మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన కొణిదల నాగేంద్రబాబు

చిరు కోసం మొక్కలు నాటిన నాగేంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు గారు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబవాసిని) మొక్కను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుండి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు.

ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ

ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ: అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గం.

ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుంది. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా! ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలి.

మెగా ఫ్యామిలీ కోసం మొక్కలు నాటిన నాగబాబు

కుటుంబ సంప్రదాయంలో భాగంగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక తదితర కుటుంబ సభ్యుల పేర్లతో దాదాపు 120కి పైగా మొక్కలు నాటినట్లు నాగబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి, ప్రియమైన వారి ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.

Continue reading
ప్రశ్న రావణ్ పేరెంట్స్ ఎందుకు మాట్లాడ్డం లేదు

ప్రశ్న రావణ్(బచ్చలకూరి జోసెఫ్).. ఈ పేరు ఓ సంచలనంగా మారింది. రావణ్ వేసిన ప్రశ్నలు చాలామందికి మింగుడు పడటం లేదు. కొందరిని వ్యక్తిగతంగా తీసుకున్నా.. ఇంకొందరిని ఇన్ డైరెక్ట్ గా తీసుకున్న రావణ్ అడిగిన విధానం కొందరికి అస్సలు నచ్చలేదు. సరైన టైమ్ కోసం వేచి చూడాలి అని చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ టైమ్ వచ్చింది. జూలై ఫస్ట్ వీక్ లో అతన్ని పోలీస్ లు అరెస్ట్ చేశారు. అంతకు ముందు దళిత క్రైస్తవ సమర శంఖారావం అనే పేరుతో ఏలూరులో జరిగిన ఓ మీటింగ్ లో ఓ గెస్ట్ గా వచ్చాడు రావణ్. అక్కడ మాట్లాడాడు. ఇందులో ఎప్పట్లానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు. అతన్ని ఇమిటేట్ చేస్తూ అతని మీటింగ్ సాగింది. అక్కడే జనసేనకు మండింది. కట్ చేస్తే వెంటనే కేస్ పెట్టారు. వెంటనే బెయిల్ వచ్చింది. తర్వాత మూడు కేస్ లు పెడితే వాటికీ బెయిల్ వచ్చింది. చివరికి రావణ్ నక్సలైట్ నాయకుడు హిడ్మా మరణం గురించి మాట్లాడాడు అనే కారణంతో ఏకంగా ‘ఉపా’కేస్ పెట్టారు. దీనికి 14జైలుకు జ్యూడీషియల్ రిమాండ్ కు పంపించారు. రావణ్ పై కేస్ పెట్టడం గురించి చాలామంది మాట్లాడారు. ప్రశ్నించే వారిపై ఇలా నిర్బంధం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఉపా కేస్ పెట్టడంపై సాధారణ సమాజం నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ఓ రకంగా జనసేన, తెలుగుదేశం, బిజెపి మినహా అన్ని పార్టీలూ ముక్త కంఠంతో ఉపా కేస్ పై ఖండనలు చేశారు. అయితే ఇవన్నీ ప్రభుత్వం చేతిలో పని కాబట్టి ఇలాంటివి కామన్.

రావణ్ కేవలం పవన్ ను మాత్రమే ప్రశ్నించడం ఎంత వరకు కరెక్ట్

అయితే రావణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం వచ్చిందా అంటే రాలేదు.. రాదు కూడా. అతను ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రశ్నిస్తే బావుండేది. కానీ కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే టార్గెట్ చేయడం చాలామందిలో మామూలుగానే అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఓ రకంగా చూస్తే రావణ్ ను కూడా కత్తి మహేష్ లా పార్సిల్ చేస్తారు అనే మాటలు వస్తున్నాయి. అయితే రావణ్ కేవలం ప్రశ్నించడం వరకు బాగా చేస్తే బావుండేది.కానీ కేవలం ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయడం ఏ మేరకు సబబు. అలాగే అతను ప్రశ్నించే విధానంలో అగ్రెసివ్ నెస్ కనిపిస్తోంది.ఇది ఓ రకంగా అతని స్టైల్ అనుకోవచ్చు. ఆ మాటును అసలు ప్రశ్నలు సరిగా సంధించలేకపోవడం ఎంత వరకు కరెక్ట్. అఫ్ కోర్స్ క్షేత్ర స్థాయిలో చాలామంది అణగారిన వర్గాల బాగు కోసం అనేక సార్లు తనదైన శైలిలో మాట్లాడాడు. కానీ అక్కడ కూడా పవన్ ను మాత్రమే టార్గెట్ చేయడం చూస్తే అతను ప్రశ్నించే విధానంలోనే ఏదో లోపం ఉందనేది ఎవరికైనా అర్థం అవుతుంది. చివరికి జనసేన మాత్రమే అతనిపై కేస్ లు పెట్టింది. ఇప్పుడు ఉపా వరకు వచ్చింది. ఇది ఇక్కడితో ఆగిపోతుందని ఎవరూ అనుకోవడం లేదు. ఇంకా చాలాముందుకు వెళ్లడం ఖాయం అనేది ఎవరిని అడిగినా అర్థం అవుతుంది. అయితే ఈ మొత్తం గొడవలో అతని కుటుంబం ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అనేది పెద్ద ప్రశ్న.

రావణ్ పేరెంట్స్ ఎందుకు మాట్లాడ్డం లేదు

బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ను చాలామంది దళితుడు అని భావించారు. కానీ ఈ మొత్తం గొడవ తర్వాతే అతను కమ్మ కులం వాడు అనేది తెలిసింది. ఓ కమ్మ వాడైనా చాలామంది దళితుల కోసం తన ప్రశ్నలు సంధించాడు. అదే టైమ్ లో కమ్మ కులం నాయకుల గురించి మాత్రం ఇంత ఘాటుగా ఎప్పుడూ స్పందించలేదు. ఆ విషయం పక్కన పెడితే అతని పేరెంట్స్ ఎవరు..? ఎందుకు వీళ్లు రావణ్ ను సపోర్ట్ చేయడం లేదు. రావణ్ తో వీరికి ఎప్పుడు చెడింది.. ఎక్కడ చెడింది.. అసలు అతని కుటుంబ నేపథ్యం ఏంటీ అనేది మాత్రం ఇంత వరకు ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. అంటే ఓ రకంగా రావణ్ తన కుటుంబం మొత్తాన్ని వదులుకున్నాడా..? లేదంటే నిజంగానే సమాజం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడా అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే.. అతని పోరాటానికి చాలామంది మద్ధతు ఇస్తున్నారు. అదే టైమ్ లో ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు అనేది వాస్తవం.

టిడిపి, వైసీపీ వీరిలో రావణ్ కు సపోర్ట్ చేస్తున్నది ఎవరు ..?

అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్నది ఎవరైనా సరే కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇలా ఎవరు ప్రశ్నించినా వారి వెనక ఇంకేదైనా కారణాలుంటాయి. కేవలం కమ్యూనిస్ట్ లు మాత్రమే సమాజం కోసం ప్రశ్నిస్తుంటారు. మిగతావారంతా తమదైన పర్సనల్ ఎజెండాతో ప్రశ్నిస్తుంటారు. అలా రావణ్ వెనక ఉన్నది ఎవరు అంటే.. చాలామంది వైసీపీ ఉంది అంటున్నారు. అలాగే ఇంకొందరు టిడిపి ఉంది అంటున్నారు. రావణ్ ప్రశ్నలు ఎక్కువగా ప్రభుత్వంపైనే ఉంటాయి కదా టిడిపి అతని వెనక ఉంది అనడం ఏ మేరకు కరెక్ట్ అని కూడా అనుకోవచ్చు. మామూలుగా చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వారికైనా ఇదే అనుమానం వస్తుంది. చంద్రబాబు ఏం చేసినా తన చేతికి మట్టి అట్టుకోకుండా చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ కారణంతో రావణ్ ఎప్పుడూ పవన్ లా వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. ఇంకా చెబితే ఇద్దరిదీ ఒకే కులం కూడా. మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయించారు అనే అనుమానం కూడా రావొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ లో చంద్రబాబు లాంటి వారి ఈజీగా చేతులు దులుపుకోవడం కూడా అత్యంత సాధారణమైన విషయం. ఈ ట్రాప్ లో వైసీపీ కూడా పడింది అని కూడా అనుకోవచ్చు.

K.Y.R

Continue reading