బిజెపికి గట్టి షాక్ ఇచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు

బిజెపికి షాక్

తాజాగా వెలువడిన మూడు బైపోల్స్ ఫలితాలు చూస్తుంటే.. ఢిల్లీ పీఠం మీద కూర్చున్న పెద్దలకు, ఇక్కడ కూటమి సర్కార్ నడుపుతున్నోళ్లకు చెమటలు పట్టడం ఖాయం. ఇవి ఎవరో సాధారణ సీట్లు కావు, బీజేపీకి దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోట్లు. అలాంటి చోట్లోనే ఓటర్లు దిమ్మతిరిగేలా రిజల్ట్స్ ఇస్తే, కమలనాథులతో పాటు కూటమి భాగస్వాములకు కూడా గుండెల్లో రైళ్లు పరుగెత్తడం పక్కా.

గుజరాత్ గుండెల్లో రైల్లు

బీహార్‌లోని బంకీపూర్‌లో బీజేపీ ఓటు షేర్ ఏకంగా ఇరవై మూడు శాతం గాలిలో కలిసిపోయింది. ఇక మోదీ, షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని మంజల్పూర్‌లో సీటు గెలిచినా పండగ చేసుకునే సీన్ లేదు. గతంలో లక్షకు పైగా ఉన్న భారీ మెజారిటీ ఈసారి కేవలం ముప్పై వేలకు పడిపోయింది, ఓటు షేర్ కూడా పాతిక శాతం హాంఫట్ అయింది. ఇక మధ్యప్రదేశ్‌లోని దాతియాలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును గట్టిగా పట్టుకొని రూట్ క్లియర్ చేసుకుంది.

పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత

కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా కూటమి ప్రభుత్వాల నడుపుతున్నప్పుడు ఈ రేంజ్ వ్యతిరేకత వస్తే.. పక్కన ఉన్న మిత్రపక్షాలు సైలెంట్‌గా ఎందుకు కంగారు పడుతున్నాయో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. “మా మాస్‌ పవర్‌ ముందు ఎవరైనా సరే” అనుకున్న అహంకారానికి నేటి ఓటర్లు ఈ ఫలితాలతో గట్టిగానే సమాధానం చెప్పారు. కంచుకోటల గోడలు ఎంత బలమైనా, ప్రజా వ్యతిరేకత పునాదుల్ని కదిలిస్తుందనడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారడం, మిత్రులకు సైతం నిద్రలేకుండా కావడం ఖాయం.

Continue reading
ప్రశాంత్ కిశోర్ సంచలన విజయం.. బీజేపీ కంచుకోట బాంకీపూర్‌లో చరిత్ర సృష్టించిన జన్ సురాజ్

ప్రశాంత్ కిశోర్ విజయం

ప్రశాంత్ కిశోర్ అంటే మామూలుగా ఎన్నికల వ్యూహకర్తగానే చాలామంది భావిస్తున్నారు. కానీ అంతకు ముందే ప్రశాంత్ కిశోర్ ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు. తర్వాతే ఎన్నికల వ్యూహకర్తగా మారాడు. ప్రస్తుతం బిహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించాడు. విశేషం ఏంటంటే.. ఇదే నియోజకవర్గం నుంచి బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గతంలో గెలుస్తూ వస్తున్నాడు. గత ఎన్నికల్లో కూడా నితిన్ నబీన్ గెలిచాడు. కానీ అతను పార్టీ జాతీయ అధ్యక్షుడు కావడంతో పాటు రాజ్యసభకు వెళ్లడంతో ఇదే అసెంబ్లీకి ఉప ఎన్నికలు తప్పలేదు. ఈ ఎన్నికల్లోనే ప్రశాంత్ కిశోర్ ఏకంగా 18వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందాడు.

ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్త

ప్రశాంత్ కిశోర్ కి రాజకీయ వ్యూహర్తగా తిరుగులేని గుర్తింపు ఉంది. 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేశాడు. అక్కడ పార్టీ గెలిచింది. తర్వాత 2014లో బిజెపి పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ మార్మోగిపోయింది. 2019 లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకు రావడంలో అత్యంత కృషి చేశాడు. ఆపైన మరికొన్ని రాష్ట్రాల్లో తను పనిచేసినా ఆయా రాష్ట్రాల్లో అతను సపోర్ట్ చేసిన పార్టీలు ఓడిపోయాయి. దీంతో ఇకపై తను వ్యూహకర్తగా ఉండనని తేల్చాడు.

ప్రశాంత్ కిశోర్ పార్టీ స్థాపన

ప్రశాంత్ కిశోర్ 2024 అక్టోబర్ 2న సొంతంగా పార్టీ స్థాపించాడు. దానికి జన్ సురాజ్ పార్టీ అని పేరు పెట్టాడు. 2025లో అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ లోని 243 స్థానాలుండగా 238 సీట్లలో పోటీ చేశాడు. కానీ తను పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ దారుణంగా పరాజయం పాలయ్యాడు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో దాదాపు 30యేళ్లుగా బిజెపి పార్టీయే జెండా ఎగరేస్తున్న బాంకీపూర్ నుంచి ఘన విజయం సాధించాడు.

బిజెపికి శరాఘాతం

ప్రశాంత్ కిశోర్ విజయం తర్వాత ప్రజాస్వామ్యంపై ఇంకా నమ్మకముంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓ రకంగా ఇది బిజెపికి శరాఘాతం అని చెప్పొచ్చు. బిజెపికి బాంకీపూర్లో తిరుగులేని స్థానంగా ఉంది. అలాంటి ప్లేస్ ల ఓటమి పాలు కావడం ప్రశాంత్ కిశోర్ విజయంగానే చెప్పాలి. రాబోయే రోజుల్లో బిజెపికి మరింత గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని ఈ పరాజయం తర్వాత చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు.

బిజెపి ఎత్తుగడలో భాగమే

ప్రశాంత్ కిశోర్ విజయం కేవలం బిజెపి ఎత్తుగడలో భాగమే అని కూడా కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ప్రశాంత్ కిశోర్ పార్టీ స్థాపించిన తర్వాత గెలిచిన తొలి స్థానం ఇది. మరి భవిష్యత్ లో అతను రాజకీయంగా నిలదొక్కుకుంటాడా.. జాతీయ స్థాయిలో కూడా తన పార్టీని కీలకంగా ఉంచుతాడా అనేది కాలమే చెబుతుంది.

 

 

Continue reading