విజయ్ విడాకుల వ్యవహారం ఎటు తేలింది..?

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ విడాకుల వ్యవహారం ఎటూ తేలకుండా ఆగిపోయింది. విజయ్ భార్య సంగీత సొర్ణలింగం ఈ యేడాది ఆరంభంలోనే విజయ్ తో విడాకులు కావాలని కేస్ వేసింది. ఈ కేస్ లో తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది సంగీత. విజయ్ కి వివాహేతర సంబంధం, తనపై మానసిక వేధింపులు, ఎమోషనల్ నెగ్లీజెన్స్ ఆరోపిస్తూ సంగీత విడాకుల కోసం దాఖలు చేసింది. ఆ కేస్ ఏప్రిల్ 20న హియరింగ్ కు వచ్చింది. ఇదే సమయంలో విజయ్ రాజకీయంగా, ఎన్నికల కారణంగా చాలా బిజీగా ఉండిపోయాడు. దీంతో 20న హాజరు కాలేను అని లాయర్స్ ద్వారా అభ్యర్థించాడు. దీనికి మన్నించిన కోర్ట్ జూన్ 15న హియరింగ్ అని చెప్పింది. ఇవాళ జూన్ 15న. బట్ ఆ ఇద్దరూ కోర్ట్ కు హాజరు కాలేదు.
కోర్టు విచారణ సందర్భంగా, అధికారిక అనుమతి పత్రం (వకాలత్‌నామా) దాఖలు చేయకపోవడం, ఇరు పక్షాల వారు స్వయంగా హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఇప్పుడు ఆగస్టు 7కి నిర్ణయించబడింది.
విచారణకు ఇద్దరూ హాజరు కాలేదు అంటే ముందు నుంచీ వస్తోన్న వార్తలకు మరింత బలం చేరింది. ఈ ఇద్దరూ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అని కొందరు.. లేదూ విజయ్ తల్లితండ్రి శోభ, చంద్రశేఖర్ చేసిన రాయబారం వల్ల ఈ ఇద్దరు మళ్లీ కలిసిపోతున్నారు అని మరికొందరు అంటున్నారు. మాగ్జిమం ఇద్దరూ మళ్లీ కలిసిపోవడం ఖాయం అనేది మెజారిటీ జనాల అభిప్రాయం. ఏదేమైనా ఇద్దరి మధ్య సంధి కుదిరినట్టుగానే చాలామంది భావిస్తున్నారు. మరి ఫైనల్ గా ఆగస్ట్ 7న అసలు విషయం తేలిపోతుందేమో చూడాలి.

Continue reading
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా

భారతీరాజా .. వెండితెరపై గ్రామీణ భారతాన్ని ఎంతో అద్భుతంగా సెల్యులాయిడ్ చేసిన దర్శకుడు. ఒకటీ రెండు కాదు.. ఎన్నో సినిమాల్లో విలేజ్ లవ్ స్టోరీస్ తో పాటు వారి జీవన విధానాల్ని అక్కడి మట్టి వాసనలంత సహజంగా పిక్చరైజ్ చేశాడు.. ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయని వెండితెరపై ఎర్రగులాబీలు పూయించి, థ్రిల్లర్ సినిమాలతో టిక్ టిక్ టిక్ మనిపించాడు. పదహారేళ్ల వయసు నుంచే మొదలైన భారతీరాజా సంచలనం నిన్నా మొన్నటి వరకూ కొనసాగింది. తెలుగు తెరపైనా తనదైన ముద్రవేసిన భారతీరాజా కన్నుమూశారు. ఎన్నో మరపురాని చిత్రాలతో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని మిగుల్చుకున్న భారతీరాజా చిత్రాల్ని ఓ సారి గుర్తు చేసుకుందాం ..

దక్షణభారత దేశ చరిత్రలో ఎంతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భారతీరాజా.. అసిస్టెంట్ గా కెరీర్ మొదలుపెట్టింది.. పి పుల్లయ్య దగ్గర. ఆయన మన తెలుగు దర్శకుడే. తర్వాత కన్నడ స్టార్ డైరెక్టర్ పుట్టన్న కనగల్, మళయాల చిత్రదర్శకుడు కృష్ణ నాయర్ వద్ద ఓనమాలు నేర్చుకున్నాడు.. కానీ తనకంటూ ఓ శైలిని అప్పుడే ఏర్పాటు చేసుకున్నట్టుగా అద్భుతమైన స్క్రిప్ట్ సమకూర్చుకున్నాడు. అదే పదహారు వయదినిలే. పరువానికి వచ్చిన అమ్మాయిల కలలు, ఊహలు ఎలా ఉంటాయి.. ఊహలకు వాస్తవాలకు మధ్య దూరమెంత అంటూ భారతీరాజా వెండితెరపై వేసిన పెయింటింగ్ ఇండియా అంతా సంచలనం అయింది.. ఆ సినిమానే తర్వాత రాఘవేంద్రరావు తెలుగులో పదహారేళ్ల వయసుగా రీమేక్ చేశాడు.
తర్వాత తెలుగులో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ ను హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో కిజక్కే పోగుమ్ రైల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కూడా గ్రామీణ వాతావరణంలో సాగే ప్రేమకథే. అంచనాలను మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎన్నో కేంద్రాల్లో యేడాది పాటు ఆడి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రాన్నే తర్వాత బాపు తెలుగులో తూర్పువెళ్లేరైలుగా రీమేక్ చేశారు.. మోహన్, జ్యోతి జంటగా నటించారు.
రెండు వరుస హిట్స్ వచ్చాయనో లేక, అతని ఎదుగుదలను ఓర్వలేకో కానీ కొందరు తమిళ చిత్ర ప్రముఖులు భారతీరాజా గ్రామీణ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు అనే ముద్రవేశాడు. దీంతో భారతీరాజా ‘‘సిగప్పుడ రోజాక్కల్’ అనే సినిమా చేశాడు. కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఆ సినిమా తెలుగులో ఎర్రగులాబీలుగా డబ్ అయింది. ఇక్కడే కాదు.. ఈ సినిమా అక్కడా బ్లాక్ బస్టర్ సాధించింది. అలాగే కమల్ తోనే థ్రిల్లర్ సినిమా ‘టిక్ టిక్ టిక్’ తీసి విమర్శకుల నోళ్లు మూయించాడు భాగ్యరాజా.
కెమెరా యాంగిల్స్ ను కొత్తగా పరిచయం చేశాడు భారతీరాజా. అప్పటి వరకూ ఉన్న ట్రెండ్ కు పూర్తి భిన్నంగా పిక్చరైజేషన్ స్టార్ట్ చేశాడు. ఇక ఎంచుకునే కథల్లో సినిమాకు అనుగుణంగా కాకుండా ఒరిజినాలిటీకి అతి దగ్గరగా సెట్ చేసుకున్నాడు. అటే లొకేషన్స్ విషయంలోనూ అదే చేశాడు. అందుకే ఆడియన్స్ కు భారతీరాజా సినిమా పై గురి పెరిగింది.
ఇక భారతీ రాజా సృష్టించిన మరో సంచలనం టీనేజ్ లవ్ స్టోరీగా తీసిన ‘అలగై ఓవితల్లై’. కార్తీక్, రాధ జంటగా రూపొందించిన ఈసినిమా పై ఆ రోజుల్లో కొన్ని విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం దుమ్మురేపింది. దాన్నే తెలుగులో సీతాకోక చిలుకగా కార్తీక్ హీరోగా ముచ్చర్ల అరుణ హీరోయిన్ గా తెరకెక్కించాడు.. ఇక్కడా ఆ చిలుక అదిరిపోయే హిట్ అందుకుంది..
ముఖ్యంగా సీతాకోక చిలుకలో అప్పటి వరకూ శృంగార తారగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత చేత అద్భుతమైన పాత్ర చేయించాడు భారతీరాజా. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించిన అవతలి వారిలోని ప్రతిభను గుర్తించడంలో భారతీరాజా స్పెషాలిటీని గుర్తు చేస్తుందా పాత్ర.. అందుకే సిల్క్ కూడా ఈ పాత్రలో అద్భుతమైన అభినయాన్ని చూపించింది.
ఎనభైయవ దశకం అంతా భారతీరాజా సంచలన విజయాలతో నిండిపోయింది. అద్భుతమైన చిత్రాలు.. అదరిపోయే విజయాలతో భారతీ రాజా దక్షిణాది చిత్రసీమపై తిరుగులేని ముద్ర వేశాడు. వీటిలో చాలా సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి.. లేదంటే డబ్ అయి, అక్కడా అంతే స్థాయిలో విజయాల్ని సాధించాయి. అయితే తొలినాళ్లలో వచ్చిన విమర్శల ప్రకారం భారతీరాజా నిజంగానే గ్రామీణ కథలతోనే ఎక్కువ విజయాలు సాధించాడు. అందులో ‘మాన్ వాసనై’ ఒకటి. ఇదే చిత్రం తెలుగులో మంగమ్మగారి మనవడు గా రీమేక్ అయింది.
భారతీరాజా సినిమాల్లో పాత్రలు అనుభవించే పెయిన్ ప్రేక్షకులూ అదే స్థాయిలో ఫీలవుతారు. అదే భారతీరాజా విజయానికి ప్రధాన కారణం. మూతల్ మరియాదై అనే ఓ మధ్యవయస్కుడి కథతో చేసిన సినిమా దేశవ్యాప్తంగా సంచలనం అయింది. నటీనటుల అద్భుత అభినయానికి తోడు, ఆ కథను భారతీరాజా నడిపించిన విధానికి ఎవరి హృదయమైనా బరువెక్కాల్సిందే. ఈ సినిమా తెలుగులో ఆత్మబంధువుగా డబ్ అయి.. సూపర్ హిట్ అయింది.
అలాగే భారతీరాజా సృష్టించిన మరో మాసివ్ అండ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఆరాధన. తెలుగులో చిరంజీవి పోషించిన పాత్రలో తమిళంలో ముందుగా సత్యరాజ్ నటించాడు.. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారతీరాజానే డైరెక్ట్ చేశాడు. ఆరాధనలోని పాటలన్నీ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే..అసలు ఇలాంటి ఓ టిపికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేయాలనే భారతీరాజా ఆలోచనకే హ్యాట్సాఫ్ చెప్పాలి..
అయితే క్లాసికల్ చిత్రాల దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు అవార్డులు సాధించిన భారతీరాజా చాలాసార్లు ఎన్నో విమర్శలు కూడా ఫేస్ చేశాడు. ముఖ్యంగా రాజాకు తెలుగువాళ్లంటే ఇష్టం ఉండదు అనేది బహిరంగ రహస్యం. అలాగే తమిళనాడు అంతా వ్యతిరేకించే అప్పటి ఉగ్రవాద గ్రూప్ అధిపతి ప్రభాకరన్ ను కలిసి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కొన్నాళ్ల క్రితం తన స్వీయదర్శకత్వంలోనే రూపొందించిన ‘‘అన్నకోడి’’ అనే సినిమాలో తెలుగువారిపై తన విద్వేషాన్ని వెల్లగక్కాడు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది..
భారతీరాజా దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించాడు. చాలాసార్లు ముక్కుసూటి తనంతో మరికొన్ని సార్లు దుడుకుతనంతో విమర్శలపాలయ్యాడు. ఓ రకంగా భారతీరాజాకు ఉన్న ఇమేజ్ కు కాస్త క్లీన్ సర్టిఫికెట్ కూడా ఉండి ఉంటే ఆయన్ని గౌరవించే వారి సంఖ్య ఇంకా చాలా పెరిగి ఉండేదని సన్నిహితులే చెబుతారు.. అలాగే ఇప్పుడు తెలుగు, తమిళ సీమల్లో టాప్ హీరోయిన్ గా వెలుగుతోన్న కాజల్ ను తెరకు పరిచయం చేసింది ఆయనే. అయితే కొన్ని రోజుల క్రితం కాజల్ కు డిసిప్లిన్ లేదని.. ఆమెను అనవసరంగా తను ఇంటర్ డ్యూస్ చేశానని చెప్పి సంచలనం సృష్టించాడు..
విమర్శలు, వివాదాలూ పక్కనబెడితే, ఆయన దర్శకుడిగా కెరీర్ ప్రారంభించింది మన తెలుగువాడైన పి పుల్లయ్య దగ్గరే. అలాగే మనం కమెడియన్ అనుకుంటున్న సుధాకర్ ను తమిళనాట స్టార్ హీరోను చేసింది కూడా భారతీరాజానే. అయినా తెలుగువారంటే ఆయనకెందుకు ఇష్టం ఉండదో కానీ, ఓ దర్శకుడిగా, సృజనాత్మకత ఉన్నవాడిగా భాషతో, వివాదాలతో సంబంధం లేకుండా భారతీరాజా ప్రతి ఒక్కడి హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్నాడు. అలాంటి దర్శకుడు మళ్లీ వస్తాడనేది కూడా అనుమానమే అని ఎంతో మంది సినీ పెద్దలు ఇప్పటికీ అంటూ ఉంటారు.. ఏదేమైనా భారతీరాజాకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను రంజింప చేయాలని కోరుకుందాం..

Continue reading
ప్రపంచంలో అతనే తొలి దర్శకుడు

ఏజ్ తో పని ఏముందీ అంటుంటారు. కానీ ఒక వయసు దాటితేనే రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు చాలామంది. బట్ ఈయన విషయంలో అది మినహాయింపు. ఈ వయసులో కూడా ఉరకలెత్తే ఉత్సాహంతో కనిపిస్తుంటాడు. అసలు తనకు ఏజ్ గురించి గుర్తుకు కూడా లేదు అంటే ఆశ్చర్యం లేదు. ఆయనే సింగీతం శ్రీనివాసరావు. ఆయన పేరు చెబితే ఇండియన్ స్క్రీన్ మీద ఈయన చేసిన ప్రయోగాలకు లెక్కే లేదు అనిపిస్తుంది. అసలు ఇన్ని ఎక్స్ పర్మెంట్స్ తో కమర్షియల్ గా విజయాలు సాధిస్తారా అని కూడా అనుకుంటారు.ఆ విషయంలో కూడా అదరగొట్టాడు సింగీతం. ఎలాంటి ఎక్స్ పర్మెంట్ అయినా కమర్షియల్ గా కూడా పెద్ద విజయాలు సాధించాడు. అదే అత్యంత అరుదైన విషయం కూడా. పుష్పక విమానం లాంటి మూకీ మూవీతో అద్భుత విజయం సాధించాడు. అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, ఆదిత్య 369,భైరవద్వీపం, మేడమ్ వంటి చిత్రాలు మచ్చుకు కొన్ని మాత్రమే. అలాంటి మనిషి ఇప్పుడు 94యేళ్ల వయసులో ఓ మూవీ చేశాడు. సింగ్ గీతం అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఇది కూడా ఆయన శైలిలో అంతా కొత్తదనంతో కూడిన చిత్రమే. ఎక్కువగా పాటలతో సాగే కథనంలా ఉండబోతోందీ మూవీ. మాటల్లోనే పాటలుగా సాగుతుంది అనిపించేలా ఉంది. రీసెంట్ గా విడుదలైన పాటలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది.
ఈ ఏజ్ లో కూడా ఇలాంటి ఎక్స్ పర్మెంట్ అంటే మామూలు విషయం కాదు. ఇక విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాత. అతనికీ ఈ దర్శకుడు అంటే ఆరాధన. దీంతోనే ఈ చిత్రాన్ని నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడీ చిత్రానికి. ప్రమోషన్స్ కూడా కొత్తగానే ఉన్నాయి. అయాన్ కే హీరోగా నటించాడు. షాలినీ కొండేపూడి విలన్ గా నటించింది. మరి ఈ చిత్రంతో సింగీతం శ్రీనివాసరావు ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో అనేది చూడాలి

Continue reading
తెలుగు సినిమాకి ఏమైంది..?

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఓ రేంజ్ లో ఊహించుకునేవారం. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. వస్తోన్న మూవీస్ అన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవుతున్నాయి. ఎవరికి వారు మేం గొప్ప తీశాం అని భావిస్తున్నారు తప్ప.. ఆడియన్స్ యాంగిల్ అవి ఎలా ఉండబోతున్నాయి అని ఎవరూ అనుకోవడం లేదు. ముఖ్యంగా ఈ సమ్మర్ లో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయాయి. ఎంతలా అంటే మార్చి నుంచి ఏప్రిల్ వరకు విడుదలైన సినిమాలు మామూలుగా 60 -70 వరకు ఉన్నాయి. మరి వీటిలో సక్సెస్ రేట్ ఎంత అంటే స్పష్టంగా చెబితే మూడో నాలుగు సినిమాలు మాత్రమే అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి ఫస్ట్ వీక్ లో విడుదలైన మృత్యుంజయ్ నుంచి మొదలైతే.. మే లాస్ట్ వీక్ లో విడుదలైన మరీచిక వరకు కూడా ఏ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
మధ్యలో మార్చిలో రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలున్నాయి. బట్ వాటిని అందుకోవడంలో దారుణంగా విఫలమైందీ మూవీ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు అనే పేరున్నా.. అది ఆడియన్స్ ను హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ ఫైడ్ చేయలేదు అనేది నిజం. హరీష్ శంకర్ డైరెక్టర్ గా ఈ మూవీతో ఇక కష్టం అనిపించుకున్నాడు అంటే అతిశయోక్తి కాదు. అంత దారుణంగా పోయిందీ మూవీ.
ఇక ఏప్రిల్ మాత్రం గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విడుదలైన రాకాస, బైకర్ మూవీస్ బాక్సాఫీస్ కు కళ తెచ్చాయి. ఈ రెండూ కమర్షియల్ గా మంచి విజయాలు సాధించాయి. రాకాస కాస్త ఎక్కువ వసూళ్లు సాధించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. హారర్ కామెడీ అన్నారు కానీ హారర్ అసలేమాత్రం లేదు. మాగ్జిమం కామెడీతో లాగించారు. బట్ ఈ మూవీలో కూడా బలమైన కథ అంటూ లేదు.
బైకర్ ఇండియాలోనే ఫస్ట్ బైక్ రేసింగ్ నేపథ్యంలో వచ్చిన మూవీగా చెప్పారు. ఆ మేరకు ఆకట్టుకుంది. శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా నటించారు. యాంగ్రీ మేన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించాడు. అతని నటనే ఈ మూవీకి హైలెట్ గా నిలిచింది. హై ఇంటెన్షల్ డ్రామాగా రూపొందిన బైకర్ అనుకున్న దానికంటే కాస్త తక్కువ విజయం సాధించింది. బట్ హిట్ గా నిలిచింది.
తర్వాత విడుదలైన డెకాయిట్ కూడా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించింది. అడివి శేష్ గత చిత్రాలతో పోలిస్తే డెకాయిట్ పూర్తిగా తేలిపోయింది. కథ, కథనాల్లో అసలు పస లేదు. అయినా ఈ మూవీ హిట్ అయిందంటే అదో మిరాకిల్ అనే చెప్పాలి. ఇక ఆపై విడుదలైన చిత్రాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ గా నిలిచాయి. ఈ మూడు చిత్రాలు మాత్రమే ఏప్రిల్ వరకు సరిపెట్టుకున్నాయి. ఇక మే నెలలో విడుదలైన చిత్రాలు కూడా తేలిపోయాయి. వీటిలో గోదారి గట్టుపైన మూవీ మాత్రం కమర్షియల్ గా విజయం సాధించింది అంటూ సక్సెస్ మీట్ పెట్టారు. బట్ ఈ మూవీలో కథ, కథనం మాత్రం కంప్లీట్ గా అవుట్ డేటెగ్ గా నిలిచాయి. ఏ మాత్రం కొత్తదనం లేని సినిమాగా దీన్ని ఆడియన్స్ తేల్చారు.
మొత్తంగా ఈ వేసవిలో విడుదలైన సినిమాలన్నీ దారుణంగా పోయాయి. ఓ రకంగా ఐపిఎల్ వల్ల మూవీస్ ఇబ్బంది పడ్డాయి అన్నా కూడా కొన్ని అయినా కంటెంట్ పరంగా ఆకట్టుకోవాలి కదా. బట్ అందులో పూర్తిగా తేలిపోయాయి. ఎంచుకున్న కథల్లో నవ్యత లేదు.. కథనంలో కొత్తదనం ఉండదు. హీరోయిజం పేరుతో సాగించిన ప్రహసనాలే ఈ చిత్రాలన్నీ తేలిపోవడానికి ప్రధాన కారణం. ఇకపై తెలుగు సినిమా జాగ్రత్త పడాల్సిందే. ఇలాంటి కథలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని దారుణమైన పరాజయాలు రావడం మాత్రం ఖాయం

Continue reading