రష్మిక మందన్నా డ్యాన్స్ చిత్రీకరణలో గాయపడింది
రష్మిక మందన్నాకు గాయాలు
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న బ్యూటీ రష్మిక మందన్నా. రష్మిక మందన్నా తాజాగా ఒక సినిమా పాట చిత్రీకరణ సందర్భంగా ఆమెకు గాయాలు అయ్యాయి. ఒక రకంగా ఇది తీవ్ర గాయమే చెబుతున్నారు. ప్రస్తుతం తను మైసా, రణబాలి మూవీస్ షూటింగ్ చేస్తుండగా ఈ గాయం అయిందా లేక మరేదైనా చిత్రీకరణలో అయిందా అనేది తెలియాల్సి ఉంది.
గతంలోనూ రష్మిక కాలికి ఫ్రాక్చర్స్
ఓ రకంగా రష్మిక మందన్నా గతంలో సికందర్ అనే బాలీవుడ్ మూవీ షూటింగ్ టైమ్ లో కూడా గాయపడింది. అయితే ఇది మూవీ షూటింగ్ టైమ్ లో కాదు. జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా కాలు బెణికింది. డాక్టర్స్ పరీక్షించారు. దీంతో కాలికి ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయని తేలింది. దీంతో కొన్నాళ్లు షూటింగ్ కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఆ టైమ్ లో మరో మూవీ ప్రమోషన్స్ లో రష్మిక మందన్నా పాల్గొంది. అంతే తను ఎంత డెడికేటెడ్ అనేది అందరికీ తెలిసింది.
ఆరు వారాలు విశ్రాంతి
ఇక తాజాగా అయినా గాయం సాధారణంగా టాప్ అథ్లెట్స్ కు మాత్రమే అవుతుందట. అలాంటిది ఓ సాధారణ హీరోయిన్ కు ఇలాంటి గాయం కావడం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం డాక్టర్లు అయితే తనకు ఆరువారాల పాటు విశ్రాంతి అవసరం అని ఖచ్చితంగా చెప్పారు.
రష్మిక మందన్నా మూవీస్ షెడ్యూల్స్ లో మార్పులు
మరి ఈ కారణంగా తను చేస్తోన్న మూవీస్ షెడ్యూల్స్ కూడా మారిపోతాయి. దీని వల్ల ఆ మూవీస్ రిలీజ్ డేట్స్ లో కూడా మార్పులు రావడం జరుగుతుంది. ఏదేమైనా రష్మిక మందన్నా త్వరగా కోలుకోవాలి. వీలైనంత వేగంగా మళ్లీ జోష్ గా షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాలని గారడి డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.







