భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’తో బ్రేక్ దొరికినట్టేనా..?

టాలీవుడ్‌లో ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే టాప్ ప్లేస్ కు వెళతారు.అలాంటి వారిలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయంతో ఆమె పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘లెనిన్’లో భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. కథకు అవసరమైన ఎమోషనల్ సీన్స్ లో కూడా తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. అఖిల్‌తో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకోవడంతో పాటు, సినిమాలో ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మూవీ సక్సెస్ మీట్ లో తను చాలా చాలా ఎమోషన్ అయింది. తన ఫ్యాన్స్ వల్లే ఈ విజయం సాధ్యమైంది అని చెప్పింది.
సినిమా హిట్ అయితే హీరోతో పాటు హీరోయిన్‌కు కూడా అవకాశాలు పెరగడం సహజం. ‘లెనిన్’కు వచ్చిన మంచి రిజల్ట్ వల్ల భాగ్యశ్రీ బోర్సే పేరు దర్శకులు, నిర్మాతల దృష్టిలో మరింత బలంగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో పాటు కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా ఆమెకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక్క సినిమా హిట్‌తోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోవడం అంత సులభం కాదు. వరుసగా మంచి కథలు ఎంచుకోవడం, నటనలో వైవిధ్యం చూపించడం, ప్రేక్షకులను కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేయడం చాలా ముఖ్యం. అదే చేస్తే భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో లాంగ్ టైమ్ నిలిచే హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉంది.
టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి సినిమా కీలకంగా మారుతుంది. ‘లెనిన్’ విజయం భాగ్యశ్రీ బోర్సేకు ఒక పెద్ద ప్లస్ అయినా, ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ ఈ సినిమా ఆమె మార్కెట్ విలువను, గుర్తింపును మాత్రం ఖచ్చితంగా పెంచిందని చెప్పవచ్చు.’లెనిన్’ భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ విజయాన్ని సరైన కథల ఎంపికతో కొనసాగిస్తే, టాలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.

Continue reading
అఖిల్ ‘లెనిన్’.. కెరీర్‌కు కొత్త ఆరంభమా?

అక్కినేని అఖిల్ కెరీర్‌లో ప్రతిసారి ఒక మంచి హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, ఏజెంట్ వంటి సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో అఖిల్ తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఎప్పుడూ కనిపించింది.అలాంటి సమయంలో వచ్చిన ‘లెనిన్’ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గ్రామీణ నేపథ్యం, మాస్ యాక్షన్, ఎమోషన్స్ కలిసిన కథతో దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చాయి.
అఖిల్‌లో కనిపించిన మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ గత సినిమాలతో పోలిస్తే చాలా మెచ్యూర్‌గా కనిపించాడు. లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్‌లో అతని కష్టపడిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తన పాత్రను తీర్చిదిద్దిన విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇటీవలి కాలంలో ప్రేక్షకులు బలమైన కథతో పాటు ఎమోషన్స్ ఉన్న మాస్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. అదే ఫార్ములాను లెనిన్ కూడా అనుసరించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, లవ్ ట్రాక్‌ను సమతూకంగా చూపించే ప్రయత్నం చేసింది. విడుదల తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా మంచి స్థాయిలో నమోదవుతున్నాయి. రెండో రోజు వసూళ్లు పెరగడం ప్రేక్షకుల్లో మంచి మౌత్ వస్తుండటం స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు.
ఈ సినిమా అఖిల్ కెరీర్‌ను మార్చుతుందా..? అంటే అవుననే చెప్పడానికి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ ఈసారి తన కంఫర్ట్ జోన్‌ను వదిలి మాస్ ఇమేజ్ వైపు అడుగు వేశాడు. అదే అతనికి పెద్ద ప్లస్ అయింది.
ఒక సినిమా సక్సెస్‌తో స్టార్‌డమ్ పూర్తిగా మారిపోదు. కానీ వరుసగా సరైన కథలను ఎంపిక చేసుకుంటే మాత్రం అఖిల్ టాలీవుడ్‌లో బలమైన స్థానం సంపాదించే అవకాశం ఉంది. లెనిన్ ఆ దిశగా అతనికి మంచి ఆరంభంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లెనిన్ కేవలం మరో సినిమా కాదు. అఖిల్ కెరీర్‌లో అత్యంత కీలకమైన మలుపుగా నిలిచే చిత్రం. ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా అతనికి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇకపై కథల ఎంపికలో ఇదే జాగ్రత్త కొనసాగిస్తే అఖిల్ కెరీర్ మరింత బలపడే అవకాశం ఉంది.

Continue reading
ఎస్.జానకి గళం.. “కామధేనువు”

తెలుగు సినిమా పాటను తమ గాత్రంతో సుసంపన్నం చేసిన గాయనీమణులు అనేకమంది ఉన్నారు. ఆ అందర్లోకీ కాస్త ఎక్కువ ప్రత్యేకమైన గాయని ఎస్ జానకి. అందుకే సినిమా పాటకి..ఎస్.జానకి గళం.. “కామధేనువు” లాంటిదంటారు డైరక్టర్ కె. విశ్వనాథ్. ఏం కావాలంటే ఆ భావం పలికించగల అత్యున్నత గాయని జానకి. కానీ ఇప్పుడా భావం ఇకపై పలకదు.. ఆ రాగం ఇకపై వినిపించదు. వయో భారంతో ఆమె కన్ను మూశారు. బట్ తను లేకపోయినా సినిమా పాట ఉన్నంత వరకు ఆమె గాత్రం ఉండిపోతోంది. అమృతవర్షిణిగా ఆడియన్స్ చేత జేజేలు కొట్టించుకున్న జానకమ్మ కొన్ని పాటలకు సంబంధించిన విశేషాలు ఓ సారి చూద్దాం.
వేదికలపై హాస్య నటుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ చంద్రశేఖర్ గారి కోడలు జానకి. అతని ద్వారానే అనుకోకుండా స్టేజ్ ఎక్కారు. ఆయన ప్రోగ్రామ్ మధ్యలో జానకితో పాటలు పాడించేవారు. ఇలా పాడుతున్న జానకిని దర్శకుడు టి.చలపతిరావు విన్నారు.
సంగీత దర్శకుడు పెండ్యాలకు రిఫర్ చేశారు. అలా ఎమ్మెల్యే చిత్రంలో నీ ఆశా అడియాసా అనే విషాదగీతంతో ఎంట్రీ ఇచ్చారు జానకి. ఆ తర్వాత చరిత్ర సృష్టించిన జానకి.. సినిమా పాటకే తలమానికమయ్యారు.

తెలుగు సినిమా తొలినాటి చిత్ర కారుడు బి.ఎన్.రెడ్డి తీసిన బంగారు పంజరంలో జానకితో ఓ అపురూప గీతం పాడించారు. బిఎన్ ఎంతగానో ఇష్డపడే దేవులపల్లి రచించిన పాటలన్నీ జానకితోనే పాడించారు. పగలైతే దొరవేరా పాటలో సున్నితమైన శృంగార భావాల్ని పలికించిన జానకి గాత్రం.. గట్టుకాడ ఎవరో…పాటలో జానపద సొగసుల్నీ అంతే అందంగా పలికిస్తుంది.

కెవి. మహదేవన్ సంగీత దర్శకత్వంలోనూ అజరామరమైన గీతాలెన్నో పాడారు జానకి. జగ్గయ్య హీరోగా వచ్చిన ముందడుగు చిత్రంలో ఆత్రేయ రాసిన కోడెకారు చిన్నవాడా పాటలో జానకికి జానకే ప్లేబ్యాక్ పాడారు. ఆ పాటలో జానకి గాత్రం మనోహరంగా సాగుతుంది. మాధవపెద్ది సత్యంకు ధీటుగా పలుకుతుంది.

సంగీత దర్శకులు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జానకితో పాడించుకోడానికే ఉత్సాహం చూపేవారు. జానకి పాడితే తప్ప ఆ ఫీల్ ఆడియన్స్ కు కారీ కాదనేది వారి నమ్మకం . ఎమ్మెస్ విశ్వనాథన్ అంతులేని కథ కోసం కళ్లలో ఉన్న నీరు కన్నులకే తెలుసు పాట జానకి పాడడం వల్లే వేదన వ్యక్తమైంది.

అదే ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో వచ్చిన మరో చరిత్రలోనూ మరపురాని పాటలెన్నో ఉన్నాయ్. వాటిలో పదహారేళ్లకు నీలోనాలో అంటూ జానకి గళంలో వినిపించే మెలోడీలో వినిపించే రాగాలు వర్ణించలేనివి. సాహిత్యంలోని భావాన్నే కాదు.. సన్నివేశంలోని సారాన్ని సైతంలో గళంలో పలికిస్తుందీ పాటలో.

డైరక్టర్ వంశీ తొలి చిత్రం మంచుపల్లకీలో జానకి ఓ అపురూపమైన గీతం ఆలపించారు. వేటూరి రాసిన ఈ గీతాన్ని రాజన్ నాగేంద్ర స్వరపరిచారు. టైటిల్ ను జస్టిఫై చేస్తూ సాగే ఈ గీతం జానకి తప్ప ఇంకెవరు పాడినా ఆ పీల్ క్యారీ అయ్యేది కాదు. సాహిత్యంలోని ఆర్తిని కంఠంలో ఒప్పించగలగడం చిన్న ఫీట్ కాదు. సినిమా కళాకారుల గొప్పతనమంతా అక్కడే ఉంది.

ఇసైజ్నాని ఇళయరాజా అయితే జానకి వీరాభిమాని. తను స్వరకల్పన చేసిన ప్రతి సినిమాలోనూ జానకితో ఒక్క పాటైనా పాడించుకోకపోతే ఆయనకు కుదరదు. అలా జానకి ఇళయరాజా వేటూరి కాంబినేషన్ లో ఎన్నెన్నో మధురగీతాలు తెలుగు శ్రోతలకు వీనుల విందు చేశాయి. వాటిలో జాతీయ పురస్కారం సాధించిన పాట కూడా ఉండడం విశేషం. సితార కోసం జానకి పాడిన వెన్నెల్లో గోదారి అందం…పాట వినడం నిజంగానే ఓ వరం.

అచ్చమైన తెలుగు ఘజల్ గా చెప్పుకోదగ్గ గీతం ఒకటి రమేష్ నాయుడు, వేటూరి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంది. శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం కోసం తయారైన ఈ గీతం జానకి పాడడం విశేషం. కవి భావాన్ని, సన్నివేశాన్ని అర్ధం చేసుకుని పాడగలగడమే సినీ నేపధ్య గాయకుల పని. ఆ పనికి నూటికి నూరు శాతం న్యాయం చేశారు జానకి.

నవ్వుల విషయంలోనూ జానకి స్పెషలిస్టు. అలా అంత నాచురల్ గా నవ్వగలిగే ఆర్టిస్టు అంతకు ముందూ లేరు…ఆ తర్వాతా రాలేదు. అది కూడా తను పాటను ఫీల్ అయి పాడడంలోంచే పుట్టింది. జ్యోతిలో సిరిమల్లె పూవల్లే నవ్వు పాటకు జానకి నవ్వులే జీవం పోశాయి. ఇక ముద్దమందారంలో అయితే జొన్నా చేలో జున్ను పాటలో బాలుతో కల్సి జానకి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.

జానకి సాహిత్యాన్నీ సందర్భాన్నీ అధ్యయనం చేసి తన గాత్రంలో పలికించే ప్రయత్నం చేస్తారు. అదే తన సక్సస్ మంత్రం అదే. ఆ కాన్ఫిడెన్స్ తోనే బాలసుబ్రహ్మణ్యానికి పోటీ గీటీ అంటూ ఉంటే నేనే అని ఓ సందర్భంగా చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పారు. తను అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్టు కూడా. సప్తపది చిత్రంలో గోవుల్లు తెల్లన లో పిల్లవాడి వరసలన్నీ జానకి స్వరంలో పురుడు పోసుకున్నవే.

సినిమా సంగీతానికి జానకి చేసిన సేవలు కొలడం సాధ్యం కాని పని. తనకు ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ ఏమంత సంతోషపరచలేదు. భారత రత్న ఇస్తే బాగుండేది అనడం కొంత మందిని బాధించినా…ఆ మాటలోనూ జానకి ఆవేదన నిండి ఉంది. సంగీత కళాకారులను ఎందుకు బిగ్ ఏరియాలో నిర్లక్ష్యం చేస్తున్నారనే వేదన ఉంది. జానకి తెలుగువారి సాంస్కృతిక సంపద.

వయసు మీదపడటం.. ఆరోగ్యం సహకరించకపోవడం.. వంటి కారణాలతో సినిమాల్లోనే కాదు.. ఇకపై ఏ వేదికలపైనా పాడబోనని కొన్నాళ్ల క్రితమే ప్రకటించారు జానకమ్మ. అలా తన పాటకు శాశ్వత విరామంతో సంగీతాభిమానులను షాక్ కు గురి చేసినా.. ఇవాళ ఆమె కూడా లేరు అనే చేదు నిజం మాత్రం ఇంకెవ్వరూ భర్తీ చేయలేనిది. ఆమె పంచిన గానసంపద తరుగు లేనిది.. తరిగిపోనిది.. ఆ సంపదనే మళ్లీ మళ్లీ వింటూ జానకమ్మ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆమె గానాన్నే వింటూ పులకించిపోతూనే ఉంటాము. ఆమెకు గారడి.కామ్ ఘనమైన నివాళి అర్పిస్తోంది.

 

 

Continue reading
‘జననాయకన్’ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్..?

దళపతి విజయ్(Thalapathi Vijay) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జననాయకన్’ సినిమా విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మూవీ టీమ్ సీబీఎఫ్‌సీ (CBFC) సూచించిన మార్పులను పూర్తి చేసి, ఫైనల్ కట్‌ను వెరిఫికేషన్ కోసం సమర్పించింది.
ఇప్పటికే సెన్సార్ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారికంగా సర్టిఫికేట్ మాత్రం మరో ఒకటి లేదా రెండు రోజుల్లో జారీ కానుందని సమాచారం. దీంతో సినిమా జూలై 23 విడుదల దాదాపు ఖరారైనట్లే బలంగా వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయినప్పటికీ, దాని ప్రభావం ఓపెనింగ్స్‌పై పెద్దగా ఉండదనే అంచనాలు ఉన్నాయి. విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ కారణంగా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘జననాయకన్’ విజయ్(C,M.Vijay) నటుడిగా చేస్తున్న చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో మరింత భావోద్వేగాన్ని కలిగిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి అభిమాన సంఘాలు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సెన్సార్ ప్రక్రియ పూర్తికావడంతో విడుదలపై ఉన్న సందేహాలకు కూడా తెరపడినట్లైంది. ఇక అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయితే ఫ్యాన్స్ కు మంచి పండగ రాబోతోందనుకోవచ్చు.

Continue reading
అల్లు అర్జున్ ను మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ

తమిళ్ లో రూపొందిన బ్లాస్ట్(Blast Movie) మూవీతో ఓవర్ నైట్ తెగ గుర్తింపు వచ్చింది ప్రీతి ముకుందన్(Preethi Mukundan) కు. అంతకు ముందు చాలా సినిమాలు చేసినా బ్లాస్ట్ తో వచ్చిన ఫేమ్ మాత్రం చాలా ప్రత్యేకమైనదే అని చెప్పాలి. పైగా ఇది ఓ యాక్షన్ ఓరియంటెడ్ కథ.. అందులో తనూ ఓ ప్రధాన పాత్రగా చేసింది. అందుకే ఈ మూవీతో విపరీతమైన గుర్తింపు వచ్చింది. అలాంటి ప్రీతి ముకుందన్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. బట్ అది తను మిస్ చేసుకుందట.
దర్శకుడు అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా'(RAAKA Movie) లో కీలకమైన ఓ పాత్ర కోసం మొదట యువ నటి ప్రీతి ముకుందన్‌ను సంప్రదించినట్లు అట్లీ స్వయంగా వెల్లడించారు. అయితే, అప్పటికే ప్రీతి ముకుందన్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, ముందుగా ఇచ్చిన డేట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన అవలేకపోయినట్టు తెలిపాడు. షెడ్యూల్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడు అట్లీ.
దీంతో ఆ కీలక పాత్రను చివరకు మలయాళ నటి ఫెమినా జార్జ్(Femina George) దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఇలాంటి భారీ సినిమాల్లో అవకాశం రావడం ఏ నటికైనా ప్రత్యేకమే. అయితే డేట్స్ సమస్య కారణంగా ప్రీతి ముకుందన్ ఈ అవకాశాన్ని కోల్పోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. మరోవైపు ఫెమినా జార్జ్‌కు మాత్రం ఇది కెరీర్‌లో మంచి అవకాశం అని భావిస్తున్నారు.

Continue reading
అనిల్ రావిపూడి సెట్స్ లో అడుగుపెట్టిన వెంకటేష్

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వెంకీ అనిల్ 5 (NKRAR2) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో కలిసి కీలక సన్నివేశాల్లో వెంకటేష్ పాల్గొంటున్నారు. విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వెంకీ అనిల్ 5’ (వర్కింగ్ టైటిల్, NKRAR2) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో వెంకటేష్ నేటి నుంచి షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో చిత్రీకరణ మరింత వేగం అందుకుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి పాల్గొంటూ కథకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కావడంతో ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, వెంకటేష్, కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి స్టార్ నటీనటులు కలిసి నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కథ, పాత్రలు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్ వంటి అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తయ్యే కొద్దీ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

Continue reading
వంద కోట్లకు చేరువలో ‘మా ఇంటి బంగారం’..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూనే ఉంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ మూవీ గత నెల 18న విడుదలైంది. అయినా ఇప్పటికీ మాగ్జిమం షోస్ రన్ అవుతూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పటికి ఈ మూవీ 96.5 కోట్లు సాధించిందని నిర్మాతలు ప్రకటించారు. అంటే మరో 3.5 కోట్లు వస్తే సమంత సోలోగా చేసిన ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టబోతోందని తెలుస్తోంది. ఓ రకంగా సోలో లీడ్ గా సమంత సాధించిన విజయం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. అది కూడా పూర్తిగా మాస్ అండ్ యాక్షన్ కంటెంట్ తో. ఓ రకంగా ఆమెకు ఇది గ్రాండ్ ఫినిషింగ్ అని కూడా అంటున్నారు. అయితే “ఇది సమంత కెరీర్‌కు గ్రాండ్ ఫినిషింగ్” అని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఆమె భవిష్యత్ ప్రాజెక్టులపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రాలేదు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా ఆమె కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాతో మరోసారి తన కథ చెప్పే శైలిని నిరూపించారని ప్రేక్షకుల అభిప్రాయం. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం, భావోద్వేగాలను సహజంగా చూపించడం, కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ‘మా ఇంటి బంగారం’లో కేవలం సమంత పాత్ర మాత్రమే కాకుండా ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లేలా రూపొందించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. పాత్రల మధ్య భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, సంఘర్షణలు సినిమాకు మంచి బలంగా నిలిచాయి. అందుకే ప్రేక్షకులు సినిమాతో ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.
సినిమాకు వస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి లభిస్తున్న ఆదరణను చూస్తే వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునేందుకు చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంది.
‘మా ఇంటి బంగారం’ సమంత కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో దర్శకురాలు నందినీ రెడ్డికి కూడా ఇది కెరీర్ బెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బలమైన కథ, ప్రతి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, సమంత అద్భుతమైన నటన ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. బాక్సాఫీస్ ప్రయాణం పూర్తయ్యే నాటికి ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Continue reading
అఖిల్ ‘లెనిన్’పై భారీ అంచనాలు.. ఈసారి హిట్ కొడతాడా?

అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాగా ‘లెనిన్’ నిలుస్తోంది. ‘ఏజెంట్’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్, ఈసారి పూర్తి కొత్త లుక్, కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, కుటుంబ విలువలు, రాజకీయ అంశాలను కలిపి దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని కొన్ని సింబాలిక్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగులు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. కొంతమంది ప్రేక్షకులు కథలో పురాణాల ప్రభావం కూడా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం అఖిల్ మేకోవర్. గత సినిమాలతో పోలిస్తే ఈసారి అతను పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడు. యాక్షన్‌తో పాటు నటనకు కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. విడుదలకు ముందు జరిగిన కార్యక్రమంలో నాగార్జున కూడా అఖిల్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న యువ కథానాయికల్లో ఆమె ఒకరు. ‘లెనిన్’లో ఆమె భారతి అనే పాత్రలో కనిపించనుంది. సరదాగా ఉండే, అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడే యువతిగా ఆమె పాత్ర ఉంటుందని స్వయంగా భాగ్యశ్రీ తెలిపింది. కాబట్టి ఈ సినిమాలో ఆమె పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
భాగ్యశ్రీకి ఈ సినిమా కూడా విజయం అందించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే అది పూర్తిగా కథ, ఆమె పాత్ర నిడివి, ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అవుతుందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో మాత్రం అఖిల్-భాగ్యశ్రీ జోడీ ఆకట్టుకుంది.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే.. ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇది ఇద్దరి ఫ్యాన్స్ లో కూడా మంచి ఉత్సాహాన్ని పెంచుతుంది. విడుదలకు ముందు సినిమాకు అదనపు హైప్ రావడానికి ఇది కూడా ఒక కారణంగా మారింది.
ప్రమోషన్స్ ను బట్టి చూస్తే ‘లెనిన్’లో యాక్షన్, భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, బలమైన పాత్రలు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అయితే సినిమా నిజంగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ మాత్రం అఖిల్‌కు ఇది బలమైన కమ్‌బ్యాక్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. మొత్తానికి ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌కే కాకుండా భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌కు కూడా కీలకమైన సినిమా. కథ ప్రేక్షకులను మెప్పిస్తే ఇద్దరికీ ఇది పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉంది.

Continue reading
పెద్ది ఓటిటిలోకి వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్దికి ఓటిటి డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ప్యాన్ ఇండియా హీరోగా చెప్పినా కేవలం తెలుగులో మాత్రం మెప్పించగలిగిందీ మూవీ. సౌత్ లోని ఇతర భాషల్లో జనం పట్టించుకోలేదు. అలాగే నార్త్ అస్సలు చూడలేదు. తెలుగులో మాత్రమే హిట్ అని చెప్పగలిగారు. అయితే రామ్ చరణ్ నటన విషయంలో మాత్రం యూనానిమస్ అంతా ఒకటే చెప్పారు. అద్భుతంగా నటించాడు అని. అలాగే జాన్వీ కపూర్ ఎపిసోడ్ విషయంలో బుచ్చిబాబు రైటింగ్ వరస్ట్ గా ఉందనే టాక్ కూడా వచ్చింది. దీంతో పాటు పాత్రలను ఇంకాస్త బలంగా రాసి ఉంటే బావుండేది అని కూడా అన్నారు. కేవలం రామ్ చరణ్ పైనే ఫోకస్ చేయడం.. అందులో మూడు ఆటలతో అంటే జనం విసిగిపోయారు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే చాలాకాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో ఇచ్చిన సంగీతానికి వంద మార్కులు పడ్డాయి. అతని వర్క్ సింప్లీ సూపర్బ్ అని చెప్పారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ మూవీ ఓటిటిలోకి వస్తోంది.
ఈ నెల 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది పెద్ది. మామూలుగా థియేటర్స్ లో ఆడకపోయిన మూవీస్ కు ఓటిటిలో మంచి అప్లాజ్ వస్తుందనే దశ కూడా దాటేశారు. ఇప్పుడు థియేటర్ రిజల్ట్స్ ఓటిటిలో కూడా రిపీట్ అవుతున్నాయి. ఆ కారణంతో పెద్దికి కేవలం తెలుగులో మాత్రమే పాజిటివ్ టాక్ వస్తుంది లేక ఇతర భాషల్లో కూడా ఆడుతుందా అనేది చూడాల్సిందే.

Continue reading
రావు బహదూర్ మూవీ రివ్యూ

సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ సినిమా మొదటి పోస్టర్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పీరియడ్ డ్రామాకు ఫాంటసీ టచ్ జోడిస్తూ, విజువల్‌గా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ చిత్రం కథ, నటన, టెక్నికల్ విలువలతో ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా వెళ్లి, ఒక డిఫరెంట్ సినిమాను అందించాలనే టీమ్ ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

కథ

ఒక రాజసం ఉన్న వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు, అతని వ్యక్తిత్వం వెనుక ఉన్న నిజాలు, అధికారం, అహంకారం, మానవ సంబంధాలు, సమాజం మధ్య జరిగే సంఘర్షణలే ఈ కథకు ప్రధాన బలం. దర్శకుడు కథను నెమ్మదిగా విప్పుతూ ప్రేక్షకుడిని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కథలో ఉన్న మిస్టరీ, భావోద్వేగాలు చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తాయి.

నటీనటుల పనితీరు

సత్యదేవ్ మరోసారి తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. రావు బహదూర్ పాత్రలో అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కళ్లతో చూపించిన భావాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఆచారి పాత్రలో వికాస్ అత్యద్భుతంగా నటించాడు. అతని ఏజ్ కు చాలా ఎక్కువగా చూపించిన పాత్ర అయినా ఆ పాత్రలో తను లీనమైన విధానం మాత్రం సింప్లీ సూపర్బ్. అలాగే దీపా థామస్ కూడా బాగా చేసింది.సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసింది. ప్రతి పాత్ర కథలో భాగంగా అనిపిస్తుంది.

దర్శకత్వం

వెంకటేష్ మహా మరోసారి తన ప్రత్యేకమైన కథనం చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒక ఆర్ట్ పీస్‌లా కనిపిస్తుంది. అయితే దర్శకుడు కమర్షియల్ అంశాల కంటే కథ, పాత్రల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కొన్ని చోట్ల సినిమా నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది.

టెక్నికల్ విభాగం

ఈ సినిమాకు అతిపెద్ద బలం విజువల్స్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లా మార్చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మంచి బలం ఇచ్చింది. ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్, మేకప్ పీరియడ్ ఫీల్‌ను అద్భుతంగా తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా ఉండి ఉంటే రన్‌టైమ్ మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.

ప్లస్ పాయింట్స్

సత్యదేవ్ అద్భుతమైన నటన
వెంకటేష్ మహా ప్రత్యేకమైన కథనం
అద్భుతమైన సినిమాటోగ్రఫీ
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
విజువల్ ప్రెజెంటేషన్

మైనస్ పాయింట్స్

మొదటి భాగంలో నెమ్మదిగా సాగే కథనం
కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం
మాస్ ప్రేక్షకులకు అన్ని చోట్ల కనెక్ట్ కాకపోవచ్చు
కొన్ని సన్నివేశాలు మరింత క్రిస్ప్‌గా ఉండి ఉంటే బాగుండేది

చివరగా

‘రావు బహదూర్’ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇది విజువల్‌గా, భావోద్వేగాల పరంగా ఒక ప్రత్యేక అనుభూతిని అందించే ప్రయత్నం చేసిన సినిమా. సత్యదేవ్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పాత్రగా నిలిచే అవకాశం ఉంది. దర్శకుడు వెంకటేష్ మహా తన ప్రత్యేకమైన స్టైల్‌ను మరోసారి నిరూపించాడు.మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించే ప్రేక్షకులకు సినిమా కొంత నెమ్మదిగా అనిపించవచ్చు. కానీ మంచి కథ, బలమైన నటన, అద్భుతమైన విజువల్స్‌ను ఆస్వాదించే వారికి మాత్రం ‘రావు బహదూర్’ తప్పకుండా నచ్చే సినిమా.

రేటింగ్        : 2.5/5

ఫైనల్ వెర్డిక్ట్:

డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన విజువల్ పీరియడ్ డ్రామా.

 

Continue reading