవితేజ ఇరుముడి మూవీతో 200 కోట్ల క్లబ్ లో చేరాడు

రవితేజ 200 కోట్ల క్లబ్ లో

మాస్ మహరాజ్ రవితేజ(Ravi Teja) హీరోగా నటించిన ఇరుముడి మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ క్లబ్ లోకి ఎంటర్ అవడం రవితేజకు ఫస్ట్ టైమ్. ఈ మూవీ ఇంకా భారీ వసూళ్లు సాధిస్తోంది. బేబీ నక్షత్ర(Baby Nakshatra) నటన అత్యద్భుతం అయితే రవితేజ ఫస్ట్ ఈ స్థాయి నటనతో అందరి హృదయాలు కొల్లగొట్టాడు. ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar), సాయికుమార్(Sai Kumar) ల నటన చాలా బావుంది. సినిమాలో చాలా మైనస్ లు ఉన్నా.. వాటన్నిటినీ రవితేజ, బేబీ నక్షత్ర నటనతో అధిగమించి మరీ ఈ మూవీ అంత పెద్ద విజయం సాధించింది.

రవితేజ ఇమేజ్ కి భిన్నంగా ఇరుముడి

రవితేజ సినిమాలన్నీ కాస్త ఫంకీగా ఉంటాయి. అతని పాత్రలు మరీ రొటీన్ అయిపోయాయి అనే తరుణంలో వచ్చింది ఇరుముడి. అద్భుతమైన నటనతో చూసినవాళ్లందరి చేతా కన్నీళ్లు పెట్టించాడు. ముఖ్యంగా బేబీ నక్షత్ర మళయాలీ అమ్మాయి అయినా ఎక్కడా తడబాటు లేకుండా తనే తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. కావేరీ పాత్రలో ప్రియా భవానీ అదరగొట్టింది. గురుస్వామిగా సాయి కుమార్ పాత్ర ఇచ్చిన ట్విస్ట్ లు అదిరిపోయాయి.

యూనానిమస్ బ్లాక్ బస్టర్ గా ఇరుముడి

ఈ మధ్య కాలంలో యూనానిమస్ గా మూవీకి బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది అంటే అది కేవలం ఇరుముడికే. జనం బళ్లు కట్టుకుని వచ్చి మరీ చూస్తున్నారు. చాలా చోట్ల ఇంకా హౌస్ ఫుల్(House Full) బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి. చాలా పెద్ద స్టార్స్ నటించిన, భారీ బడ్జెట్ మూవీస్ కు కూడా ఇన్ని రోజుల తర్వాత ఆ బోర్డ్ కనిపించలేదు. దర్శకుడు శివ నిర్వాణ(Shiva Nirvana) సాధించిన విజయం మాత్రం అఖండమే అని చెప్పాలి.

టికెట్ రేట్లు పెంచకున్నా భారీ వసూళ్లు

ఇరుముడి మూవీకి ఉన్న మరో అడ్వాంటేజ్ సినిమా టికెట్ రేట్లు పెంచకపోవడం. ఒకవేళ టికెట్ రేట్లు పెంచి ఉంటే వసూళ్లు ఓ రేంజ్ లో ఉండేవి. ఓ రకంగా తెలుగు మూవీస్ లో ఇప్పటికీ హయ్యొస్ట్ కలెక్షన్స్ లో మన శంకర్ వరప్రసాద్ గారు, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఆ స్థాయిలో నిలవబోయే మూవీగా ఇరుముడి స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా రవితేజ తన జోన్ నుంచి పూర్తిగా తప్పుకుని చేసిన ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరేమో. రవితేజ ఇరుముడి 200 కోట్లు సాధించినందుకు ఎంటైర్ టీమ్ కు కంగ్రాట్యులేషన్స్.

Continue reading
రష్మిక మందన్నా ‘మైసా’మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్

రష్మిక మందన్నా రణబాలి కూడా లైన్ లో

రష్మిక మందన్నా అంటే ఇప్పుడు టాప్ హీరోయిన్. తెలుగుతో పాటు బాలీవుడ్ లో అదరగొడుతోంది. ప్యాన్ ఇండియా రేంజ్ మూవీస్ తో బాగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తోంది. అయితే పెళ్లికి ముందే స్టార్ట్ అయిన మూవీ రణబాలి. రణబాలి సెట్స్ లో ఉన్న టైమ్ లోనే విజయ్ దేవరకొండతో ఏడు అడుగులు నడిచింది రష్మిక మందన్నా. అఫ్ కోర్స్ వీరి పెళ్లి గురించి మూడేళ్లుగా జనం మాట్లాడుకుంటున్నారు.
రణబాలి మూవీ ఈ సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. బట్ రష్మిక మందన్నా హిప్ కు ఇంజూరీ అవడంతో ఆలస్యం అయింది. కొత్త రిలీజ్ డేట్ గా అక్టోబర్ 16ని ప్రకటించింది మూవీ టీమ్. ఈ మూవీలోనే విజయ్ దేవరకొండ స్వాతంత్ర్య సమరయోధుడుగా కనిపించబోతున్నాడు అని ముందు నుంచే చెప్పారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది.

రష్మిక మందన్నా ప్యాన్ ఇండియా మూవీ మైసా

రష్మిక మందన్నా రణబాలి తర్వాత చేస్తోన్న మూవీ మైసా. మైసా ప్యాన్ ఇండియా మూవీ. ఇది భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ మాత్రం అద్దిరిపోయింది అనే చెప్పాలి. మైసాలో రష్మిక మందన్నా ఓ గిరిజన యోధురాలి పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ టైమ్ లోనే విడుదల చేసిన వీడియోతో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది కరెక్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ అని అప్పుడే అంతా చెప్పుకున్నారు.

మైసా దర్శకుడు ఎవరు

రష్మిక మందన్నా మైసా మూవీకి రవీంద్ర పుల్లెపు దర్శకుడు. ఇతనికి ఇదే తొలి సినిమా. గతంలో రవీంద్ర.. హను రాఘవపూడి దగ్గర పనిచేశాడు. ఆ అనుభవంతోనే ఈ మూవీపై విపరీతమైన రీసెర్చ్ చేసి మరీ కథ రాసుకున్నాడట. ఏదేమైనా గాయం తర్వాత చాలా వేగంగా కోలుకున్న రష్మిక మందన్నా వెంటనే మళ్లీ సెట్స్ లో జాయిన్ కాబోతుండటం మాత్రం తన డెడికేషన్ కు నిదర్శనం. మరి రణబాలి, మైసా మూవీస్ తో రష్మిక మందన్నా ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.

Continue reading
రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా నిలబడతాడా

రవితేజ వారసత్వం మాధవ్ నిలబెడతాడా

మాస్ మహరాజ్ రవితేజ(Ravi Teja) తమ్ముడు రఘు రాజు తనయుడు మాధవ్ భూపతి(Madhav Bhupathi Raju) రాజు హీరోగా నిలబడతాడా..? తాజాగా విడుదలైన అతను హీరోగా నటించిన మారెమ్మ ట్రైలర్ చూస్తుంటే అతను ఇంకా చాలా చాలా షైన్ కావాల్సి ఉంది అనిపిస్తోంది. ట్రైలర్ లోనే అతని లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ మైనస్ గా కనిపిస్తోంది అనేది వాస్తవం. ఈ మూవీ కోసం అతను చాలా టైమ్ తీసుకున్నాడు. చాలామంది నిర్మాతలు కూడా కనిపిస్తున్నారు. కంటెంట్ తెలంగాణ నేపథ్యంగా ఉంది. తెలంగాణలో మారెమ్మ తల్లి గురించి తెలియని వారు ఉండరు. అందుకే ఆ నేపథ్యం తీసుకున్నాడేమో అనుకోవచ్చా లేక నిజంగానే ఈ కథలో ఏదైనా నావల్టీ ఉందా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.

మారెమ్మ ట్రైలర్ ఎలా ఉంది

ఇక మారెమ్మ ట్రైలర్(Maremma Trailer) పరంగా చూస్తే ఇది తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో సాగే కథ అని అర్థమౌతుంది. మారెమ్మ కోసం మొక్కుకున్న ఓ ఎద్దు చుట్టూ సాగే కథగా ఉంది. ఆ ఎద్దుకంటే ముందు ఊరంతా ఇబ్బందులు పడుతుంది. పశువులు చనిపోతుంటాయి. ఆ కారణంగా ఎద్దు పుట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి హీరో సాకుతాడు. ఓ రకంగా చూస్తే అతనో పశువుల కాపరి. అతనికి చదువుకున్న అమ్మాయితో ప్రేమ ఉంటుంది. అదే ఊరిలో ఉన్న దొరల కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యలు ఏంటీ..? వాటిని ఈ కుర్రాడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథగా ఉండబోతోందని తెలుస్తోంది.

ట్రైలర్ లో మేటర్ లేనట్టుగా ఉంది

మారెమ్మ ట్రైలర్ లో పెద్దగా విషయం ఉన్నట్టు కనిపించడం లేదు. ఆకట్టుకునే కంటెంట్ లాగా కూడా లేదు. హీరో క్యారెక్టరైజేషన్ లో కూడా పెద్దగా బలం లేనట్టుగా చూపించారు. హీరోయిన్ పాత్రను కూడా మాగ్జిమం లైట్ తీసుకున్నారు అనేలా ఉంది. మిగతా పాత్రలు కూడా పెద్ద గొప్పగా కనిపించడం లేదు. కొన్ని పాత్రలు మరీ రొటీన్ గా ఉండబోతున్నాయి అనిపించాయి.

ఇరుముడి సెంటిమెంట్ మారెమ్మతో రిపీట్ అవుతుందా..

రవితేజ రీసెంట్ గా దేవుడి కంటెంట్ తో ఉన్న ఇరుముడితో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మారెమ్మతో మాధవ్ కూడా విజయం అందుకుంటాడు అని కొంతమంది సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతున్నారు. మరి చూద్దాం.. విజయం అందుకుంటాడా లేదా అనేది.
మారెమ్మ ఈ నెల 10న విడుదల కాబోతోంది. మంచాల నాగరాజు(Manchala Nagaraju) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు(Mayur Reddy Bandaru) నిర్మించాడు. ప్రశాంత్ ఆర్ విహారి(Prashanth R. Vihari) సంగీతం అందించాడు.

Continue reading
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ‘వేట’ మొదలు

సందీప్ సరోజ్ కొత్త సినిమా గ్రాండ్ లాంచ్

సినిమా టైటిల్‌కి కథతో కనెక్షన్ ఉంటే ఆ సినిమాపై మొదటి నుంచే ఒక ఆసక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తిని క్రియేట్ చేస్తున్న సినిమా ‘వేట’. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ సరోజ్, సాత్విక జంపా జంటగా నటిస్తున్న ఈ సినిమా సోమవారం ఆగస్ట్ 31న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

ఎస్‌ఆర్‌డీ స్టూడియోస్, ఈటీవీ విన్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాతలు. కొత్త దర్శకుడు అశోక్ కోటిపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

గోదావరి నేల నుంచి ఓ కొత్త కథ..

‘వేట’ టైటిల్‌ను ప్రకటించిన విధానం చూస్తే సినిమా ఏ తరహాలో ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది. గోదావరి ప్రాంతపు నేపథ్యంతో, గ్రామీణ జీవితం, అక్కడి మనుషులు, వారి భావోద్వేగాలను టచ్ చేసే కథగా ఈ సినిమా ఉండబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

ఇప్పటివరకు విడుదలైన సమాచారం ప్రకారం ఇది కేవలం పల్లెటూరి కథగా మాత్రమే కాకుండా సహజత్వంతో పాటు కమర్షియల్ అంశాలను కూడా కలిపిన సినిమాగా రూపొందనుంది. నిర్మాత ఫణి అడపాక కూడా సినిమా సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో సాగుతుందని చెప్పారు.

అంటే గోదావరి బ్యాక్‌డ్రాప్‌ను కేవలం అందమైన లొకేషన్ల కోసం కాకుండా కథలో ఒక ముఖ్యమైన భాగంగా ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. అయితే కథలో అసలు ‘వేట’ ఏంటి? అనే విషయాన్ని మాత్రం మేకర్స్ ప్రస్తుతానికి సస్పెన్స్‌లోనే ఉంచారు.

సందీప్ సరోజ్‌కి మరో డిఫరెంట్ సినిమా

‘కమిటీ కుర్రోళ్లు’తో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ సరోజ్(Sandeep Saroj)ఇప్పుడు ‘వేట’తో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమాలో తన పాత్ర, కథకు తగ్గట్టుగా కొత్తగా కనిపించబోతున్నట్టు చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, ఎమోషన్, యాక్షన్ వంటి అంశాలతో సినిమా సాగనుండటంతో సందీప్ సరోజ్‌కు ఇది మరో మంచి అవకాశం కావచ్చు.

సందీప్ సరోజ్ స్వయంగా ‘వేట’ టైటిల్ కథకు సరిగ్గా సరిపోతుందని చెప్పడం కూడా ఆసక్తిని పెంచుతోంది. గతంలో ఇదే పేరుతో చిరంజీవి నటించిన సినిమా ఉండటంతో టైటిల్‌పై సహజంగానే చర్చ మొదలైంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను కేవలం ఆ పాత సినిమా పేరుతో వచ్చిన గుర్తింపు కోసం తీసుకోలేదని, తమ కథకు ఇది యాప్ట్‌గా ఉంటుందని సందీప్ సరోజ్ స్పష్టం చేశారు.

దర్శకుడిగా అశోక్ కోటిపల్లి మొదటి అడుగు

‘వేట’తో అశోక్ కోటిపల్లి(Ashok Kotipalli) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మొదటి సినిమానే ఒక ప్రత్యేకమైన గ్రామీణ కథతో చేయడం ఆసక్తికరంగా మారింది.

కథ చెప్పిన వెంటనే సీనియర్ నటుడు, దర్శకుడు కేఎస్ రవి కుమార్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అశోక్ కోటిపల్లి తెలిపారు. తొలి సినిమాతోనే మంచి టీమ్‌తో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.

కొత్త దర్శకుడికి కథే అసలు బలం. ‘వేట’ విషయంలో కూడా కథను నమ్మి నిర్మాతలు ముందుకు రావడం, అనుభవజ్ఞులైన నటీనటులు భాగం కావడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

కేఎస్ రవి కుమార్ కీలక పాత్ర

‘వేట’లో సీనియర్ దర్శకుడు, నటుడు కేఎస్ రవి కుమార్ (K.S. Ravi Kumar) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.సినిమా కథ తనకు నచ్చిందని, ఇందులో తాను పోషిస్తున్న పాత్ర కూడా తనకు బాగా నచ్చిందని ఆయన ఈవెంట్‌లో తెలిపారు. గ్రామీణ నేపథ్యంలోని పెద్దమనిషి తరహా పాత్రలో కనిపించనున్నట్టు చెప్పారు. జెన్‌జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని, మూవీ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.

ఇలాంటి పాత్రలో కేఎస్ రవి కుమార్ కనిపించడం సినిమాకు అదనపు బలం కావచ్చు. అయితే ఆయన పాత్ర స్వభావం, కథలో ఎంత కీలకంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం సినిమా విడుదలకు దగ్గర్లోనే మరింతగా తెలుసుకునే అవకాశం ఉంది.

ఘనంగా ‘వేట’ పూజా కార్యక్రమం

‘వేట’ ప్రారంభోత్సవానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొనగా, కేఎస్ రవి కుమార్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు.

నాగబాబు స్క్రిప్ట్ అందించగా.. సాయి రాజేష్(Sai Rajesh), ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య(V.N.Aditya), ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మెహర్ రమేష్(Meher Ramesh), యదు వంశీ, అనుదీప్ దేవ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇలా పలువురు ప్రముఖుల సమక్షంలో ‘వేట’ లాంఛనంగా ప్రారంభం కావడం సినిమాపై ఇండస్ట్రీలో కూడా ఆసక్తి ఉందనే విషయాన్ని చూపిస్తోంది.

సాత్విక జంపాకు కీలక అవకాశం

సాత్విక జంపా(Satwika Jampa) ‘వేట’లో సందీప్ సరోజ్‌కు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో మంచి ప్రారంభంగా మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. కానీ కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటుందనే ఆసక్తి మాత్రం ఏర్పడుతోంది. సినిమా కథ ముందుకు వెళ్లేకొద్దీ సాత్విక పాత్రపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత అదే రూట్.. కానీ ఈసారి మరింత కమర్షియల్‌గా?

సందీప్ సరోజ్‌కు ‘కమిటీ కుర్రోళ్లు’ మంచి గుర్తింపును తెచ్చిన సినిమా. ఇప్పుడు ‘వేట’ కూడా గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకోవడం యాదృచ్ఛికమే అయినా.. రెండు సినిమాలను ఒకేలా చూడాల్సిన అవసరం లేదు.

‘వేట’ విషయంలో నిర్మాతలు చెబుతున్న మాటలను బట్టి చూస్తే గ్రామీణ వాతావరణం ఉన్నప్పటికీ సినిమా పూర్తిగా నేచురల్ డ్రామాగా మాత్రమే ఉండదు. కమర్షియల్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఉండనుంది. అదే ఈ సినిమాను ‘కమిటీ కుర్రోళ్లు’ నుంచి వేరుగా నిలబెట్టే అంశం కావచ్చు.

‘వేట’లో అసలు వేట ఏంటి?

ఇదే ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న ప్రధాన ప్రశ్న.

టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. గోదావరి బ్యాక్‌డ్రాప్, గ్రామీణ వాతావరణం, ప్రేమ, భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్.. ఇవన్నీ కలిసిన కథగా ‘వేట’ను మేకర్స్ పరిచయం చేస్తున్నారు. కానీ టైటిల్ వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

అందుకే ప్రస్తుతానికి కథపై ఎలాంటి ఊహాగానాలు చేయడం కంటే మేకర్స్ నుంచి వచ్చే ఫస్ట్ లుక్, టీజర్, క్యారెక్టర్ పోస్టర్లు, షూటింగ్ అప్‌డేట్స్ కోసం వేచి చూడటం మంచిది.

టెక్నికల్ టీమ్ కూడా ఆసక్తికరంగానే ఉంది

‘వేట’(Veta Movie)కు అశోక్ కోటిపల్లి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎ. విజయ్ ఫైట్స్, అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైన్, రాఘవేంద్ర తిరుణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సినిమాకు సరైన విజువల్ టోన్ తీసుకురావడంలో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా గోదావరి ప్రాంతపు నేచురల్ లొకేషన్స్‌ను కథకు తగ్గట్టుగా చూపించగలిగితే ‘వేట’కు ప్రత్యేకమైన విజువల్ ఐడెంటిటీ వచ్చే అవకాశం ఉంది.

Continue reading
బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగుతారా

బాలకృష్ణ, నాగార్జున బరిలో దిగుతారా

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) దూకుడు బాగా పెంచాడు. వరుసగా హిట్ మూవీస్ చేస్తున్నాడు. అఖండ 2తో డబుల్ హ్యాట్రిక్ మిస్ అయింది. అయినా రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు గోపీచంద్ మలినేని(Gopichand Malineni) డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ ను ఈ నెల 6న అనౌన్స్ చేస్తాం అని ప్రకటించారు. మధ్యలో బాలయ్య(Balayya) కాస్త గాయపడటంతో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. లేదంటే ఈ మూవీ ఈ దసరాకే రావాల్సి ఉంది. యాక్సిడెంట్ కారణంగా ఆయన ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు.

నాగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కాస్త స్లో అయ్యాడు. అయినా తన వందో సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు. రీసెంట్ గా తన బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రా. కార్తీక్(Ra. Karthik) డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. నాగార్జున 100వ సినిమాను ఓ మైల్ స్టోన్ గా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గ్లింప్స్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డిసెంబర్ 24న నాగార్జున 100వ సినిమా విడుదల చేస్తాం అని చెప్పారు. ఇక్కడే బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు మూవీ టీమ్ కూడా ఓ డైలమాలో పడిపోయారు.

బాలయ్య కూడా అదే డేట్ కేనా

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ కూడా డిసెంబర్ 24నే విడుదల చేస్తారు అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే డేట్ లో నాగార్జున వస్తున్నాడు అంటే పోటీ తప్పదు అనిపించేలానే ఉంది. లేదంటే నందమూరి బాలకృష్ణ కొంత ముందుగా విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని వినిపిస్తోంది. అంటే డిసెంబర్ సెకండ్ వీక్ లో బాలకృష్ణ మూవీ విడుదలవుతుందని చెబుతున్నారు.

బాలయ్య, నాగ్ పోటీ తప్పదా

బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ ఒకేసారి వస్తే మాత్రం పోటీ ఓ రేంజ్ లో ఉంటుందనుకోవచ్చు. పైగా ఇద్దరి మధ్య వ్యక్తిగతమైన వైరం కూడా ఉంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. సో.. ఇద్దరూ డిసెంబర్ 24నే వస్తే అభిమానులకు మాత్రం ఓ పెద్ద పని పడబోతోంది అనుకోవచ్చు.

 

Continue reading
కాల భైరవ, కావ్య కళ్యాణ్ రామ్ ఎంగేజ్మెంట్ ఫిక్స్

కాల భైరవ, కావ్య కళ్యాణ్ రామ్  ల పెళ్లి

కాల భైరవ(Kaala Bhairava), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyanram))ఇద్దరూ జంట కాబోతున్నారు. ఈ ఇద్దరికీ మధ్య ఉన్న రిలేషన్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిని వారు ఖండించలేదు.. అవును అని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఈ ఇద్దరి ప్రైవేట్ వ్వవహారం. అందుకే ఇద్దరూ వస్తోన్న వార్తలను లైట్ తీసుకున్నారు. ఈ ఇద్దరు పెళ్లికి ఇరువైపుల పెద్దలు అంగీకరించారు. తాజాగా లగ్న పత్రిక రాసుకునే టైమ్ లో వీరు ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు.

కావ్య కళ్యాణ్ రామ్ సినీ కెరీర్

కావ్య కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితం గురించి చెబితే తను చైల్డ్ ఆర్టిస్ట్ గా 11 సినిమాలు చేసింది. తన పిల్లి కళ్లు కాబట్టి అంతా నార్త్ అమ్మాయి అనుకున్నారు. తను పుట్టింది తెలంగాణలోని కొత్తగూడెంలో. యస్ తను పక్కా తెలంగాణ అమ్మాయి. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగింది. తొలి సినిమా ప్రేమంటే ఇదేరా. తర్వాత గంగోత్రి(Gangothri Movie) మూవీతో బాగా ఫేమ్ అయింది. తర్వాత టాగోర్, అడవి రాముడు, బన్నీ, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి విజయవంతమైన చిత్రాల్లో బాగా ఆకట్టుకుంది.
మసూద(Masooda Movie) మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది. బలగం(Balagam Movie) మూవీతో బాగా పాపులర్ అయింది. బలగం పెద్ద విజయం సాధించడంతో తను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు.ప్రస్తుతం వాట్సప్ నరేష్ అనే మూవీలో హీరోయిన్ గా చేస్తోంది.

కాల భైరవ నేపథ్యం

కాల భైరవ విషయానికి వస్తే అతని తండ్రి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(M.M. Keeravani). అలాగే టాప్ డైరెక్టర్ రాజమౌళికి(SS Raja Mouli) వరసకి కొడుకు అవుతాడు. రాజన్న మూవీలో పాటతో తన కెరీర్ మొదలు పెట్టాడు గాయకుడుగా. అప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నాడు. మొదట కీరవాణికి మాత్రమే పాడేవాడు. తర్వాత ఇతర సంగీత దర్శకులతో కూడా పనిచేయడం మొదలు పెట్టాడు. మత్తు వదలరా మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారాడు. సో.. ఓ వైపు సింగర్ గానూ, మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ గానూ కెరీర్ సాగిస్తున్న కాల భైరవ, కావ్య ఇద్దరికీ ఎక్కడ సెట్ అయిందో కానీ కొన్నాళ్లుగా లవ్ లో ఉన్నారు. తాజాగా వీరి పెళ్లి విషయం అఫీషియల్ గా చెప్పేశారు.

Continue reading
రవితేజ ఇరుముడి ముందు ఇవన్నీ నిలబడతాయా..?

రవితేజదే ఈ వారం కూడా

మాస్ మహరాజ్ రవితేజ చాలాకాలం తర్వాత ఓ బ్లాక్ బస్టర్ చూశాడు. అతని కెరీర్ లోనే చాలా పెద్ద విజయం ఇది. ఇరుముడి మూవీ యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ డిక్లేర్ అయింది. ఇప్పటికే 150 కోట్లు వసూళ్లు వచ్చాయి. అది 200 కోట్ల వరకు వెళుతుందని చాలామంది అనుకుంటున్నారు. అలాగే రెండో వారంలో కూడా ఈ మూవీ దూకుడు తగ్గలేదు. మూడో వారంలో రాబోతోన్న మూవీస్ అయినా రవితేజ మూవీకి బ్రేకులు వేస్తాయా అనేది చూస్తే..

సుమంత్ ప్రభాస్, అనంతిక మ్యాజిక్ చేస్తారా

సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన మూవీ రోమాంచకం. సెప్టెంబర్ 3న విడుదల కాబోతోందీ మూవీ. సందీప్ రెడ్డి వంగా నిర్మించాడు. ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. ఇదో రొమాంటిక్ మూవీ అని ముందు నుంచీ చెప్పారు. మరి ఈ మూవీతో సందీప్ రెడ్డి విజయం అందుకుంటాడా అనేది చూడాలి.
కుమార్ కసరం, స్వేత లక్ష్మణ్ జంటగా నటించిన మూవీ ‘సహ’. ఈ మూవీ చాలాకాలంగా చిత్రీకరణ చేసుకుంది. నిషాంత్ దోతి దర్శకత్వం చేసిన ఈ మూవీ కూడా సెప్టెంబర్ 3న విడుదల కాబోతోంది. ఇప్పటికైతే పెద్దగా అంచనాలేం లేవు. రిలీజ్ తర్వాత రివ్యూస్ ను బట్టి ఆడియన్స్ వస్తారేమో చూడాలి.

దుల్మర్ సల్మాన్ తెలుగులో సత్తా చాటుతాడా

దుల్మర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఐమ్ గేమ్’. ఇదో యాక్షన్ ఎంటర్టైనర్. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా అని ట్రైలర్ తోనే అర్థమైంది. నిజానికి ఇది ఆగస్ట్ 21నే విడుదల కావాల్సి ఉంది. బట్ అనుకోని కారణాలతో వాయిదా వేశారు. మరి ఈ డబ్బింగ్ మూవీపై అంచనాలు కూడా లేవు. కేవలం దుల్కర్ మూవీ కాబట్టి కాస్త జనాలు చూసే అవకాశం ఉండొచ్చు.
నివిన్ పాలీ, మమితా బైజు జంటగా నటించిన మూవీ బెత్లెమేమ్ కుటుంబ కథ అనే మళయాల మూవీ కూడా డబ్బింగ్ అయి సెప్టెంబర్ 4న విడుదల కాబోతోంది. ఇది మళయాలంలో ఆగస్ట్ 21న విడుదలైంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 200 వసూళ్లు సాధించింది. ఇంకా సత్తా చాటుతోందీ మూవీ. అందుకే తెలుగులో డబ్ చేశారు. నిజానికి ఇది విశ్వనాథ్ అండ్ సన్స్ కథకు దగ్గరగా ఉండే మూవీ. మరి తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. మొత్తంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మరికొన్ని డబ్బింగ్, పేరులేని మరికొన్ని చిత్రాలు విడుదలవుతున్నాయి.

రవితేజ దూకుడు పెరుగుతూనే ఉంది

మరి ఈ మూవీలో ఇరుముడి ప్రభంజనంను దాటుకుని నిలిచే మూవీస్ ఏమై ఉంటాయా అనేది చూడాలి. బట్ ఇరుముడికి జనం మాత్రం జేజేలు కొడుతున్నారు. ఆ కారణంగా కొత్తగా వస్తోన్న మూవీస్ పై జనం పెద్దగా పట్టించుకోవడం కష్టమే అంటున్నారు. సో.. ఈ వారం కూడా అదే రిపీట్ అయితే మాస్ రాజా పంట గట్టిగా పండినట్టే.

Continue reading
వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2నుంచి అవుట్

టాలీవుడ్ 2నుంచి వెంకటేష్ అవుట్

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47′ (AK47).వెంకీకి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. నారా రోహిత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ రావాలని అభిమానులు చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వీరి నిరీక్షణ ఫలించింది. అయితే ఈ మూవీ అక్టోబర్ 2న విడుదలవుతుందని గతంలోనే ప్రకటించారు. బట్ ఈ డేట్ లో మార్పు వచ్చింది. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసింది మూవీ టీమ్. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9కి వాయిదా వేశారు. దీంతో పాటు అక్టోబర్ లో విడుదల కాబోతోన్న మూవీస్ చూస్తే రిలీజ్ డేట్స్ ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 2న తెల్ల కాయితం

అక్టోబర్ 2న తెల్ల కాయితం విడుదల కాబోతోంది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న మూవీ ఇది. దీనిపై మంచి అంచనాలున్నాయి. కొత్త దర్శకుడే అయినా టైటిల్ నుంచి పబ్లిక్ లో హైలెట్ కావడం కూడా మూవీకి పెద్ద ప్లస్ అయింది. చాలా వేగంగా చిత్రీకరణ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అప్పుడే ఫిక్స్ కావడం చూసి సినిమా వర్గాల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ 15న రజినీకాంత్

ఇక దసరా బరిలో ఉన్న మూవీస్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అంతా ఊహించినట్టుగానే రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్ 2 ను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నారు. ఈ రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ చేయలేదు. బట్ ఈ రిలీజ్ డేట్ మాగ్జిమం ఖాయం అయిందని చాలామంది చెబుతున్నారు.

అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ

అక్టోబర్ 16న మోస్ట్ అవెయిటెడ్ మూవీ రణబాలి కూడా విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న మూవీ ఇది. మామూలుగా అయితే ఇది సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. రష్మిక మందన్నాకు గాయం కారణంగా ఒక నెల వాయిదా వేశారు. ఇది అక్టోబర్ 16న విడుదలవుతుందని రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది టీమ్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై విజయ్ దేవరకొండ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ధనుష్ కూడా అక్టోబర్ 16నే

అక్టోబర్ 16న విడుదల కాబోతోన్న తమిళ్ మూవీ ఓమ్. ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. మమ్మూట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ కూడా తెలుగులో బాగా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ అక్టోబర్ భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు, డబ్బింగ్ మూవీస్ తో టాలీవుడ్ లో మంచి కాంపిటీషన్ ఉండబోతోంది. మరి ఈ పోటీలో ఎవరు బలంగా నెగ్గుతారో అనేది చూడాలి.

 

Continue reading
బాలకృష్ణ, వెంకటేష్, నాగ చైతన్య వంటి స్టార్స్ తో మూవీకు రెడీ అయినా జీ5

భారతీయ వినోద రంగం భవిష్యత్ వైవిధ్య‌మైన భాషాల‌తో, క్రియేటివిటీతో, కొత్త హ‌ద్దుల‌ను నిర్దేశిస్తూ ముందుకు సాగుతోంది. ఈ జ‌ర్నీలో క్రియేట‌ర్స్ ప్ర‌తిభ ఎంతో కీల‌కంగా మారింది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగు జీ5 తన కంటెంట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ.. ఐకానిక్ ఫ్రాంచైజీలు, ఒరిజినల్ సిరీస్‌లు, భారీ చిత్రాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, గతంలో ఎన్నడూ లేనంత విస్తృతమైన వినోద అనుభవాలతో కూడిన భారీ కంటెంట్ లైనప్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇండస్ట్రీలో అత్యంత నిబద్ధతతో, నాణ్యమైన కంటెంట్‌ను ఆదరించే ప్రేక్షకులే తెలుగు వినోద రంగానికి అసలైన బ‌లం.. సాంస్కృతికతను కాపాడుకుంటూనే సృజనాత్మకతలో కొత్తదనాన్ని అందించడంలో జీ5 ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రేక్షకుల మనసులను బలంగా తాకే కథలను అందిస్తూనే.. పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఉన్న సంప్రదాయ పద్ధతులను ఎప్పటికప్పుడు కొత్తగా నిర్వచిస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు, బ్యానర్స్‌తో తెలుగు జీ5 పార్ట‌న‌ర్‌ఫిప్ కుదుర్చుకుంది. దీంతో ఈ కొత్త కంటెంట్ లైనప్‌కు మరింత బలాన్ని చేకూరింది. వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ), ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్, వృద్ధి సినిమాస్, మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్, ఉదయ భాను ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్‌ఎల్‌పీ వంటి ఇండస్ట్రీలోని ప్రముఖ సంస్థలతో కలిసి తెలుగు జీ5 ఈ భారీ లైనప్‌ను సిద్ధం చేసింది. ఒరిజినల్స్ విభాగంలో నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న‌ ‘శ్రీమతి’, భరత్ నివాస్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘పంచనామా’తో పాటు.. జగపతి బాబు హోస్ట్‌గా ప్రేక్షకుల అభిమాన షో ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ మరోసారి సందడి చేయనుంది.

ఇక సినిమా విభాగంలో కూడా ఆసక్తికరమైన చిత్రాల లైనప్‌ను తెలుగు జీ5 అందిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ‘లెనిన్’..గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటిస్తున్న ‘ఎన్‌బీకే111’..అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’..కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చైతన్య అక్కినేని, మీనాక్షి చౌదరి నటిస్తున్న ‘వృషకర్మ’.. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్, కాజల్ చౌదరి నటిస్తున్న ‘కనక దుర్గ’ చిత్రాలు ఈ లైనప్‌లో ఉన్నాయి. అలాగే ‘జననాయకుడు’, ‘హాయ్’, ‘డిమాంటీ కాలనీ 2’, ‘ఏ క్వీన్’, ‘వీరప్పన్ 2’ వంటి డబ్బింగ్ చిత్రాలతో కూడా తెలుగు జీ5 ప్రేక్ష‌కును అల‌రించ‌నుంది.

జీ5 తెలుగు, త‌మిళ్‌, మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనంతో, సంప్రదాయానికి భిన్నంగా ఉండే కథలను ఆదరిస్తుంటారు. తమ భావోద్వేగాలకు, మనసుకు దగ్గరయ్యే సహజత్వాన్ని కూడా ఎంతో విలువగా భావిస్తారు తెలుగు ఆడియెన్స్‌. గత కొన్నేళ్లుగా క్రియేటర్స్‌, నిర్మాణ సంస్థలు, ప్రేక్షకులతో మేం ఏర్పరుచుకున్న పార్ట్‌న‌ర్‌షిప్‌ ద్వారా మార్కెట్‌లో ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఏర్పడింది. అదే ఆలోచనతో ఈ కొత్త కంటెంట్ లైనప్‌ను రూపొందించాం.

‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ నుంచి ‘శ్రీమతి’, ‘పంచనామా’ వంటి ఒరిజినల్స్ వరకు.. ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరైన కంటెంట్‌తో పాటు సరికొత్త కథలను కూడా ఈ లైనప్‌లో అందిస్తున్నాం. ప్రతి టైటిల్‌కు ప్రత్యేకమైన కథనం, విభిన్నమైన దృక్పథం ఉంది. కొత్తగా, ధైర్యంగా, ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే కథలను అందించాలనే మా నిబద్ధతకు ఈ కంటెంట్ లైనప్ సాక్ష్యం. అదే సమయంలో తెలుగు ప్రేక్షకుల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే అంశాలను కూడా ఈ కథల్లో జోడించాం” అని అన్నారు.

ఒరిజినల్స్, సినిమాలతో పాటు.. ఏఐ ఆధారిత స్టోరీటెల్లింగ్‌తో కూడా తెలుగు జీ5 తన వినోద ప్రపంచాన్ని మరింత విస్తరిస్తోంది. ‘గరుడ’, ‘విక్రమ్ బేతాళ్’, ‘శివ్ సతి’, ‘చంద్రకాంత’, ‘తిరుపతి బాలాజీ’, ‘నర్మద’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’ వంటి టైటిల్స్‌తో సరికొత్త కథనాలను ప్రేక్షకులకు అందించనుంది.

అలాగే పిల్లల కోసం ‘బార్బరీక్’, ‘కుండక మండక్క’ వంటి కంటెంట్‌తో పాటు.. ఫిఫా, బుండెస్లీగా, కోప్పా ఇటాలియా, ఐఎల్‌టీ20 వంటి లైవ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను కూడా అందిస్తూ తన ఎంటర్‌టైన్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తోంది. విభిన్న ఫార్మాట్లు, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కంటెంట్‌తో.. దక్షిణాది నుంచి అత్యుత్తమ వినోదాన్ని తెలుగు జీ5 అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఏదో ఒక ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు జీ5లో సిద్ధంగా ఉంది.

Continue reading