రష్మిక మందన్నా ‘మైసా’మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్

రష్మిక మందన్నా రణబాలి కూడా లైన్ లో

రష్మిక మందన్నా అంటే ఇప్పుడు టాప్ హీరోయిన్. తెలుగుతో పాటు బాలీవుడ్ లో అదరగొడుతోంది. ప్యాన్ ఇండియా రేంజ్ మూవీస్ తో బాగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తోంది. అయితే పెళ్లికి ముందే స్టార్ట్ అయిన మూవీ రణబాలి. రణబాలి సెట్స్ లో ఉన్న టైమ్ లోనే విజయ్ దేవరకొండతో ఏడు అడుగులు నడిచింది రష్మిక మందన్నా. అఫ్ కోర్స్ వీరి పెళ్లి గురించి మూడేళ్లుగా జనం మాట్లాడుకుంటున్నారు.
రణబాలి మూవీ ఈ సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. బట్ రష్మిక మందన్నా హిప్ కు ఇంజూరీ అవడంతో ఆలస్యం అయింది. కొత్త రిలీజ్ డేట్ గా అక్టోబర్ 16ని ప్రకటించింది మూవీ టీమ్. ఈ మూవీలోనే విజయ్ దేవరకొండ స్వాతంత్ర్య సమరయోధుడుగా కనిపించబోతున్నాడు అని ముందు నుంచే చెప్పారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది.

రష్మిక మందన్నా ప్యాన్ ఇండియా మూవీ మైసా

రష్మిక మందన్నా రణబాలి తర్వాత చేస్తోన్న మూవీ మైసా. మైసా ప్యాన్ ఇండియా మూవీ. ఇది భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ మాత్రం అద్దిరిపోయింది అనే చెప్పాలి. మైసాలో రష్మిక మందన్నా ఓ గిరిజన యోధురాలి పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ టైమ్ లోనే విడుదల చేసిన వీడియోతో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది కరెక్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ అని అప్పుడే అంతా చెప్పుకున్నారు.

మైసా దర్శకుడు ఎవరు

రష్మిక మందన్నా మైసా మూవీకి రవీంద్ర పుల్లెపు దర్శకుడు. ఇతనికి ఇదే తొలి సినిమా. గతంలో రవీంద్ర.. హను రాఘవపూడి దగ్గర పనిచేశాడు. ఆ అనుభవంతోనే ఈ మూవీపై విపరీతమైన రీసెర్చ్ చేసి మరీ కథ రాసుకున్నాడట. ఏదేమైనా గాయం తర్వాత చాలా వేగంగా కోలుకున్న రష్మిక మందన్నా వెంటనే మళ్లీ సెట్స్ లో జాయిన్ కాబోతుండటం మాత్రం తన డెడికేషన్ కు నిదర్శనం. మరి రణబాలి, మైసా మూవీస్ తో రష్మిక మందన్నా ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.

Continue reading
వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2నుంచి అవుట్

టాలీవుడ్ 2నుంచి వెంకటేష్ అవుట్

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47′ (AK47).వెంకీకి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. నారా రోహిత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ రావాలని అభిమానులు చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వీరి నిరీక్షణ ఫలించింది. అయితే ఈ మూవీ అక్టోబర్ 2న విడుదలవుతుందని గతంలోనే ప్రకటించారు. బట్ ఈ డేట్ లో మార్పు వచ్చింది. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసింది మూవీ టీమ్. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9కి వాయిదా వేశారు. దీంతో పాటు అక్టోబర్ లో విడుదల కాబోతోన్న మూవీస్ చూస్తే రిలీజ్ డేట్స్ ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 2న తెల్ల కాయితం

అక్టోబర్ 2న తెల్ల కాయితం విడుదల కాబోతోంది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న మూవీ ఇది. దీనిపై మంచి అంచనాలున్నాయి. కొత్త దర్శకుడే అయినా టైటిల్ నుంచి పబ్లిక్ లో హైలెట్ కావడం కూడా మూవీకి పెద్ద ప్లస్ అయింది. చాలా వేగంగా చిత్రీకరణ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అప్పుడే ఫిక్స్ కావడం చూసి సినిమా వర్గాల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ 15న రజినీకాంత్

ఇక దసరా బరిలో ఉన్న మూవీస్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అంతా ఊహించినట్టుగానే రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్ 2 ను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నారు. ఈ రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ చేయలేదు. బట్ ఈ రిలీజ్ డేట్ మాగ్జిమం ఖాయం అయిందని చాలామంది చెబుతున్నారు.

అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ

అక్టోబర్ 16న మోస్ట్ అవెయిటెడ్ మూవీ రణబాలి కూడా విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న మూవీ ఇది. మామూలుగా అయితే ఇది సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. రష్మిక మందన్నాకు గాయం కారణంగా ఒక నెల వాయిదా వేశారు. ఇది అక్టోబర్ 16న విడుదలవుతుందని రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది టీమ్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై విజయ్ దేవరకొండ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ధనుష్ కూడా అక్టోబర్ 16నే

అక్టోబర్ 16న విడుదల కాబోతోన్న తమిళ్ మూవీ ఓమ్. ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. మమ్మూట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ కూడా తెలుగులో బాగా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ అక్టోబర్ భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు, డబ్బింగ్ మూవీస్ తో టాలీవుడ్ లో మంచి కాంపిటీషన్ ఉండబోతోంది. మరి ఈ పోటీలో ఎవరు బలంగా నెగ్గుతారో అనేది చూడాలి.

 

Continue reading
విజయ్ దేవరకొండ రణబాలి రిలీజ్ డేట్.. దసరాకు రాబోతున్న రౌడీ స్టార్

విజయ్ దేవరకొండ రణబాలి రిలీజ్ డేట్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’ రిలీజ్ డేట్ మారింది. ముందుగా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 16, 2026న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమైంది.

రణబాలి రిలీజ్ డేట్ మారింది

విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిఫరెంట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రణబాలి’పై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. సినిమా కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు.

అక్టోబర్ 16, 2026న రణబాలి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయాలని చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా రిలీజ్ డేట్‌ను అక్టోబర్ 16కి మార్చారు. విజయదశమి సీజన్‌లో సినిమా విడుదల కానుండటంతో పాన్ ఇండియా స్థాయిలో మరింత భారీగా ప్రమోషన్స్‌కు అవకాశం ఏర్పడింది.

విజయ్ దేవరకొండ మరోసారి డిఫరెంట్ లుక్‌లో..

‘రణబాలి’లో విజయ్ దేవరకొండ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ చేతిలో కత్తితో పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో కనిపించారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ చూస్తే.. విజయ్‌ను ఇప్పటివరకు చూడని ఒక పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించబోతున్నారనే ఆసక్తి పెరిగింది.

రష్మికతో మరోసారి జోడీ

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ మరోసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది.

ఈ సినిమాలో రష్మిక జయమ్మ పాత్రలో కనిపించనున్నారు. విజయ్, రష్మికల పాత్రలు కథలో కీలకంగా ఉండనున్నట్లు ఇప్పటివరకు విడుదలైన సమాచారం ద్వారా తెలుస్తోంది.

1854 నుంచి 1878 మధ్య జరిగే కథ

‘రణబాలి’ కథ 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుంది. ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్యకాలంలో చోటుచేసుకున్న చారిత్రక ఘటనల స్ఫూర్తితో కథను రూపొందించినట్లు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ వెల్లడించారు.

అయితే ఇది ఒక నిర్దిష్ట వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా కాదని, చరిత్రలో పెద్దగా ప్రస్తావనకు రాని సంఘటనలు, స్థానిక కథనాల నుంచి స్ఫూర్తి పొందిన కథగా దర్శకుడు వివరించారు. ఈ నేపథ్యమే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

భారీ టెక్నికల్ టీమ్

‘రణబాలి’కి ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. టి-సిరీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

దసరా బరిలో రణబాలి

సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 16కి రిలీజ్ మారడంతో ‘రణబాలి’ ఇప్పుడు దసరా సీజన్‌లో థియేటర్లలోకి రాబోతోంది. పండుగ సీజన్ సినిమాలకు సాధారణంగా మంచి ప్రేక్షకాదరణ లభించే అవకాశం ఉండటంతో ఈ రిలీజ్ డేట్ సినిమాకు కలిసొచ్చే అంశంగా మారనుంది.

అదే సమయంలో పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ చాలా కీలకం కానున్నాయి. టీజర్, ట్రైలర్, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ద్వారా సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ కెరీర్‌కు కీలకంగా మారుతుందా?

‘రణబాలి’ కేవలం మరో సినిమా కాకుండా విజయ్ దేవరకొండకు ఒక కొత్త జానర్‌లో తనను తాను చూపించే అవకాశం. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్, చారిత్రక నేపథ్యం, రాహుల్ సాంకృత్యన్ టేకింగ్, విజయ్-రష్మిక కాంబినేషన్.. ఇలా సినిమాకు పాజిటివ్ పాయింట్లు చాలానే ఉన్నాయి.

మరి ఈ అంశాలన్నింటినీ దర్శకుడు ఎలా తెరపైకి తీసుకొచ్చారు? విజయ్ దేవరకొండ వారియర్ పాత్రలో ఎంతవరకు మెప్పిస్తారు? రణబాలి కథ ప్రేక్షకులను ఎంతవరకు కనెక్ట్ చేస్తుంది? అన్నది సినిమా విడుదల తర్వాతే పూర్తిగా తెలుస్తుంది.

ప్రస్తుతానికి మాత్రం అక్టోబర్ 16, 2026న రణబాలి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అనేది క్లియర్. దసరా బరిలో రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు ఎలా పెరుగుతాయో చూడాలి.

Continue reading