రష్మిక మందన్నా రణబాలి కూడా లైన్ లో
రష్మిక మందన్నా అంటే ఇప్పుడు టాప్ హీరోయిన్. తెలుగుతో పాటు బాలీవుడ్ లో అదరగొడుతోంది. ప్యాన్ ఇండియా రేంజ్ మూవీస్ తో బాగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తోంది. అయితే పెళ్లికి ముందే స్టార్ట్ అయిన మూవీ రణబాలి. రణబాలి సెట్స్ లో ఉన్న టైమ్ లోనే విజయ్ దేవరకొండతో ఏడు అడుగులు నడిచింది రష్మిక మందన్నా. అఫ్ కోర్స్ వీరి పెళ్లి గురించి మూడేళ్లుగా జనం మాట్లాడుకుంటున్నారు.
రణబాలి మూవీ ఈ సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. బట్ రష్మిక మందన్నా హిప్ కు ఇంజూరీ అవడంతో ఆలస్యం అయింది. కొత్త రిలీజ్ డేట్ గా అక్టోబర్ 16ని ప్రకటించింది మూవీ టీమ్. ఈ మూవీలోనే విజయ్ దేవరకొండ స్వాతంత్ర్య సమరయోధుడుగా కనిపించబోతున్నాడు అని ముందు నుంచే చెప్పారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది.
రష్మిక మందన్నా ప్యాన్ ఇండియా మూవీ మైసా
రష్మిక మందన్నా రణబాలి తర్వాత చేస్తోన్న మూవీ మైసా. మైసా ప్యాన్ ఇండియా మూవీ. ఇది భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ మాత్రం అద్దిరిపోయింది అనే చెప్పాలి. మైసాలో రష్మిక మందన్నా ఓ గిరిజన యోధురాలి పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ టైమ్ లోనే విడుదల చేసిన వీడియోతో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది కరెక్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ అని అప్పుడే అంతా చెప్పుకున్నారు.
మైసా దర్శకుడు ఎవరు
రష్మిక మందన్నా మైసా మూవీకి రవీంద్ర పుల్లెపు దర్శకుడు. ఇతనికి ఇదే తొలి సినిమా. గతంలో రవీంద్ర.. హను రాఘవపూడి దగ్గర పనిచేశాడు. ఆ అనుభవంతోనే ఈ మూవీపై విపరీతమైన రీసెర్చ్ చేసి మరీ కథ రాసుకున్నాడట. ఏదేమైనా గాయం తర్వాత చాలా వేగంగా కోలుకున్న రష్మిక మందన్నా వెంటనే మళ్లీ సెట్స్ లో జాయిన్ కాబోతుండటం మాత్రం తన డెడికేషన్ కు నిదర్శనం. మరి రణబాలి, మైసా మూవీస్ తో రష్మిక మందన్నా ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.





