జీ5 బిగ్ అనౌన్స్‌మెంట్.. NBK111, వెంకీ అనీల్ 5, వృషకర్మ ఓటీటీలో

జీ5 బిగ్ సర్‌ప్రైజ్.. తెలుగు ప్రేక్షకులకు భారీ ట్రీట్

OTT ప్రపంచంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్, రీజినల్ కంటెంట్… ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి ప్లాట్‌ఫామ్ కొత్త వ్యూహాలతో ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ZEE5 తన ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద మల్టీలాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను ప్రకటించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ ప్రకటనలో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే… NBK111, వెంకీ అనీల్ 5, వృషకర్మ వంటి క్రేజీ సినిమాలు ZEE5 డిజిటల్ లైనప్‌లో చోటు దక్కించుకోవడం. తెలుగు ప్రేక్షకులకు ZEE5 నుంచి భారీ గిఫ్ట్. ఈసారి ZEE5 కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు, లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కథలు, యానిమేషన్, పిల్లల కోసం ప్రత్యేక కంటెంట్‌తో ఏడు భారతీయ భాషల్లో భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

తెలుగు విభాగంలో ప్రకటించిన ప్రాజెక్టులు…

NBK111
వెంకీ అనీల్ 5
వృషకర్మ
శ్రీమతి (నివేదా థామస్)
Objection My Lord (శ్రీకాంత్)
జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో కొత్త సీజన్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK111 ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమా ZEE5 డిజిటల్ లైనప్‌లో భాగమవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే, స్ట్రీమింగ్ తేదీ లేదా డిజిటల్ విడుదలపై ZEE5 ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

వెంకటేష్ – అనీల్ రావిపూడి కాంబో

వెంకటేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వారి కొత్త చిత్రం Venky Anil 5 కూడా ZEE5 లైనప్‌లో ఉండటం ఈ ప్రకటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా థియేట్రికల్ విడుదల అనంతరం ZEE5లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఈ ప్రకటనతో స్పష్టమైంది. అయితే స్ట్రీమింగ్ సమయం తర్వాత ప్రకటించనున్నారు.
నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ కూడా ఈ లైనప్‌లో భాగమైంది. ఈ సినిమా ఇప్పటికే సినీ అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు డిజిటల్ భాగస్వామిగా ZEE5 పేరు రావడంతో మూవీపై మరింత హైప్ పెరిగింది.

సినిమాలతో పాటు ఒరిజినల్స్‌కు పెద్దపీట

తెలుగు ప్రేక్షకుల కోసం ZEE5 ప్రత్యేకంగా రెండు కొత్త ఒరిజినల్స్‌ను కూడా తీసుకొస్తోంది.

శ్రీమతి
Objection My Lord

ఇవే కాకుండా గతంలో మంచి ఆదరణ పొందిన జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోను కూడా కొత్త సీజన్‌తో తిరిగి తీసుకురానుంది.

ZEE5 వ్యూహం ఏమిటి?

ప్రస్తుతం OTT మార్కెట్‌లో కేవలం హిందీ కంటెంట్‌తో ముందుకు వెళ్లడం కష్టమవుతోంది. అందుకే ZEE5 “Language First” విధానాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్థానిక ప్రేక్షకులకు దగ్గరయ్యే కథలపై దృష్టి పెట్టింది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యాలు కూడా ప్రకటించింది.

గారడీ విశ్లేషణ

ఇటీవల తెలుగు సినిమాల డిజిటల్ హక్కుల కోసం OTTల మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. అలాంటి సమయంలో NBK111, వెంకీ అనీల్ 5, వృషకర్మ వంటి మూడు భారీ సినిమాలను ఒకేసారి తన లైనప్‌లో చూపించడం ద్వారా ZEE5 తెలుగు మార్కెట్‌పై తన ఫోకస్‌ను స్పష్టంగా చాటింది.
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రకటన డిజిటల్ లైనప్‌కు సంబంధించినది మాత్రమే. విడుదల తేదీలు, స్ట్రీమింగ్ షెడ్యూల్ లేదా ఇతర వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాబట్టి వాటి కోసం సంబంధిత చిత్రబృందాలు లేదా ZEE5 నుంచి వచ్చే తదుపరి ప్రకటనల కోసం వేచి చూడాల్సిందే.

Continue reading
విజయ్ దేవరకొండ: పదేళ్ల సినీ ప్రయాణం… విజయాలూ, వైఫల్యాలు

విజయ్ దేవరకొండ పదేళ్ల ప్రస్థానం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి కొన్నేళ్లకు ఒక కొత్త స్టార్ వస్తుంటాడు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ స్టైల్, యాటిట్యూడ్, సినిమాల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.

చిన్న పాత్రలతో ప్రారంభమైన అతని ప్రయాణం, స్టార్ హీరోగా ఎదగడం, వరుస విజయాలు, అనూహ్యమైన పరాజయాలు, మళ్లీ తిరిగి నిలబడేందుకు చేసిన ప్రయత్నాలు… ఇలా విజయ్ కెరీర్‌లో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఈ పదేళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి.

చిన్న పాత్రల నుంచి హీరో వరకు

విజయ్ దేవరకొండ మొదట నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని స్నేహితుడి పాత్రతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఆ సినిమా అతనికి మంచి అవకాశాల తలుపులు తెరిచింది.

‘పెళ్లిచూపులు’తో మొదలైన స్టార్ జర్నీ

2016లో వచ్చిన పెళ్లిచూపులు విజయ్ జీవితాన్నే మార్చేసింది. పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా, మంచి కథతో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఒక సాధారణ అబ్బాయి పాత్రలో విజయ్ చాలా సహజంగా నటించాడు. అప్పటివరకు “కొత్త హీరో”గా ఉన్న విజయ్, ఈ సినిమాతో “భవిష్యత్ స్టార్”గా మారిపోయాడు.

2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. ఈ సినిమా విడుదల సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం విజయ్ నటనకు ఫిదా అయ్యారు. కోపం, ప్రేమ, బాధ, ఆవేశం… ప్రతి భావాన్ని సహజంగా చూపించి ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత విజయ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. “రౌడీ” అనే ఇమేజ్ కూడా అప్పుడే బలపడింది.

ఒకే ఏడాదిలో మూడు హిట్లు

మహానటిలో చిన్న కానీ గుర్తుండిపోయే పాత్ర
గీత గోవిందం భారీ బ్లాక్‌బస్టర్
టాక్సీవాలా మరో సూపర్ హిట్

ప్రత్యేకంగా గీత గోవిందం విజయ్‌లోని మరో కోణాన్ని చూపించింది. అర్జున్ రెడ్డిలో కనిపించిన కోపిష్టి యువకుడికి పూర్తి భిన్నంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే పాత్రలో విజయ్ మెప్పించాడు.

భారీ అంచనాలు… ఆశించిన ఫలితం కాదు

ఈ విజయాల తర్వాత విజయ్ చేసిన డియర్ కామ్రేడ్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో నటనకు ప్రశంసలు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా నిరాశపరిచింది. ఇక్కడి నుంచే విజయ్ స్క్రిప్ట్ ఎంపికపై చర్చ మొదలైంది.

‘లైగర్’… కెరీర్‌లో అతిపెద్ద షాక్

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన లైగర్ విజయ్ కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్. కానీ సినిమా విడుదల తర్వాత తీవ్ర నిరాశ ఎదురైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ కెరీర్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

‘ఖుషి’తో కొంత ఊరట

లైగర్ తర్వాత వచ్చిన ఖుషి విజయ్‌కు కొంత ఊరటనిచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. పూర్తిస్థాయి కమ్‌బ్యాక్ కాకపోయినా, అభిమానుల్లో మళ్లీ ఆశలు పెంచింది.

విజయ్ బలం ఏమిటి?

విజయ్ దేవరకొండను ప్రత్యేకంగా నిలబెట్టేది అతని నటన మాత్రమే కాదు.
స్క్రీన్‌పై కనిపించే ఎనర్జీ
సహజమైన డైలాగ్ డెలివరీ
కొత్త తరానికి దగ్గరగా ఉండే బాడీ లాంగ్వేజ్
యువతను ఆకట్టుకునే స్టైల్
ఇవన్నీ అతని ప్రత్యేకతలు.

బలహీనత ఏమిటి?

విజయ్ కెరీర్‌ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత అదే తరహా ఇంటెన్స్ పాత్రల వైపు ఎక్కువగా వెళ్లడం, సరైన కథల ఎంపికలో కొన్ని తప్పులు చేయడం అతని కెరీర్‌పై ప్రభావం చూపింది. ప్రేక్షకులు ప్రతి సినిమాలో కొత్త విజయ్‌ను చూడాలని కోరుకుంటారు. అదే అతనికి పెద్ద సవాలు.

గారడీ విశ్లేషణ

విజయ్ దేవరకొండ కెరీర్‌ను ఒక మాటలో చెప్పాలంటే… “వేగంగా ఎదిగిన స్టార్, కష్టాలను ఎదుర్కొని మళ్లీ నిలబడేందుకు ప్రయత్నిస్తున్న నటుడు.”

Continue reading
ఘట్టమనేని జయకృష్ణను అభిమానులు ఓన్ చేసుకోలేదా..?

జయకృష్ణను ఘట్టమనేని ఫ్యామిలీ పట్టించుకోవడం లేదేంటీ..?

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. మరికొన్ని గంటల్లో అతను నటించిన శ్రీనివాస మంగాపురం మూవీ విడుదల కాబోతోంది. అయితే ఇక్కడ అనేక సందేహాలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మనవడుగా ఎంట్రీ ఇస్తున్నాడు జయకృష్ణ. అంతకు ముందే కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు మరణించి ఉన్నాడు. అతను హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అది కృష్ణకి చాలా పెద్ద లోటుగా ఉండిపోయింది. తర్వాత మహేష్ బాబు వచ్చాడు కృష్ణ ట్యాగ్ అయిన సూపర్ స్టార్ ను ఓన్ చేసుకున్నాడు. అయితే అంత త్వరగా మహేష్ బాబు స్టార్డమ్ తెచ్చుకోలేదు. చాలా ఫ్లాపుల తర్వాత గాడిలో పడ్డాడు. దీనికి తోడు మంచి నటుడు అనిపించుకున్నాడు.

రమేష్ బాబుపై మహేష్ బాబు ప్రేమ..?

మహేష్ బాబుకు అన అన్న రమేష్ బాబు అంటే చాలా ఇష్టం. ప్రేమ, గౌరవం కూడా మెండుగా ఉన్నాయి చాలామంది చెబుతుంటారు. అలాంటి తన అన్న కొడుకు హీరోగా మారాడు అంటే అతనికి సపోర్ట్ చేయాల్సిన మహేష్ బాబు మాత్రం మాగ్జిమం మౌనంగా ఉండిపోయాడు. శ్రీనివాస మంగాపురం మూవీకి సంబంధించి ఏ ఈవెంట్ కూ అటెండ్ కాలేదు. అందుకు తన వారణాసి మూవీ కారణమే అని చెబుతూ ఓ చిన్న వీడియో చేసి వదిలాడు. బట్ అది ఏమాత్రం సరిపోలేదు అనేది నిజం.

జయకృష్ణను మహేష్ ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారా..

మహేష్ బాబు దాదాపు లైట్ తీసుకున్నాడు అనేది చాలామందిలో కలుగుతున్న భావన. దర్శకుడు అజయ్ భూపతి ఎంత చెప్పినా ఈ విషయంలో అడ్జెస్ట్ కాలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రధాన విషయం ఏంటీ అంటే.. మహేష్ బాబు అభిమానులెవరూ కూడా జయకృష్ణను ఓన్ చేసుకోలేపోయారు. అతని గురించి మినిమం కూడా పట్టించుకోలేదు అనేది వాస్తవం. పాపం అతనే సొంతంగా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. రెండు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు. ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. బట్ అభిమానులు మాత్రం చాలా అంటే చాలా లైట్ తీసుకున్నారు జయకృష్ణను.
ఇలాంటి సందర్భాల్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన.. వస్తోన్న హీరోలందరితో పోలిస్తే జయకృష్ణను ఎవరూ పట్టించుకోవడం లేదు. మహేష్ బాబు తన అన్నపై చాలా గౌరవం ఉన్నా.. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన సందర్భంలో మాత్రం వదిలేయడం ఎంత వరకు సమంజసం అనేది పెద్ద ప్రశ్న. శ్రీనివాస మంగాపురంకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ ఏవీ కూడా ఆడియన్స్ నుంచి అటెన్షన్ తెచ్చుకోలేదు అనేది వాస్తవం. అతనేదో అతని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ప్రేక్షకులు మాత్రం ఈ కుర్రాడిలో హీరోను చూడలేకపోతున్నారు.

నెపోకిడ్స్ ను రుద్దడం కామన్

మామూలుగా పెద్ద కుటుంబాల నుంచి వస్తోన్న హీరోలందరు కూడా ముందుగా ప్రేక్షకులపై రుద్దబడటం కామన్ గా చూస్తున్నాం. జయకృష్ణ విషయంలో కూడా అదే జరుగుతుంది అని చాలామంది అనుకుంటున్నా.. అసలు ఆ కుటుంబం నుంచే ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అదే ఫ్యామిలీకి అల్లుడైన సుధీర్ బాబు హీరోగా మారిన టైమ్ లో అతని కోసం చాలామంది చాలా చేశారు. అతన్ని కూడా రుద్దారు. ఇప్పటికీ రుద్దడం జరుగుతూనే ఉంది. కాకపోతే సుధీర్ బాబు తన సినిమాల రిజల్ట్స్ ను పక్కన పెట్టి తనదైన శైలిని ఏర్పాటు చేసుకున్నాడు.

జయకృష్ణ స్వయంకృషే దిక్కా..

ఏదేమైనా కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు.. అతని ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా జయకృష్ణను అస్సలు పట్టించుకోలేదు అనేది తెలుస్తోంది. మరి అందుకు కారణాలేంటీ అనేది తెలియకపోయినా కుర్రాడు మాత్రం ఈ విషయాలన్నీ గమనించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం మాత్రం ఆపొద్దు అని చెప్పొచ్చు.

Continue reading
శర్వానంద్ భోగి మూవీ వాయిదా పడిందా..?

శర్వానంద్ భోగిపై లేటెస్ట్ అప్డేట్

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ భోగి. ఇదో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే మూవీ అని గతంలోనే ప్రకటించారు. సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. శర్వానంద్ ఫస్ట్ డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఊరమాస్ లుక్ తో నటిస్తున్నాడు. ఈ కథ చాలా బలంగా ఉందని చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా శర్వానంద్ ఇదో బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా భావిస్తున్నారు.

సంపత్ నందికి పెద్ద హిట్ కావాలి

సంపత్ నంది ఈ మధ్య కాలంలో సరైన విజయాలు లేక కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయినా నిర్మాతగా మాత్రం కాస్త ఫర్వాలేదు అనిపించేలాంటి మూవీస్ చేస్తున్నాడు. ఆ మూవీస్ కంటెంట్ పక్కన పెడితే కమర్షియల్ గా మాత్రం బానే వర్కవుట్ అయ్యాయి. ఈ కారణంగా తను డైరెక్ట్ చేసిన మూవీస్ పోయినా ఇబ్బంది పడకుండా ఉంటున్నాడు. అయితే భోగి మూవీ విషయంలో సంపత్ నంది మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నాడట. రీసెంట్ గా ఈ మూవీ రష్ మొత్తం శర్వానంద్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.

భోగి అవుట్ పుట్ పై శర్వానంద్ హ్యాపీ

భోగి కంటెంట్ తో పాటు సంపత్ నంది టేకింగ్ పై శర్వానంద్ చాలా ఇంప్రెస్ అయ్యాడట.దీంతో సంపత్ నందికి మరో అవకాశం ఇవ్వబోతున్నాడు శర్వానంద్. భోగి చిత్రాన్ని ఆగస్ట్ 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా చెప్పలేదు కానీ ఇప్పటికైతే ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది.

భోగి అందరికీ కీలకమే

ఏదేమైనా భోగిపై శర్వానంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సంపత్ నంది ఈ చిత్రంపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. అటు డింపుల్ హయాతి కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కు కూడా ఈ మూవీ కీలకమే అవుతుందని చెప్పొచ్చు. మరి రిజల్ట్ తర్వాత ఎవరికి ఎంత మేలు జరుగుతుందో అనేది తెలుస్తుంది.

Continue reading
విజయ్ జన నాయగన్ ఫైనల్ రిజల్ట్ ఏంటీ..?

జన నాయగన్ బిగ్గెస్ట్ డిజాస్టర్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమాగా జన నాయగన్ విడుదలైంది. నిజానికి ఈ మూవీ ఈ యేడాది జనవరి 9నే విడుదల కావాల్సి ఉంది. అప్పుడు రిలీజ్ అయితే ఎలక్షన్ కు ప్లస్ అవుతుందని అతను భావించినా సెన్సార్ కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విడుదలకు ముందే మూవీ రావడం కష్టం అని భావించారు. ఈ లోగా పైరసీకీ గురైంది. ఈ లోగా విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత వెంటనే విడుదల అనుకున్నా.. అప్పుడూ కుదరలేదు.

భగవంత్ కేసరికి రీమేక్

ఫైనల్ గా ఈ నెల 23న విడుదల చేశారు. బట్ రిజల్ట్ మాత్రం దారుణంగా వచ్చింది.
జన నాయగన్ తెలుగులో వచ్చిన భగవంత్ కేసరికి రీమేక్. అయితే ఇది కేవలం 50శాతం మాత్రమే తీసుకున్నారు అని ముందే చెప్పినా విడుదల తర్వాత చూస్తే 80శాతం వరకు అదే ఉంది. పైగా మూవీ అంతా మక్కీకి మక్కీగానే ఉంది. టేకింగ్ పరంగా మేకింగ్ పరంగా ఏ మాత్రం కొత్తదనం లేదు. అయినా విజయ్ మూవీ కాబట్టి తమిళ్ లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి అని చాలామంది భావించారు. బట్ అందుకు భిన్నంగా ఈ మూవీకి బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ తమిళ్ లోనే వచ్చింది.

జన నాయగన్ ను పట్టించుకోని ప్రేక్షకులు

ఎలెక్షన్స్ టార్గెట్ గా తీసిన మిగతా 20శాతం ఇప్పుడు అవసరం లేకపోవడంతో మరింత మైనస్ గా మారింది. ఆ కారణంగా జన నాయగన్ చూసిన వాళ్లంతా.. ఇంకా చెబితే విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. దీంతో ఈ చిత్రంలో డిలీట్ చేసిన ఒక 6సీన్స్ ను మళ్లీ యాడ్ చేస్తున్నాం అని మూవీ టీమ్ ప్రకటించింది. బట్ ఇప్పటికే జరగాల్సిన నష్టమే అయితే జరిగింది. ఈ టైమ్ లో కొన్ని సీన్స్ ను యాడ్ చేయడం వల్ల ఒరిగేదేంటీ అని చాలామంది ఫీలవుతున్నారు.

విజయ్ లాస్ట్ మూవీ డిజాస్టర్ గా

ఏదేమైనా విజయ్ మూవీ అంటే భారీ క్రేజ్ ఉంటుంది. పైగా అతని లాస్ట్ మూవీ అని కూడా జనం ఎగబడి చూస్తారు అనుకున్నారు. కానీ కంటెంట్ లో దమ్ము లేకపోతే జనం అస్సలు పట్టించుకోరు అని జన నాయగన్ తో మరోసారి ప్రూవ్ అయింది.ఏదేమైనా విజయ్ లాస్ట్ మూవీతో ఇలాంటి డిజాస్టర్ చూడ్డం కాస్త బాధాకరమే.

Continue reading
కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయడమేంటి

కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్

ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వెలిగిన వాళ్లంతా ఆఫర్స్ తగ్గగానే ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకునేవారు. మెల్లగా ట్రెండ్ మారింది. టాప్ హీరోయిన్ లుగా వెలుగుతున్న టైమ్ లో కూడా ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. అయితే వారి ఇమేజ్ కు తగ్గట్టుగా మాత్రమే ఇది కనిపించేది. అలాంటిది కీర్తి సురేష్ కూడా ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటే మాత్రం చాలామంది నమ్మలేకపోతున్నారు. బట్ ఇది నిజం. కీర్తి సురేష్ కూడా ఇప్పుడు ఐటమ్ లో చిందేస్తోంది.

వరుస మూవీస్ తో బిజీ

కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా బాగా బిజీగా మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది అని తెలుస్తోంది. దీంతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ సరసన మరో మూవీ చేస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్, కృతిశెట్టి మరో జంటగా నటిస్తున్నారు. వీటితో పాటు తమిళ్ లో కూడా మరికొన్ని మూవీస్ చేస్తోంది. అలాంటి టైమ్ లో కీర్తి సురేష్ సడెన్ గా ఐటమ్ సాంగ్ చేయడం ఆశ్చర్యమే.

ద ప్యారడైజ్ మూవీలో స్పెషల్ సాంగ్

Keerthy Suresh Movies, The Paradise Movieనేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘ద ప్యారడైజ్’మూవీలో కీర్తి సురేష్ ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఇది ఈ నెల 28నుంచే చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది కదా. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఐటమ్ సాంగ్ పెద్ద బ్యాలన్స్ గా ఉంది. ఈ పాట కేవలం నాని కోసమే చేస్తోంది అనేది చాలామందికి తెలిసిన విషయం. నానితో కీర్తి సురేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ కారణంగానే ఈ ఐటమ్ లో చిందేస్తోందా లేక ఫ్యూచర్ లో కూడా ఈ టైప్ స్పెషల్ సాంగ్స్ తో నర్తిస్తుందా అనేది చూడాలి.
కానీ కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయడం ఆమె అభిమానులకు కాస్త మింగుడు పడని విషయమే అని చెప్పాలి.

Continue reading
అనిల్ రావిపూడిని ఫాలో అయిన త్రివిక్రమ్

వెంకటేష్ ఆదర్శ కుటుంబం గ్లింప్స్

మూవీ ప్రమోషన్స్ అంటే ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడిని చూసే అంతా నేర్చుకోవాలని అంటున్నారు. చాలా ఇన్నోవేటివ్ గా, అట్రాక్టివ్ గా ముఖ్యంగా ఆడియన్స్ మైండ్ లోకి ఇమ్మీడియెట్ గా చొచ్చుకుపోయేలా అతను ప్రమోట్ చేస్తుంటాడు. దీంతో చాలామంది ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి అని ఫిక్స్ అయిపోతుంటారు. అదీ అనిల్ రావిపూడి స్టైల్. ఇప్పుడు అనిల్ రావిపూడిని ఫాలో అవుతూ ఆదర్శకుటుంబం ప్రమోషన్ మొదలు పెట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తోన్న మూవీ ఇది. అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ మేరకు గతంలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్. అయితే ఈ గ్లింప్స్ చూడగానే అందరికీ గుర్తొచ్చింది కేవలం అనిల్ రావిపూడినే. అతని స్టైల్లోనే ఆదర్శ కుటుంబం గ్లింప్స్ కనిపిస్తోంది.

అనిల్ రావిపూడి స్టైల్ లో గ్లింప్స్

శ్రీనిధి శెట్టి, వెంకటేష్ ఓ కొత్త ఇంటికి వెళతారు. అక్కడ ఉన్న వస్తువులన్నీ చూసి నీకు ఎంత బాగా పనిచేస్తాయో అంటూ శ్రీనిధి శెట్టి, వెంకటేష్ కు చెబుతూ ఉండటం.. దానికి కౌంటర్ గా రఘుబాబు చాలా చీప్ గా వెంకీని చూడటం చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఓ రకంగా ఎఫ్ 2 లో వెంకటేష్, రఘుబాబు పాత్రలను కొనసాగించినట్టుగానూ ఉంది. మొత్తంగా ఈ గ్లింప్స్ అయితే చూడగానే ఆకట్టుకునేలా ఉంది అనేది చెప్పొచ్చు.
అయితే ఆదర్శ కుటుంబంలో కూడా వెంకటేష్ కూడా తన భార్య కింద నలిగిపోయే పాత్రే చేస్తున్నట్టుగా ఉంది. త్రివిక్రమ్ స్టైల్ లో ఈ మూవీని రూపొందిస్తున్నారని అర్థమైంది. కాకపోతే ఫ్లేవర్ అంతా అనిల్ రావిపూడిదే ఉండటం కొంత ఇబ్బందిగా ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆదర్శ కుటుంబలో నారా రోహిత్ కూడా

ఇక కొసమెరుపేంటంటే.. ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్ పోలీస్ అధికారి పాత్రలో నటించడం. మరి అతని పాత్ర ఎలా ఉంటుంది అనేది ఇలా ప్రమోషన్స్ లో చెబుతారా లేక డైరెక్ట్ గా మూవీలోనే చూడాలా అనేది తెలియాల్సి ఉంది.

 

Continue reading
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ

తెలుగు సినిమా చరిత్రలో దర్శకులంటే గుర్తొచ్చే పేర్లు చాలా ఉన్నాయి. కానీ కథ చెప్పే విధానం, పాత్రల నిర్మాణం, పాటల చిత్రీకరణ, భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించే తీరు వల్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ప్రేక్షకులే ఆయనకు “క్రియేటివ్ డైరెక్టర్” అనే బిరుదు ఇచ్చారు.కెరీర్‌లో ఎన్నో విజయాలు, కొన్ని పెద్ద అపజయాలు ఎదురైనా తన కథ చెప్పే శైలిని మార్చకుండా ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత.

గులాబీతో మొదలైన ప్రయాణం

1995లో వచ్చిన గులాబీ కృష్ణవంశీని దర్శకుడిగా పరిచయం చేసింది. రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసినప్పటికీ, తొలి సినిమాతోనే తనదైన విజువల్ స్టైల్, భావోద్వేగాలను చూపించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. పాటల చిత్రీకరణ, ప్రేమకథను చెప్పిన తీరు అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నిన్నే పెళ్లాడతా కృష్ణవంశీ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కుటుంబ కథలను కూడా అందంగా, వినోదాత్మకంగా చెప్పొచ్చని నిరూపించిన సినిమా ఇదే. నాగార్జున, టబు నటనతో పాటు కుటుంబ బంధాలను చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది.

సిందూరం.. సాహసోపేత ప్రయత్నం

నక్సలిజం నేపథ్యంలో రూపొందిన సిందూరం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రియలిస్టిక్ కథనం, భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణాన్ని చూపించిన తీరు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

అంతఃపురం.. రియలిజానికి నిదర్శనం. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన అంతఃపురం ఇప్పటికీ కృష్ణవంశీ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. హీరోయిజం కంటే మనుషుల జీవితాలను, భయాలను, కుటుంబ బంధాలను ముందుకు తీసుకువచ్చిన తీరు ఈ సినిమాకు ప్రత్యేకత.

మురారి.. మహేష్ బాబులోని నటుడిని వెలికితీసిన సినిమా. మురారి మహేష్ బాబు కెరీర్‌లో ముఖ్యమైన చిత్రాల్లో ఒకటి. కుటుంబ విలువలు, గ్రామీణ నేపథ్యం, ఆధ్యాత్మిక అంశాలను మేళవిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఖడ్గం కృష్ణవంశీ కెరీర్‌లో మరో మైలురాయి.

దేశభక్తి, మత సామరస్యం, సినిమా పరిశ్రమ, ప్రేమ వంటి విభిన్న అంశాలను ఒకే కథలో మిళితం చేస్తూ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు, సంభాషణలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి.

ప్రయోగాలు… విజయాలు… అపజయాలు

ఖడ్గం తర్వాత శ్రీ ఆంజనేయం, చక్రం, రాఖీ, చందమామ, మహాత్మా, గోవిందుడు అందరివాడేలే వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కొన్ని సినిమాలు మంచి స్పందన పొందగా, మరికొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయినప్పటికీ కొత్త అంశాలను ప్రయత్నించాలనే తపన మాత్రం ఆయనలో ఎప్పుడూ కనిపించింది.

కృష్ణవంశీ సినిమాల్లో కనిపించే ముఖ్యమైన అంశాలు:

బలమైన కుటుంబ భావోద్వేగాలు
విభిన్న పాత్రల నిర్మాణం
గ్రామీణ నేపథ్యాల సహజ చిత్రణ
కథలో భాగంగా ఉండే పాటలు
మహిళా పాత్రలకు ప్రాధాన్యం
సమాజానికి సంబంధించిన అంశాలపై దృష్టి
ఇవే ఆయనను ఇతర దర్శకుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి.

కెరీర్‌లో ఎదురుదెబ్బలు

కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఆ మార్పులకు అనుగుణంగా వచ్చిన కొత్త కథన శైలితో పోలిస్తే, కృష్ణవంశీ కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు.అయితే ఆయన దర్శకత్వ శైలి, కథల ఎంపిక, భావోద్వేగాల చిత్రణకు ఇప్పటికీ ప్రత్యేక అభిమానులు ఉన్నారు.

ముగింపు

తెలుగు సినిమా చరిత్రలో కృష్ణవంశీ పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. హిట్లు, ఫ్లాపులు ప్రతి దర్శకుడి కెరీర్‌లో సహజమే. కానీ ఒక దర్శకుడిని గుర్తుంచేది అతని విజయాల కంటే అతను సృష్టించిన సినిమాల ప్రభావం. ఆ కోణంలో చూస్తే గులాబీ, నిన్నే పెళ్లాడతా, సిందూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం వంటి చిత్రాలు కృష్ణవంశీని తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

Continue reading
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక యువత శక్తి

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం

దేశ రాజకీయాల్లో కొన్ని సంఘటనలు కేవలం వార్తలుగానే మిగలవు. అవి ఒక తరం ఆలోచనలను, ప్రజాస్వామ్యం బలాన్ని గుర్తు చేస్తాయి. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా అలాంటి సంఘటనగానే చర్చకు వస్తోంది.

కొన్ని వారాలుగా కొనసాగిన విద్యార్థుల ఆందోళనలు, పరీక్షల నిర్వహణపై వచ్చిన విమర్శలు, నిరుద్యోగ యువతలో పెరిగిన అసంతృప్తి చివరకు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారాయి. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అనే కొత్త వేదిక ఊపునిచ్చింది.

ఎలా మొదలైంది ఈ ఉద్యమం?

మొదట్లో ఇది కేవలం పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులపై ప్రశ్నలతో ప్రారంభమైంది. ముఖ్యంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విషయంలో వచ్చిన వివాదాలు వేలాది మంది విద్యార్థుల్లో ఆగ్రహాన్ని పెంచాయి.

అదే సమయంలో సోషల్ మీడియాలో యువత పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రారంభించింది. ఈ అసంతృప్తిని ఒకే వేదికపైకి తీసుకురావడంలో CJP కీలక పాత్ర పోషించింది.

జంతర్ మంతర్ నుంచి జాతీయ ఉద్యమంగా

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగార్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.

కొన్ని చోట్ల పోలీసుల చర్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనలు మరింత వైరల్ కావడంతో ఉద్యమానికి దేశవ్యాప్తంగా సానుభూతి పెరిగింది.

సోషల్ మీడియా పాత్ర ఎంత?

ఈ ఉద్యమం ఒక విషయాన్ని స్పష్టంగా చూపించింది. ఇప్పుడు సోషల్ మీడియా కేవలం వినోద వేదిక కాదు. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే, ఉద్యమాలను విస్తరించే శక్తివంతమైన సాధనం.

గతంలో ప్రధాన మీడియా సంస్థలు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షించగలిగేవి. ఇప్పుడు ఒక సాధారణ యువకుడి పోస్టు కూడా జాతీయ చర్చకు కారణమవుతోంది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు కీలకం?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చాలా మంది సాధారణ రాజకీయ పరిణామంగా చూడడం లేదు. ఇది ప్రభుత్వంపై పెరిగిన ప్రజా ఒత్తిడికి ప్రతిస్పందనగా భావిస్తున్నారు.

కొన్ని మీడియా నివేదికల ప్రకారం విద్యార్థుల ఆందోళనలు, పరీక్షల నిర్వహణపై వచ్చిన విమర్శలు, ప్రజా అసంతృప్తి ఈ నిర్ణయానికి దారితీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ప్రభుత్వం అధికారికంగా రాజీనామాకు వేరే కారణాలు చెప్పినా, ప్రజల దృష్టిలో మాత్రం ఈ ఉద్యమం ప్రభావం స్పష్టంగా కనిపించింది.

యువతకు ఈ ఉద్యమం ఇచ్చిన సందేశం

ఈ మొత్తం పరిణామం యువతకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం హక్కు. సమస్యలను శాంతియుతంగా ప్రస్తావించడం బాధ్యత. ఒక్కోసారి చిన్నగా మొదలైన ఉద్యమాలు కూడా దేశవ్యాప్తంగా మార్పులకు కారణం కావచ్చు.

గారడి విశ్లేషణ

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి ఎవరి రాజకీయ అభిప్రాయం ఎలా ఉన్నా, ఒక విషయం మాత్రం స్పష్టం. ఈ ఘటన భారత యువతలో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని బయటపెట్టింది.

ప్రశ్నించే స్వరం ఎంత బలంగా ఉంటుందో, ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఎంత ముఖ్యమో ఈ ఉద్యమం మరోసారి గుర్తు చేసింది.
చివరికి ఈ ఉద్యమం చెప్పిన సందేశం ఒక్కటే…
‘‘పోరాడితే పోయేదేమీ లేదు… బానిస సంకెళ్లు తప్ప.”

Continue reading
చెన్నై లవ్ స్టోరీకి అసలు ఛాలెంజ్ ముందుంది..

చెన్నై లవ్ స్టోరీకి అసలు ఛాలెంజ్ ముందుంది

కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బేబీ విజయంతో సాయి రాజేష్, ఎస్కేఎన్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉండటంతో ఈ సినిమాను కూడా “కల్ట్”, “క్లాసిక్”, “ఎపిక్” అంటూ బలంగా ప్రమోట్ చేశారు. అయితే సినిమా విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తోంది.

చెన్నై లవ్ స్టోరీ కథలో కొత్తదనం ఎంత?

సినిమా ప్రారంభం నుంచే హీరోయిన్ జీవితంలో జరిగిన బ్రేకప్ చుట్టూనే కథ తిరుగుతుంది. పెళ్లి వరకు వెళ్లిన ప్రేమ ఒక్కసారిగా ముగియడంతో ఆమె మానసికంగా కుంగిపోతుంది. ఇదే సమయంలో హీరో జీవితంలోకి రావడం, ఇద్దరి మధ్య స్నేహం పెరగడం, ఆ తర్వాత ప్రేమగా మారడం కథలో ప్రధాన అంశం.

అయితే ఈ ప్రేమ ప్రయాణం ప్రేక్షకులను పూర్తిగా కన్విన్స్ చేయలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా బ్రేకప్ నుంచి హీరోయిన్ అంత త్వరగా బయటపడటం, హీరోతో ప్రేమలో పడటం కొంతమందికి సహజంగా అనిపించలేదు.ఫస్ట్ హాఫ్‌లో కథ నెమ్మదిగా ముందుకు వెళ్లినా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కిరణ్ అబ్బవరం కూడా తన పాత్రకు తగ్గట్టే అమాయకమైన నటనతో కనిపిస్తాడు.

కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సినిమా పూర్తిగా మరో దిశలోకి వెళ్తుంది.

సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫాంటసీ ఎలిమెంట్స్, ఆత్మ కాన్సెప్ట్, దానికి సంబంధించిన సంఘటనలు అందరికీ ఒకేలా కనెక్ట్ కావు. కొన్ని సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లకుండా సాగదీసిన భావన కలిగిస్తాయి.ప్రత్యేకంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఎమోషనల్ బిల్డప్, త్యాగం చుట్టూ తిరిగే ఎపిసోడ్లు బలంగా రాసి ఉంటే సినిమా ప్రభావం మరింత పెరిగేదనే అభిప్రాయం కలుగుతుంది.

పాత్రలు ఎలా ఉన్నాయి?

కిరణ్ అబ్బవరం తనకు అలవాటైన నేచురల్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శ్రీ గౌరీ ప్రియ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రలో భావోద్వేగ మార్పులు చాలా వేగంగా జరగడం వల్ల ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ కావడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్లు కథకు అవసరమైనంత వరకు మాత్రమే పరిమితమయ్యాయి.

కథనం ఎందుకు బలహీనంగా అనిపించింది?

ఈ సినిమాకు ప్రధాన బలహీనత కథ కాదు… కథనమే.కొన్ని కీలక సంఘటనలకు సరైన బిల్డప్ లేకపోవడం, పాత్రల నిర్ణయాలకు బలమైన కారణాలు చూపించకపోవడం వల్ల భావోద్వేగాలు పూర్తిగా పనిచేయవు.అలాగే రెండో భాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉన్నాయనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.

ప్రమోషన్లు సినిమాకు ప్లస్ అయ్యాయా?

సినిమా విడుదలకు ముందు “కల్ట్”, “క్లాసిక్”, “ఎపిక్” వంటి పదాలను విస్తృతంగా ఉపయోగించారు. అలాంటి భారీ అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు కొత్త అనుభూతిని ఆశిస్తారు. కానీ తెరపై కనిపించింది మాత్రం చాలా వరకు రెగ్యులర్ లవ్ స్టోరీనే అన్న భావన కొంతమంది ప్రేక్షకుల్లో కనిపిస్తోంది.

సినిమా గురించి ఇలాంటి ట్యాగ్స్‌ను ప్రేక్షకులే విడుదల తర్వాత ఇస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ముందే వాటిని ప్రమోషన్‌లో ఎక్కువగా ఉపయోగించడం అంచనాలను అనవసరంగా పెంచినట్లు అనిపిస్తుంది.

GAARADI Verdict

చెన్నై లవ్ స్టోరీలో మంచి భావోద్వేగ ప్రేమకథ చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. నటీనటులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ కథనం బలహీనపడటం, రెండో భాగంలో వచ్చే ఫాంటసీ ఎలిమెంట్స్ పూర్తిగా కనెక్ట్ కాకపోవడం వల్ల సినిమా ఆశించిన స్థాయికి చేరలేకపోయింది.ముఖ్యంగా రిలీజ్‌కు ముందు ఏర్పడిన భారీ హైప్ ఈ సినిమాపై మరింత ఒత్తిడిని తీసుకొచ్చింది. అదే చివరకు సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది.
ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి చూడొచ్చు. కానీ కొత్త అనుభూతి లేదా “కల్ట్ క్లాసిక్” స్థాయి సినిమా ఆశించి వెళ్తే మాత్రం కొంత నిరాశ కలిగించే అవకాశం ఉంది.

Continue reading