సిద్ధు జొన్నలగడ్డకు మరో OTT ఛాన్స్

ప్రొడ్యూసర్ గా తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు నాగవంశీ. కొత్త కథలు కాకపోయినా ఆ కథలను కొత్తగా చెప్పే దర్శకులను బాగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు నాగవంశీ. అలాంటి నాగవంశీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా భవిష్యత్ అంతా ఓటిటిలదే అన్నాడు. ఓటిటిల్లోనే మూవీ రావడం పక్కా అన్నాడు. అంతే కాదు.. ఓటిటి మూవీస్ ట్రైయల్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండతో నెట్ ఫ్లిక్స్ లో ఓ మూవీ చేస్తున్నానని.. అది త్వరలోనే విడుదల కాబోతోంది అని కూడా చెప్పాడు. మరి ఆ ట్రైయల్ అతనికి బాగా నచ్చిందో ఏమో.. లేటెస్ట్ గా మరో భారీ కంటెంట్ తో ఓటిటి మూవీ అనౌన్స్ చేయబోతున్నాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సిద్ధు

సిద్ధు జొన్నలగడ్డ అంటే నాగవంశీ క్యాంప్ మనిషి అనేది క్లియర్. అతనితో చేసిన డిజే టిల్లు, డిజే టిల్లు స్క్వేర్ రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. తర్వాత సిద్ధు జొన్నలగడ్డ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అయినా అతనిపై నమ్మకంతో నాగవంశీ మూవీ చేయబోతున్నాడు. మీనాక్షి చౌధరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని సమాచారం.

భారీ తారాగణంతో ఓటిటి మూవీ

ఇది పూర్తిగా ఓటిటిలోనే రాబోతోన్న మూవీ అట. అత్యంత భారీ బడ్జెట్ ను కూడా పెట్టబోతున్నారని చెబుతున్నారు. భారీ తారాగణం కూడా ఉండబోతోందంటున్నారు. ఏదేమైనా నాగవంశీ ప్లానింగ్ అంటే ప్లానింగ్ అంటున్నారు చాలామంది. సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి చౌధరి జంటగా వెంకీ అట్లూరి మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ బాగానే ఉన్నట్టే. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ కంటెంట్ కూడా ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.